10, మే 2021, సోమవారం

108


తనదాకా వస్తే కానీ...
వై.ఎస్. రాజశేఖర రెడ్డి గారి హయాములో ఉమ్మడి రాష్ట్రంలో 108 అంబులెన్స్ సర్వీసులు ప్రభుత్వ ప్రైవేట్ భాగస్వామ్యంతో మొదలయ్యాయి. ఒక ప్రముఖ కమ్యూనిస్ట్ నాయకుడు ఈ పధకాన్ని అసెంబ్లీలో, బయట చెరిగి పారేసేవాడు. రోడ్డు మీద గాయపడ్డ వాళ్ళని దగ్గరలో ఆసుపత్రులకు చేర్చడానికి ఇంత డబ్బు పెట్టి అంబులెన్సులు ఏర్పాటు చేయాలా అనేది ఆయన గారి వాదన.
ఇలా వుండగా అనుకోని కష్టం ఆయనకే వచ్చి పడింది. ఏదో ఊరు వెళ్లి తిరిగి వస్తుంటే ఆయన కారు ప్రమాదానికి గురైంది. ఆయన తీవ్రంగా గాయపడ్డారు. ఎవరో 108 సర్వీసుకు ఫోన్ చేశారు. వాళ్ళు ఆఘమేఘాల మీద వచ్చి ఆయన్ని సికిందరాబాదు ఆసుపత్రిలో చేర్చారు. తీసుకురావడంలో కొద్దిగా ఆలస్యం అయినా పరిస్థితి వేరుగా ఉండేదని కోలుకున్న తర్వాత ఆయనకు తెలిసింది. విలువలు ఉన్న నాయకుడు కాబట్టి 108 సర్వీసులు ఆపదలో ఉన్నవారికి అమోఘమైన సేవలు అందిస్తున్నాయని పత్రికలవారికి చెప్పారు.

కామెంట్‌లు లేవు: