భండారు శ్రీనివాస రావు – వార్తా వ్యాఖ్య
మీడియా, రాజకీయాలు, మరెన్నో
25, ఫిబ్రవరి 2021, గురువారం
23, ఫిబ్రవరి 2021, మంగళవారం
నడిచివచ్చిన దారి - భండారు శ్రీనివాసరావు (Idream)
చెప్పింది చెప్పినట్టు,
చెప్పింది మార్చకుండా (ఇంటి పేరుతొ సహా) నా జీవనయాన క్రమాన్ని నాతోనే
చెప్పించిన ఐ డ్రీం (Idream) నాగరాజు గారికీ, అ
సంస్థ యాజమాన్యానికీ కృతజ్ఞతలు.
https://youtu.be/jVNIPkwB_48
21, ఫిబ్రవరి 2021, ఆదివారం
ఓ మంచి పుస్తకం చదివాను – భండారు శ్రీనివాసరావు
మంచి పుస్తకం చదవడానికి, మంచి సినిమా చూడడానికి, మంచి పాట వివిధభారతిలో వినడానికీ చెరువులో చేపలు పట్టేవాడికి ఉన్నంత ఓపిక వుండాలని మా పెద్దన్నయ్య పర్వతాలరావు గారు చెబుతుండేవారు. గాలం వేసి ఎంతో ఓపికగా ఎదురుచూడగా, చూడగా ఒక మంచి చేప ఆ గేలానికి చిక్కుతుంది. అలాగే పుస్తకాలు, సినిమాలు, రేడియోలో పాటలు కూడా. చదవగా చదవగా ఓ మంచి పుస్తకం, చూడగా చూడగా ఓ మంచి సినిమా, వినగా వినగా ఓ మంచి పాట అలా అన్నమాట.
20, ఫిబ్రవరి 2021, శనివారం
గజిబిజి పలుగులు - భండారు శ్రీనివాసరావు
“అర్ధం చేసుకోగలిగితే వేదాంతం చాలా గొప్పది.
పారమార్ధికం, పారలౌకికం ఈ రెంటినీ సరైన పాళ్ళలో కలిపితే అదే వేదాంతం
అవుతుంది. గీతలో భగవానుడు బోధించింది అదే.
“నీ పని నువ్వు చెయ్యి. ఫలితం నాకు వదిలేయ్”
ఎవరి పని వాళ్ళు చేయడం పారలౌకికం. ఫలితాన్ని
పరమాత్ముడికి వదిలేసి దేనికీ తాపత్రయ పడకపోవడం పారమార్ధికం.
ఇలా చేస్తే స్వార్ధరహిత కర్తవ్యపాలన జరుగుతుంది.
దాన్ని పరిపాలన అనండి, ఉద్యోగం
అనండి,
కుటుంబ బాధ్యతలు అనండి, ఇంకేదైనా
అనండి. అన్నిటికీ ఈ సూత్రాన్ని పాటిస్తే సమాజానికి మేలు జరుగుతుంది.
కానీ జరుగుతున్నది తద్విరుద్ధం. పారమార్ధిక
భావాలు బాగానే ప్రబలుతున్నాయి. అలాగే పారలౌకిక భావనల్లో స్వార్ధ తలంపులు కూడా.
భగవద్గీతను భక్తిగా తలమీద పెట్టుకుంటాం కాని, అందులో
చెప్పిన దాన్ని నిబద్ధతతో తలకెక్కించుకో౦!
కలివిడిగా వున్నప్పుడు కూడా మనసును విడిగా ఉంచుకోగలగాలి.
విడిగా వున్నప్పుడు సైతం నలుగురితో కలిసివున్నామన్న భావన పెంచుకోవాలి.
ఏమిటో శంకరాభరణం శంకర శాస్త్రిగారి మాటల్లాగా
ఒక్కటీ అర్ధం కావడం లేదనిపిస్తోందా!
అందుకే దాన్ని వేదాంతం అన్నారు శిష్యా!”
అనుగ్రహభాషణ ముగించారు ఏకాంతానందస్వామి.
(20-02-2021)