15, జనవరి 2022, శనివారం

రంగులో ఏముంది? – భండారు శ్రీనివాసరావు

 ప్రముఖ నటుడు చిరంజీవి ఏపీ ముఖ్యమంత్రి వై.ఎస్. జగన్మోఃన రెడ్డిని కలుసుకున్నప్పుడు ముఖ్యమంత్రి చిరంజీవికి  మర్యాదపూర్వకంగా కప్పిన శాలువ రంగుపై కొంత చర్చ నడిచింది. ఆ శాలువా రంగు పసుపు రంగు కావడం ఈ చర్చకు కారణం. అలాగే ఫేస్ బుక్ లో చంద్రబాబుకు అనుకూలంగా రాసే ఓ రచయిత/విశ్లేషకుడు సంక్రాంతి పండుగ సందర్భంగా ధరించిన దుస్తుల రంగు నీలి వర్ణం అని మరో మిత్రుడు చెప్పారు.

గతంలో ఉమ్మడి రాష్ట్రంలో జరిగిన ఎన్నికల్లో  తెలుగుదేశం పార్టీని ఓడించి  కాంగ్రెస్ నాయకుడు వై.ఎస్. రాజశేఖర రెడ్డి ముఖ్యమంత్రిగా పదవిలోకి వచ్చారు. తొలిరోజుల్లో  దూరదర్సన్ ద్వారా ఇవ్వాల్సిన ఒక  సందేశం ప్రతిని ప్లాస్టిక్ ఫోల్డర్ లో  తీసుకువెళ్లి సీఎం పేషీ అధికారికి ఇచ్చాను. ఆయన ఎగాదిగా చూసి,  ‘శ్రీనివాసరావు గారూ! ప్రభుత్వం మారిన సంగతి మీరింకా గుర్తించినట్టు లేదు అన్నారు. ఎందుకు ఇలా అన్నారని పరకాయించి చూస్తే ఆ ప్లాస్టిక్ ఫోల్డర్ రంగు పసుపు రంగు.

ఏపీలో ప్రభుత్వ కార్యాలయాలకి నీలి రంగు వేయడం మీద చెలరేగిన  వివాదం ఏ స్థాయికి చేరిందో అందరికీ తెలుసు.

నిజానికి పసుపు రంగు అనేది తెలుగు దేశం ఆవిర్భావానికి ముందు నుంచి వుంది. అలాగే నీలి రంగు వైసీపీ పుటకకు ముందు నుంచీ వుంది. మరి ఎందుకీ వర్ణ వివక్ష!

మనం పెట్టుకున్న కళ్ళజోడు రంగుబట్టి  మనకు కనబడే రంగు వుంటుంది.



(15-01-2022)  

కామెంట్‌లు లేవు: