3, జూన్ 2021, గురువారం

ఆధ్యాత్మిక రచనల మార్గంలో జ్వాలా

సుందరకాండ మందర మకరందం, బాలకాండ, అయోధ్యకాండ, అరణ్యకాండ, కిష్కింధ కాండ, యుద్ధకాండ, ధర్మధ్వజం, ఆంధ్ర వాల్మీకి రామాయణ రసరమ్య గాధలు, శ్రీ మహా భాగవత కధలు, శ్రీ మదాంధ్ర మహాభారత కధలు. ఇవన్నీ ఉద్గ్రంథాలు. ఇంకా అనేకం వున్నాయి. స్థలాభావం కారణంగా పేర్కొనడం లేదు. అన్నీ కలిపితే వేల పుటలు దాటిపోతాయి. రాసింది మాత్రం ఒక్క చేయి. ఇరవై నాలుగు గంటలు ఉద్యోగ, సంసార బాధ్యతల్లో మెలిగే మనిషికి ఎలా సాధ్యం? అసాధ్యాన్ని సాధ్యం చేసుకోవడం జ్వాలాకు పుట్టుకతో వచ్చిన విద్య కాదు, పట్టుదలతో అలవరచుకున్న అభ్యాసం.
ప్రచురణ కాగానే నాకొక కాపీ ఇవ్వడం ఈ కరోనా రోజుల్లో పంపడం ఆయనకు అలవాటు. అలాగే ఇవ్వాల కూడా కవిత్రయ విరచిత శ్రీ మదాంధ్ర మహాభారత కధలు అనే పేరుతొ రాసిన ఆస్వాదన గ్రంధాన్ని పంపాడు.
కరోనా కోరల్లో చిక్కుకున్న రోజుల్లో కూడా రామ నామం మరవకుండా, ఆధ్యాత్మిక గ్రంధ రచన కొనసాగిస్తూ వచ్చాడు అనడానికి ఈ కొత్త గ్రంధం ఓ ఉదాహరణ.
భగవదనుగ్రహం ఆ కుటుంబానికి సర్వదా లభిస్తుందని ప్రత్యేకంగా చెప్పనక్కరలేదు. ఇందుకు అర్హత ఆయనే సంపాదించుకున్నాడు ఇలాంటి అద్భుత రచనలు చేసి. మరో విశేషం ఏమిటంటే జ్వాలా ఇంతవరకు రాసిన పుస్తకాలను మార్కెట్లో పెట్టి విక్రయించలేదు.
ఆయన ఆ సర్వేశ్వరుడి నీడలో ఉండబట్టే ఆ పరమేశ్వరుడు జ్వాలా చేత ఈ సత్కార్య రచన చేయిస్తున్నాడు.



(03-06-2021)

కామెంట్‌లు లేవు: