14, ఆగస్టు 2016, ఆదివారం

ఎలా అని అనుకోకూడదు, అలానే అని అనుకోవాలి


ప్రసిద్ధ పాత్రికేయులు ఏ.ఎన్.జగన్నాధ శర్మ సంపాదకత్వంలో వెలువడే ‘నవ్య’ వారపత్రిక తాజా సంచికలో ఒక సీరియల్  లో వచ్చిన వాక్యాలు ఇలా వున్నాయి.( సీరియల్ : మదరిండియా, రచయిత: వక్కంతం సూర్యనారాయణ రావ్, 17-08-2016, 34వ పేజీ, మూడో కాలమ్, ఆఖరి పేరా) 

“వినడం వేరు పాటించడం వేరు.
‘బైక్  మీద  జాగర్త నాయనా! నెమ్మదిగా వెళ్ళు అని తల్లి కొడుక్కి చెబుతుంది.
‘ఓ అలాగే’ అన్న కొడుకు జాగర్తగా, నెమ్మదిగా వెడతాడన్న గ్యారంటీ ఉందా’! “
ఇక మూడేళ్ళు వెనక్కి వెడదాం.
2013 అక్టోబరులో  నేను నా బ్లాగులో ‘వినుడు వినుడు’ అనే పేరుతొ ఒక పోస్టింగు పెట్టాను. అందులో ఒక పేరా ఇలా వుంటుంది.
'వినంగానే సరిపోదు- విన్నది ఆచరించాలనీ - అప్పుడే విన్నదానికి సార్ధకతఅనే వాళ్ళున్నారు.
'ఒరేయ్ కన్నా! మోటార్ సైకిల్ పై అంత స్పీడ్ గా వెళ్లకురా!అని తండ్రి అంటే- పిల్లాడు విన్నట్టుగా తలాడిస్తే - నిజానికి అది వినడం కిందికి లెక్క రాదు.
విని పాటించినప్పుడే - 'రాముడు మంచి బాలుడుతలిదండ్రుల మాట జవదాటడుఅని కన్నవాళ్ళు - వినే వాళ్లకు చెప్పుకునే వీలుంటుంది.

మనుషుల్లోనే కాదు, రచనల్లో కూడా పోలికలు వుంటాయి. పోలికనిబట్టి ‘కాపీ’ అనడం  భావ్యం కాదు. సరదాగా తీసుకుంటే  జీవితం కూడా సరదాగా  గడుస్తుంది.



కామెంట్‌లు లేవు: