21, సెప్టెంబర్ 2021, మంగళవారం

మళ్ళీ రాని పండగ రోజు

 ఓ ఏడాది (2019) సంక్రాంతి వెళ్ళిన మరునాడు అంటే  కనుమనాడు మా ఇంట పండుగ సందడే సందడి.

పాతికేళ్ళ క్రితం మేము పంజాగుట్ట దుర్గానగర్ కాలనీలో ఉన్నరోజుల్లో మా ఇంట్లో పనిచేసిన మల్లయ్య కుటుంబం ఆ సాయంత్రం మా ఇంటికి వచ్చింది. ఆటో నడిపే మల్లయ్యకు అందరూ ఆడపిల్లలే. ఇప్పుడు అందరూ పెద్దవాళ్ళయ్యారు. పెళ్ళిళ్ళయి పిల్లలకు తల్లులు అయ్యారు. వీళ్ళలో ఒకమ్మాయి కళ తన ఇద్దరు మొగ పిల్లలకు తను పెంచిన మా పిల్లల పేర్లే, సందీప్, సంతోష్ అని పెట్టుకుంది. యాదమ్మ, మల్లయ్యలకు ఇప్పుడు నలుగురు మనుమళ్ళు నలుగురు మనుమరాండ్రు. ఎల్ కేజీ నుంచి తొమ్మిదో తరగతి దాకా చదువుతున్నారు. పెద్ద పండగ సంక్రాంతికి పుట్టింటికి వచ్చారు. అల్లుళ్ళు ఏరీ అని అడిగితే అందరిలోకి చిన్నమ్మాయి తిరుపతమ్మ ( మాకళ్ళ ముందే పుట్టింది, ఇప్పుడు పాతికేళ్ళు,పెళ్ళిలో రూప అని పేరు మార్చుకుందట) తటాలున జవాబు చెప్పింది. ‘మేము మా అమ్మానాన్నలను చూడడానికి మా పుట్టింటికి వచ్చాము. మా మొగుళ్ళు వాళ్ళ అమ్మానాన్నలను చూడ్డానికి వాళ్ళ పుట్టింటికి వెళ్ళారు’

వాళ్ళు వున్న సమయం మాకు నిజంగా పండగ మాదిరిగా హాయిగా గడిచిపోయింది.

(మరో ఏడు నెలల తరువాత చూడడానికి వుండదు అని ముందుగా ఏమైనా తెలిసిందో ఏమో అందరూ కట్టగట్టుకుని వచ్చి చూసివెళ్ళారు అని ఇప్పుడు అనిపిస్తోంది)

Below Photo:

Left to Right (Sitting)

Goutham Kartik, Sai Rama Krishna, Samruddhi, Sandeep, Sreemanya, Santosh, Manojna

Left to Right (Standing)

Sampoorna, Abhiram, Nirmala Bhandaru, Kala, Bhagya, Tirupatamma (Roopa), Yadamma




 

కామెంట్‌లు లేవు: