12, జులై 2021, సోమవారం

రెండేళ్ల క్రితం సరిగ్గా ఇదే రోజున ....

 నా రాశి ఫలాల్లో పుస్తక లాభం అని రాసివుంటుందేమో. నేను చూడను కనుక తెలియదు. ఉదయం ఏపీ అసెంబ్లీ మాజీ డిప్యూటీ స్పీకర్ మండలి బుద్ధ ప్రసాద్ గారు ఫోన్ చేసి నాయింటి అడ్రసు వాకబు చేసారు. చెప్పిన సమయానికే వచ్చారు. దాదాపు మూడుగంటలు. ఇంకా ఎక్కువే కావచ్చు. నాకయితే టైము తెలియలేదు. అన్ని ముచ్చట్లు. ఎన్నెన్నో విషయాలు. అవన్నీ రాయాలంటే వంద పేజీల పుస్తకం అవుతుంది. రాయడం తెలిసిన రాజకీయ నాయకుడు కనుక ఆయనే రాస్తే బాగుంటుంది. అదే ఆయనతో చెప్పాను. చూద్దాం రాస్తారేమో.

మా ఆవిడ ఇచ్చిన కాఫీ తాగారు. భోజనం చేసి వెళ్ళండి అంటే  ఇల్లు తెలిసింది కదా మరో మారు అన్నారు. మా ఇద్దరితో కలిసి ఒక ఫోటో దిగారు.



ఇప్పుడు ఆ పుస్తకాలు, నేనూ ఆ  ఫోటో మిగిలాము ఇంట్లో. సరిగ్గా రెండు నెలల తర్వాత 'భోంచేసి వెళ్ళండి' అని అడిగే మా ఆవిడ లేకుండా పోయింది.

(12-07-2020)

కామెంట్‌లు లేవు: