16, జనవరి 2014, గురువారం

వీఐపీ ఏకాదశి

ఓసారి తిరుపతి వెళ్ళినప్పుడు ఓ అధికారి చెప్పాడు. 'రోజూ వేలమంది వస్తుంటారు. వాళ్ళల్లో ఓ రెండువేలమందిని మా వాళ్లు జాగ్రత్తగా చూసుకుంటే చాలు. మిగిలిన వాళ్ళతో మాకు ఏం ప్రమాదం వుండదు. నాలుగు తిట్టుకుంటారు. అంతే. సర్డుకుపోతారు. మళ్ళీ వస్తారు. వీఐపీ లంటే వాళ్ళలో మీ జర్నలిష్టులు కూడా. కొండమీద గోరంత జరిగితే కొండంత చేసి రాస్తుంటారు. మళ్ళీ పాసులూ అవీ మామూలే. ఇవేవీ మాకు కొత్తకాదు. రెండు రోజులు మాట్లాడుకుంటారు. తరువాత మరిచిపోతారు. వీఐపీ లని, మళ్ళీ వాళ్ళలో కొంతమందిని జాగ్రత్తగా కనిపెట్టి చూసుకుని దర్శనం చేసి పంపిస్తే చాలు. ఇక్కడ మమ్మల్ని అడిగేవాడు ఎవ్వడూ వుండడు' ఇదీ వరస.


కామెంట్‌లు లేవు: