18, నవంబర్ 2012, ఆదివారం

బస్సులో వచ్చిన బంధువులు


బస్సులో వచ్చిన బంధువులు
‘బస్సు వేసుకుని మరీ ఆరోజు మా ఇంటికి భోజనానికి వచ్చిన వారందరూ నిజానికి మా బంధువులు కాదు. కానీ, ఒక్క పూట మా ఇంట్లో గడిపిన ‘పుణ్యానికి’ మాకు ఆత్మబంధువులుగా మారారు.
‘ఇస్కస్ బృందం తరపున మన రాష్ట్రం నుంచి వచ్చిన వారిని అంతకు మునుపే రెండు మూడు సోవియట్ నగరాలు చూపించి మాస్కోలోని ఓ పెద్ద హోటల్ లో బస ఏర్పాటు చేశారు.  బందరుకు చెందిన నరసింహమూర్తిగారనే పెద్దమనిషి ఆ బృందంలో వున్నారు. శాకాహారి అయిన మూర్తి గారు, రష్యాలో తిండీ తిప్పలు గురించి ముందుగానే వాకబు చేసుకుని, నాకు ఓ కార్డు ముక్క రాసి తాను వస్తున్న విషయం ముందుగానే తెలియచేసారు. వారిని కలవడానికి హోటల్ కు వెళ్ళిన నేను, వారితో వున్న రష్యన్ దుబాసీతో సహా  మొత్తం బృందాన్ని వెంటబెట్టుకుని వాళ్ల బస్సులోనే మా ఇంటికి తీసుకువెళ్లాను. బిలబిలమంటూ దిగిన అతిధులను చూసిముందు  మా ఆవిడ బిత్తర పోయినా  వెంటనే తమాయించుకుని అందరికీ వంట ఏర్పాట్లు చేసింది. అంతా పచ్చళ్ళు, కారాలు, సాంబారు, పెరుగుతో భోజనాలు చేసి అన్నదాతా సుఖీభవా! అని ఆశీర్వదించి వెళ్లారు. అలా ఆ రోజు మా ఇంట్లో భోంచేసి వెళ్ళిన వాళ్ళలో చాలామంది ఇన్నేళ్ళ తరువాత ఇప్పటికీ కూడా ప్రతియేటా గ్రీటింగ్ కార్డులు పంపిస్తూనే వున్నారు. వాళ్ల సహృదయతకు ఖరీదు  కట్టే షరాబు యెవ్వడు?’             
ఇలాటి వివరాలు మరిన్ని  తెలుసుకోవాలంటే ‘మార్పుచూసిన కళ్ళు’ పుస్తకం చదవండి. అలనాటి కమ్యూనిస్ట్ రష్యా చరమాంకం విశేషాలను అక్షరబద్ధం చేస్తూ సాగిన రచన. ముద్రణ పూర్తయి విడుదలకు సిద్ధంగా వుంది. ప్రతులకు, వివరాలకు: శ్రీ కె. లక్ష్మణరావు, కార్యదర్శి, వయోధిక పాత్రికేయ సంఘం, హైదరాబాదు. ఫోను: 9394712208, Email: lakshmanarao_konda@yahoo.co.in>,

కామెంట్‌లు లేవు: