13, మే 2016, శుక్రవారం

తాపీ ధర్మారావు కీర్తి పురస్కారం

నిన్న గురువారం సాయంత్రం పొట్టి శ్రీరాములు తెలుగు విశ్వవిద్యాలయంలో జరిగిన కార్యక్రమం, పత్రికారచన విభాగంలోో తాపీ ధర్మారావు స్మారక పురస్కారాన్నిఅందుకున్న దృశ్యాన్ని మా మేనకోడలు, ఇంటికోడలు రేణు పోస్ట్ చేసింది. ఆమెకు కృతజ్ఞతలు.




తెలంగాణా ప్రణాళికా సంఘం ఉపాధ్యక్షులు శ్రీ నిరంజన్ రెడ్డి, సాంస్కృతిక వ్యవహారాలసలహాదారు శ్రీ కే.వీ. రమణాచారి, తెలంగాణా ముఖ్యమంత్రి ప్రత్యేక అధికారి శ్రీ దేశపతి శ్రీనివాస్, విశ్వవిద్యాలయం ఉపకులపతి శ్రీ ఎల్లూరి శివారెడ్డి సమక్షంలో వారి చేతులమీదుగా జరిగిన కార్యక్రమం ఇది.

1 కామెంట్‌:

విన్నకోట నరసింహా రావు చెప్పారు...

అభినందనలు. మీకు మరిన్నో సత్కారాలు లభించాలని కోరుకుంటున్నాను.
ఇకమీదట మీకు ఇటువంటి సన్మానాలు జరిగడానికి ముందు రోజు మీ బ్లాగులో ఓ చిన్నమాట (కార్యక్రమ స్ధలం, సమయం) పడేస్తే, వీలుంటే మేం కూడా హాజరై ఆనందిస్తాంగా.