12, జూన్ 2016, ఆదివారం

అమెరికా సమారాధన


నడిపేది నడిపించేది కవిత్వమైతే, నలుగుర్నీ  కలిపేది కలిపించేది, ఐతే జ్వాలా  లేదా రవి. ఈ ఇద్దరూ నా మేనకోడళ్ళను పెళ్ళాడిన వాళ్ళే.

ఇంజినీర్ జీవీఆర్  రవి, ఆయన భార్య నా మేనకోడలు విజయ కుటుంబ సమేతంగా అంటే కొడుకూ కోడలు, కూతురు, అల్లుడు సహా అమెరికా యాత్ర చేసివచ్చారు. కాశీ సమారాధన మాదిరిగా తెలిసిన నలుగుర్నీ, (నలుగురు అనేది ఏదో మాటవరసకు అన్నది, అసలు వచ్చినవాళ్ళు నలభయ్ పై మాటే)పిలిచి  రాత్రి వాళ్ళింట్లో టెర్రేస్ మీద  బ్రహ్మాండమయిన విందు ఇచ్చారు. కొత్తగా రాజ్యసభ సభ్యులు అయిన కెప్టెన్ లక్ష్మీ కాంత రావు, ఆయన భార్య శ్రీమతి సరోజిని ముఖ్య అతిధులు. ఇంకా అతిరధులు మాజీ  ఎంపీ పీవీ రాజేశ్వర రావు, తెలంగాణా  జెన్  కో  చైర్మన్ దేవులపల్లి ప్రభాకర రావు, మాజీ ఐజీ, ఏపీ పోలీసు హౌసింగ్ కార్పోరేషన్ చైర్మన్ రావులపాటి సీతారామారావు (మరో మేనకోడలు శారద భర్త), ప్రముఖ ఆడిటర్ ఎస్ వీ రావు, తెలంగాణా ముఖ్యమంత్రి సీపీఆర్ఓ వనం జ్వాలా నరసింహారావు( మరో మేనకోడలు విజయలక్ష్మి భర్త) ఇంకా అనేకమంది మహారధులు ఈ విందుకు హాజరయిన వారిలో వున్నారు.   

      


(PHOTO COURTESY KARTIK)

కామెంట్‌లు లేవు: