25, అక్టోబర్ 2021, సోమవారం

ఈనాటి మీడియా - భండారు శ్రీనివాసరావు


రాముడు వనవాసం చేస్తూ ఒక చెట్టు కింద విశ్రాంతి తీసుకుంటూ ఉంటాడు. కొంతసేపు గడిచిన తర్వాత తన ధనుర్బాణాల కింద నలిగిపోతూ నెత్తురోడుతున్న ఒక మండూకం కనిపిస్తుంది.
రాముడి మనసు చివుక్కుమంటుంది.
‘రక్తం స్రవిస్తూ కూడా ఇంతటి బాధను ఎలా ఓర్చుకున్నావు మండూకమా! వెంటనే నాకు చెప్పక పోయావా’ అంటాడు ఓదార్పుగా.
కప్ప ఇలా జవాబిస్తుంది.
“ఓ శ్రీరామచంద్రా! సమస్త ప్రాణులను కాపాడే దేవదేవుడివి నువ్వు. నువ్వే నా బాధకు కారణం అయినప్పుడు నేనెవ్వరికి చెప్పుకుంటాను చెప్పు?’
అలాగే వుంది ఈనాటి మీడియా వ్యవహారశైలి

కామెంట్‌లు లేవు: