'చదివేది డిటెక్టివ్ నవలో, వేయిపడగలో అది వేరు మాట, ముందు చదవడం అలవాటు చేసుకో' అని మా పెద్దన్నయ్య పర్వతాల రావు గారి మాటతో, ఖమ్మం బ్రాహ్మణ బజారు చివర్లో పాత మునిసిపల్ ఆఫీసు దగ్గర వున్న జిల్లా గ్రంధాలయంలో వున్న శరత్ సాహిత్యం, జైనేంద్ర సాహిత్యం, విశ్వనాధ, చలం, శ్రీ శ్రీ, ఆరుద్ర, ముళ్లపూడితో మొదలుపెట్టి, పదో తరగతి పూర్తి కాకమునుపే అన్నీ పుక్కిట పట్టేసాను.
అంతే! మళ్ళీ బుద్దిగా ఒక్క పుస్తకం ఒకే విడతలో, ఏకబిగిన చదివితే ఒట్టు.
చదవడం మానడం అంటే ఎదగడం ఆగిపోవడమే అని మా అన్నయ్య చెప్పిన మాట ఇప్పుడు జ్ఞాపకాల్లోనే మిగిలిపోయింది.
కామెంట్లు లేవు:
కామెంట్ను పోస్ట్ చేయండి