6, నవంబర్ 2013, బుధవారం

పార్టీలు వేరయినా ‘వరస’ ఒక్కటే!


పార్టీలు వేరయినా ‘వరస’  ఒక్కటే!
రాష్ట్ర విభజన అనండి రాష్ట్ర సమైక్యత అనండి – నిప్పూ ఉప్పూ మాదిరిగా ఏమాత్రం పొసగని  అన్ని పార్టీలదీ ఒక్కటే మాట - అదే చిత్రం! అదే విచిత్రం! కావాలంటే ఆయా పార్టీల నాయకులు తరచుగా చెప్పే  మాటలు ఓసారి  గమనించండి. అర్ధమై పోతుంది.
“కేవలం మా పార్టీని ఇరుకున పెట్టడానికి అవతలి పార్టీలు కుమ్మక్కై చేస్తున్న ఆరోపణ ఇది.  ఆ రాజకీయ పార్టీలన్నిటిది  ఒకటే లక్ష్యం.  వోట్లు, సీట్లు. ఎన్నికల్లో గెలిచి అధికారం కైవసం చేసుకోవడం యెలా అన్న యావ తప్పితే వాటికి ఈ విషయంలో మా మాదిరిగా ఎంతమాత్రం  చిత్తశుద్ధి లేదు.”
ఈ మాటలు చెప్పింది, చెప్పేది  ఏ పార్టీ అన్నది, ఏ పార్టీవారన్నది అసలు లెక్క లోకే  రాదు. ఎందుకంటే తిరగేసి మరగేసి అందరూ ఏకధాటిగా వినిపించే వాదనల  సారాంశం ఇదే.  కాంగ్రెస్, టీడీపీ, బీజేపీ, వైఎస్ఆర్సీపీ, సీపీఐ,,  ఇలా ఏ పార్టీ వారిదయినా ఒకటే స్వరం. ఒకటే రాగం. పల్లవులే వేరు,  ‘దారులు వేరయినా వారి బారులొక్కటే’ అన్న చందంగా.       
(ఇందుకు సీపీయం మినహాయింపు. ఎందుకంటే వారిది మొదటి నుంచీ  ఒకటే మాట – రాష్ట్రాన్ని సమైక్యంగా వుంచాలని.  టీ.ఆర్.ఎస్. వాళ్లకు కూడా ఈ మినహాయింపు  కొంత వర్తిస్తుంది ఎందుకంటే ఆ పార్టీ  పుట్టిందే వేర్పాటు నినాదంతో కాబట్టి. వారికి మరో మాటా బాటా లేదు కాబట్టి)

నమ్మకం కుదరాలంటే  ఏదో ఒకరోజు ఉదయం కాస్త మనస్సు ఉగ్గపట్టుకుని  టీవీ చర్చలు చూడండి.
(06-11-2013)       

2 కామెంట్‌లు:

ANALYSIS//అనాలిసిస్ చెప్పారు...

Yes, I agree with U Sir

భండారు శ్రీనివాసరావు చెప్పారు...

@అనాలిసిస్ - ధన్యవాదాలు