31, అక్టోబర్ 2018, బుధవారం

రెండు వార్తలు, పర్యవసానాలు – భండారు శ్రీనివాసరావు


1984 అక్టోబరు 31
ప్రధానమంత్రి శ్రీమతి ఇందిరాగాంధి తన అంగరక్షకుల తుపాకీ గుళ్ళకు బలయిన రోజు.
సంఘటన ఆరోజు మధ్యాన్నమే జరిగినా ముందు జాగ్రత్త కోసం చాలాసేపు మరణ వార్తను అధికారికంగా ప్రకటించలేదు. సాయంత్రం రేడియో వార్తల్లో ఆ వార్త ప్రసారం అయ్యేవరకు శ్రీమతి గాంధి చావుబతుకుల మధ్య పోరాడుతున్నారనే సమాచారంతో జాతి యావత్తూ తీవ్రంగా మధన పడుతోంది. వార్తల అనంతరం దేశవ్యాప్తంగా పరిస్తితి పూర్తిగా మారిపోయింది. కాల్పులు జరిపిన వారిలో బియాంత్ సింగ్ ఒకరన్న సమాచారంతో అట్టుడికిపోయిన ఆందోళనకారులు   విచక్షణారహితంగా సిక్కులపై ఊచకోతకు తలపడ్డారు. ఈ నరమేధం నాలుగు రోజులు సాగింది. సంఘటనతో ఏమాత్రం సంబంధం లేని అమాయకులయిన సిక్కులు ప్రాణాలు కోల్పోయారు. కాశ్మీర్ నుంచి  కన్యాకుమారి వరకు జాతీయ రహదారులపై  ట్రక్కులు నడిపే సిక్కు డ్రైవర్లలో చాలామంది అనేక  అరాచకాలకు, దౌర్జన్యాలకు  గురయ్యారు.
వార్తా ప్రసారంలో తగు జాగ్రత్తలు తీసుకోకపోతే ఎలాంటి విపరీతాలు సంభవిస్తాయనడానికి ఇదో ఉదాహరణ.   
1948 జనవరి 30
మహాత్మాగాంధీని ప్రార్ధనా స్థలంలో ఒక వ్యక్తి దగ్గరగా నిలబడి తుపాకీతో కాల్పులు జరపడంతో ఆయన ఆక్కడికక్కడే ప్రాణాలు కోల్పోయారు.
అప్పుడు జవహర్ లాల్ నెహ్రూ ప్రధాన మంత్రి. సర్దార్ వల్లభాయ్ పటేల్ ఉప ప్రధాని హోదాలో హోం శాఖను చూస్తున్నారు.
పటేల్ రాగల పర్యవసానాలను చప్పున ఊహించారు. తక్షణం స్పందించారు. ఆకాశవాణి ఉన్నతాధికారులతో మాట్లాడి మహాత్ముడిపై కాల్పులు జరిపింది ఒక హిందువు అని ప్రసారం చేయించారు.
అంతకు కొన్ని రోజుల ముందు నుంచే  దేశం యావత్తూ హిందూ, ముస్లిం ఘర్షణలతో అట్టుడికిపోతోంది. మహాత్మా గాంధీపై  కాల్పులు జరిపింది, ఆయన్ని హత్య చేసిందీ ఒక  హిందువు అని తెలియడంతో, అప్పటివరకు ప్రాణాలు అరచేతిలో పెట్టుకుని బిక్కుబిక్కుమంటున్న  ముస్లిములు ఊపిరి పీల్చుకున్నారు.
పటేల్ ముందు చూపు కారణంగా ఆనాడు దేశం ఆవిధంగా ఒక పెద్ద మారణహోమం నుంచి బయట పడింది.  

30, అక్టోబర్ 2018, మంగళవారం

వైఎస్ జగన్ పై దాడితో ఏపీ రాజకీయాలు ఎలాంటి మలుపు తిరగబోతున్నాయి ?



ప్రతి మంగళవారం మాదిరిగానే ఈరోజు ఉదయం NTv News Channel  Rushi's Live Show చర్చాకార్యక్రమంలో నాతోపాటు పాల్గొన్నవాళ్ళు : శ్రీ గోవిందరెడ్డి (వైసీపే ఎమ్మెల్సీ), శ్రీ మాణిక్య వరప్రసాద్ (టీడీపీ ఎమ్మెల్సీ), శ్రీ భానుప్రకాష్ (బీజేపీ, ఫోన్ లైన్లో)

వైఎస్ జగన్ పై దాడితో ఏపీ రాజకీయాలు ఎలాంటి మలుపు తిరగబోతున్నాయి ?



ప్రతి మంగళవారం మాదిరిగానే ఈరోజు ఉదయం NTv News Channel  Rushi's Live Show చర్చాకార్యక్రమంలో నాతోపాటు పాల్గొన్నవాళ్ళు : శ్రీ గోవిందరెడ్డి (వైసీపే ఎమ్మెల్సీ), శ్రీ మాణిక్య వరప్రసాద్ (టీడీపీ ఎమ్మెల్సీ), శ్రీ భానుప్రకాష్ (బీజేపీ, ఫోన్ లైన్లో)

29, అక్టోబర్ 2018, సోమవారం

Debate on YS Jagan Airport Incident Investigation Report | The Debate wi...





ప్రతి సోమవారం మాదిరిగానే ఈరోజు ఉదయం AP 24 X 7 News Channel 'Debate With Venkata Krishna'  చర్చాకార్యక్రమంలో నాతో పాటు పాల్గొన్నవాళ్ళు:  శ్రీ గోవిందరెడ్డి (వైసీపీ ఎమ్మెల్సీ), శ్రీ రామకృష్ణ (టీడీపీ), శ్రీ సత్యమూర్తి (బీజేపీ), డాక్టర్ తులసి రెడ్డి ( కాంగ్రెస్), శ్రీ బొలిసెట్టి సత్యనారాయణ (జనసేన), శ్రీ గఫూర్ (సీపీఎం, ఫోన్ లైన్లో

Janasena Vs TDP | TDP Sensational Comments on Janasena Alliance | AP24x7





ప్రతి సోమవారం మాదిరిగానే ఈరోజు ఉదయం AP 24 X 7 News Channel 'Debate With Venkata Krishna'  చర్చాకార్యక్రమంలో నాతో పాటు పాల్గొన్నవాళ్ళు:  శ్రీ గోవిందరెడ్డి (వైసీపీ ఎమ్మెల్సీ), శ్రీ రామకృష్ణ (టీడీపీ), శ్రీ సత్యమూర్తి (బీజేపీ), డాక్టర్ తులసి రెడ్డి ( కాంగ్రెస్), శ్రీ బొలిసెట్టి సత్యనారాయణ (జనసేన), శ్రీ గఫూర్ (సీపీఎం, ఫోన్ లైన్లో

Debate on Pawan Kalyan Tweet on Party Alliance in Elections



ప్రతి సోమవారం మాదిరిగానే ఈరోజు ఉదయం AP 24 X 7 News Channel 'Debate With Venkata Krishna'  చర్చాకార్యక్రమంలో నాతో పాటు పాల్గొన్నవాళ్ళు:  శ్రీ గోవిందరెడ్డి (వైసీపీ ఎమ్మెల్సీ), శ్రీ రామకృష్ణ (టీడీపీ), శ్రీ సత్యమూర్తి (బీజేపీ), డాక్టర్ తులసి రెడ్డి ( కాంగ్రెస్), శ్రీ బొలిసెట్టి సత్యనారాయణ (జనసేన), శ్రీ గఫూర్ (సీపీఎం, ఫోన్ లైన్లో

28, అక్టోబర్ 2018, ఆదివారం

గాడి తప్పుతున్న సీబీఐ వ్యవహారాలు – భండారు శ్రీనివాసరావు


(Published in SURYA telugu daily, today, Sunday, 28-10-18)

ఆ మెయిన్ రోడ్డు తిన్నగా పొతే అమెరికాలోని సియాటిల్ నగరంలో మా
మనుమరాళ్ళు చదువుకునే బెల్ వ్యూ స్కూలు వస్తుంది. కానీ అది ఒక మలుపు
తిరిగే చోట మరో రహదారి పక్కనుంచి వచ్చి దానిలో కలుస్తుంది. ఆ దోవన వచ్చే
వాహనదారులు ఆ రెండు రోడ్లు కలిసే చోట కాసేపు ఆగి, ప్రధాన రహదారిలో వేరే
వాహనాలు ఏవీ రావడం లేదన్న సంగతి ధృవపరచుకుని కానీ ఆ రోడ్డులోకి
ప్రవేశించేవారు కారు. అయితే, హైదరాబాద్ ట్రాఫిక్కుకు అలవాటు పడివున్న
నాకు మాత్రం, ఆ వాహనాలు అదే వేగంతో మెయిన్ రోడ్డులోకి దూసుకు వస్తాయేమో
అన్న భీతి పీడిస్తూ వుండేది.

“ఎందుకంత స్పీడు. కాస్త పక్కగా వచ్చే కార్లను చూసుకుని నడపకూడదా!”
అనేవాడిని మా అబ్బాయితో.

“నమ్మకం” అనేవాడు మావాడు స్థిరంగా.

“అలా దూసుకు రావని ఇక్కడ మా నమ్మకం. వచ్చి తీరుతాయని హైదరాబాదులో మీ
నమ్మకం. మా నమ్మకంతో ఇక్కడ మేమిలా స్పీడుగా పోగలుగుతున్నాం. మీ నమ్మకంతో
అక్కడ మీరలా ఆచితూచి నడుపుతున్నారు. అక్కడ మిమ్మల్నీ, ఇక్కడ మమ్మల్నీ
నడుపుతోంది ఆ నమ్మకమే!” అన్నాడు అమెరికాలో పదేళ్ళకు పైగా వుంటున్న మావాడు
మరింత నమ్మకంగా.

అమెరికన్లు ఒక పట్టాన ఎవరినీ నమ్మరంటారు. కానీ వారి జీవితాలన్నీ కేవలం
‘నమ్మకం’ ప్రాతిపదికపై నిశ్చింతగా నడిచిపోతున్నాయి.

చెక్కు ఇస్తే చెల్లుతుంది అన్న నమ్మకం.

వస్తువు కొంటే నాణ్యత వుంటుందన్న నమ్మకం, నచ్చని వస్తువును తిరిగి వాపసు
చేయగలమన్న నమ్మకం.

కారు నడిపేటప్పుడు వెనుకనుంచో, పక్కనుంచో అడ్డదిడ్డంగా వేరే వాహనాలు
దూసుకు రావన్న నమ్మకం.

బహిరంగ ప్రదేశాలలో ఎంతటి ఖరీదయిన వస్తువును మరచిపోయినా దాన్ని పరాయివారు
పొరబాటున కూడా వేలేసి తాకరన్న నమ్మకం.

పలానా టైం కు వస్తామని చెబితే ఖచ్చితంగా మాట నిలబెట్టుకుంటారన్న నమ్మకం.

అవతల వ్యక్తి ఏమిచెప్పినా అది మనల్ని మోసం చేయడానికే అన్న భావం ఏకోశానా
వుండకూడదనే నమ్మకం.

ఇలా నమ్మకాలమీద ఆధారపడి వారి జీవితాలు నమ్మకంగా గడిచిపోతున్నాయి.

ఇలాటి నమ్మకం ఏదయినా, ఒక్కటంటే ఒక్కటయినా మనకూ వుందని నమ్మకంగా
చెప్పగలమా? లేదని మాత్రం ఘంటాపధంగా చెప్పగలం.

ఎందుకంటే, ఈ అరవై ఏళ్ళ పైచిలుకు స్వతంత్ర ప్రజాస్వామ్యం మనకిచ్చిందీ,
మిగిల్చిందీ ఏమోకానీ ‘నమ్మకం’ అన్న పదాన్ని జీవితాల్లో కనబడకుండా మాత్రం
చేసింది.

నాయకులు తమ అనుచరులనే నమ్మరు. నీడలా వెన్నంటే వుంటూ, తందానా అనకముందే తాన
అని అంటూ, ప్రతి చిన్న విషయంలో ఆహా ఓహో అని భజన చేసే కార్యకర్తలు, కడకంటా
తమ వెంట వుండరేమో అనే అపనమ్మకం నాయకులది.

అనుచరులు నాయకులని నమ్మరు. ఎందుకంటే, తమ నాయకుడు ‘తన నాయకుడికి’ ఎలా
పంగనామాలు పెట్టాడో అన్న వాస్తవానికి వాళ్ళే ప్రత్యక్షసాక్షులు కాబట్టి.
అవసరమయితే నిచ్చెన మెట్లెక్కినట్టు నాయకుడి తలపైనే కాలుమోపి ఆ పైమెట్టుకి
ఎగబాకాలనే తాపత్రయం వారిది.

జనం ఈ కార్యకర్తలని నమ్మరు, ఎందుకంటే తమపేరు చెప్పి పైవాళ్ళ నుంచి వసూలు
చేసే పెద్ద మొత్తంలో తమకు ముట్టినదెంతో అణాపైసలతో సహా వారికి లెక్కలు
తెలుసు కాబట్టి.

జనాలను రాజకీయులు నమ్మరు, డబ్బులు తీసుకుని కూడా ఓట్లు తమకు వేయరేమో అనే
అపనమ్మకం వారిది.

ఇలా లెక్కేసుకుంటూ వెడితే ఈ ‘అపనమ్మకాల’ జాబితా కొండవీటి చాంతాడే.

ఏటీఎం లనుంచి డ్రా చేసే కరెన్సీ నోట్లలో ఎన్ని అసలువో, ఎన్ని నకిలీవో
తెలియదు. మెరిసిపోతున్నాయని ముచ్చటపడి కొనే నగలలో అసలు బంగారం ఎంతో, కాకి
బంగారం ఎంతో అన్నది అనుమానమే.

నిగనిగ లాడుతోందని తినే మామిడి పండ్లకు, అరటి పండ్లకు ఆ మెరుపు సహజంగా
వచ్చిందా కార్బైడ్ వంటి కృత్రిమ లేపనాలతో వచ్చిందా అంటే చప్పున చెప్పడం
కష్టమే.

నకిలీ ఔషధాలు గురించిన వార్తలు మరింత ఘోరం. శారీరక రుగ్మతలనుంచి
బయటపడడానికి డాక్టర్లు రాసిన మందుల్ని రోగులు నమ్మకంతో కొనుక్కుంటారు.
కానీ మార్కెట్లో విచ్చలవిడిగా పంపిణీలో వున్న నకిలీ మందులు రోగాలను నయం
చేయడం సంగతి అటుంచి రోగుల ప్రాణాలనే బలిగొంటున్నాయి.

తాగే నీళ్ళు అంతే. ప్లాస్టిక్ సీసాల్లో దొరికే మంచి నీళ్ళు తాగడానికి
యెంత శ్రేయస్కరమో చెప్పలేము కాని, వాటిని తయారు చేసేవాళ్ళకు కాసులు
కురిపిస్తున్నాయి.

ఏకంగా ఏడుకొండల వాడి లడ్డూ ప్రసాదం తయారీలో వాడే నెయ్యే కల్తీ అని ఆ మధ్య
చెప్పుకున్నారు. లెక్క ప్రకారం దర్యాప్తులు అయితే జరుగుతాయి కానీ నిజాలు
వెలుగు చూస్తాయా అన్న విషయంలో ఎవరి అనుమానాలు వారికి వున్నాయి.

ఆదివారం హాయిగా కులాసా కబుర్లు చెప్పుకోక ఈ నమ్మకాలు, అపనమ్మకాల గొడవ ఏమిటంటారా?

గత వారం రోజులుగా దేశ వ్యాప్తంగా ఒకే ఒక్క పదం జనం నోట్లో నానుతోంది.
మీడియా ముఖతః మోగుతోంది.

అదే సీబీఐ. సెంట్రల్ బ్యూరో ఆఫ్ ఇన్వెస్టిగేషన్. దేశం మొత్తంలో ప్రముఖ
దర్యాప్తు సంస్థ.

పాలక పక్షం చేతిలో కీలుబొమ్మ అని ప్రతిపక్షాలు ఆక్షేపిస్తుంటాయి. కానీ
ఎక్కడ ఏదైనా సంఘటన జరిగితే, సీబీఐ దర్యాప్తుకు ఆదేశించాలని ముందుగా
ప్రభుత్వాన్ని డిమాండ్ చేసేది కూడా ఆ పార్టీలే. కాలక్రమంలో అన్ని
వ్యవస్థల మాదిరిగానే ఈ నిప్పు లాంటి సంస్థకు కూడా ఏనాడో చెదలు పట్టాయి.
అయినా ప్రజలకు ఈ సంస్థ పట్ల ఇంకా ఎంతో కొంత గౌరవం, నమ్మకం మిగిలే
వున్నాయి. రాజకీయంకోసం ఈ సంస్థను వాడుకుంటున్నారని పాలక పక్షాన్ని
ప్రతిపక్షాలు దెప్పిపొడుస్తుంటాయి. చిత్రం ఏమిటంటే అధికారం తమ చేతిలోకి
రాగానే అవేపని అవి చేస్తుంటాయి. ఇవే చిలుక పలుకులు మళ్ళీ ప్రతిపక్షంగా
మారిన ఒకనాటి పాలకపక్షం నోటి వెంట వినీ వినీ జనాలకు విసుగు పుడుతోంది.
కానీ గుడ్డిలో మెల్ల అన్నట్టు సీబీఐ సమర్ధత పట్ల ప్రజలకున్న అమితమైన
విశ్వాసం పూర్తిగా ఆవిరి కాలేదు.

ఇప్పుడు ఆ ఘడియ కూడా దాపురించింది.

ఈ సంస్థకు చెందిన ఇద్దరు ఉన్నతాధికారుల నడుమ చెలరేగిన విబేధాలు ఆరోపణల
స్థాయికి పెరిగి అతి స్వల్ప కాలంలోనే బాగా రాజుకుని ఆ సెగలు కేంద్ర
ప్రభుత్వానికి కూడా తగిలాయి. దాంతో వారిరువురిని పదవుల నుంచి తప్పించి
సెలవుపై పంపడం జరిగింది. ఇదంతా సంస్థ ప్రతిష్టను కాపాడడానికే అని
కేంద్ర మంత్రి ఒకరు సర్దిచెప్పే ప్రయత్నం చేయడం ఈ వివాదంలో కొసమెరుపు.

అత్యున్నత అధికారి లేకుండా మరి సంస్థ నడవడం ఎట్లా! అందుకే తాత్కాలిక
ప్రాతిపదికన కొత్త అధిపతిని నియమిస్తూ అప్పటికప్పుడు అర్ధరాత్రి ఓ
నిర్ణయం తీసుకున్నారు.

పాత అధికారి ఇది అన్యాయం అంటూ సుప్రీం తలుపుతట్టారు. విధానపరమైన కొత్త
నిర్ణయాలు ఏవీ కొత్త అధికారి తీసుకోరాదని, మాజీ డైరక్టర్ పై ఆయన సహచర
అధికారి చేసిన ఆరోపణలపై సుప్రీం కోర్టు మాజీ న్యాయమూర్తి పర్యవేక్షణలో
సెంట్రల్ విజిలెన్స్ కమిషనర్ రెండు వారాలలోగా దర్యాప్తు పూర్తిచేసి ఆ
నివేదికను సీలు వేసిన కవరులో సర్వోన్నత న్యాయస్థానానికి నవంబరు పన్నెండు
నాడు అందచేయాలని ఆదేశిస్తూ తదుపరి విచారణను వచ్చే నెలకు వాయిదా వేసింది.

కేంద్ర ప్రభుత్వం కొత్తగా తెచ్చిపెట్టుకున్న అధికారిపై కూడా చాలా పాత
ఆరోపణలు వున్నాయని ఆయన నియామకపు వార్తతో పాటే మరికొన్ని పుకార్లు ప్రాణం
పోసుకున్నాయి.

అత్యున్నత స్థానాలలో వుండేవారిపై వచ్చే ఆరోపణలను విచారించే ఈ అత్యున్నత
దర్యాప్తు సంస్థలో చాలా కాలంగా ఆరోపణలు ఎదుర్కుంటున్న అధికారులను
ఇంతకాలం ఎలా పనిచేయనిస్తున్నారు అనే ప్రశ్నకు జవాబు దొరుకుతుంది అనుకోవడం
అత్యాశే. సమాధానం తెలిసిన వాళ్ళు కూడా చెబుతారనే ఆశ అంతకంటే లేదు.

ఈ మొత్తం ఉదంతం గమనించిన తర్వాత రామాయణానికి సబంధించిన ఒక ప్రక్షిప్త
వృత్తాంతం గుర్తుకు వస్తోంది.

రాముడు వనవాసం చేస్తూ ఒక చెట్టు కింద విశ్రాంతి తీసుకుంటూ ఉంటాడు.
కొంతసేపు గడిచిన తర్వాత తన ధనుర్బాణాల కింద నలిగిపోతూ నెత్తురోడుతున్న ఒక
మండూకం కనిపిస్తుంది.

రాముడి మనసు చివుక్కుమంటుంది.

‘రక్తం స్రవిస్తూ కూడా ఇంతటి బాధను ఎలా ఓర్చుకున్నావు మండూకమా! వెంటనే
నాకు చెప్పక పోయావా’ అంటాడు ఓదార్పుగా.

అందుకా కప్ప ఇచ్చిన జవాబే ఈ వ్యాసానికి ప్రేరణ.

“ఓ శ్రీరామచంద్రా! సమస్త ప్రాణులను కాపాడే దేవదేవుడివి నువ్వు. నువ్వే నా
బాధకు కారణం అయినప్పుడు నేనెవ్వరికి చెప్పుకుంటాను చెప్పు?’



అలాగే వుంది ఈ సీబీఐ వ్యవహారం.

News Scan LIVE Debate With Vijay | 28th October 2018



ప్రతి ఆదివారం మాదిరిగానే  ఈరోజు  ఉదయం  TV 5 Vijay's News Scan లో ఏపీ రాజకీయాలపై చర్చాకార్యక్రమం. నాతోపాటు పాల్గొన్నవాళ్ళు ; శ్రీ జూపూడి ప్రభాకరరావు (టీడీపీ), శ్రీ విల్సన్ (బీజేపీ), శ్రీ గౌతంరెడ్డి (వైసీపీ) 

27, అక్టోబర్ 2018, శనివారం

26, అక్టోబర్ 2018, శుక్రవారం

Hero Sivaji Hints At Attack On YS Jagan Operation Garuda |



ప్రతి శుక్రవారం మాదిరిగానే ఈరోజు ఉదయం మహా న్యూస్ ఛానల్ 'అజిత' Sunrise Showలో నాతోపాటు పాల్గొన్నవాళ్ళు: శ్రీ కొత్తకోట దయాకర్ రెడ్డి (టీడీపీ), శ్రీ ప్రేమేందర్ రెడ్డి (బీజేపీ), శ్రీ బెల్లయ్య నాయక్ (టీకాంగ్రెస్).

KSR Special Live Show | Attack on YS Jagan mohan Reddy in Vizag Airport ...



సాక్షి టీవీలో కొమ్మినేని శ్రీనివాసరావు జగన్ పై కత్తిదాడి సంఘటనపై నిర్వహించిన ప్రత్యేక చర్చాకార్యక్రమంలో  నాతో పాల్గొన్న వాళ్ళు: చిన్ని కృష్ణ (సినీ రచయిత), శ్రీ రవిచంద్రారెడ్డి(కాంగ్రెస్), శ్రీ కోటేశ్వర రావు (బీజేపీ)

The Fourth Estate || Murder Attack on YS Jagan || వైఎస్‌ జగన్‌పై హత్యాయత...

23, అక్టోబర్ 2018, మంగళవారం

NTv LIVE SHOW on KCR Comments on TDP



ప్రతి మంగళవారం మాదిరిగానే ఈరోజు ఉదయం NTv Rushi's Live Show చర్చాకార్యక్రమంలో నాతో పాటు పాల్గొన్నవాళ్ళు: శ్రీ అరవిందకుమార్ గౌడ్ (టీడీపీ), శ్రీ మందా జగన్నాధం (టీఆర్ఎస్), శ్రీ వేణుగోపాల రెడ్డి ( బీజేపీ). 

22, అక్టోబర్ 2018, సోమవారం

మంచివాళ్ల మౌనం – భండారు శ్రీనివాసరావు


Silence is connivance,
Connivance is betrayal,
Betrayal is sin,
Sin is punishable offence
అవసరమైన సందర్భాలలో మౌనంగా వుండడం అనేది ఒకరకంగా లాలూచీనే.
లాలూచీ అంటే వెన్నుపోటు
వెన్నుపోటు పొడవడం పాపం
పాపం శిక్షార్హం
స్వేచ్చానువాదం చేస్తే ఆపై ఆంగ్ల వాక్యాలకు దగ్గరగా నాకనిపించిన అనువాదం ఇది.
కీర్తిశేషులు, మాజీ గవర్నర్ జనరల్  శ్రీ సి. రాజగోపాలాచారి ఆంగ్లంలో తిరగ రాసిన మహాభారతంలోనిది.
కురుక్షేత్ర యుద్ధరంగంలో  అంపశయ్యపై పడుకుని  తన  ఆఖరి ఘడియల కోసం ఎదురు చూస్తున్న భీష్మాచార్యులవారితో  కృష్ణ భగవానుడు చెప్పిన మాటలు ఇవి.
కదనరంగంలో తీవ్రంగా గాయపడి మరణం తధ్యమని నిర్ధారించుకున్న పిదప ఇచ్చామరణం అనే వరం కారణంగా అంపశయ్యపై ఆఖరి రోజులు గడిపే భీష్ముడికి యెనలేని మనోవేదన పట్టుకుంటుంది.
తనొక మహావీరుడు. తెలిసి తెలిసీ ఏనాడూ ఎలాంటి దుష్ట కార్యం తలపెట్టలేదు. పొరబాటున కూడా పాపానికి ఒడిగట్టలేదు. ఇతరుల రాజ్యంపై కన్ను వేయలేదు. పరకాంతను చెరబట్టడం సరే కలలో సయితం  ఏ కాంత పొందునూ కోరని ఆజన్మ బ్రహ్మచారిని.
ఇలాంటి నాకేల ఈదుస్తితి?
పగలల్లా రణన్నినాదాలు. ప్రళయభీకర ఆయుధ గర్జనలు. పొద్దువాలేసమయానికి నాటి యుద్ధ పరిసమాప్తి. చుట్టూ శవాల గుట్టలు. ఆత్మీయుల ఆక్రందనలు. కొసప్రాణంతో మిగిలిన సైనికులు తమ ప్రాణం కాపాడండంటూ చేసే హృదయ విదారక రోదనలు. ఆసువులు బాసిన అమరుల పార్ధివ శరీరాలను కడుపారా ఆరగించడానికి ఆకాశంలో గిరికీలు కొట్టే రాబందుల రెక్కల చప్పుళ్ళు. ఆ నిశిరాత్రి సమయంలో చెవులు చిల్లులు పడేలా నక్కల ఊళలు.
కడుపు తిప్పే ఇటువంటి దారుణ దృశ్యాల నడుమ నిదురలేని రాత్రులు గడపాల్సిన స్తితి. ఈ దుస్తితి పగవాళ్ళకు కూడా రాకూడదు.
కురుపాండవ వంశాలకే కాదు, యావత్ కురుసామ్రాజ్యానికి పరిరక్షకుడిగా, సకల శస్త్రాస్త్రవిద్యలలో  ఆరితేరినవాడిగా, సమస్త ధర్మశాస్త్రాలు పుణికిపుచ్చుకున్నవాడిగా, త్యాగానికి మారుపేరుగా, ఆడిన మాట తప్పనివాడిగా, శత్రువుకు వెన్ను చూపని వీరాధి వీరుడిగా పేరు ప్రఖ్యాతులు సంపాదించుకున్న తన కడసారి ఘడియలు ఈ విధంగా గడుస్తాయని ఏనాడూ అనుకోలేదే. ఎందుకిలా జరిగింది? నేను చేసిన పాపం ఏమిటి?
అంటూ కుమిలిపోతున్న భీష్ముడి అంతరంగ వేదనకు కృష్ణుడు ఇచ్చిన సమాధానమే ఇది.
“ధృతరాష్ట్రుడి  నిండు కొలువులో దుర్యోధనాదులు పాంచాలిని వివస్త్రను చేసే సందర్భంలో కాపాడమని ఆ ఆబల కోరినదెవరినో గుర్తున్నది కదా గాంగేయా! భీష్మ, ద్రోణ, అశ్వద్ధామ, కృపాచార్యులను. ఎందుకంటే వారు సర్వ ధర్మాలను ఎరిగిన వారు. ఏది మంచో ఏది చెడో నిర్భయంగా చెప్పగలిగిన సమర్ధులు. సర్వ శక్తిమంతులు కూడా. అప్పటి ఆనాటి  మీ మౌనం ఎంతటి అనర్ధానికి కారణం అయిందో ఇప్పటికయినా తెలిసి వచ్చిందా!”
ఈఉదయం  జర్నలిష్టు కాలనీలో AP 24 X 7 స్టూడియోకు వెళ్లి జర్నలిష్టు మిత్రుడు, నడిచే ఎన్ సైక్లోపీడియా పాశం యాదగిరి ఇంటిమీదుగా వస్తూ అతడికి ఫోను చేసాను. షరామామూలు కులాసా కాలక్షేపం కబుర్లకోసం కాదు. పనికొచ్చే నాలుగు ముక్కలు చెబుతాడని. నేను అనుకున్నట్టే యాదగిరి పొద్దున్నే ఏ కళన ఉన్నాడో ఏమో కానీ మంచివాళ్ల మౌనం అంశం ఎత్తుకున్నాడు. చాలా చాలా విషయాలు చెప్పాడు. జాతికి మెదళ్లవంటి మేధావుల అధోగమన తీరుతెన్నులు గురించి చెప్పాడు. అన్నీ రాయాలంటే అదో గ్రంధం అవుతుంది.
అమావాస్య పున్నములకు ఓసారి అన్నట్టుగా ఎప్పుడో కాని కాగితం మీద కలం పెట్టని యాదగిరిని నేను కోపగించుకునేది ఈ ఒక్క విషయంలోనే. రాయి యాదగిరీ! రాయి!! యాదొచ్చినవన్నీ అప్పుడప్పుడన్నా  రాస్తుండు. మాకోసం అయినా!             



కేసీఆర్ దూకుడు, మహాకూటమి



ప్రతి సోమవారం మాదిరిగానే ఈరోజు ఉదయం AP 24 X 7 News Channel The Debate With Venkata Krishna చర్చాకార్యక్రమంలో నాతో పాటు పాల్గొనవాళ్ళు: శ్రీ కార్తీక్ రెడ్డి (కాంగ్రెస్), డాక్టర్ సముద్రాల వేణుగోపాలాచారి (టీఆర్ఎస్), శ్రీ శ్రీధర్ రెడ్డి (బీజేపీ).

20, అక్టోబర్ 2018, శనివారం

మంచితనానికి దైవానుగ్రహం తోడయితే..... భండారు శ్రీనివాసరావు


నిన్న తిరుమలమ్మ మా ఇంటికి వచ్చింది. పోల్చుకోవడానికి కొంత సమయం పట్టిన మాట నిజం.
ఈ అమ్మాయి ఎవరో చెప్పడానికి ముందు కొంచెం నేపధ్యం తెలపడం అవసరం.
1992 లో మేము మాస్కోనుంచి వచ్చేసి హైదరాబాదులో ఇల్లు వెతుక్కుంటున్న రోజులు. వెంట తెచ్చుకున్న అయిదారు సూటుకేసులు మా పెద్దన్నయ్య పర్వతాలరావు గారి పంజాగుట్ట క్వార్టర్ లో వదిలేసాము. కంటైనర్లో వేసిన మిగిలిన సామాను, రష్యా నుంచి ఓడలో మద్రాసు వచ్చి మళ్ళీ రోడ్డు మార్గంలో హైదరాబాదు చేరడానికి రెండు మూడు నెలలు పడుతుంది. కాబట్టి ఇల్లు వెతుకులాట కార్యక్రమం కాసింత నెమ్మదిగానే సాగింది, హడావిడి లేకుండా.
మా అన్నయ్యగారి ఇంటికి దగ్గరలోనే ఇటు పంజాగుట్ట మెయిన్ రోడ్డు, అటు రాజ భవన్ రోడ్డు నడుమ దుర్గానగర్ అనే కాలనీలో ఓ ఇల్లు దొరికింది. అద్దె పద్దెనిమిది వందలు. వచ్చే సామాను కోసం అంత కిరాయి పెట్టక తప్పలేదు.
మా ఇంటి సందు మొదట్లో ఓ గుడిసెలో  కాపురం ఉంటున్న యాదమ్మ మా  ఇంట్లో పనికి కుదిరింది. మొగుడు మల్లయ్యకు సొంత ఆటో వుంది. ఆ బండే వీరి బతుకు బండికి ఆధారం. ఈ తిరుమల అనే అమ్మాయి యాదమ్మ, మల్లయ్యల కడసారి  కుమార్తె. ఆ దంపతులకు  అందరూ ఆడపిల్లలే. కళ, భాగ్య, సంపూర్ణ,  తిరుమల అందరూ మా ఇంట్లోనే దాదాపు పెరిగారు. బిడ్డల్ని వెంటేసుకుని యాదమ్మ పనికి వచ్చేది. వీళ్ళు కూడా వాళ్ళ పెళ్ళిళ్ళు అయ్యేవరకు మా ఇంట్లోనే పనిపాటులు చూస్తుండేవారు. కాలక్రమంలో  మేము అనేక ఇల్లు మారుతూ వచ్చినా ఆ కుటుంబం మాత్రం మమ్మల్ని వదిలిపెట్టలేదు. కళకు పెళ్ళయి ఇద్దరు పిల్లలు పుడితే వారిద్దరికీ మా పిల్లల పేర్లే  సందీప్, సంతోష్ అని పెట్టుకుంది.  సందీప్ ఇప్పుడు తొమ్మిదో తరగతి. ప్రభుత్వ పాఠశాలలో చేరి మంచి మార్కులు తెచ్చుకుంటూ, బాగా చదువుకుంటున్న అతడికి ఈ ఏడాది తెలంగాణా ప్రభుత్వం పదిహేను వేల రూపాయల స్కాలర్ షిప్ కూడా ఇచ్చింది.
మరో అమ్మాయి కుమార్తెకు మంచి సంబంధం దొరికింది. ఆ అబ్బాయికి  ఏదో మల్టీ నేషనల్ కంపెనీలో ఉద్యోగం. నలభయ్  లక్షలు పెట్టి ఫ్లాటు కొనుక్కుని ఆ గృహ ప్రవేశానికి మమ్మల్ని కూడా పిలిచారు. 
మా ఇంట్లో పారాడుతూ పెరిగిన తిరుమలమ్మకు కూడా పెళ్లయింది. కూకట్ పల్లిలో ప్రభుత్వం కేటాయించిన ఫ్లాటులో వుంటున్నారు. మొగుడు మంచి ఉద్యోగం చేస్తున్నాడు.
నువ్వేం చేస్తున్నావని అడిగితే, ‘నేనిప్పుడు పూర్తిగా హౌస్ వైఫ్.  ఇంట్లోనే వుండి నా పిల్లల మంచీచెడూ చూసుకుంటున్నాను’ అంది నవ్వుతూ.
పెద్ద ఆశలు పెట్టుకోకుండా పిల్లల్ని పెంచిన మల్లయ్య దంపతుల ఆశలపై వాళ్ళు నమ్ముకున్న యాదాద్రి నరసింహుడు నీళ్ళు చల్లలేదు. సరికదా, వారిని చల్లగా చూస్తున్నాడు. శుభం!

Discussion on Rahul Gandhi's Telangana Tour | Public Point | Part 1 | AB...



ప్రతి శనివారం మాదిరిగానే ఈరోజు ఉదయం ముఖాముఖి చర్చాకార్యక్రమంలో ......

Discussion on Rahul Gandhi's Telangana Tour | Public Point | Part 2 | AB...



ప్రతి శనివారం మాదిరిగానే ఈరోజు ఉదయం ముఖాముఖి చర్చాకార్యక్రమంలో ......

19, అక్టోబర్ 2018, శుక్రవారం

సతీమణి అంటే....... భండారు శ్రీనివాసరావు


ఎమ్మెస్సార్ కృష్ణారావు గారు. రేడియోలో నా సీనియర్ కొలీగ్. ఇండియన్ ఇన్ఫర్మేషన్ సర్వీసు అధికారిగా హైదరాబాదులో, ఢిల్లీలో పనిచేసి రిటైర్ అయ్యారు. ఆయనకు తెలుగంటే ప్రాణం. ‘మాట్లాడితే ఇంగ్లీష్ లో మాట్లాడండి, లేదా పూర్తిగా తెలుగులో మాట్లాడండి, అంతేకాని  ఇంగ్లీష్  తెలుగు  కలిపి సంకరం చేయొద్దు’ అనేవారు.
‘నా వైఫ్’ అని ఏదైనా చెప్పబోతే ఆయనకు చర్రున కాలేది. ‘నా  వైఫ్ ఏమిటి ఛండాలంగా,  మా ఆవిడ అని హాయిగా  అనొచ్చుగా’ అనేది ఆయన వాదన.
అలాగే ‘సతీమణి’ అనే పదం పట్ల కృష్ణారావు గారికి కొన్ని అభ్యంతరాలు ఉండేవి.
‘సతీమణి అంటే సతులలో మణి అని అర్ధం. రుక్మిణి కృష్ణుడి సతీమణి. ఆయనకున్న అష్ట సతుల్లో ఆవిడ మణి అని. పలానా వారి సతీమణి అని వార్తల్లో చెబితే తప్పు అర్ధం వస్తుంది, ఆయనగారికి ఇంకా వేరే భార్యలు వున్నారని. అలా కాకుండా పలానా వారి భార్య’ అని రాయమనేవారు.

చంద్రబాబుతో మా ఆవిడ పోటీ – భండారు శ్రీనివాసరావు



“చంద్రబాబును చూడండి, ఆ వయసులో ఎలా అలుపు ఎరగకుండా పనిచేస్తున్నాడో. మొన్నీమధ్య అమెరికా వెళ్లి వచ్చాడా. మనమయితే  జెట్ లాగ్ అంటూ రెండ్రోజులు కాళ్ళు మునగతీసుకుని ఇంట్లోనే పడివుంటాం. ఆయన మాత్రం కాళ్ళకు బలపం కట్టుకుని తిరుగుతూనే ఉంటాడు. ఇప్పుడు తిత్లీ తుపాను సంగతి చూడండి, తుపాను రావడం తీరం దాటి వెళ్ళడం మాత్రం జరిగింది కానీ ఆయన ఆల్ మకాం శ్రీకాకుళం జిల్లాలోనే పెట్టి ఎలా అహోరాత్రులు పనిచేస్తున్నాడో. టీవీల్లో చూస్తుంటే ఆశ్చర్యంకలుగుతుంది.  రోజుకు పద్దెనిమిది గంటలు పనిచేస్తానని అంటుంటే ఏమో అనుకున్నా కానీ నిజమే అనిపిస్తోంది”
ఈ మధ్య మా ఇంటికి వచ్చిన ఒక పెద్ద మనిషి చెప్పుకొచ్చాడు, మా ఆవిడ ఇచ్చిన కాఫీ తాగుతూ చంద్రబాబు గురించి   అనర్ఘలంగా మాట్లాడుతూ.
ఆయనకో సంగతి తెలవదు మా ఆవిడ కూడా రోజుకు పద్దెనిమిది గంటలు, అవసరమయితే మరికొన్ని గంటలు ఎక్కువగా పనిచేస్తుందని. పని చెయ్యకపోయినా, పని లేకపోయినా ఆమెకు తోచదని నాకూ ఆలస్యంగానే తెలిసింది.
‘చూసారా డ్రాయింగు రూములో తేడా’ అంటుంది నేను మధ్యాన్నం నిద్ర లేవగానే. ఈ కొద్ది సమయంలో కొట్టొచ్చిన ఆ తేడా ఏమిటని నేను నిద్ర కళ్ళు మరింత విప్పార్చి చూస్తే ఏమీ కనబడదు.
‘అదే మరి. నిన్న ఫ్లవర్ వాజు ఎక్కడుంది? ఇవ్వాళ ఎక్కడుంది. ఇక్కడ పెట్టి చూసాను, ఎంతో అందంగా కనిపించింది’
కొలను విడిచిన తామరపూలు వాడి పోతాయని సుమతీ శతకంలో చదివా కానీ, ఫ్లవర్ వాజ్ చోటు మారితే లేని అందాలు సంతరించుకుంటుందని నాకు తెలియదు.
‘అవునా’ అనబోయి ఎందుకయినా మంచిదని ‘అవును’ అన్నాను ముక్తసరిగా.
‘పక్కింటి పిన్నిగారు కూడా అలాగే అంది, ఇలా పెడితేనే చాలా బాగుందని’
ఇచ్చిన కాఫీ తాగి బల్ల మీద పెట్టబోతే అదక్కడ కనిపించలేదు. ఏమైందా అని చూస్తే గదిలో మరో మూలకు జరిగి కూర్చుంది.
‘వాస్తు మహిమా?’ అనబోయి ఆగి ఆ నమ్మకాలు ఆమెకు లేవని గుర్తుకొచ్చి, ఇంటి సర్డుడు కార్యక్రమంలో భాగమని జ్ఞాపకంవచ్చి నాలుక మడతేసి సర్దుకున్నాను.
మా ఇంట్లో సోఫాలు ఈ రోజు వున్నట్టు మరురోజు ఉంటాయన్న గ్యారంటీ లేదు. అటూ ఇటూ మారుస్తూ వాటితో చెడుగుడు ఆడడం మా ఆవిడకో సరదా. మంచాలు జరుగుతాయి. తలగడలు  అటువి ఇటవుతాయి. టీవీ దిక్కు మార్చుకుంటుంది. పూలకుండీలు, బట్టల బీరువాలు, పుస్తకాల అరమరాలు, డైనింగు టేబులు ఏవీ నాల్రోజుల పాటు ఒక్క తీరున, ఒక్క జాగాలో వుండవు. వంటిల్లు సరేసరి. అది ఆవిడ సొంత సామ్రాజ్యం.
‘ఆ గోడ మీద వినాయకుడి పెద్ద పటం అక్కడ బాగా అనిపించడం లేదు, ఎవరయినా వచ్చినప్పుడు ఎదురుగా కనిపిస్తే బాగుంటుంది.’ తనలో తాను అనుకుంటున్నట్టుగా పైకే అనేసింది.
నాకు అనిపించింది, బ్రహ్మ రుద్రాదులు కూడా ఆ వినాయకుడి స్థానచలనాన్ని ఇక ఆపలేరని.
మొన్నటికి మొన్న మా అమ్మగారి ఆబ్దీకం, ఆ తర్వాత వరలక్ష్మీ వ్రతాలు, వినాయక చవితి, ఇప్పడు దేవీ నవరాత్రులు, లలితా సహస్రాలు, ఇవన్నీ ఒక్క చేత్తో సంభాళిస్తూనే మళ్ళీ ఇలా తెచ్చి పెట్టుకున్న పనులు. అలసట అనేది ఈ మనిషికి లేదా ఉండదా అనిపిస్తుంది.
అలాగే మరోటి కూడా అనిపిస్తుంది.
ఇందులో పనికొచ్చే పనులెన్ని? పనికిరానివెన్ని?
పని కోసం పనిచేయడమా? పనికొచ్చే పనిచేయడమా?
అడగడానికి మా ఇంట్లో అసెంబ్లీ లేదు.