19, జులై 2021, సోమవారం

పార్లమెంటు సమావేశాలు

 ఈరోజు  సోమవారం నుంచి పార్లమెంటు సమావేశాలు మొదలు.

సాంప్రదాయకంగా  జరిగే అఖిలపక్ష సమావేశం ఒక రోజు ముందుగా  నిర్వహించారు. సభ సజావుగా సాగడానికి ప్రతిపక్షాలు సహకరించాలని ప్రభుత్వం, ప్రజాసమస్యల ప్రస్తావన చేయడానికి తమకు తగినంత వ్యవధానం ఇవ్వాలని విపక్షాలు పరస్పరం విన్నవించుకున్నాయి. అలా ఈనాటి సమావేశంలో ఉభయులు అంగీకారానికి వచ్చినట్టు టీవీల్లో స్క్రోలింగులు అయితే పరుగులు తీసాయి.

ఈ బుద్ధి బుధవారం దాకా వుంటే బూరెలు వండి పెడతాను అందట ఓ భార్య మొగుడితో.

చూద్దాం ఏం జరుగుతుందో!

 

కామెంట్‌లు లేవు: