26, మే 2021, బుధవారం

పోలేదు, వున్నారు

 

కవికుల పరమేష్టి బిరుదాంకితులు, బహు గ్రంధ రచయిత, వివిధ సాహితీ ప్రక్రియలతో పాఠకులను ఎంతో కాలంగా అలరిస్తున్న సాహిత్య ద్రష్ట, సరికొత్త శైలితో మహిళా పాఠకురాళ్ళను అమితంగా ఆకట్టుకున్న ప్రతిభాశాలి అయిన శ్రీ ఏకాంబరం తన యాభయ్యో ఏట గత సాయంత్రం....”

ఇలా అనంతంగా సాగుతున్న వార్తాప్రసారాన్ని వింటూ ఒక శ్రోత పక్క శ్రోతను అడిగాడు.,  పోయాడా ఏమిటి అని. ఆయన జవాబు ఇచ్చేలోగా సమస్యాపూరణం పూర్తి చేశాడు ఆ న్యూస్ రీడర్.

“.....నగరంలో కన్నుల పండువగా జరిగిన ఓ కార్యక్రమంలో పలు సాహితీ సాంస్కృతిక సంస్థల నుంచి ఘన సన్మానం పొందారు”

గతంలో రేడియో వార్తల మీద ఇలాంటి జోకులు పేల్చేవాళ్ళు.

నీతి: పుట్టిన రోజయినా, మరోటి అయినా సూటిగా చెప్పడం మంచిది. ఈ కరోనా కాలంలో మరీ అవసరం.

(26-05-2021)

 

కామెంట్‌లు లేవు: