11, సెప్టెంబర్ 2021, శనివారం

మరో చిత్తరువు జ్ఞాపకం

 

ఇప్పుడంటే ఇలా మొబైల్ తో ఫోటో తీసి అలా అప్ లోడ్ చేస్తున్నాం కానీ ఒకానొక రోజుల్లో ఫోటోగ్రఫీ అనేది ప్రయాసతో కూడిన ప్రియాతిప్రియమైన అనుభవం. సొంత కెమెరా ఉన్నాకూడా, తీసిన ఫోటో వెంటనే చూసుకునే వీలు వుండేది కాదు. ఒక రీలు కొంటే మహా అయితే ఓ పాతిక ఫోటోలు వచ్చేవి. వీటిల్లో మసకమసగ్గా వున్న ఫోటోలు పోను ఓ పదిహేను పరవాలేదు అనిపించేవిలా ఉండేవి. మళ్ళీ ఈ రీళ్ళలో కలర్ రీళ్ళు, బ్లాక్ అండ్ వైట్ రీళ్ళు. కెమెరాలోని రీలు మొత్తం అయిపోతే కాని ప్రింటింగ్ కు ఇవ్వడానికి కుదరదు. అందుకే ఒకటి రెండు అబ్బురంగా తీసి రీలు మొత్తం పూర్తయ్యాకే స్టూడియోలో ఇచ్చేవాళ్ళు. అక్కడ డార్క్ రూమ్ లో ఆ రీలు కడిగి ఆరబెట్టి, ప్రింట్ వేసి ఇచ్చేసరికి చాలా సమయం పట్టేది.
అలా దిగిన ఫొటోలే ఈ కిందవి. బహుశా ముప్పయ్యేళ్ల కిందటివి అనిపిస్తోంది. ఎందుకు ఎప్పుడు వెళ్ళామో తెలియదు కానీ బస్సులో నాగార్జున సాగర్ వెళ్ళినప్పటి ఫోటోలు అని, వీటిని నాకు షేర్ చేసిన మిత్రుడు సూర్య చెప్పారు.
నిజంగా ఇవి నాకు అపురూపం. ఎందుకంటే ఇందులో నా భార్య నిర్మల కూడా వుంది. సూర్య గారి భార్య వాణి గారితో మా ఆవిడకు చక్కని స్నేహం. అక్కాచెల్లెళ్ల మాదిరిగా వుండేవారు. (బస్సులో, బోటులో మా వెనక సీట్లలో కూర్చున్నారు)
(10-09-2021)












కామెంట్‌లు లేవు: