22, మార్చి 2021, సోమవారం

వంద సమర్పణ

 సన్మాన సభ ముగింపుకు వచ్చింది. అధ్యక్షుల వారు వందన సమర్పణ చేయాల్సిన వ్యక్తిని ఆహ్వానించారు. అతడొక పత్రికలో ప్రూఫ్ రీడర్.

అతడు నీరసంగా వేదిక మీదకు వచ్చి, తన చేతిలో ఉన్న ఆనాటి ఆహ్వాన పత్రికని  సభికులకు చూపుతూ మరింత నీరసంగా ఇలా అన్నాడు.

‘ఈ కార్యక్రమానికి రావడానికే మూడు బస్సులు మారి వచ్చాను. ఈ ఇన్విటేషన్ లో చూస్తే నా పేరు రాసి, ‘పలానా ఆయన వంద సమర్పణ చేస్తారు  అని వుంది. వంద కాదుకదా ఇంటికి పోవడానికి బస్సు చార్జీలు కూడా లేవు

ఆకాశవాణి పూర్వ సంచాలకులు డాక్టర్ పీ.ఎస్. గోపాల కృష్ణ నిన్న ఫోనులో కబుర్లు చెబుతూ రువ్విన జోకు.

 

కామెంట్‌లు లేవు: