16, సెప్టెంబర్ 2022, శుక్రవారం

చెయ్యి తీస్తాను అన్ననోటితో క్షమాపణ చెప్పిన రోశయ్య

 

 

ఉప్పూ కారం తినే వాడికి కోపం రావడం సహజం. అలుగుటయే ఎరుంగని ధర్మరాజు వంటి వాడు అలిగితే ఏమి జరుగుతుందో కృష్ణుడు ఒక పద్యంలో చెప్పాడు. అలాగే ఒకసారి రోశయ్య గారెకి కూడా కోపం వచ్చింది. అదీ నిండు శాసన సభలో. ఎప్పుడూ చమత్కారాలు రాలుతుండే ఆయన నోటి వెంట పరుష పదజాలాలు దొర్లడం చూసి ప్రెస్ గేలరీలో ఉన్న పాత్రికేయులు సయితం అవాక్కయ్యారు.

ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ శాసన సభలో టీడీపీ సభ్యుడు శ్రీ గాలి ముద్దు కృష్ణమ నాయుడి వైఖరి పట్ల .రోశయ్య గారెకి అసహనం కలిగింది. అది ఆగ్రహంగా మారింది. తీవ్ర పదజాలం వాడారు. బహుశా తన సుదీర్ఘ రాజకీయ ప్రస్థానంలో శ్రీ రోశయ్య సంయమనం కోల్పోయి మాట్లాడడం ఇదే ప్రధమం కావచ్చు. ఆ రోజు సభలో ముద్దుకృష్ణమ నాయుడిని ఉద్దేశించి ఆవేశంతో ఊగిపోతూ ఆయన ఇలా అన్నారు:

“ఏమిటా గద్దింపులు? నువ్వు పెద్ద మగాడివా!  ఏమిటా చెయ్యి? చెయ్యి తీస్తాను జాగ్రత్త! ఏమనుకుంటున్నావో!”

తర్వాత తాను అన్న మాటలకు ఆయనే సభలో క్షమాపణ చెప్పారు.

“నా కారణంగా ప్రజాధనం లక్షలాది రూపాయలు దుర్వినియోగం అయిపోతుందని, ఈ సభ గౌరవం తగ్గిపోతుందని నాక్కూడా భావన కలిగింది. నేను ఇరవై ఎనిమిదో తారీకున మాట్లాడుతూ, గౌరవనీయులు శ్రీ ముద్దు కృష్ణమ నాయుడు గారి గురించి కఠినంగా మాట్లాడినటువంటి మాట నేను విత్ డ్రా చేసుకుంటున్నాను. నా విచారాన్ని వ్యక్తం చేస్తున్నాను”      

ఒకప్పుడు ఇలా ఉండేవి శాసన సభలు


శ్రీ రోశయ్యతో రచయిత)


(15-09-2022)

 

Video LINK:

https://youtu.be/hC9GdIctEKE

 


కామెంట్‌లు లేవు: