26, సెప్టెంబర్ 2020, శనివారం

సర్కారు భరోసా

 

 

అర్హత కలిగిన వారికి సాయం చేయడం సామాజిక ధర్మం అయితే సాయపడ్డవారికి కృతజ్ఞతలు  తెలపడం కనీస మానవతా ధర్మం.

మా మూడో అన్నయ్య (ఆయన ఇప్పుడు లేరు)  కుమారుడు రమేశ్  ఖమ్మంలో జర్నలిస్టుగా పనిచేస్తున్నాడు. దురదృష్టం కొద్దీ  వాడికీ, వాడి భార్యకూ కరోనా పాజిటివ్  అని తేలింది. అమ్మాయికి ఖమ్మంలోనే హోం క్వారంటైన్. రమేశ్ కి కొద్దికాలం క్రితం స్టెంట్ వేయడం వల్ల హైదరాబాదు పంపారు. అయిదురోజులు  ఆసుపత్రిలో వైద్యం చేయించుకుని అన్నీ చక్కబడ్డ తర్వాత ఆ వివరాలు వాట్సప్ లో తెలంగాణా మీడియా అకాడమీ చైర్మన్ అల్లం  నారాయణ గారెకి పంపారు. తెలంగాణా వర్కింగ్ జర్నలిస్ట్  అసోసియేషన్, మీడియా అకాడమీ కలిసి కరోనా బారిన పడిన  జర్నలిస్టులకు కొంత ఆర్ధిక సాయం ప్రభుత్వం నుంచి అందిస్తున్నారు. ప్రభుత్వం సాయం చేసినా అది అందుకోవాలంటే కొంత ప్రయాస తప్పదు. సంబంధిత అధికారులను కలిసి ధరకాస్తులు ఇవ్వాలి. కరోనా వచ్చినవారు ఈ లాయలాస పడలేరు. మరి ఎలా అనుకుంటూ వుంటే ఈరోజు  ఇరవై వేల రూపాయలు బ్యాంకు ఖాతాలో జమ అయినట్టు ఎస్సేమ్మస్ వచ్చింది. దీనికి వాళ్ళు తీసుకున్న సమయం నిండా రెండు రోజులు కూడా కాదు.

ఇది విన్నప్పుడు చాలా సంతోషం అనిపించింది.

ప్రభుత్వం  ఎన్నో రకాల సంక్షేమ పధకాలు ప్రజలకు అందిస్తోంది. అన్ని ప్రభుత్వ శాఖల్లోని   సంబంధిత అధికారులు కూడా తెలంగాణా  మీడియా అకాడమీ పనితీరును ఆదర్శంగా తీసుకుంటే ప్రజలకు పెద్ద భరోసా లభించినట్టే.

అల్లం నారాయణ గారికి  అభినందనలు, ధన్యవాదాలు  (24-09-2020)

కామెంట్‌లు లేవు: