29, అక్టోబర్ 2020, గురువారం

అమెరికా ఎన్నికల్లో సింహభాగం ఖర్చు మీడియా మీదే.

 అమెరికా ప్రెసిడెంట్ ఎన్నికలు గురించి కొద్ది సేపటి క్రితం ఒక టీవీ ఛానల్ డిబేట్ నిర్వహించింది.

అమెరికానుంచి ఇందులో పాల్గొన్న తానా మాజీ అధ్యక్షుడు శ్రీ కోమటి జయరాం ఒక ఆసక్తికరమైన విషయం చెప్పారు.

‘మన దేశంలో మాదిరిగానే ఆ దేశంలో కూడా పార్టీల వాళ్ళు ఓటర్లకు డబ్బులు ఇస్తారా అనే సందేహం మన దగ్గర చాలామందిలో వుంది. ఓటర్లకు నేరుగా డబ్బులు ఇవ్వడం అనేది అమెరికాలో లేదు. మరి వసూలు చేసిన కోట్లాది డాలర్ల పార్టీ ఎలెక్షన్ ఫండ్ ఎలా ఖర్చు చేస్తారు అనే అనుమానం రావచ్చు. ఉదాహరణకు నన్ను ఈ చర్చకు ఆహ్వానించారు. వరసగా వాణిజ్య ప్రకటనలు వేస్తూ పది నిమిషాలు వెయిట్ చేయించారు. అక్కడా పార్టీలకు ఇదే ప్రధానమైన ఖర్చు. పత్రికలు, ప్రకటనలకు అయ్యే ఖర్చే ఎక్కువ. ఓటర్లకు ఇచ్చేది ఏమీ వుండదు. ఇక్కడి ఓటర్లు ఓ బాధ్యతగా భావించి తమ ఓటు హక్కు వినియోగించుకుంటారు. వాళ్ళని ప్రలోభ పెట్టాల్సిన అవసరం వుండదు”

అచ్చు ఇలాగే కాకపోయినా ఇదే అర్ధం వచ్చేట్టు ఆయన మాట్లాడారు.

(29-10-2020)

కామెంట్‌లు లేవు: