తిరుమల TTD లేబుల్‌తో ఉన్న పోస్ట్‌లను చూపుతోంది. అన్ని పోస్ట్‌లు చూపించు
తిరుమల TTD లేబుల్‌తో ఉన్న పోస్ట్‌లను చూపుతోంది. అన్ని పోస్ట్‌లు చూపించు

26, నవంబర్ 2017, ఆదివారం

పిల్లి శాపాలకు ఉట్లు తెగుతున్నాయి – భండారు శ్రీనివాసరావు


మూడేళ్ళ క్రితం తిరుపతి వెంకటేశ్వర స్వామి దర్శనం చేసుకుని వచ్చిన తర్వాత ఆ యాత్రానుభవాలను గురించి నాడు ‘సూర్య’ దినపత్రికలో రాసిన వ్యాసం నుంచి చిన్న పేరా:
“ తిరుమల గర్భ గుడి నుంచి బయటకు వచ్చిన తరువాత భక్తుల అసలు కష్టాలు మొదలవుతాయి. అధికారులువీ ఐ పీ లను తీసుకువచ్చి మళ్ళీ తీసుకుపోయే వాహనాలు గుడి దరిదాపుల దాకా వస్తాయి. కానీ సామాన్య భక్తులు  మాత్రం పాదరక్షలతో  ఎండలో, వానలో మాడ వీధులలో తిరుగాడరాదు. ఇందులో తప్పు పట్టేది ఏమీ లేదు. గుడిలోకి ప్రవేసించే భక్తులు పాదరక్షలు విడిచే ప్రదేశం ఒకటి, బయటకు వచ్చే చోటు మరొకటి. గుడి బయట పరచిన బండలనండిఇంకోటి అనండి వాటిమీద నడుస్తుంటే అరికాలిమంట నెత్తికెక్కుతుంది. పాలకమండలి సభ్యులుఅధికారులు ఒక్కటంటే ఒక్కసారి చెప్పులు లేకుండా గుడి చుట్టూ తిరిగివస్తే బాగుంటుంది అని కూడా  అనిపిస్తుంది.
అయినా పిల్లి శాపాలకు ఉట్లు రాలవు కదా!

కానీ రాలుతున్నట్టున్నాయి.  నిన్న పత్రికలో ఒక  వార్త వచ్చింది. కొత్తగా వచ్చిన ఈ ఓ యాత్రీకులకు ఎండావాన నుంచి కాస్త ఉపశమనం కలిగించడానికి అక్కడ యేవో కదిలే చలవ పందిళ్ళు శాశ్వత ప్రాతిపదికపై వేయిస్తున్నారని. సంతోషం మూడేళ్ళ తర్వాత అయినా నా గోడు ఏలిన వారి చెవిన పడినందుకు.    
No automatic alt text available.

16, జనవరి 2014, గురువారం

వీఐపీ ఏకాదశి

ఓసారి తిరుపతి వెళ్ళినప్పుడు ఓ అధికారి చెప్పాడు. 'రోజూ వేలమంది వస్తుంటారు. వాళ్ళల్లో ఓ రెండువేలమందిని మా వాళ్లు జాగ్రత్తగా చూసుకుంటే చాలు. మిగిలిన వాళ్ళతో మాకు ఏం ప్రమాదం వుండదు. నాలుగు తిట్టుకుంటారు. అంతే. సర్డుకుపోతారు. మళ్ళీ వస్తారు. వీఐపీ లంటే వాళ్ళలో మీ జర్నలిష్టులు కూడా. కొండమీద గోరంత జరిగితే కొండంత చేసి రాస్తుంటారు. మళ్ళీ పాసులూ అవీ మామూలే. ఇవేవీ మాకు కొత్తకాదు. రెండు రోజులు మాట్లాడుకుంటారు. తరువాత మరిచిపోతారు. వీఐపీ లని, మళ్ళీ వాళ్ళలో కొంతమందిని జాగ్రత్తగా కనిపెట్టి చూసుకుని దర్శనం చేసి పంపిస్తే చాలు. ఇక్కడ మమ్మల్ని అడిగేవాడు ఎవ్వడూ వుండడు' ఇదీ వరస.