7, డిసెంబర్ 2021, మంగళవారం

మారని వ్యవస్థ

 తప్పతాగిన స్తితిలో అతి వేగంగా ఓ యువవిద్యార్ధి కారు నడిపిన ఫలితంగా సంభవించిన ప్రమాదంలో రెండు ప్రాణాలు గాలిలో కలిసిపోయాయి. ఒక కుటుంబం మొత్తం చితికి పోయింది. ఉద్యోగం నిమిత్తం అమెరికా వెడుతున్న ఒక యువకుడి కలలన్నీ అతడి కనురెప్పల కిందే కరిగిపోయాయి. అప్పటివరకు చదువుతున్న స్కూలును ఒదిలి మరో స్కూల్లో చేరి బంగారు భవిష్యత్తు దిశగా తొలి అడుగు వేసిన పదేళ్ళ బాలిక రమ్య ఈ ప్రమాదంలో తీవ్రంగా గాయపడి చావుబతుకుల మధ్య కొట్లాడుతూ వారం రోజుల తరువాత మృత్యు దేవత ఒడిలో ఒదిగి పోయింది. హైదరాబాదు పంజాగుట్ట ఫ్లై ఓవర్ ప్రాంతంలో జరిగిన ఈ దుర్ఘటనలో చిన్నారి రమ్య, ఆమె బాబాయి రాజేష్ చనిపోవడం, ఆ కారులో వున్న మరో ముగ్గురు తీవ్రంగా గాయపడడంతో మొత్తం నాలుగు కుటుంబాలు భరించలేని దుఃఖంలో మునిగిపోయాయి. సహచర విద్యార్ధులతో కలిసి పగటి పూటే పూటుగా మద్యం సేవించిన ఒక ఇంజినీరింగ్ విద్యార్ధి నడుపుతున్న కారు, అదుపు తప్పి బోల్తా కొట్టి, మరో వాహనంపై పడడంతో ఈ ప్రమాదం చోటుచేసుకుంది.

ఇది జరిగి ఏండ్లు గడిచిపోయాయి.
పరిస్థితి ఏమైనా మారిందా?
లేదు అని హైదరాబాదులో తాజాగా జరిగిన సంఘటనలు తెలుపుతున్నాయి.

1 కామెంట్‌:

అజ్ఞాత చెప్పారు...

పరిస్థితి మారాలీ అని ఆందరూ కోరుకున్నారు.
పరిస్థితి మారిందా అని ఎందరో అడుగుతున్నారు.
పరిస్థితిని మార్చాలని ఎందరు ప్రయత్నించారు?
ఎందుకని ఎవరూ పూనుకోలేదు?
పనిచేయటం కష్టం.
ప్రశ్నించటం సులభం.
అదీ సంగతి.