30, ఆగస్టు 2019, శుక్రవారం

నేనో బిగ్ జీరో



“ఏదో అనుకున్నాకానీ నువ్వో బిగ్ జీరో”
అన్నారు ఆంధ్రజ్యోతి వారపత్రిక ఎడిటర్ పురాణం సుబ్రమణ్య శర్మ గారు.
అప్పుడు నేను ఆయన దగ్గర సబ్ ఎడిటర్ గా పనిచేస్తున్నాను. ఇంద్రగంటి శ్రీకాంత శర్మ గారు సుదీర్ఘ సెలవులో పోవడం వల్ల నాకు అనుకోకుండా కలిగిన అదృష్టం అది. దినపత్రికలో సబ్ ఎడిటర్ గా ఉన్న నన్ను ఎడిటర్  నండూరి రామ్మోహన రావు గారు కొన్నిరోజులపాటు పురాణం గారికి సాయంగా కొన్నాళ్ళు  ఉండమన్నారు.
ఆరోజుల్లో, పేరు జ్ఞాపకం రావడం లేదు కానీ ఒక తెలుగు చిత్రానికి కధ, మాటలు రాసే అవకాశం పురాణం గారికి  వచ్చింది. బెజవాడ బీసెంటు రోడ్డులోని మోడరన్ కేఫ్ లో ఒక గది ఇచ్చారు నిర్మాతలు. పగలు ఆఫీసు పనిచూసుకుని సాయంత్రానికి పురాణం గారు అక్కడికి వచ్చేవారు. ఆ పని పూర్తికావస్తున్న దశలో కాబోలు నన్ను సాయంగా రమ్మన్నారు.
ఆయన గారి ఆలోచనలు జెట్ స్పీడు. దానికి తగ్గట్టుగా వాటిని కాగితాలపై పెట్టడం నా పని, నన్నయభట్టుకు నారాయణ భట్టు మాదిరిగా. ఆయన చెబుతూ వుండడం నేను రాస్తూ పోవడం. నేను పత్రికా విలేకరినే కానీ తెలుగు షార్ట్ హ్యాండ్ గట్రా ఏమీ తెలవ్వు. అంచేత కొన్ని నట్లు పడేవి. ఆ సందర్భంలో ఒక రోజు పురాణం వారు అక్షింతలు వేస్తూ అన్న మాట ఇది. పెద్దవారి అక్షింతలు ఆశీర్వాదాలే కదా!
ఇంతకీ ఆయన ఆ ఒక్క మాటే అని ఊరుకోలేదు.                              
ఆయన అన్నదేమిటంటే:
“శ్రీనివాసరావ్! నువ్వో జీరో లాంటివాడివి. నీ సంగతి నీకు తెలవదు. ఎవరన్నా నీకు దన్నుగా వుంటే నీ విలువ ఇంకా బాగా పెరుగుతుంది, ఒకటి పక్కన సున్నా లాగా”
ఆయన ఏక్షణంలో అన్నారో తెలవదు.
ఈ సున్నా పక్కన మా ఆవిడ వచ్చి నిలబడిన తర్వాత కానీ  ఆ విషయం బోధపడలేదు.          

22, ఆగస్టు 2019, గురువారం

A honest Confession Of A Husband


‘ఇంతగా ప్రేమించారు. చాలా గొప్ప విషయం’ అంటూ మితృలు కొనియాడుతున్నారు. ఇది కలలో కూడా నేను అంగీకరించను. ఒకవేళ నేను అలా గొప్పలు చెప్పుకుంటే నన్ను నేను మోసం చేసుకున్నట్టే.
మా ఆవిడ స్నేహితురాలు శ్రీమతి వనం గీత ఎప్పుడూ అంటుండేది. ‘నువ్వు మీ ఆయన్ని బాగా గారాబం చేసి చెడగొడుతున్నావు. అందరికీ మొగుళ్ళు లేరా! అందరూ ఇలానే మాలిమి  చేస్తున్నారా! నీకు ఒంట్లో బాగా లేకపోయినా నువ్వే కాఫీ కలిపి ఆయనకు ఇవ్వాలా! వంటింట్లోకి పోయి ఓ కప్పు కాఫీ కలుపుకుని తాగలేరా, మరీ విడ్డూరం కాకపొతే!’
అవును. గీత గారు చెప్పింది అక్షరాలా నిజం. నన్ను చెడగొట్టి ఎందుకూ పనికిరాని ఓ మొగుడ్ని చేసింది. స్టవ్ అంటించడం కూడా రాని మొగుళ్ళ జాబితాలో చేర్చేసింది. సిగ్గు లేకుండా చెబుతున్నాను. నా బనీను సైజు కూడా నాకు తెలియదు. పొరబాటున ఏదైనా వూరు వెళ్లినప్పుడో, స్నేహితులు షాపింగ్ చేస్తున్నప్పుడు కొనుక్కున్నానా ఇక అంతే! లొడుంగు బుడుంగు. ప్యాంటు పైకి లాక్కుంటూ తిరుగుతుంటే తనే తీసుకువెళ్ళి వాటిని ఆల్టర్ చేయించేది.
ఇంటికి ఎవరు  వచ్చినా ‘ఇదిగో ఎక్కడున్నావ్? రెండు కాఫీలు ఇస్తావా?’ అని కేక పెట్టి అడిగే పనే లేదు. వచ్చిన సమయాన్ని బట్టి, వాళ్ళు ఎవ్వరయినా సరే!  కాఫీలో, టిఫిన్లో, భోజనాలో కనుక్కుని పెట్టేది. ఇన్నేళ్ళుగా ఆమె నిరంతరంగా చేస్తున్న  సేవలను నేను ఎన్నడూ గుర్తించలేదు. ఓ మంచి మాట తనతో అన్నదీ లేదు. అందరూ అన్నపూర్ణ తల్లి అంటుంటే గర్వంగా ఫీలయ్యేవాడిని. పైగా అలా చేయడం ఆమె బాధ్యత అనుకునేవాడిని.
నేను పొద్దున్నే టీవీ షోలకు వెళ్ళాలి అంటే ఆ పాట్లేవో తనే పడేది. నాకంటే ముందే లేచి కార్న్ ఫ్లేక్స్ తయారు చేసి తినిపించి  బీపీ మాత్తర్లు ఇచ్చి పంపేది. డాక్టర్ రాసిచ్చిన ఆ మాత్ర పేరేమిటో నాకిప్పటికీ తెలవదు.
ఒక్కోసారి ‘వుండండుండండి! ఆ టీవీ వాళ్లకు ఈ చొక్కా రంగు పడదు. తీరా పోయిన తర్వాత గ్రీన్ మ్యాటో, బ్లూ మ్యాటో అని వేరే ఎవరి చొక్కానో  తగిలిస్తారు. ముందే మార్చుకుని వెళ్ళండి’ అంటూ జాగ్రత్తలు చెబుతుంది.
అలా  అన్నీ ఆమే నాకు అమర్చి పెట్టేది.  కంటికి రెప్పలా కనుక్కుంటూ వుండేది. ఇంట్లో నేనొక మహారాజుని. ఆవిడ జీతం భత్యం లేని మహామంత్రి. నన్నలా మురిపెంగా, మన్ననగా, లాలనగా  చూసుకుని, నా కళ్ళముందే  అలా దాటిపోయింది.
ఇప్పుడు అర్ధం అయివుంటుంది అనుకుంటాను ఫ్రెండ్స్!  ఆమెను పోగొట్టుకుని  కాదు, నేను ఇంతగా బాధ పడుతోంది. ఇలా చేసే మనిషి లేకుండా ఎలా బతకాలి దేవుడా అనే స్వార్ధం నా చేత ఇలా రాయిస్తోంది. కాబట్టి స్నేహితురాలా! నిలువెల్లా స్వార్ధం నిండిన ఈ వ్యక్తికి ఊరడింపు వాక్యాలు, హిత వచనాలు పలికి మీ మంచితనాన్ని వృధా చేసుకోకండి ప్లీజ్!

20, ఆగస్టు 2019, మంగళవారం

మిస్టర్ నిర్మల


‘ఏమోయ్! ఒసే! ఇలా పిలుపులు లేవు. నేను ఆమెకు ‘ఏమండీ’. ఆమె నాకు ‘మిస్టర్’. పెళ్ళయిన మొదటి రోజునుంచీ ఇంతే!
'నా బాసూ నా బానిసా నా భార్యే. నా తప్పులు సరిదిద్దడానికి బాసు. నా తప్పులు భరించడానికి బానిస. ఇలా 48 ఏళ్ళు నాతో కాపురం వెళ్ళదీసింది'
‘మా ఆవిడ భయపడదు, నాకు కాదు. నేనూ భయపడతాను,అయితే ఆవిడకి కాదు.
‘ఇప్పటికే రెండు గుండె ఆపరేషన్లు. ఏటా ఒకసారి పుట్టింటికి వెళ్ళినట్టు ఆసుపత్రిలో మూడు నిద్రలు చేస్తుంది. ఇంటికి రాగానే జబ్బుల సంగతి మర్చిపోతుంది.
‘నేనలా కాదు. ప్రపంచం నా ముందు బలాదూర్ అనుకుంటా. కానీ చిన్న అస్వస్థత వస్తే చాలు  జావకారిపోతాను.
‘అలాంటిది నన్ను ఇన్నేళ్ళుగా కనిపెట్టుకుని వున్న  'గుండే' జారిపోతే.....
రోజు గడవడం ఎలా!
ఓ పాతికేళ్ళకు పూర్వం కమ్యూనిస్ట్ రష్యాకు  వెడుతున్నాను అని ఓ మిత్రుడితో చెబితే ఇలా అన్నాడు.
‘నువ్వు మాట్లాడకుండా బతకలేవు. అక్కడ మాట్లాడితే బతకలేవు’ 
రోజుకి 24 గంటలు, 1440 నిమిషాలు
ఇప్పటికి ఎన్ని గడిచాయో, ఇంకా ఎన్ని గడవాలో, ఎలా గడవాలో !
ఓకే! అందరూ చెబుతున్నట్టు గుండె దిటవు పరచుకుంటాను. మామూలుగా రోజులు గడిపే ప్రయత్నం చేస్తాను. రెండు గంటలు టీవీ చర్చలు, ఓ నాలుగుగయిదు గంటలు ఇలా పిచ్చి రాతలు. ఓ గంట తిండీతిప్పలు. నిద్ర పడితే ఓ ఆరుగంటలు. పట్టక పొతే పద్నాలుగు గంటలు ఎలా గడుస్తాయి. ఇప్పుడు నా  చుట్టూ వున్న ఈ  జనం ఒక్కసారి మాయమై పోయి ఒక్కడినే మిగిలితే!



15, ఆగస్టు 2019, గురువారం

‘వొట్రకంబు’ – భండారు శ్రీనివాసరావు

పరీక్షలకోసం పాస్ పోర్ట్ సైజ్ ఫోటో తీయించుకోవడం తప్ప మా చిన్నతనంలో విడిగా కావాలని ఫోటో దిగడం అనేది అబ్బురమే. అసలు కెమెరా అనేది చాలామంది ఇళ్ళల్లో కనిపించేది కాదు. రేడియో, కెమెరా ఉన్నాయంటే కలిగినవాళ్ళని అర్ధం.
అలాంటిది నేను ఓ యాభయ్ ఏళ్ళక్రితం ఫోటో దిగాను అంటే నేనే నమ్మను. కానీ ఏం చెయ్యను కళ్ళెదుట కనిపిస్తుంటే...
నేను బెజవాడ ఎస్సారార్ కాలేజీలో చేరకముందు కాంగ్రెస్ ఆఫీసు రోడ్డులోని సింహాలమేడలోని అనేకానేక వాటాల్లో ఒక దానిలో అద్దెకు వుండేవాళ్ళం. (మా పెద్దన్నగారనుకోండి). ఆ మేడ ఆవరణలోనే రోడ్డుకు ఆనుకుని విశ్వా టైప్ రైటింగ్ ఇన్స్తిటూట్ వుండేది. అందులో సూర్యనారాయణ అని పనిచేస్తుండేవాడు. మాంచి హుషారు మనిషి. ఎప్పుడూ క్రాఫు చెదరకుండా దసరా బుల్లోడిలా ఉండేవాడు. ఆ రోజుల్లో స్కూలు ఫైనల్ పాసయిన ప్రతి వాడూ టైప్ నేర్చుకోవాలని అనుకునేవాడు. ఆ డిప్లొమా చేతిలో వుంటే ప్రభుత్వ ఉద్యోగం తేలిగ్గా వస్తుందని. అమీర్ పేటలో జావాలు, ప్లస్ లూ నేర్చుకునే వాళ్ళ మాదిరిగా అనుకోండి.
ఆ సూర్య నారాయణ ఇన్నేళ్ళ తర్వాత ఫేస్ బుక్ ద్వారా నన్ను పట్టుకుని వాట్స్ అప్ లో మూడు ఫోటోలు పంపాడు. టీవీల్లో నన్ను చూస్తుంటాడట. పేరేమో భండారు శ్రీనివాసరావు అని చెబుతారు, మనిషి చూస్తేనేమో వేరేగా వున్నాడు, ఆయనా ఈయనా ఒకరేనా అనే అనుమానంతో నాకు ఫోన్ చేసి అడిగాడు, టీవీల్లో కనిపించేది నువ్వేనా అని.
ఫోటోలు చూసిన తర్వాత ఆ అనుమానం ఎవరికైనా వస్తుంది. అప్పుడు సన్నగా రివటగా వుండే వాడిని. మా ఆవిడేమో మద్రాసు ఆంధ్రా మెట్రిక్. నాకు ‘వొట్రకంబు’ అని నిక్ నేమ్ పెట్టింది. (అప్పటికి పెళ్లి కాలేదు, ప్రేమ లేఖల స్థాయిలోనే వుంది. ఆ మాటకు అర్ధం పెళ్ళయిన తర్వాత చెప్పింది. అంటే ఇళ్ళల్లో పాజుట్లు (బూజు) దులిపే కర్ర)
సరే! ఏం చేస్తాం!
ఇప్పుడు సూర్యనారాయణ పంపిన పాత ఫోటోలు చూస్తుంటే అది నిజమే అనిపిస్తోంది.


కింది ఫోటోలలో వున్నది: బెజవాడ కృష్ణలో నీళ్ళు లేనప్పుడు వెళ్లి దిగామని అతడే చెప్పాడు. నాతోపాటు (చివరి ఫోటోలో నేను కుడి నుంచి రెండు) వున్నది: సూర్యనారాయణ, డాక్టర్ దాసు మధుసూదనరావు, దాసు శ్రీరాములు, అడ్వొకేట్ గారి అబ్బాయి, ఆంధ్రయూనివర్సిటీలో ప్రొఫెసర్ గా చేసి రిటైర్ అయి వైజాగ్ లో సెటిలయ్యారట. మూడో అతను అద్దేపల్లి సత్యనారాయణ, కృష్ణ లంక, ఇప్పుడు లేరట)

వృద్ధభారతం – భండారు శ్రీనివాసరావు


(Published in SURYA telugu daily on 16-08-2019, Friday)

భారత దేశం  తన డెబ్బయి మూడవ స్వాతంత్రదిన  వార్షికోత్సవాన్ని ఘనంగా జరుపుకుంది. మన దేశానికి స్వాతంత్రం వచ్చిన రోజునే పుట్టిన లక్షలాదిమంది కూడా అదేరోజున డెబ్బయ్యవపడి దాటివుంటారు. ఇన్నేళ్ళ తమ జీవితంలో స్వతంత్ర భారతం తమకేమి ఇచ్చినా, ఇవ్వకున్నా ఈ ముదిమి వయసులో కాసింత ఆసరా కోరుకునే వృద్ధుల సంఖ్య కూడా ఈ దేశంలో తక్కువేమీ కాదు. ఒకరకంగా చూస్తే వృద్ధాప్య సమస్యల విషయంలో కలిగిన వారు, లేనివారు అనే తేడా లేదు.
ఒక వ్యక్తి పరిపూర్ణ జీవితం గడిపాడూ అంటే అతడు బాల్య, కౌమార, యవ్వన, వృద్ధాప్య దశలను అనుభవించాడని అర్ధం. కానీ అన్ని దశల్లో మానవజీవితం ఒకే మాదిరిగా సాగడం అనేది ఈ సృష్టిలో సాధ్యం కాని విషయం. అయితే అన్ని దశల్లో కష్టాలు వుంటాయి, సుఖాలూ  వుంటాయి. వీటిని దాటుకుంటూ  రావడమే నిజమైన జీవితానుభవం.
ఈ నాలుగు దశల్లో మధ్యలో రెండింటిని మినహాయిస్తే మిగిలిన  రెండింటిలో తప్పనిసరిగా ఎవరిపైనో ఒకరిపైన  ఆధారపడాల్సిన పరిస్తితే! చిన్నతనంలో  కన్నవారి మీదా, పెద్దతనంలో కన్నపిల్లల మీదా ఆధారపడి నెట్టుకొచ్చే దుస్తితే!       
బాల్యం గురించీ, అందులోని మధురిమ గురించీ అనేకమంది అనేక రకాలుగా కధలు, గాధలు, గేయాలు రాసారు. నిజంగా అదొక అద్భుతమైన అపురూప దశ. కన్నవారికి మినహా తమకంటూ ఓ బాధ్యత అంటూ లేని జీవితభాగం ఇదొక్కటే. తలితండ్రులు ఎవరో తెలియని నిర్భాగ్య దామోదరులని తప్పిస్తే, ఏదొచ్చినా పైనుంచి కంటి రెప్పలా  కనిపెట్టి చూసుకునేవారు ఎల్లవేళలా వెన్నంటి  వుండే దశ కూడా ఇదే.
కౌమార, యవ్వనాలు జీవన పధాన్ని నిర్దేశించే దశలు. ఈ కాలంలో ఎవరి కర్మవారిదే. వాళ్ళ ప్రయత్నాలను బట్టే వారి బతుకులు మలుపు తిరుగుతాయి.
బాధ్యత లేని దశలు ఇవే. బాధ్యతతో మెలగాల్సిన దశలూ ఇవే కావడం  సృష్టిలోని మరో చమత్కారం.
ఇక మిగిలిందీ, బతికుంటే  చివరకు అందరూ చేరాల్సిందీ వృద్ధాప్యదశ ఒక్కటే. చేరేలోగా రాలిపోయే బతుకులు కొన్నయితే, చేరి వాడిపోయే జీవితాలు మరికొన్ని.
ఇవిగో వీటిని గురించే, జీవన సాగరాన్ని ఈదుతూ అంతిమంగా ఓ తీరానికి చేరుకొని అలుపు తీర్చుకుంటున్న వీరిని గురించే ఈనాడు నేను ముచ్చటిస్తున్నది.


2011 జనాభా లెక్కల ప్రకారం దేశంలో అరవై ఏళ్ళు పైబడిన వృద్ధుల సంఖ్య పది కోట్ల పైమాటే. గడచిన ఎనిమిదేళ్ళ కాలంలో ఇది మరింత పెరిగి ఉండవచ్చు. దేశ జనాభా నూట పాతిక కోట్ల మందిలో ఇదెంత అనిపించవచ్చు కానీ మిగిలిన నూట పదిహేను కోట్ల మందికీ, వీరికీ తేడా ఏమిటంటే ఇతరుల మీద ఆధార పడి బతుకులు వెళ్ళదీయాల్సిన దుస్తితి. ముందే చెప్పినట్టు ఈ విషయంలో ఉన్నవారనీ, లేనివారనే తేడాలేదు. ఎంతటి సంపన్నులయిన వయో వృద్ధులయినా తమ  పిల్లల మీదనో, లేదా వాళ్ళు ఏర్పాటు చేసిన పనిమనుషులు, ఆయాలు, నర్సుల మీదనో ఆధారపడి బతుకు దొర్లించాల్సిందే! దేశానికి స్వతంత్రం వచ్చినప్పుడు అంటే 1947లో దేశ జనాభా సగటు జీవితకాలం 31 సంవత్సరాలు కాగా 2005 నాటికి అది  64 సంవత్సరాలకు పెరిగింది. ఇప్పటికిమరింత పెరిగివుంటుంది. సందేహం లేదు. అలాగే, మరణాల రేటు వెయ్యి మందికి  45 కాగా, అది   2007 ఆగస్టు  19 వ తేదీ నాటికి కేవలం  ఎనిమిది మందికి పడిపోయింది.
అభివృద్ధి చెందుతున్న మన దేశానికి ఇది చాలా మంచి పురోగతే.  మరణాల సంఖ్య చెప్పుకోదగిన విధంగానే తగ్గింది. జీవిత కాలం బాగా పెరిగింది. అయితే అలా జీవిస్తున్నవారి సుఖ సంతోషాలు ఏమైనా పెరిగాయా? అందరూ సంతోషంగా బతుకులు వెళ్ళదీస్తున్నారా? వారిలో సంతృప్త స్థాయి ఆశించిన స్థాయిలో ఉందా? ఈ ప్రశ్నలన్నింటికీ ‘అవును’ అనే  జవాబు దొరికినప్పుడే మరణాల సంఖ్య గణనీయంగా తగ్గించగలిగామని గర్వంగా చెప్పుకోవడానికి వీలుపడుతుంది.
మా చిన్నప్పుడు వూళ్ళో చాలామంది వారి పెద్దతనంలో మంచానపడి ఆ  కుక్కి మంచంలోనే శేషజీవితం  గడిపి కన్ను మూయడం చూశాను. అప్పుడు తరచుగా కనబడే ఈ దృశ్యాలు ఈనాడు అరుదుగా కూడా కానరావడం లేదని చెప్పే పరిస్తితి లేదు. అప్పుడూ ఇప్పుడూ రోగాలు వున్నాయి. అయితే ఆ రోజుల్లో అదొక రోగమని తెలియకుండానే చనిపోయేవారు.  ఇప్పుడు ఇంకో రకం దుస్తితి. రోగమని తెలుసు. నయం చేయించుకోవచ్చనీ తెలుసు. కానీ అందుకోసం చేసే ఖర్చుతో ఆ రోగం నయమవుతుందో లేదో తెలియదు కానీ సంసారం మాత్రం ఆర్ధికంగా కునారిల్లి  పడకేస్తుంది.
అయితే, డబ్బు ఒక్కటే ఇప్పటివారి  సమస్య కాదు. అనేక రకాల ఆరోగ్య బీమా సంస్థలు పుట్ట గొడుగుల్లా పుట్టుకొచ్చాయి. బీమా చేయించుకునే నాటికి ఉన్న ధీమా ఒక్కసారి ఆసుపత్రి పాలు కాగానే నీరు కారిపోవడం ఖాయం.  అవసరం పడినప్పుడు ఆదుకోవాల్సిన బీమా పాలసి  అవసరంలో ఉన్నవారికి అవసరమైనప్పుడు ఆపన్నహస్తం అందిస్తోందా అంటే అనుమానమే. బీమా కార్డు చేతిలో ఉన్నప్పటికీ వేన్నీళ్ళకు చన్నీళ్ళ తోడు అన్నట్టుగా బీమా కంపెనీ ఇచ్చే సొమ్ముకు అదనంగా  కొంత చేతి చమురు వదిలితే కానీ ఆసుపత్రి నుంచి రోగి కాలు బయట పెట్టలేడు.  
వెనకటి రోజుల్లో చిన్న పిల్లల వైద్యులు అనే బోర్డులు కనబడేవి. ఇప్పుడు అన్ని ఆసుపత్రులలో పెద్దవారికి వైద్యం చేసే నిపుణులు కనబడుతున్నారు.      
పూర్వం ఉమ్మడి కుటుంబాలు వున్నప్పుడు రోగం రొష్టు వస్తే చూసుకోవడానికి ఇంట్లో ఎవరో ఒకరు వుండేవారు. ఇప్పుడు పల్లెటూళ్ళలో కూడా చాలా సంసారాలు ‘ఒంటి రాయి, శొంటికొమ్ము’ అన్నట్టుగా సాగుతున్నాయి. నగరాల్లో పరిస్తితి చెప్పక్కర లేదు. మధ్య తరగతి కుటుంబాల్లో చదువుకున్న పిల్లలు ఉద్యోగాల బాట పట్టి వేరే ఊళ్లకు తరలి వెడుతున్నారు. విదేశాలకు పోయి స్థిరపడే వారి సంఖ్య కూడా తక్కువేమీ కాదు. కాపురాలు మొదలు పెట్టినప్పుడు రెండు గదుల వాటాలో గడిపినవాళ్ళు కూడా ఇప్పుడు మూడు నాలుగు పడక గదుల ఇళ్ళకు మారిపోయారు. అనుకోకుండా ఎవరయినా చుట్టమొచ్చి దిగబడితే ఎక్కడ పడుకోబెట్టాలి, తామెక్కడ నిద్ర చేయాలి అని బిక్కు బిక్కుమంటూ వుండేవాళ్ళు. ఇప్పుడో!  చెప్పుకోవడానికి మూడు బెడ్రూములు వున్నాయి, రోజూ తుడిచి, దులిపి శుభ్రం చేయడం తప్పించి, ఒక్కళ్ళూ వచ్చేవాళ్ళు లేరు అని గొణుక్కు౦టున్నారు.   సంపన్నులు నివసించే ప్రాంతాలలో పెద్ద పెద్ద భవనాలు కనిపిస్తాయి. వాటిల్లో వుండేది బిక్కుబిక్కుమంటూ ఇద్దరు ముసలి వాళ్ళు, వాళ్ళకు తోడుగా ఓ కుక్క, ఓ వాచ్ మన్. పిల్లలు మాత్రం విదేశాల్లో. విశాలమైన భవంతుల్లో ఆరుబయలు జైలు ఖైదీల్లా పెద్దవాళ్ళు. వీళ్ళు అక్కడికి పోలేరు. వాళ్ళు ఇక్కడికి రాలేరు.    
మొన్న మాకు తెలిసిన వృద్ధ దంపతులు ఆసుపత్రికి వెళ్ళారు. వీళ్ళ దగ్గర అన్ని రకాల హెల్త్ కార్డులు వున్నాయి. భార్యకి స్వైన్ ఫ్లూ అన్నారు. విడిగా ఓ విభాగంలో పెట్టారు. మర్నాడు ఆ పెద్దాయన కూడా అడ్డం పడ్డాడు. ఆయనకీ అదే వ్యాధి అని నిర్ధారించారు. కార్డుఉన్న  మనుషులు కనుక ఆసుపత్రి వాళ్ళు వెంటనే చేర్చుకున్నారు. చేర్చుకుంటూ అడిగారు, మీ పిల్లలు ఎవరూ రాలేదా అని. జవాబు చెప్పడానికి ఆయనకి జబ్బుతో పాటు సిగ్గు కూడా అడ్డం వచ్చి వుంటుంది. అబ్బాయి అమెరికాలో. అమ్మాయి ఆస్ట్రేలియాలో. డబ్బుకు కొదవలేదు. కానీ కనిపెట్టి చూసేవారే లేరు. దీన్ని ఖర్మ అనాలా! ప్రాప్తం అనాలా!  

NOTE: Courtesy Image Owner   

14, ఆగస్టు 2019, బుధవారం

Debate On Polavaram Project Reverse Tendering | News & Views#1 | hmtv Te...









ప్రతి బుధవారం మాదిరిగానే  ఈరోజు ఉదయం  HMTV  న్యూస్  ఛానల్ లో  యాంకర్  శ్రీమతి లక్ష్మి  నిర్వహించిన న్యూస్ అండ్  వ్యూస్  చర్చాకార్యక్రమంలో  నాతోపాటు  పాల్గొన్నవాళ్ళు: శ్రీ రఘురాం (బీజేపీ, ఫోన్ లైన్లో), శ్రీ రామనుజయ (టీడీపీ),  డాక్టర్  శ్రీధర్ (వైసీపీ).

Debate On Polavaram Project Reverse Tendering | News & Views#2 | hmtv Te...





ప్రతి బుధవారం మాదిరిగానే  ఈరోజు ఉదయం   న్యూస్  ఛానల్ లో  యాంకర్  శ్రీమతి లక్ష్మి  నిర్వహించిన న్యూస్ అండ్  వ్యూస్  చర్చాకార్యక్రమంలో  నాతోపాటు  పాల్గొన్నవాళ్ళు: శ్రీ రఘురాం (బీజేపీ, ఫోన్ లైన్లో), శ్రీ రామనుజయ (టీడీపీ),  డాక్టర్  శ్రీధర్ (వైసీపీ).

13, ఆగస్టు 2019, మంగళవారం

KSR Live Show | Chandrababu Naidu faces embarrassment for tweeting fake ...









ప్రతి మంగళవారం మాదిరిగానే ఈరోజు ఉదయం సాక్షి టీవీలో కొమ్మినేని శ్రీనివాసరావు నిర్వహించే కెఎస్ఆర్ లైవ్ షో చర్చాకార్యక్రమంలో నాతోపాటు పాల్గొన్న వాళ్ళు: శ్రీ లక్ష్మీ పతిరాజా (బీజేపీ), శ్రీ కరణం ధర్మ శ్రీ (వైసీపీ), శ్రీ రామ్మోహన్ రెడ్డి (కాంగ్రెస్), శ్రీ సుధాకరబాబు (వైసీపీ ఎమ్మెల్యే ఫోన్ లైన్లో)

12, ఆగస్టు 2019, సోమవారం

Is BJP To Start Targeting YSRCP In AP ? | The Debate With Venkata Krishn...





ప్రతి సోమవారం  మాదిరిగానే  ఈరోజు ఉదయం    AP 24  7    న్యూస్  ఛానల్లో The Debate With Venkata krishna చర్చాకార్యక్రమంలో నాతోపాటు పాల్గొన్నవాళ్ళు: శ్రీ సుందర రామ శర్మ(కాంగ్రెస్), శ్రీ పట్టాభి (టీడీపీ), శ్రీ గోవింద రెడ్డి (వైసీపీ), శ్రీ కిషోర్ బాబు (బీజేపీ)

Did Congress Fail To Select Party President in CWC Meeting?| The Debate ...





ప్రతి సోమవారం  మాదిరిగానే  ఈరోజు ఉదయం    AP 24  7    న్యూస్  ఛానల్లో The Debate With Venkata krishna చర్చాకార్యక్రమంలో నాతోపాటు పాల్గొన్నవాళ్ళు: శ్రీ సుందర రామ శర్మ(కాంగ్రెస్), శ్రీ పట్టాభి (టీడీపీ), శ్రీ గోవింద రెడ్డి (వైసీపీ), శ్రీ కిషోర్ బాబు (బీజేపీ)

11, ఆగస్టు 2019, ఆదివారం

Live : దిశ లేని పాలన..! | News Scan LIVE Debate With Vijay | 11th August...





ప్రతి ఆదివారం మాదిరిగానే ఈరోజు ఉదయం    TV 5  న్యూస్  ఛానల్ లో   ఎక్జిక్యూటివ్  ఎడిటర్  విజయ నారాయణ్  నిర్వహించిన న్యూస్ స్కాన్ చర్చాకార్యక్రమంలో  నాతోపాటు పాల్గొన్నవాళ్ళు: శ్రీ రఘునాధ బాబు (బీజేపీ), శ్రీ గంగాధర్ (కాంగ్రెస్)

10, ఆగస్టు 2019, శనివారం

Discussion | Chandrababu Naidu Accuses CM Jagan over His Decision on Wel...





ప్రతి శనివారం  మాదిరిగానే  ఈరోజు  ఉదయం   ABN Andhra Jyothy  న్యూస్  చానల్  లో   యాంకర్ పవన్ కుమార్  నిర్వహించిన  Public  Point ముఖాముఖి కార్యక్రమంలో...

చంద్రబాబును ఎందుకు ఓడించారు? – భండారు శ్రీనివాసరావు


నిజానికి ఇది ప్రజల్లో మొలకెత్తిన ప్రశ్న కాదు. ‘నన్నెందుకు ఓడించారంటూ’ ఏకంగా చంద్రబాబు నాయుడే  జనంలో కొత్త అనుమానాలు రేకెత్తిస్తున్నారు.
‘ఓడించడానికి తానేం తప్పు చేశానో తెలియడంలేదని’ గుంటూరులోని టీడీపీ రాష్ట్ర కార్యాలయంలో నియోజకవర్గాల వారీ సమీక్షా సమావేశంలో మాట్లాడుతూ టీడీపీ జాతీయ అధ్యక్షుడు  చంద్రబాబు నాయుడు మధనపడ్డట్టు పత్రికలు రాశాయి.
‘సమీక్షించుకోవడానికి లోపం ఎక్కడ జరిగిందో అంతుచిక్కడం లేదు. కార్యకర్తలకు ఎలాంటి దిశానిర్దేశం చేయాలో తెలియడం లేద’ని చంద్రబాబు ఆవేదన వ్యక్తం చేశారు.
‘ప్రజలకు కష్టం తెలియకుండా ఆ కష్టమేదో నేనే పడ్డా. సంక్షేమ పథకాల్లో లోటు రానివ్వలేదు. ప్రపంచ స్థాయి రాజధాని అమరావతి నిర్మాణానికి శ్రీకారం చుట్టా. అనతి కాలంలోనే పట్టిసీమ పూర్తి చేశా. పోలవరం ప్రాజెక్టు పనులను రికార్డు స్థాయిలో పూర్తి చేసేందుకు చర్యలు తీసుకున్నా. అయిదేళ్ళు రాష్ట్ర అభివృద్ధి కోసం కష్ట పడితే కేవలం ఇరవై మూడు సీట్లు రావడమేమిటో ఇప్పటికీ బోధపడడం లేదు.  నేనేమైనా తప్పు చేశానాఅని చంద్రబాబునాయుడు బాధ పడ్డారు.
 క్రమంలో, తన పార్టీకి ప్రజలిచ్చిన తీర్పు పట్ల కూడా ఆయన  అసహనం వ్యక్తం చేశారు. ఓటర్ల  తీరుతెన్నులను తప్పుపట్టారు.
‘మనం ఇచ్చిన గోదావరి నీళ్ళు తాగారు. ఓట్లేయడం మాత్రం మరచిపోయారు. పాలిచ్చే ఆవును వదిలిపెట్టి, తన్నే దున్నపోతును పట్టుకొచ్చుకున్నారు’ అని ఎద్దేవా చేశారు.
చిరునవ్వులు చిందిస్తూ ఆయన ఈ మాటలు చెప్పినట్టు టీవీల్లో కనిపించింది కాబట్టి ఈ విమర్శలను తేలిగ్గా తీసుకోవాలని, ఏదో మాటవరసకు, సరదాగా అన్నారని సరిపుచ్చుకోవచ్చు. కానీ నలభయ్ ఏళ్ళకు పైగా సుదీర్ఘ రాజకీయ అనుభవం ఉన్న నాయకుడు అనాల్సిన మాటలేనా అని అనిపిస్తే కూడా  తప్పు పట్టాల్సిన పనిలేదు. నిజం చెప్పాలంటే, సోషల్ మీడియాలో వివిధ పార్టీల అభిమానులు అత్యుత్సాహంతో, శృతిమించిన అభిమానంతో ఎదుటివారిపై చేస్తున్న చౌకబారు వ్యాఖ్యలకు ఇవి  తక్కువేమీ కాదు. ఇలాంటివి అభిమానులు మాట్లాడితే అర్ధం చేసుకోవచ్చు. కానీ,  కోపం రావాల్సిన సందర్భాలలో సయితం అమితమైన ఓర్పును ప్రదర్శిస్తారనే మంచి పేరు చంద్రబాబునాయుడు ఖాతాలో ఎప్పటినుంచో వుంది.  అలాంటి ఆయన నోటివెంట ఈ మాటలు  రావడమే ఆశ్చర్యకరం. గతంలో ఉమ్మడి రాష్ట్రంలో వై.ఎస్. రాజశేఖరరెడ్డి ముఖ్యమంత్రిగా వున్నకాలంలో అసెంబ్లీ సమావేశాల్లో చోటు చేసుకున్న ఆవేశకావేశపూరిత సంభాషణలలో సయితం చంద్రబాబు ఏనాడు కట్టుతప్పి వ్యవహరించిన దాఖలా లేదు. ఏ పరిస్తితుల్లో కూడా  సంయమనం కోల్పోలేదు.  ఈ విషయాలు గుర్తున్నవాళ్లకే కాకుండా, గతంలో ఆయన అధికారంలో వున్నప్పుడు, అధికారానికి దూరమైనప్పుడు కూడా  ఆయన వ్యవహారశైలి ఇలాగే వుండేది.  ఆ కోణంలో గమనిస్తూ  చంద్రబాబుకు అభిమానులుగా మారిన వారికి సైతం  ఆయన  ఉదహరించిన ఈ  పాడిఆవు, దున్నపోతు సామ్యం రుచించలేదని గట్టిగా చెప్పవచ్చు. మంచో చెడో ప్రజలు ఒక నిర్ణయానికి వచ్చారు. వారి విజ్ఞతను ఎద్దేవా చేయడం ప్రజాస్వామ్యవాదులు చేయాల్సిన పని కాదు.
తనమీద కక్ష పెంచుకుని డెబ్బయి శాతం పూర్తయిన పోలవరం ప్రాజెక్టు పనులు నిలిపివేశారని అంటూ  అదే కక్షతో అమరావతిని చంపేస్తారా? ప్రపంచ బ్యాంకు రుణాలను ఆపేస్తారా? అంటూ చంద్రబాబు ఆగ్రహంగా ప్రశ్నించారు.
జగన్, కేసీఆర్ కలిసి వుంటే తనకు బాధ లేదని, కానీ ఇద్దరూ కలిసి రాష్ట్రాన్ని నాశనం చేస్తుంటే చాలా బాధగా వుందని చంద్రబాబు ఆవేదన వెలిబుచ్చారు.
సరే! ఈ రకమైన విమర్శలతో, ఆరోపణలతో ఏకీవభించేవాళ్ళు వుంటారు. విబేధించేవాళ్ళు వుంటారు. ఎందుకంటే అవి రాజకీయపరమైన ఆరోపణలు. ఏపార్టీ వాళ్ళు ఆ పార్టీకి విధానానికి, విధేయతకు  తగ్గట్టుగా వాటిని అన్వయించుకుంటారు. వాటిని వాళ్ళ భాషలోనే వారి విజ్ఞతకు వదిలేద్దాం.     
‘గతంలో నేను ప్రతిపక్ష నేతగా వున్నప్పుడు అప్పటి ప్రభుత్వాలు నా భద్రతను తగ్గించలేదు. ఈ ముఖ్యమంత్రి (జగన్ మోహన రెడ్డి) మాత్రం తగ్గించారు. ఇలాంటి కక్ష సాధింపు రాజకీయాలు తాను అధికారంలో వున్నప్పుడు చేసుంటే మీరెక్కడ (వైసీపీ అధినేతలు) వుండేవారు’ అని చంద్రబాబు  ఆక్షేపించారు.
ఒక సీనియర్ నాయకుడికి, అందులో గతంలో ఓసారి మావోయిస్టుల దాడికి గురయిన నేతకు తగిన భద్రత అవసరమే. అయితే, అది శృతిమించిన స్థాయిలో వుంటే, ప్రజల మధ్యకు వెళ్లి స్వేచ్చగా మసిలేందుకు అదే భద్రత పెద్ద అడ్డంకిగా మారుతుంది. మర తుపాకులు చేత ధరించి అనుక్షణం కాపలా వుండే భద్రతావలయం లేకుండా చంద్రబాబు నాయుడు అమెరికాలో సంచరిస్తున్న  ఫోటోలు ఈ మధ్య సోషల్ మీడియాలో దర్శనమిచ్చాయి. ఇలా ఆయన్ని చూసి దశాబ్దాలు గడిఛి పోయాయి.  అమెరికాలో  ఎటువంటి భద్రతాఏర్పాట్లు లేకుండా చంద్రబాబు నాయుడు  అక్కడి వీధుల్లో, రోడ్డు పక్క రెస్టారెంట్లలో హాయిగా కలయ తిరిగిన ఫోటోలు చూసినప్పుడు ‘పక్షిలా ఎగిరిపోవాలి’ అనే పాట జ్ఞాపకం వచ్చింది. ఎన్నో ఏళ్ళ తర్వాత ఆయన ఇలా స్వేచ్చగా తిరగడం చూసిన బాబు అభిమానులు కూడా ముచ్చటపడ్డారు. కొత్తగా దొరికిన ఈ స్వేచ్చతో బహుశా ఆయనకు కూడా మంచి ఉల్లాసం లభించి ఉండాలి. ప్రజలని తన నుంచి వేరుచేస్తున్న ఈ భద్రతా వలయాన్ని గురించి ఆయన పునరాలోచించుకోవడం మంచిది. ఎందుకంటే ప్రజల మధ్య తిరగాల్సిన రోజులు ముందున్నాయి. తమ మధ్య తిరిగే నాయకుడినే ప్రజలు తమలో తమలో ఒకడిగా పరిగణించే రోజులివి. ప్రతి రాజకీయ నాయకుడు గుర్తుంచుకోవాల్సిన వాస్తవం ఇది.    
ఎన్నికల ఫలితాలు వెలువడిన రెండు నెలల పదిహేను రోజుల తర్వాత ఆయన ఈ వ్యాఖ్యలు చేయడం కొంత ఆశ్చర్యం కలిగిస్తుంది. ఫలితాల ప్రకటన తర్వాత తెలుగు దేశం పార్టీ అనేక అంతర్గత సమావేశాలు నిర్వహించి పరాజయ కారణాలు గురించి సుదీర్ఘమైన సమీక్షలు జరిపింది. పైగా టీడీపీ పరాజయాన్ని విశ్లేషిస్తూ వివిధ పత్రికల్లో సవివరమైన వ్యాసాలు వచ్చాయి. మీడియాలో విస్తృతంగా చర్చలు కూడా  జరిగాయి. సోషల్ మీడియాలో సీనియర్ జర్నలిస్టు కొల్లి అరవింద్, పాత తరం టీడీపీ నాయకుడు ‘సువేరా’  కలిసి ‘ఒక పరాజయం - వంద తప్పులు  ’ అనే పేరుతొ సోషల్ మీడియాలో వరుస కధనాలు పోస్ట్ చేస్తున్నారు. ఇప్పటివరకు సుమారు అరవై అయిదు ఎపిసోడ్లు వెలువడ్డాయి. త్వరలో ఇవన్నీ ఒక పుస్తక రూపంలోకి వచ్చే అవకాశాలున్నాయి. తప్పు ఎక్కడ జరిగింది అనే అన్వేషణ పక్కనబెట్టి ‘నేనేమి తప్పు చేసాను’ అనుకోవడంలోనే పొరబాటు చేస్తున్నారనిపిస్తోంది.
ఇన్నాళ్ళ తర్వాత కూడా ఓటమికి దారితీసిన అంశాల విషయంలో సాక్షాత్తూ పార్టీ అధినాయకుడే ఇంతటి అస్పష్టతతో వుండడం నిజంగా ఆశ్చర్యమే. రాజకీయాల్లో చంద్రబాబు అనుభవం తక్కువేమీ కాదు. జయాపజయాలు కొత్తవీ కావు. ఈ అంశాలను దృష్టిలో ఉంచుకుని పరిశీలిస్తే బాబు వ్యాఖ్యలు మరింత ఆశ్చర్యాన్ని కలిగించేవిగా వున్నాయి.
నిజానికి చంద్రబాబు చేసిన ఈ పరిశీలనలో అర్ధం చేసుకోదగిన ఆవేదన వుంది. అర్ధం కాని ఆగ్రహం వుంది. అలాగే  అర్ధంపర్ధం లేని ఆక్రోశం కూడా వుందనిపిస్తోంది.
కొత్తగా ఏర్పడ్డ రాష్ట్రం అభివృద్ధికి చంద్రబాబు శాయశక్తులా కృషి చేసిన విషయాన్ని ఎవరూ కాదనలేరు. అయితే, అభివృద్ధి, సంక్షేమం చాటున ఆయన దృష్టికి రాని అనేక అంశాలు ప్రజల తీర్పును ప్రభావితం చేసి ఉండవచ్చు. అన్నీ సమపాళ్ళలో వున్నప్పుడు అభివృద్ధి, సంక్షేమం అక్కరకు వస్తాయి. వేరే అంశాలు వాటిని కప్పేసినప్పుడు మాత్రం అటువంటి విషయాలే ప్రజలను ముందుగా ఆకట్టుకుంటాయి. అభివృద్ధి ఒక్కటే గట్టెక్కించే తరుణోపాయం అయిన పక్షంలో గతంలో కూడా ఆయనకు పరాజయ అనుభవాలు మిగిలేవి కావు.  ఆంధ్రప్రదేశ్ సమైక్యంగా వున్నప్పుడు ఆయన హయాములోనే   హైదరాబాదు, మరీ ముఖ్యంగా జూబిలీ హిల్స్ వంటి ప్రాంతాలు గుర్తుపట్టలేనంత అభివృద్ధికి నోచుకున్నాయి. కానీ, ఆ ప్రాంతంలోనే అధికార టీడీపీ అభ్యర్ధి కనీసం వార్డు కౌన్సిలర్ గా కూడా  గెలవలేకపోయారు. అప్పుడు కూడా చంద్రబాబులో ఇదే రకమైన నిర్వేదం ద్యోతకమైంది. మళ్ళీ ఇప్పుడు అదే పరిస్తితి.                 
2019 ఎన్నికల్లో ఏపీ ప్రజలు తనను ఎందుకు ఓడించారో అర్ధం కావడం లేదని ఆంధ్రప్రదేశ్  మాజీ ముఖ్యమంత్రి మధన పడుతున్నట్టు ఆయన మాటలు బట్టి అర్ధం చేసుకోవాలి. ఈ ప్రశ్నకు జవాబు వెతుక్కోవాలంటే, 2014 లో అదే ప్రజలు తనను ఎందుకు గెలిపించారో ముందు ఆయన విశ్లేషించుకోవాల్సివుంటుంది.
అప్పుడు అనేక విషయాలు చంద్రబాబుకు కలిసివచ్చాయి. ఆయన ప్రభావమే ఎక్కువ అయినప్పటికీ, మోడీ, పవన్ ఇరువురూ ఆ ఎన్నికల్లో అందించిన స్నేహ హస్తం పాత్రను కూడా తక్కువగా అంచనా వేయలేము. రాష్ట్ర విభజన జరిగిన తీరు  చంద్రబాబుకు ఇష్టం లేకపోయినా, పదేళ్ళ సుదీర్ఘ విరామం తర్వాత అదే అంశం మళ్ళీ ముఖ్యమంత్రి కావడానికి దోహదం చేసింది. విడిపోయిన రాష్ట్రానికి చంద్రబాబు అనుభవం కావాలని అనుకున్న ప్రజలు ఆయనకు పట్టం కట్టారు. అయినా ఆయన ప్రత్యర్ధి జగన్ మోహన్ రెడ్డి కేవలం అయిదారు లక్షల ఓట్ల తేడాతోనే  అధికారానికి ఆమడ దూరంలో ఆగిపోయారు. అలా అని ఆయన చేతులు ముడుచుకుని కూచోలేదు. అసెంబ్లీని వదిలి పారిపోయారని టీడీపీ శ్రేణులు, ఇతర ప్రతిపక్షాల వాళ్ళూ ఎంతగా ఆక్షేపించినా జగన్ పట్టించుకోలేదు. ప్రజల్ని నమ్ముకుని ప్రజల్లోనే వుండిపోయారు. ఆ పట్టుదలే ఆయన్ని ముందు ప్రజలకు, తరువాత అధికార పీఠానికి దగ్గర చేసింది. ఇప్పుడు చంద్రబాబు చేయాల్సింది కూడా అదే. ప్రజలని నమ్ముకోవాలి.
అలా నమ్ముకుంటారా? లేక తను ఇన్నాళ్ళుగా నమ్ముతూ వచ్చిన మార్గాన్నే మళ్ళీ ఎంచుకుంటారా? ఆయన మాట్లాడుతున్న తరహా గమనిస్తుంటే రెండోదే ఆయన ఆలోచనల్లో ఉన్నట్టుంది.
గతంలో రెండుసార్లు ఓటమిని చవిచూసిన తర్వాత ఆయన ప్రజల దగ్గరకు వెళ్లి ‘నేను మారాను, నన్ను నమ్మండి’ అని పలుసార్లు చెప్పుకున్నారు. ప్రజలు నమ్మి ఆయనకు పాలనాపగ్గాలు అప్పగించారు. కానీ ఆయన మారిన దాఖలా తదుపరి పాలనలో కానరాలేదు. తన పాత మార్గంలోనే కొనసాగారు. ఫలితం తెలిసిందే.
ఇటీవలి ఎన్నికల్లో చంద్రబాబుకు సీట్లు బాగా తగ్గిన మాట నిజమే కాని, ఆయనకు మద్దతుగా నిలిచిన ఓటర్ల శాతం గణనీయంగానే వుంది. నలభయ్ శాతం ఓట్లు అంటే చెప్పుకోదగిన స్థాయిలోనే ప్రజాదరణ వున్నట్టు. కానీ ఒక్కోసారి మాట తీరు ప్రజల మనసులపై ప్రభావం చూపిస్తుందనే మాట మరవకూడదు. ఈ ఆవులు, దున్నపోతుల వ్యవహారం అలాంటిదే.
చేసిన మంచి పనులను  ప్రజలకు చేరవేయడానికి ప్రచారం అవసరమే. చేసినట్టు కనబడడానికి ప్రచారం మీద మాత్రమే ఆధారపడితే ప్రజలు ఇట్టే పట్టేస్తారు. నేను ముందుగా చెప్పినట్టు చంద్రబాబు చేసిన చాలా మంచి పనులను ఆయన ఏరికోరి చేసుకున్న ప్రచార ఆర్భాటమే కప్పివేసింది.    
‘నన్ను ఎందుకు ఓడించారు అని జనాలను అడగకుండా ఈ ప్రశ్నను తనకు తానే వేసుకుని వుంటే చంద్రబాబుకే సరయిన సమాధానం దొరికి వుండేది. అయితే, చిన్న పిల్లవాడు కూడా బదులు చెప్పగల ఈ ప్రశ్నకు జవాబు ఆయనకు తెలియదని ఎవరూ అనుకోరు.
రాజకీయం చేయడంలో ఒక్కొక్క నాయకుడిది ఒక్కో స్టయిల్. ఇది  చంద్రబాబు స్టయిల్ అనుకోవాలి.


9, ఆగస్టు 2019, శుక్రవారం

చంద్రబాబు చేసిన పొరపాట్లే మళ్ళీ జగన్ రిపీట్ చేస్తున్నారా ? | Hot Topic w...





ప్రతి  శుక్రవారం  మాదిరిగానే  ఈరోజు ఉదయం Prime 9 TV ఛానల్ సీయీఓ శ్రీ  సాయి నిర్వహించిన   Hot Topic With Journalist Sai  చర్చాకార్యక్రమంలో  నాతోపాటు పాల్గొన్నవాళ్ళు: శ్రీ నరసయ్య గౌడ్ (టీ. బీజేపీ), శ్రీ రఘు (టీడీపీ), శ్రీ కిరణ్ కుమార్ (జనసేన), శ్రీ జాన్  వెస్లీ (వైసీపీ), శ్రీ భవానీ  శంకర్ (ఏపీ బీజేపీ)

పొలవరాన్ని నీట ముంచిందేవరు ? చంద్రబాబేనా ? | Hot Topic With Journalist Sai





ప్రతి  శుక్రవారం  మాదిరిగానే  ఈరోజు ఉదయం Prime 9 TV ఛానల్ సీయీఓ శ్రీ  సాయి నిర్వహించిన   Hot Topic With Journalist Sai  చర్చాకార్యక్రమంలో  నాతోపాటు పాల్గొన్నవాళ్ళు: శ్రీ నరసయ్య గౌడ్ (టీ. బీజేపీ), శ్రీ రఘు (టీడీపీ), శ్రీ కిరణ్ కుమార్ (జనసేన), శ్రీ జాన్  వెస్లీ (వైసీపీ), శ్రీ భవానీ  శంకర్ (ఏపీ బీజేపీ)

బందర్ పోర్ట్ పై నాతో కీలక నిర్ణయం తీసుకున్న జగన్ | Hot Topic With Journa...





ప్రతి  శుక్రవారం  మాదిరిగానే  ఈరోజు ఉదయం Prime 9 TV ఛానల్ సీయీఓ శ్రీ  సాయి నిర్వహించిన   Hot Topic With Journalist Sai  చర్చాకార్యక్రమంలో  నాతోపాటు పాల్గొన్నవాళ్ళు: శ్రీ నరసయ్య గౌడ్ (టీ. బీజేపీ), శ్రీ రఘు (టీడీపీ), శ్రీ కిరణ్ కుమార్ (జనసేన), శ్రీ జాన్  వెస్లీ (వైసీపీ), శ్రీ భవానీ  శంకర్ (ఏపీ బీజేపీ)

7, ఆగస్టు 2019, బుధవారం

Special Debate On Sushma Swaraj | News&Views #1 | hmtv

Special Debate On Sushma Swaraj | News&Views #1 | hmtv

కాశ్మీర్ విషయంలో కాంగ్రెస్ చేసిన తప్పు ఏంటి | Debate On Kashmir Issue In...

Debate On Why Congress Opposing Kashmir Issue In Parliament | News&Views...

6, ఆగస్టు 2019, మంగళవారం

కాశ్మీర్ : నమ్మలేని నిజాలు


పిల్లి మెడలో గంట ఎవరు కట్టాలి అంటూ  దశాబ్దాల తరబడి  నాన్చుతూ వస్తున్న ఓ మొండి  సమస్యకి ముగింపు పలుకుతూ  ప్రధాని మోడీ చివరికి ఆ గంట కట్టారు. అయితే ఇది ముగింపా లేక మరో సమస్య పురుడు పోసుకోవడానికి ప్రారంభమా అనేది కాలమే చెప్పాలి.  
నా చిన్నప్పుడు కాశ్మీర్ అంటే భూతల స్వర్గం అనేవారు. పెరిగి పెద్దయ్యే సరికి అది భూతాల స్వర్గం అవుతుందని ఆరోజుల్లో ఎవరూ అనుకోలేదు.  కాశ్మీర్ అంటే మంచు ముంచెత్తే లోయలు. కాశ్మీర్ అంటే అందమైన సరస్సులు.  కాశ్మీర్ అంటే కనువిందు చేసే ప్రకృతి. కాశ్మీర్ అంటే జీవితంలో ఏదో ఒక రోజు చూసితీరాలని అనిపించే ఇహలోక స్వర్గం. తీరని ఆ కోరిక తీర్చుకోవడం కోసమేమో తెలియదు,  కాశ్మీర్ అందచందాలను ఆరబోసే హిందీ చలన చిత్రాలను, ఆ భాష అర్ధం కానివాళ్ళు కూడా విరగబడి చూసేవాళ్ళు. ఒకప్పుడు కాశ్మీర్ అన్నా, దాన్నే  ఇప్పుడు కష్మీర్ అంటున్నా అది నిజంగా భూతల స్వర్గమే.
‘భారత ప్రధాన మంత్రి జవహర్ లాల్ నెహ్రూ, కాశ్మీర్ ప్రధాన మంత్రి షేక్ అబ్దుల్లాతో భేటీ’ అనే వార్త చిన్నప్పుడు పత్రికల్లో  చదివినప్పుడు, ‘ఇదేమిటి కాశ్మీర్ భారత్ లో లేదా, దానికి వేరే ప్రధానమంత్రి ఏమిటి?’ అనే సందేహాలు పొటమరించేవి.
కాశ్మీర్ చరిత్రే కాదు, ఏ ప్రాంతపు చరిత్ర అయినా ఆయా కాలాల్లో నివసించిన లేదా వాటిని గురించి అధ్యయనం చేసిన చరిత్రకారులు రాసిన  పుస్తకాల ద్వారా మాత్రమే తెలుసుకోవడానికి వీలుంటుంది. అంతమాత్రాన అది నూటికి నూరుపాళ్ళు వాస్తవమైన చరిత్ర అని అనుకోలేము. రాసేవారి మనోభావాలుబట్టి, వారి వారి భావజాలాన్నిబట్టి కొంత వక్రీకరణ చోటుచేసుకునే వీలుంటుంది. అవి చదివేవాళ్ళు కూడా వారి వారి అభిప్రాయాలకు తగ్గట్టుగానే చరిత్ర గురించిన అభిప్రాయాలను ఏర్పరచుకునే అవకాశం వుంటుంది. భావితరాల వారు ఇదే  నిజమైన చరిత్ర అని అపోహపడే ప్రమాదం కూడా వుంటుంది. కానీ ఇంతకూ మించి మనం చరిత్రను అవగతం చేసుకునే  వీలు ప్రస్తుతానికి లేదు. ఈ విషయం గమనంలో ఉంచుకుని చరిత్రను అర్ధం చేసుకునే ప్రయత్నం చేస్తే అపార్ధాలకు తావుండదు.
స్వతంత్ర భారత చరిత్రలో జవహర్ లాల్ నెహ్రూ, సర్దార్ వల్లభాయ్ పటేల్ ఇద్దరికీ అత్యంత విలువైన స్థానం వుంది. స్వతంత్ర భారత రూపకల్పనలో ఎవరూ కాదనలేని స్థానం వారిద్దరిదీ. ఇరువురూ ఒకే రాజకీయ పార్టీకి చెందినా వారయినా వారి ఆలోచనా రీతులు విభిన్నం. ఆ నాటి పరిస్తితుల నేపధ్యంలో చరిత్రను అర్ధం చేసుకోకుండా, కేవలం వ్యక్తి ఆరాధన కారణంతో విశ్లేషించుకుంటే మిగిలేది చరిత్ర కాదు, కేవలం ఊహాగానభరితమైన కధాకధనం మాత్రమే. విచిత్రం ఏమిటంటే నెహ్రూను అభిమానించేవారు వారు పటేల్ పట్ల కూడా అదే విధమైన ఆరాధనభావంతో వుంటారు. అలాగే పటేల్ అభిమానులు కూడా నెహ్రూను ప్రేమిస్తారు. అయితే రాజకీయాల కోణం నుంచి చూస్తే వారికీ వీరికీ చుక్కెదురు. నెహ్రూ విధానాలను వ్యతిరేకించేవారు పటేల్ ను కారణం లేకుండానే అభిమానిస్తారు. ఒక రకంగా సినీ నటుల అభిమానులు ప్రదర్శించే గుడ్డి అభిమానం అనుకోవచ్చేమో!
ఈఇరువురు నాయకులను గురించి అనేక గ్రంధాలు వెలువడ్డాయి. కొన్ని వారి సమకాలీనులు రాసినవి. మరికొన్ని వారి తదనంతర కాలంలో అధ్యయనం చేసి రాసినవి. ముందే చెప్పినట్టు వారిపట్ల రచయితలకు ఉన్న సహజసిద్ధమైన అభిమానపు ఛాయలు వాటిల్లో తొంగిచూడడంలో ఆశ్చర్యం లేదు.
పాకిస్తాన్ కనుక  హైదరాబాద్ డెక్కన్ (నాటి నిజాం సంస్థానం) పేరెత్తకుండా వుంటే,  కాశ్మీర్ ను పాక్  కు వదిలేసేందుకు  పటేల్ సుముఖత వ్యక్తం చేసారని కాశ్మీర్ నేత సైఫుద్దీన్ సోజ్, ‘కాశ్మీర్, గ్లింప్స్ ఆఫ్ హిస్టరీ అండ్ ది స్టొరీ ఆఫ్ స్ట్రగుల్’ అనే  పుస్తకంలో రాసారు.
ఆ ప్రకారం పటేల్ చేసిన ప్రతిపాదనను పాకీస్తాన్ లో కాశ్మీర్ వ్యవహారాలు కనిపెట్టి చూసే హయత్ ఖాన్ కు బ్రిటిష్ గవర్నర్ జనరల్ లార్డ్ మౌంట్ బాటెన్ అందించారు.  పాకీస్తాన్ హైదరాబాద్ డెక్కన్  పేరెత్తకుండా వుంటే  కాశ్మీర్ ను పాక్  కు ఇచ్చేందుకు సిద్ధమేనని పటేల్ షరతు పెట్టారన్నది ఆ ప్రతిపాదన.
హయత్ ఖాన్ దాన్ని అప్పటి పాక్ ప్రధాని లియాకత్ ఆలీఖాన్ కు చేరవేశారు.
‘కాశ్మీర్ కోసం, అక్కడి బండరాళ్ళ కోసం పంజాబ్ కంటే విశాలమైన హైదరాబాద్ డెక్కన్  వదులుకునేందుకు నేనేమీ పిచ్చివాడిని కాదు’ అన్నది  లియాఖత్ స్పందన.
కాశ్మీర్ ను వదులుకునేందుకు  తొలిరోజుల్లో పటేల్ సుముఖంగానే ఉండేవారని ఆయన దగ్గర వ్యక్తిగత కార్యదర్శిగా  పనిచేసిన వీపీ మీనన్ చెప్పారు.
భారత దేశం, పాకీస్తాన్ ఈ రెంటిలో దేనిలో చేరతారో  తేల్చుకోండని  వల్లభాయ్ పటేల్, 1947 జూన్  3వ తేదీన ఆనాడు దేశంలో లెక్కకు మిక్కిలిగా ఉన్న స్వదేశీ సంస్థానాధీసులకు రాసిన లేఖలో  ఓ అవకాశం ఇచ్చారని ‘ఇంటిగ్రేషన్  ఆఫ్ ఇండియన్ స్టేట్స్’ అనే పేరుతొ రాసిన ఓ పుస్తకంలో మీనన్  పేర్కొన్నారు.
రాజ్ మోహన్ గాంధి ‘పటేల్ ఏ లైఫ్’ అనే పేరుతొ పుస్తకం రాసారు. అందులో పటేల్ గురించి పేర్కొన్న కొన్ని విషయాలు:
1947 అక్టోబర్  26 న నెహ్రూ నివాసంలో ఒక  సమావేశం జరిగింది. మహరాజా హరిసింగ్ దూతగా వచ్చిన  మెహర్ చాంద్ మహాజన్ కాశ్మీర్ రాజు తరపున  భారత్ సైనిక సాయాన్ని అర్ధించారు. ఇందుకు  భారత్ అంగీకరించని పక్షంలో పాకీస్తాన్ సాయం కోరాల్సివస్తుందని కూడా మెహర్ చాంద్ చెప్పారు.  ఆ మాట నెహ్రూకు విపరీతమైన కోపం తెప్పించింది. ‘అలా అయితే తక్షణం వెళ్ళిపొమ్మని ఆ దూతని ఆదేశించారు. సర్దార్ పటేల్ ఆ సమయలో కలగచేసుకుని ‘మహాజన్! మీరు పాకిస్తాన్ తో కలవడం లేదు’ అని హామీ ఇచ్చారు. (అంటే భారత్ మీరు అడిగిన సాయం చేయడానికి సిద్ధంగా వుంది  అనే అర్ధం అందులో వుందని రాజ్ మోహన్ గాంధి అభిప్రాయం)
కాశ్మీర్ పట్ల పటేల్ కు పెద్ద ఆసక్తి లేదని తెలిపే మరో ఉదంతాన్ని గుజరాతీ చరిత్రకారుడు, రచయిత అయిన ఊర్విష్ కొఠారి బీబీసీ ప్రతినిధికి వెల్లడించారు. ‘సచో మానస్ సాచి వాట్’ అనే పేరుతొ గుజరాతీలో ఊర్విష్ కొఠారి ఒక పుస్తకం రాసారు. అందులో పేర్కొన్న కొన్ని విషయాలను ఆ రచయిత బీబీసీతో పంచుకున్నారు.
“కాశ్మీర్ లో ముస్లిం జనాభా ఎక్కువ. భౌగోళికంగా చూసినా ఆ ప్రాంతం  పాకిస్తాన్ కు దాపులో వుంది. అంచేత భారత్ లో  కాశ్మీర్ విలీనం పట్ల  పటేల్ కు పెద్దగా  ఆసక్తి లేదు. అయితే స్వయానా కాశ్మీరీ అయిన నెహ్రూకు మాత్రం కాశ్మీర్ ను  భారత్ లో కలపాలనే కోరిక బలంగా  వుండేది. పైగా మహారాజా హరి సింగ్ , షేక్ అబ్దుల్లా ఇద్దరూ నెహ్రూకు మంచి స్నేహితులు. కాశ్మీర్ విషయంలో అవసరానికి మించి నెహ్రూ సున్నితంగా, ఉదారంగా వ్యవహరించడానికి అదో కారణం  అంటారు ఊర్విష్.
ముందే చెప్పినట్టు ఈ పుస్తకాల్లో రాసినవన్నీ అక్షర సత్యాలని భావించలేము. ఆ రోజుల్లో అంటే నెహ్రూ శకంలో వల్లభాయ్ పటేల్ వ్యక్తిత్వాన్ని దెబ్బతీసేలా చరిత్రను వక్రీకరించే ప్రయత్నాలు జరిగాయన్నది కొందరి వాదన.
భారత్ లో కాశ్మీర్ విలీనం జరిగి ఏండ్లూ పూ౦డ్లూ గడిచిపోయాయి. ఇందుకు సంబంధించిన వివరాలు, పత్రాలు భారత పార్లమెంటు గ్రంధాలయంలో దొరికే అవకాశం వుంది.
అయితే ఈనాటి వేగయుగంలో అంతటి ఓపికా తీరికా ఉన్నవారు తక్కువ. కాబట్టి నమ్మినా నమ్మకపోయినా కొన్ని పుస్తకాల్లో రాసిన విషయాలనే ప్రామాణికంగా తీసుకోవాల్సి వస్తోంది. 

KSR Live Show | మోడీ సర్కార్ సంచలన నిర్ణయం...370 అధికరనం రద్దు - 6th Aug...





ప్రతి మంగళవారం మాదిరిగానే  ఈరోజు ఉదయం సాక్షి టీవీ  KSR LIVE SHOW చర్చాకార్యక్రమంలో  నాతోపాటు పాల్గొన్నవాళ్ళు: శ్రీ  జనక్ ప్రసాద్  (కాంగ్రెస్),  శ్రీమతి మాధవి కొల్లి  (బీజేపీ),  డాక్టర్  సుధాకర్  (సీపీఐ)

5, ఆగస్టు 2019, సోమవారం

Debate on AP Speaker Tammineni Sensational Comments on VP Venkaiah Naidu...





ప్రతి సోమవారం  మాదిరిగానే  ఈరోజు  ఉదయం   Ap 24 X 7   న్యూస్  ఛానల్ లో Debate With Venkata Krishna చర్చాకార్యక్రమంలో  నాతోపాటు పాల్గొన్నవాళ్ళు : శ్రీ కుటుంబరావు (టీడీపీ), శ్రీ కరణం ధర్మశ్రీ (వైసీపీ), శ్రీ సత్యమూర్తి (బీజేపీ), శ్రీ  సుందర రామ శర్మ (కాంగ్రెస్)

జమ్మూ కాశ్మీర్ ను మూడు ముక్కలు గా విడగొడతారా ...? | The Debate with VK |...





ప్రతి సోమవారం  మాదిరిగానే  ఈరోజు  ఉదయం   Ap 24 X 7   న్యూస్  ఛానల్ లో Debate With Venkata Krishna చర్చాకార్యక్రమంలో  నాతోపాటు పాల్గొన్నవాళ్ళు : శ్రీ కుటుంబరావు (టీడీపీ), శ్రీ కరణం ధర్మశ్రీ (వైసీపీ), శ్రీ సత్యమూర్తి (బీజేపీ), శ్రీ  సుందర రామ శర్మ (కాంగ్రెస్)

Debate on BJP Leader Warns AP Govt Over Polavaram Re Tendering Row | The...





ప్రతి సోమవారం  మాదిరిగానే  ఈరోజు  ఉదయం   Ap 24 X 7   న్యూస్  ఛానల్ లో Debate With Venkata Krishna చర్చాకార్యక్రమంలో  నాతోపాటు పాల్గొన్నవాళ్ళు : శ్రీ కుటుంబరావు (టీడీపీ), శ్రీ కరణం ధర్మశ్రీ (వైసీపీ), శ్రీ సత్యమూర్తి (బీజేపీ), శ్రీ  సుందర రామ శర్మ (కాంగ్రెస్)

4, ఆగస్టు 2019, ఆదివారం

Live : కశ్మీరంలో ఏం జరుగుతోంది..? | News Scan LIVE Debate With Vijay | 4...





ప్రతి  ఆదివారం  మాదిరిగానే  ఈరోజు  ఉదయం   TV 5 ఎక్జిక్యూటివ్  ఎడిటర్  శ్రీ  విజయ్  నారాయణ్  నిర్వహించిన  News Scan చర్చాకార్యక్రమంలో  నాతోపాటు  పాల్గొన్నవాళ్ళు : శ్రీ బెల్లయ్య  నాయక  (కాంగ్రెస్), శ్రీ ప్రకాష్ రెడ్డి (బీజేపీ). శ్రీ  పద్మనాభయ్య  (కేంద్ర ప్రభుత్వ మాజీ హోం శాఖ కార్యదర్శి, కాశ్మీర్ వ్యవహారాల ఇంచార్జ్, ముంబై నుంచి ఫోన్ లైన్లో)

3, ఆగస్టు 2019, శనివారం

మరో వివాదంలో పోలవరం - భండారు శ్రీనివాసరావు


దిన దిన గండం నూరేళ్ళ ఆయుస్సు మాదిరిగా నడుస్తోంది పోలవరం కధ. పేరులో మాత్రమె వరం వుండి శాపగ్రస్త ప్రాజెక్టుగా మారిన ఈ పోలవరం ప్రాజెక్ట్ వ్యవహారం కంచికి చేరని కధలా సాగిపోతోంది. బాలారిష్టాల్లో చిక్కుకుని విలవిలలాడుతోంది. వార్తల్లో మాత్రమే  కనిపించే ఈ ప్రాజెక్ట్  వాస్తవరూపం దాల్చి, ఫలాలు అందించడానికి ఏండ్లూ పూండ్లూ పట్టేట్టు వుంది.  
అనేక శంకుస్థాపన ఫలకాలు మెడలో హారంలా మిగిలాయి కానీ ప్రాజెక్టు మాత్రం ప్రారంభోత్సవ ఫలకం కోసం ఇంకా ఎదురుచూపులు చూస్తూనే వుంది.
ఎప్పుడో ఎనభయ్యవ దశకంలో ఆ నాటి ముఖ్యమంత్రి టీ. అంజయ్య గారు పోలవరం ప్రాజెక్టు నిర్మాణం కోసం పునాదిరాయి వేసినప్పటినుంచి ఇప్పటి వరకు అనేక ప్రభుత్వాలు మారాయి. ముఖ్యమంత్రులు మారారు. అసలు రాష్ట్ర స్వరూపమే మారిపోయింది. రెండు రాష్ట్రాలుగా విడిపోయింది.
విభజన అనంతరం ప్రాజెక్టులో కదలిక మొదలయింది. కొత్తగా ఏర్పడ్డ ఆంద్ర ప్రదేశ్ రాష్ట్రానికి సారధిగా చంద్రబాబు నాయుడు, దేశ సారధిగా నరేంద్ర మోడీ పగ్గాలు చెప్పడంతో కొత్త ఆశలు చిగురించాయి. అప్పట్లో వాళ్ళిద్దరూ మంచి మిత్రులు కావడం, వారు ప్రాతినిధ్యం వహించే టీడీపీ, బీజేపీలు రెండూ మిత్ర పక్షాలు కావడం, నిధుల కొరత ఉండదనే ధీమా ప్రబలడం ఇవన్నీ మంచి శకునాలే అనుకున్నారు. పోలవరం అనుకున్న వ్యవధిలో పూర్తి కాగలదని ఆ రెండు పార్టీల నాయకులతో పాటు సామాన్య ప్రజలు కూడా నమ్మారు.
కాలం ఎప్పుడూ ఒకే రీతిన సాగిపోతే ఇక ఆ కాలానికి మహిమ ఏముంటుంది?
ఆ కాలమహిమ కారణంగా మిత్రుల నడుమ పొరపొచ్చాలు వచ్చాయి. ఆ మిత్రత్వం కూడా కడుపులో వుండి కాదు, కావిలించుకుంటే వచ్చింది కాబట్టి ఆ స్నేహ బంధానికి కాలయాపన లేకుండానే కాలం  చెల్లింది. ఆ రెండు పార్టీల నడుమ ఏర్పడ్డ బంధం రాజకీయ కారణాల వల్ల కాబట్టి ఆ రాజకీయ కారణాలే ఆ బంధాన్ని తెగగొట్టాయి. రెండు రాజకీయ పార్టీలు విడిపోతే దేశానికి వచ్చే నష్టం ఏమీ వుండదు. కాకపోతే ఆ ప్రభావం పోలవరం వంటి ప్రాజెక్టుపై పడింది.
ఇచ్చిన నిధులకు లెక్కలు అడిగారు ఢిల్లీ ఏలికలు. రాష్ట్రం పంపిన లెక్కలు కేంద్రం వారికి రుచించలేదు. కొత్తగా నిధులు రాకపోగా రావాల్సిన నిధులు కూడా ఆపేశారు, కేంద్రం ఆంద్ర ప్రదేశ్ రాష్ట్రంపై కక్ష కట్టింది అని ఆక్రోశించారు తెలుగు దేశం నాయకులు. నిధుల దుర్వినియోగం జరుగుతోందని బీజేపీ శ్రేణుల ముక్తాయింపు.
ఈ లోగా కాంట్రాక్టర్ మారారు. కొత్త కాంట్రాక్టర్ రంగంలోకి వచ్చారు. వేల కోట్ల రూపాయలు ఖర్చయ్యే ప్రాజెక్టును నామినేషన్ పద్దతిపై తోచిన వారికి కట్టబెడతారా అని ప్రతిపక్ష వైసీపీ నేత హుంకరింపు.
ఇక్కడ కొంత నేపధ్యాన్ని మననం చేసుకోవాలి.
రాష్ట్రం రెండుగా విడిపోక ముందు అప్పుడు ఉమ్మడి రాష్ట్రానికి ముఖ్యమంత్రిగా ఉన్న కిరణ్ కుమార్ రెడ్డి హయాములో పోలవరం ప్రాజెక్టు కాంట్రాక్టును ట్రాన్స్ ట్రాయ్ సంస్థ దక్కించుకుంది. విభజన అనంతర పరిణామాలు ప్రాజెక్టు నిర్మాణంపై దుష్ప్రభావాన్ని చూపాయి.  కాంట్రాక్టర్ చేతులు ఎత్తేయడంతో తరువాత అధికారంలోకి వచ్చిన చంద్రబాబు నాయుడు ప్రభుత్వం ప్రముఖ నిర్మాణ సంస్థ నవయుగ సంస్థతో ఒప్పందం కుదుర్చుకుంది. అప్పటి నుంచి పనుల వేగం పెరిగింది. వారం వారం ప్రతి సోమవారాన్ని ‘పోలవరం’గా ప్రకటించి పనుల పురోగతిని ఎప్పటికప్పుడు పరిశీలించే వినూత్న కార్యక్రమం మొదలు పెట్టారు. ఆ పురోగతిని  ఆనాటి ప్రభుత్వం రాజకీయంగా వాడుకోవాలని చూసింది. రాష్ట్రం  నలుమూల నుంచి ప్రత్యేక బస్సులు వేసి ప్రజలను తీసుకు వెళ్లి ప్రాజెక్టు నిర్మాణ పురోగతిని కళ్ళకు కట్టినట్టు చూపే ప్రచార కార్యక్రమానికి తెర లేపింది. ఇది సహజంగానే ప్రతిపక్ష వైసీపీకి మింగుడు పడలేదు. ఆ రోజుల్లోనే వైసీపీ నాయకుడు వై.ఎస్. జగన్ మోహన రెడ్డి తన పాదయాత్రలో అనేక సందర్భాలలో పోలవరం అవినీతి గురించి పెక్కు సార్లు ప్రస్తావించారు. తమ పార్టీ అధికారంలోకి రాగానే  విచారణ జరిపించి తగు చర్యలు తీసుకుంటానని హెచ్చరించారు.
కధ ఇలా సాగుతూ ఉండగానే రాష్ట్రంలో అధికార మార్పిడి జరిగింది. అప్పటివరకు పోలవరం ప్రాజెక్టును కొంతవరకు పూర్తిచేసిన తెలుగు దేశం ప్రభుత్వం ప్రతిపక్ష పాత్రలోకి మారిపోయింది. పోలవరంలో టీడీపీ పెద్దఎత్తున నిధుల దుర్వినియోగానికి పాల్పడిందని ఆరోపణలు చేస్తూ వచ్చిన వైసీపీ అధికారంలోకి వచ్చింది. అదీ ప్రజలు ఇచ్చిన భారీ మెజారిటీతో.
కధ మొదటికి వచ్చింది. వైసీపీ అధినాయకుడు, కొత్త ముఖ్యమంత్రి శ్రీ జగన్ మోహన రెడ్డి రెండు మాసాలు కూడా గడవక ముందే పోలవరం ప్రాజెక్టు వ్యవహారాలు గురించి నిపుణుల కమిటీ వేయడం, అది నివేదిక ఇవ్వడం, దాని ఆధారంగా ప్రస్తుతం ప్రాజెక్టు నిర్మాణ వ్యవహారాలు చూస్తున్న కాంట్రాక్టర్ ను ఆ పని నుంచి తప్పుకోవాలని ఆదేశించడం ఆఘమేఘాల మీద జరిగిపోయింది.
నవయుగతో చేసుకున్న ఒప్పందం ప్రధాన  నిర్మాణ సంస్థ ట్రాన్స్ ట్రాయ్ తో కుదుర్చుకున్న ఒప్పందానికి విరుద్ధమని వైసీపీ భావించింది. కాంట్రాక్టర్ మార్పిడిలో తెలుగుదేశం ప్రభుత్వం భారీ ముడుపులకు తెర తీసిందని ఆ పార్టీ  గట్టిగా నమ్ముతోంది. ట్రాన్స్ ట్రాయ్ మాత్రమే చేపట్టాల్సిన పనులను ఈపీసీ విధానానికి వ్యతిరేకంగా నవయుగ సంస్థకు అప్పగించారని నిపుణుల కమిటీ కూడా అభిప్రాయ పడింది.
‘పనులను ఈపీసీ కింద అప్పగించాక అంచనాలు పెంచడం, 60 - సి కింద నోటీసులు జారీ చేయడం మార్గదర్శకాలకు  విరుద్ధం అని పేర్కొన్నది. అంచేత ప్రాజెక్టు పనులకు రివర్స్ టెండరింగ్ విధానాన్ని అమలు చేయాలని నిపుణుల కమిటీ  రాష్ట్ర ప్రభుత్వానికి సిఫారసు చేసింది.
ఈ కమిటీ సూచనలకు అనుగుణంగా ప్రభుత్వం తరపున నీటి పారుదల శాఖ ఉన్నతాధికారులు తక్షణం పనులు నిలిపి వేయాలని నిర్మాణ సంస్థ నవయుగ ను కోరారు. గత అసెంబ్లీ, లోకసభ ఎన్నికల్లో అతి ఘోరమైన పరాజయాన్ని మూటగట్టుకుని, నవనాడులు కుంగిపోయిన స్తితిలో ఉన్న తెలుగు దేశం పార్టీ నాయకులకు ఈ పరిణామం కొంత ఉపశమనం కలిగించింది. రాష్ట్రానికి వరప్రసాదిని వంటి పోలవరాన్ని పాలక పక్షం వైసీపీ అడుగడుగునా అడ్డుకుంటోందని, సంకుచిత రాజకీయ ప్రయోజనాలకోసం రాష్ట్ర విస్తృత ప్రయోజనాలను ఫణంగా పెడుతోందని ఒంటి కాలిపై నిలబడి ఆరోపణాస్త్రాలు సంధించడం మొదలు పెట్టారు.
రివర్స్ టెండరింగ్ పేరుతొ పోలవరం ప్రాజెక్టు ను ఆలస్యం చేస్తే వ్యయం అంచనాలు బాగా పెరిగిపోవడమే కాకుండా అనుకున్న వ్యవధిలో ప్రాజెక్టు పూర్తి చేయడం కష్టమని వారి వాదన.
పోలవరం వంటి భారీ సేద్యపు నీటి ప్రాజెక్టులను ఎలాంటి అంతరాయాలు, అవరోధాలు లేకుండా పూర్తి చేయడం ఎంత గొప్ప కాంట్రాక్టర్ కైనా సాధ్యం కాదు. సుదీర్ఘ కాలం సాగే నిర్మాణంలో అనేక ప్రకృతి పరమైన అవరోధాలు ఏర్పడడం కద్దు. వర్షాకాలంలో నదీ ప్రవాహం బాగా పెరుగుతుంది. తప్పనిసరిగా కొంత కాలంపాటు నిర్మాణ పనులను ఆపి వేయాల్సి వస్తుంది. కాబట్టి ప్రాజెక్టు నిర్మాణం కుంటుపడుతుందని చెప్పే వాదనలో పస లేదు. పైగా పోలవరం పూర్తయ్యే వరకు రైతులకు సేద్యపు నీటి ఇబ్బందులు లేకుండా చేయడానికి చంద్రబాబు నాయుడు పట్టుబట్టి నిర్మించిన పట్టిసీమ ఎలాగూ వుంది.
కోట్ల రూపాయలు ఖర్చయ్యే ప్రాజెక్టు పనులను యేవో కొన్ని సాంకేతిక కారణాలు చూపించి నామినేషన్ పద్దతిపై కాంట్రాక్టర్లకు అప్పగించే విధానం మంచిది కాదు. అనుకున్న వ్యవధిలో ప్రాజెక్టు పూర్తి చేయాలనే తపనను ఎవరూ అపార్ధం చేసుకోరు. పైగా హర్షిస్తారు కూడా. అయితే అదే సమయంలో ప్రభుత్వం అనుసరించిన పద్దతులుఏమిటి అనే విషయాన్ని కూడా గమనంలోకి తీసుకోక తప్పదు. నియమాలను, నిబంధనలను పాటించండి అని కోరే ప్రభుత్వాలు వాటిని ఏర్పరచింది తామే అని మరవకూడదు.
ప్రజాధనం దుర్వినియోగం కాకూడదు అనే ఉద్దేశ్యంతో ప్రభుత్వాలు ప్రవేశ పెట్టిన నిబంధనలు ఒక్కోసారి వింతగా అనిపించవచ్చు.
‘ఇచ్చిన అప్పు, దానిపై పేరుకు పోయిన వడ్డీల వసూలుకోసం  అంతకంటే ఎక్కువ మొత్తాలలో న్యాయవాదులకు ఫీజులు చెల్లించడంలో ఔచిత్యం ఏమిటని ఓసారి ఓ బ్యాంకు ఉన్నతాధికారిని అడిగాను.
ఆయన ఇలా జవాబు చెప్పారు.
“అప్పిచ్చిన మొత్తం చిన్నదే కావచ్చు. దాన్ని వసూలు చేయడానికి పెట్టే ఖర్చు ఎక్కువే కావచ్చు. ఒక పైసా ప్రభుత్వధనం కూడా  దుర్వినియోగం కాకుండా చూడాలనే మహత్తర లక్ష్యం అందులో దాగుంది. ఆ విషయాన్ని గమనంలో వుంచుకుంటే ఈ అనుమానాలు రావు”