12, జులై 2014, శనివారం

గురుద్దేవో నమో నమః !



సంతః సదాభిగంతవ్యా యది నోపదిశం త్యపి
యాస్తు స్వైర కధాస్తేషాం ఉపదేశా భవంతి తాః

మనకు పాఠాలు బోధించే గురువులు వుంటారు. చెప్పని గురుదేవులూ వుంటారు. ఇటువంటివారు ప్రత్యేకించి ఏవిధమయిన ఉపదేశాలు ఇవ్వకపోయినా వాళ్లు ఏం చెబితే అదే ఉపదేశం అవుతుందని ఈ శ్లోక తాత్పర్యం.
ఏ మంచి గురువయినా తన శిష్యుల ఎదుగుదలను కోరుకుంటాడు. ఈ క్రమంలో శిష్యుడు ఎవరయినా తనని దాటి పెరిగిపోతున్నా అసూయ  పడనివాడే ఉత్తమ గురువు. నేను  పలానా అయ్యగారిదగ్గర పాఠాలు నేర్చుకున్నానుఅని చెప్పుకోవడం శిష్యులకు గౌరవంగా  వుంటుంది. అలాగే పలానా వాడున్నాడే వాడు నా దగ్గరే చదువుకున్నాడుఅని గుర్తుచేసుకోవడం గురువుకు ఆనందంగా వుంటుంది.
అదృష్టం కొద్దీ నాకు అందరూ మంచి గురువులే దొరికారు. వీరిలో చదువు  చెప్పిన వాళ్లు వున్నారు. నీతి పాఠాలు బోధించిన వాళ్లు వున్నారు. మా అమ్మ దగ్గరినుంచి నా భార్యవరకు ఆమాటకు వస్తే ఇన్నేళ్ళ జీవితంలో నాకు తారసపడిన ప్రతి ఒక్కరినుంచీ జీవితానికి పనికొచ్చే ముక్క ఏదో ఒకటి నేర్చుకున్నాను. జగమంత గురుకుటుంబం నాది. గురుపూర్ణిమ రోజున గురువులందరికీ - గురుద్దేవో నమో నమః -


కామెంట్‌లు లేవు: