20, అక్టోబర్ 2021, బుధవారం

మీడియాకు విజ్ఞప్తి – భండారు శ్రీనివాసరావు

కొన్ని పదాలు నోటితో అనడానికి, చెవితో వినడానికి కూడా కంపరం కలిగిస్తాయి. అందుకే కాబోలు, బూతు బూతులా వినిపించకుండా దర్శకుడు జంధ్యాల ఓ చిత్రంలో చక్కటి సన్నివేశం సృష్టించి చూపారు.
ప్రత్యక్ష ప్రసారాల కారణంగా వాటిని అప్పటికప్పుడు ఎడిట్ చేసి ప్రసారం చేయడంలో కొంత సాంకేతిక ఇబ్బంది ఉన్నమాట నిజమే. తెలుగునాట ప్రత్యేకించి ఆంధ్ర ప్రదేశ్ లో అనేక మంది రాజకీయ నాయకులు వాటిని యధేచ్చగా ఉచ్చరిస్తూ వుండడం అందరూ చూస్తూ వున్నారు. ఈ విషయంలో ఈ పార్టీ ఆ పార్టీ అనే తేడా లేదు. కొంచెం డిగ్రీ డిఫరెన్స్.
ఒక మీడియా మనిషిగా మీడియాకు నా సలహా ఏమిటంటే, ప్రత్యక్ష ప్రసారం వల్ల మొదటిసారి అటువంటి పదాలను తొలగించి ప్రసారం చేయడానికి వీలు ఉండకపోవచ్చు. కానీ తదుపరి ప్రసారాల్లో వాటిని పదేపదే ప్రసారం చేయడం వల్ల గరిష్ట స్థాయిలో అవన్నీ చేరకూడని ప్రజలకు చేరిపోతున్నాయి. ఇందులో రాజకీయ నాయకుల తప్పిదం కంటే మీడియా బాధ్యతారాహిత్యమే ఎక్కువ. ఇది తగ్గించుకుంటే సమాజానికి మంచిది.
(నోట్: ఇది చాలా పాత పోస్టు. ఏపీ ఉమ్మడి రాష్ట్రంగా వున్నప్పుడు ఓ సందర్భంలో రాసిన వ్యాసంలోని వాక్యాలు ఇవి. అంచేత జరిగిన, జరుగుతున్న పరిణామాల మీద మీ వ్యాఖ్య ఏమిటి అంటూ వివాదం చేయవద్దు. దారి తప్పిన రాజకీయం కంటే, దోవ తప్పిన మీడియా వల్ల సమాజానికి ఎక్కువ చెడుపు జరుగుతుందనేది నా నమ్మకం. రాజకీయుల దండాగిరి గురించి, వారి అనాగరిక చర్యలు గురించి గతంలో రాసి రాసి, రాసేవారికి, చదివేవారికి విసుగు పుడుతోంది. అంచేత వారికి నీతి బోధలు చేయడం వృధా)




NOTE: COURTESY CARTOONIST RAJU EPURI


(20-10-2021)

కామెంట్‌లు లేవు: