bhandaru లేబుల్‌తో ఉన్న పోస్ట్‌లను చూపుతోంది. అన్ని పోస్ట్‌లు చూపించు
bhandaru లేబుల్‌తో ఉన్న పోస్ట్‌లను చూపుతోంది. అన్ని పోస్ట్‌లు చూపించు

28, మార్చి 2010, ఆదివారం

శాసన సభలు- ప్రత్యక్ష ప్రసారాలు (వార్తావ్యాఖ్య - భండారు శ్రీనివాసరావు)



శాసన సభలు- ప్రత్యక్ష ప్రసారాలు  (వార్తావ్యాఖ్య - భండారు శ్రీనివాసరావు)


చాలా ఏళ్ళ క్రితం -
అటు పార్లమెంట్ సమావేశాలు కానీ, ఇటు శాసనసభ సమావేశాలు కానీ ప్రారంభం అయ్యే తరుణంలో  రేడియో, దూరదర్శన్ లలో ఒక రోజుముందు - 'యిస్యూస్ బిఫోర్ ది హవుస్' (చట్టసభలో చర్చకు రానున్న అంశాలు) అనే  శీర్షికతో పేరెన్నికగన్న జర్నలిస్టులతో కార్యక్రమాన్ని ప్రసారం చేసేవారు. దరిమిలా జరిగే చట్టసభల సమావేశాల్లోని చర్చల్లో - ఈ నిపుణుల అభిప్రాయాల ప్రభావం స్పష్టంగా కనబడేది. అలాగే సమావేశాలు జరిగినన్నాళ్ళు- ప్రతిరోజూ రాత్రి పదిహేను నిమిషాలపాటు జర్నలిస్టులతో రాయించిన సమీక్షలు రేడియోలో ప్రసారమయ్యేవి. ఆకాశవాణి వార్తావిభాగం సిబ్బందికి అసిధారావ్రతం లాంటి కార్యక్రమం ఇది. జర్నలిస్టులు రాసుకొచ్చిన సమీక్షను ఒకటికి రెండుసార్లు పరిశీలించిన తరవాతగానీ ప్రసారం చేసేవాళ్ళు  కాదు. ఎందుకంటె ఏమాత్రం తభావతు వచ్చినా 'సభాహక్కుల ఉల్లంఘన'  కిందికి వస్తుందన్న భయం అనండి  ఇంకేదన్నా అనండి - అన్ని జాగ్రత్తలు తీసుకునేలా జాగరూకులను చేసేది. రేడియోలో ప్రసారం అయ్యే ఈ సమీక్షలను శాసన సభ్యులు నివసించే ప్రాంగణాల్లో మైకుల ద్వారా వినిపించేవాళ్ళు. వినే శ్రోతలకు కరవు వుండేది కాదు. స్తానిక సమస్యలను  శాసన సభలో-   తాము లేవనెత్తిన వయినం గురించి తమ నియోజక వర్గాలలోని జనాలకు తెలియడానికి బాగా ఉపయోగపడుతుందన్న అభిప్రాయం చాలామంది సభ్యులలో ఉండడంవల్లనొ ఏమో గానీ వారు కూడా ఈ కార్యక్రమం పట్ల యెంతో ఆసక్తి చూపడం ఆనాటి  రేడియో విలేకరిగా నా స్వానుభవం.  విమర్శలు, ప్రతి విమర్శలు ఒక  స్తాయికి మించి ప్రసారం చేయకపోవడం వల్ల - ఛలోక్తులకు తగిన స్తానం కల్పించడంవల్లా - ఈ కార్యక్రమ ప్రభావం సభలో ప్రతిఫలించేది. 
ఇక ప్రస్తుతానికి వస్తే-
టీవీ చానళ్ళ విస్తృతి, వాటిమధ్య పోటీల నీలినీడలు శాసన సభల పని తీరుపై ముసురుకుంటున్నాయన్న ఆరోపణల నేపధ్యంలో ఈ అంశాన్ని చర్చించాల్సిన అవసరం ఏర్పడింది. శాసన సభ కార్యకలాపాల ప్రత్యక్ష ప్రసారాలు మొదలయినప్పుడు ప్రజాస్వామ్య ప్రియులందరూ హర్షాతిరేకాలు వ్యక్తం చేశారు. ప్రతిపక్షాల వాణి జనాలకు వినపడుతుందని  ఆశపడ్డారు.అర్ధవంతమయిన చర్చలను ఆస్వాదించే అవకాశం లభించిందని సంబరపడ్డారు.  కానీ, సంచలనం ఒక్కటే ఈ ప్రసారాలకు కేంద్ర బిందువుగా మారే అవకాశం వుందని ఊహించలేకపోయారు. ఈ ప్రసారాల తీరుతెన్నులను నిశితంగా పరిశీలిస్తూ వస్తున్న ఒక జర్నలిష్టు మిత్రుడొకరు చేసిన వ్యాఖ్య సమంజసమనిపించేదిగా వుంది. సభ సజావుగా జరుగుతోందన్న అభిప్రాయం లేశ మాత్రంగా కలిగినాసరే - ప్రత్యక్ష ప్రసారాన్ని తక్షణం నిలిపివేసి - టీవీ యాంకర్ మరో అంశానికి మారిపోతాడట. టీవీల కోణం నుంచి చూస్తే ఇందులో అసహజమయినది ఏమీ వుండదు. ఎందుకంటె సంచలనం లేకుండా చూపిస్తే చూసేవాళ్ళు వుండరన్నది వారి అభిప్రాయం అయివుండవచ్చు. కానీ దీని ప్రభావం సభ జరిగే తీరుపై పడుతోందన్నది కూడా కాదనలేని నిజం. వీక్షకులు కూడా సంచలనాన్నే కోరుకున్న పక్షంలో ఇక ఈ విషవలయం నుంచి బయటపడడం కష్టం. అయితే ఈ విషయం నిర్ధారణ చేయడానికి ఎలాంటి ప్రయత్నం జరగలేదన్నది సయితం అంగీకరించాల్సిన అంశం. 
చట్ట సభల సమావేశాలను ప్రత్యక్ష ప్రసారం చేయడం ద్వారా ఆశించిన సానుకూల ఫలితాలు ఒనగూరాయా అన్న విషయంపై  సమగ్ర చర్చ జరగాల్సి వుంది. సానుకూల ఫలితాల సంగతి సరే, ప్రతికూల  ఫలితాలు గురించి కూడా దృష్టి సారించాలి. అయితే ఒక్క విషయాన్ని మాత్రం జాగ్రత్తగా గుర్తుపెట్టుకోవాలి. చట్ట సభల్లో తాము ఎన్నుకున్న సభ్యుల ప్రవర్తన ఏవిధంగా వుందో గమనించుకోవడానికి వోటర్లకు వున్న  ఒకే ఒక అవకాశం ఈ  ప్రత్యక్ష ప్రసారాలే  అన్న అంశాన్ని మరువకూడదు.
అందుకే, సమస్యతో సంబంధం వున్న వాళ్ళందరూ ఈ చర్చలో భాగస్వాములు కావాలి. ఎవరి పాత్ర ఎంతవరకో స్వచ్చందంగా నిర్దే సించుకోవాలి. అనారోగ్యకరమయిన సంచలన ప్రసారాలకు స్వచ్చందంగా అడ్డుకట్ట వేసుకోవాలి. సహేతుక విమర్శలు చేయడానికి ప్రతిపక్షాలకు సరైన అవకాశం సభలో లభించాలి. అయితే విమర్సల పేరుతో సభా సమయం వృధా చేయని తత్వాన్ని అవి అలవరచుకోవాలి. అదేసమయంలో -  సంచలనానికి సంయమనం జోడించి నిఖార్సయిన సమాచారం అందించే భాద్యతను మీడియా నెత్తికెత్తుకోవాలి. ప్రజాస్వామ్య పరిరక్షణలో తమవంతు కర్తవ్యాన్ని నలుగురూ కలసి  కలసికట్టుగా నిర్వర్తించినప్పుడే ప్రజాస్వామ్య సౌద పునాదులు నాలుగు కాలాలపాటు పటిష్టంగా మనగలుగుతాయి.(28-03-2010)

NOTE: All the images in this blog are copy righted to their respective owners.


                                                      


Y

25, మార్చి 2010, గురువారం

KCR doing ‘good’ than ‘harm’ to T-cause - Bhandaru srinivasrao (I.I.S.)


KCR doing ‘good’ than ‘harm’ to T-cause - Bhandaru srinivasrao (I.I.S.)



Of late, the founder president K Chandrasekhara Rao of Telangana Rashtra Samiti, formed to fight for separate statehood, appears to have indulging in unethical practices politicizing every government department and official, purely based on regional chauvinism.  To me, it appears a greatest threat to very foundations of these institutions, which were established to ensure some semblance of discipline in a civilized society.
Yes, I am very much perturbed, rather concerned, over his accusations against the Anti-Corruption Bureau, whose job is to check corruption among government servants.  If such an institution is dragged into meet one’s narrow political ends, I am scared, it bound to do more harm than good to the society as a whole.  He alleges the ACB, of late, targeting only Telangana officials framing false charges to weaken the separate statehood movement, for their active involvement.
In this context, one wishes to ask Rao whether a government servant is entitled to take active part in body politics.  Does Service Rules of government services entertain?  Should such relaxation is entertained will not there be chaos in administration?  How can a government servant hold such a grouse, especially on such contentious issues like separate statehood, while holding office and drawing salary?
Even during the independent struggle, Mahatma gave a call to all those who wanted to join the freedom struggle to quit their jobs employed by British rulers. If KCR too wanted to give such a call, he can do so.  And if those government employees belonging to the region wanted to paralyze the state machinery too had the right to choose that path.  None can object and in turn, such a major step may as well strengthen the demand for separate statehood.
Instead, while enjoying the fruits of the government, if the organizations formed on regional names just cannot take active part in a political movement like Telangana.  No such freedom is even enshrined to Indian citizen in our Constitution.  And, that’s what the ACB choose to adhere to the Government Servants Rule Book and trying to discipline those erring officials, who choose to bamboozle government funds.

  The ACB Chief, Mr Aravinda Rao, was quick to respond to the allegations of KCR and clear the air.
I, for one, wonder will such acts help strengthen the movement anyway? Will such act do more harm than good to such good cause? 
Ironically, neither he nor the Telangana Joint Action Committee could bring in unanimity among the people’s representatives of the region.  Though, they came together cutting across their party lines, they preferred to part ways when it came to resignations to their public offices like MP, MLAs and MLCs.  If unanimity cannot be achieved among the people’s representatives, how can either KCR or the T-JAC impose such diktat on poor employees who joined government services with great difficulties to eke out their livelihood?Hence, it would be wise on part of KCR and his T-JAC members to restrain from indulging in such cheap gimmicks dragging in government institutions like ACB or Police or Judiciary or any other, to meet their narrow political ends.(25-03-2010)

NOTE: All the images in this blog are copy righted to their respective owners.



2, మార్చి 2010, మంగళవారం

దటీజ్ డాక్టర్ రాజశేఖరరెడ్డి!


దటీజ్ డాక్టర్ రాజశేఖరరెడ్డి!

"అయాం సోల్డ్" - అన్నారు ఆనాటి ముఖ్యమంత్రి రాజశేఖర రెడ్డి గారు.

ముఖ్యమంత్రి అమ్ముడుపోవడమా!అందులోను వైఎస్సార్? ఎవరికి అమ్ముడుపోయారు? ఎంతకు అమ్ముడుపోయారు?



అది డిసెంబరు నెల. 2007 వ సంవత్సరం.

అప్పటికే -108- అంబులెన్సులు రాష్ట్రాన్ని చుట్టిపెడుతున్నాయి. అత్యవసర వైద్య సేవలు అందించడంలో దేశం మొత్తంలోనే అగ్రగామి అనిపించుకుంటున్నాయి.నిజానికి ఈ సర్వీసులకు ప్రాచుర్యం కల్పించిన ఘనత రాజశేఖరరెడ్డి గారిదే. ఏ పబ్లిక్ మీటింగ్ లోనయినా సరే - 'కుయ్ ...కుయ్' మని 108 అంబులెన్సుని అనుకరిస్తూ దాని ప్రాముఖ్యాన్ని ప్రజలకు తెలియచేసేవారు.

ఆ రోజుల్లోనే - సుదూర గ్రామీణ ప్రాంతాల్లో ఆరోగ్య సేవలకు సంబంధించి మరో ప్రతిపాదన ప్రభుత్వం ముందుకు వచ్చింది.అదే ఎఫ్ డీ హెచ్ ఎస్. -'ఫిక్సెడ్ డేట్ హెల్త్ సర్వీస్' - నిర్దేశిత దిన వైద్య సేవలు. ఇందుకు పూర్వ రంగం గురించి కొంత ప్రస్తావించాల్సివుంటుంది.

ప్రభుత్వం ఏటా కోట్ల రూపాయలు వైద్య ఆరోగ్య రంగంపై ఖర్చు చేస్తోంది.ఇందులో సింహ భాగం నిర్వహణ వ్యయం కిందికే పోతోంది. గ్రామీణ ప్రాంతాలలో ప్రాధమిక ఆరోగ్య కేంద్రాలు కొంత మేరకు ప్రజల ఆరోగ్య సేవల అవసరాలను తీరుస్తున్నప్పటికీ- డాక్టర్ల కొరత అన్నది ఎప్పటికీ తీరని సమస్యగానే మిగిలిపోతున్నది. మన రాష్ట్రంలో ఎనభయి వేల గ్రామాలుంటే, కేవలం పదిహేను వందల చోట్ల మాత్రమే వైద్యులు అందుబాటులో ఉన్నారు. వైద్య కళాశాలలో పట్టా పుచ్చుకున్న ఏ ఒక్కరు కూడా పల్లెలకు వెళ్లి వైద్యం చేయడానికి సిద్దంగా లేరంటే అతిశయోక్తి కాదు. ఇక మందుల విషయం చెప్పనక్కరలేదు. ప్రాధమిక ఆరోగ్య కేంద్రాలకు దూరంగా వున్న పల్లెల్లో నివసించే వారికి ఈ అరకొర సదుపాయం కూడా అందుబాటులో లేదు. నాటు వైద్యుల దయా దాక్షిణ్యాల పయినా, వారిచ్చే నాటు మందుల పయినా ఆధారపడాల్సిన దీన స్తితి వారిది. బయట ప్రపంచంతో సంబంధాలు లేకుండా అరణ్య ప్రాంతాలలో - అంత సులువుగా చేరుకోలేని కోయ గూడాలు, లంబాడి తండాల్లో వుండే పేద వారికి రోగం రొస్టూ వస్తే ఇక ఇంతే సంగతులు. అలాటివారు సాధారణంగా షుగరు, రక్త పోటు, ఉబ్బసం, కీళ్ళ వ్యాధులతో బాధపడుతుంటారు. అసలు ఇలాటి జబ్బులు తమకు వున్నట్టు కూడా వీరికి తెలియదు. ఎందుకంటె ఎలాటి వైద్య పరీక్షలు ఎప్పుడూ చేయించుకుని ఎరుగరు కనుక. రోగం ముదిరి ఏ పక్షవాతానికో దారి తీసేదాకా 'బీపీ' వున్నట్టు కూడా తెలియదు.

ఈ నేపధ్యంలో -

అప్పటికే - ప్రభుత్వ ప్రయివేటు భాగస్వామ్యం ప్రాతిపదికన ఏర్పాటయి, పనిచేస్తున్న -104- ఉచిత వైద్య సలహా కేంద్రం నిర్వాహకులు - హె చ్ ఎం ఆర్ ఐ (హెల్త్ మానేజిమెంట్ రీసెర్చ్ ఇన్స్టిట్యూట్) వారు ఈ సమస్యపై దృష్టి సారించారు. అందుబాటులో వున్న ఆధునిక సాంకేతిక పరిజ్ఞానాన్ని వినియోగించుకుని ఒక పరిష్కారాన్ని కనుగొన్నారు. ప్రాధమిక ఆరోగ్య కేంద్రాలకు మూడు కిలోమీటర్ల ఆవల వుండే ప్రతి పల్లెకు- నెల నెలా క్రమం తప్పకుండా వెళ్లి - వూరివారికి వైద్య పరీక్షలు చేసి ఉచితంగా మందులు అందించే వాహనానికి రూపకల్పన చేశారు. 108 అంబులెన్సు ప్రమాదం అంచున ఉన్నవారి ప్రాణాలను కాపాడేందుకు ఉద్దేశించినదయితే ఈ 104 సంచార వైద్య వాహనం - పేద పల్లె ప్రజల ప్రాణాలు ప్రమాదం అంచుకు చేరకుండా చూస్తుంది.ఇంతా చేసి ఈ పధకం కింద లబ్ది పొందేవారి సంఖ్యను లెక్కలోకి తీసుకుంటే- ఒక్కొక్కరిపై పెట్టె ఖర్చు ఏడాదికి కేవలం ఎనభయి రూపాయలు మాత్రమే. అంటే వైద్య ఆరోగ్య రంగం బడ్జెట్ లో పది శాతం కన్నా తక్కువన్నమాట.

ఈ వాహనం ప్రతి నెలా ఒక నిర్దేశిత దినం నాడు క్రమం తప్పకుండా ఒక గ్రామాన్ని సందర్శిస్తుంది. ఇందులో ఒక డేటా ఎంట్రీ ఆపరేటర్, ముగ్గురు ఏ ఎన్ ఎం లు(నర్సులు), ఒక ఫార్మసిస్టు, ఒక లాబ్ టేక్నీషియన్, ఒక డ్రయివర్తో సహా మొత్తం ఏడుగురు సిబ్బంది వుంటారు. బయో మెట్రిక్ పద్దతి ద్వారా రోగుల వివరాలను కంప్యూటర్లలో నిక్షిప్తం చేస్తారు. గర్భిణీ స్త్రీలను, బాలింతలను పరీక్షించి మందులు ఇస్తారు. గర్భిణి కడుపులో పిండం పెరుగుదలను నెలనెలా గమనిస్తూ తగిన జాగ్రత్తలు సూచిస్తారు.అవసరమని భావిస్తే, ఫోన్ చేసి ఆసుపత్రిలో చేర్పిస్తారు.రక్త పోటు, షుగర్ ఉన్నవారికి నెలవారీగా చేయాల్సిన పరీక్షలు నిర్వహిస్తారు.

'దర్వాజాలో దవాఖానా' వంటి ఈ పధకానికి సంబంధించిన మొత్తం వివరాలను పవర్ పాయింట్ ప్రజంటేషన్ రూపంలో ముఖ్యమంత్రికి వివరించడానికి హెహ్ ఎం ఆర్ ఐ నిర్వాహకులు ముఖ్యమంత్రి అప్పాయింట్మెంట్ తీసుకుని ఆనాడు సచివాలయానికి వెళ్ళారు.ఇప్పటి ముఖ్యమంత్రి, ఆనాటి ఆర్ధిక మంత్రి అయిన రోశయ్య గారు కూడా పాల్గొన్న ఆ సమావేశం మొదలయి మూడు నాలుగు స్లయిడులు వేసారో లేదో- రాజశేఖరరెడ్డి గారు ఇక వినాల్సింది ఏమీ లేదన్నట్టు, హటాత్తుగా 'అయాం సోల్డ్ '(ఫర్ థిస్ ఐడియా) అనేసారు.

అంతే!

దాదాపు ఏడాదికి నూరు కోట్ల రూపాయలకు పైగా ఖర్చయ్యే ప్రాజక్టును పది నిమిషాల్లో ఖరారుచేసి, గ్రీన్ సిగ్నల్ ఇచ్చేసారు.

దటీజ్ డాక్టర్ రాజశేఖరరెడ్డి!

___________________________________________________________________________________________

-భండారు శ్రీనివాసరావు (02-03-2010)

____________________________________________________________________________________________

--(హెలికాప్టర్ దుర్ఘటనలో రాజశేఖర రెడ్డి గారు కన్నుమూసి ఆరు మాసాలు గడిచిన సందర్భంలో 02-03-2010 తేదీన సాక్షి దినపత్రికలో ప్రచురితం - భండారు శ్రీనివాసరావు)

NOTE: All the images in this blog are copy righted to their respective owners.

6, జనవరి 2010, బుధవారం

Oh Media – care common man! - Bhandaru Srinivas Rao

Oh Media – care common man!




By Bhandaru Srinivasa Rao



The all-party meeting convened by the Union Home Minister P Chidambaram over Telangana might not have accomplished its objective in attaining consensus on ‘separation’, yet in my view ensured unanimity over restoring peace. That’s interesting.



In his opening remarks, Chidambaram though appeared to remain self-explanatory regarding apprehensions expressed by various people over his December 9 and December 23 statements on the contentious issue. He said, if the first statement was based on the reported ‘consensus’ reached at the all-party meeting convened by Andhra Pradesh Chief Minister K Rosaiah, then the December 23 was on the ‘altered’ view point of major political parties thereafter. As a result, the entire Andhra Pradesh was engulfed with ‘fire’ with pro-and-anti groups indulging in violence over state’s bifurcation.



Chidambaram’s genuine concern over the democratic institutions losing its importance in resolving contentious issues such as Telangana, is understandable, His reasoning that such an impression will only give an opportunity to those who are opposing it to gain an upper hand is also indisputable. Although, he did not elaborate it in so many words, yet the ‘rider’ of his statement is ‘loud and clear’. Especially, regarding the left-wing extremist groups! “We should not send a message that we cannot resolve contentious issues through democratic process. Every issue can be found a solution with mutual consultations and dialogue” was the essence of his statement.



Whatever has happened is happened and the common man today, in both the regions, are put to inconvenience with frequent ‘rasta rokos’ ‘bandhs’ and ‘rail-roko’ agitations. Should this be continued or put a stop to initiate any further dialogue on bifurcation is the pertinent question apparently being raised by the Union Minister? And, the eight major political parties, which attended the meeting, at least accepted in principle that ‘peace’ (read normalcy) now becomes priority in their ‘agenda’ rather than the “T” issue. Hence, they agreed to issue a joint statement appealing to, especially the student community and other voluntary organizations agitating in ‘favor’ and ‘against’- to restore peace a tranquility. One should welcome this and restrain any more debates and discussions on the ‘outcome’ of the all-party meeting held under the chairmanship of the Union Minister.



As a political observer, I feel now the onus lies on my media colleagues, especially the visual media. The electronic media should restrain from holding any more debates or discussions in their respective channels, at least for couple of months, till peace prevails all over the state. Today, the common man is worst affected and I wonder ‘who had given the right to deprive the right an individual to move around, either to work place or anywhere? Doesn’t this vitiate human rights?



During the past few months, the state, which is on the forefront of development, has received a serious dent with frequent agitations all over the state. The Confederation of Indian Industry as well we the AP Chamber of Commerce expressed their concern over the state being lost of crores of investments that were to come as result of unrest. Student community lost reasonable time due to institutions shut down. Those who are preparing for competitive exams are the most worried lot today with dates drawing nearer for entrance tests of renowned institutions. All thease are to be taken into consideration by the responsible media, before airing views from different people which- in my view - many a times serving no purpose except adding fuel to the fire. (06-01-10)

29, డిసెంబర్ 2009, మంగళవారం

ఎటు పోయాయ్‌ ఆ రోజులు ? --భండారు శ్రీనివాసరావు

ఎటు పోయాయ్‌ ఆ రోజులు ?

మా తాత గారి కాలం నాటికి మా వూళ్లో కరెంటు లేదు. ఆముదపు దీపాలు మినహా - కరెంట్‌  బల్బ్ ని కూడా చూడకుండానే ఆయన కాలం చేశారు.
మా నాన్న గారి కాలం వచ్చేసరికి కరెంట్‌ రాలేదు కానీ - రేడియోలు, గ్రామఫోన్లూ ఉండేవి. కాకపోతే ఆ రేడియోలు - మోటారుకార్లలో వాడే పెద్దసైజు బ్యాటరీల సాయంతో పనిచేసేవి.
మా వూరి మొత్తం జనాభాలో- ఆరోజుల్లో - యాభయి మైళ్ల దూరంలో వున్న బెజవాడకి వెళ్లి, సినిమా చూసొచ్చిన పెద్దమనిషి ఆయన ఒక్కరే. ఆ మాటకి వస్తే ఆయన తప్ప- రైలుని చూసిన  వాళ్ళు  కానీ, బస్సు ఎక్కిన వాళ్ళు కానీ, మా వూళ్లో ఎవరూ లేరని కూడా చెప్పుకునే వారు.
ఇక మా అమ్మ-
కట్టెల పొయ్యి ముందు కూర్చుని - పొగచూరిన వంటింట్లో పదిమందికి వండి వార్చేది. ఆమె సామ్రాజ్యంలో రకరకాల పొయ్యిలు ఉండేవి. పాలు కాగబెట్టడానికి దాలిగుంట - కాఫీ కాచుకోవడానికి బొగ్గులకుంపటి, వంట చేయడానికి మూడు రాళ్ల పొయ్యి, ఇలా దేనికి దానికి విడివిడిగా ఉండేవి. ఇక పెరట్లో బావి ప్రక్కన స్నానాలకోసం కాగులో నీళ్ళు  మరగపెట్టడానికి మరో పెద్ద పొయ్యి సరేసరి. దాలిగుంట విషయం ప్రత్యేకంగా చెప్పుకోవాలి. వంటింటి వసారాలోనే ఓ మూలగా ఉండేది. నిప్పంటించిన పిడకలను ఆ దాలిగుంటలో దొంతరగావేసి పాలకుండని వాటిపై ఉంచి - పైన ఒక రాతిపలకని కప్పేవారు. సన్నటి సెగపై ఆ పాలు తీరిగ్గా కాగేవి. ఎరగ్రా కాగిన ఆ పాలపై - అరచేతి మందాన మీగడ కట్టేది. మర్నాడు - ఆ కుండలోని పెరుగుని నిలబడి వయ్యారంగా కవ్వంతో చిలికేవారు. మజ్జిగ నీటిపై తెట్టెలా కట్టిన తెల్లటి వెన్నని చేతుల్లోకి తీసుకుని, అరచేతిలో ఎగురవేస్తూ ముద్దగా చేసేవారు. పక్కన నిలబడి ఆశగా చూసే చిన్న పిల్లలకి చిన్న చిన్న వెన్న ముద్దలు పెట్టే వాళ్ళు . ఆహా ఏమి రుచి! అని లొట్టలు వేస్తూ తినేసి- ఆటల్లోకి జారుకునే వారు.  మగవాళ్ల సంగతేమో కానీ, ఆడవాళ్లకి ఆ రోజుల్లో చేతినిండా పనే. భోజనాలు కాగానే - అంట్లగిన్నెలు సర్దేసి - వంటిల్లు ఆవు పేడతో అలికేవారు. బాదం ఆకులతో విస్తళ్ళు కుట్టే వారు.  రోకళ్లతో వడ్లు దంచేవారు. ఇంటికి దక్షిణాన ఉన్న రోటిపై కూర్చుని పప్పు రుబ్బేవారు. ఈపనులు చేయడానికి విడిగా పనిమనుషులు ఉన్నా వారితో కలిసి ఈ పనులన్నీ చేసేవారు. వాటితో పాటు శ్రమతెలియకుండా పాటలు పాడుకుండేవారు. విలువ కట్టని వారి శ్రమా, విలువ కోరని వారి నిబద్ధతా చిన్న నాటి జ్ఞాపకాల దొంతర్లలో పదిలంగా ఉండిపోయాయి.
ఇక మారోజులు వచ్చే సరికి - రోజులు పూర్తిగా మారిపోయాయి. కట్టెల పొయ్యిలు పోయి - గ్యాస్‌ స్టవ్‌లు వచ్చాయి. నీళ్ల కాగుల్ని బాయిలర్లు భర్తీ చేశాయి. కరెంట్‌ దీపాలు వచ్చి లాంతర్లని వెనక్కి నెట్టేశాయి. కరక్కాయ సిరాలు- పుల్ల కలాలు తరువాతి రోజుల్లో రూపాలు మార్చుకుని ఫౌంటెన్‌ పెన్నులుగా, బాల్‌పాయింట్‌ పెన్నులుగా అవతరించాయి. రూపాయికి పదహారణాలు అనే లెక్కకాస్తా మా చిన్నతనంలోనే నూరు నయాపైసలుగా మారిపోయింది. బేడలూ, అర్ధణాలూ, కాసులూ, చిల్లికాసులూ జేబుల్లోంచి జారిపోయి నిగనిగలాడే రాగి నయా పైసలు, నికెల్‌ నాణేలు చెలామణిలోకి వచ్చాయి. రామాయణ కాలంనుంచీ ఎరిగిన ఆమడలు, కోసులు, మైళ్ళు  కాలగర్భంలో కలిసిపోయి, కిలోమీటర్‌  రాళ్ళు  రోడ్లపై  వెలిసాయి.  ఏడాదికోమారు జరిగే తిరుణాళ్లు  నిత్యకృత్యంగా మారి - అశ్లీల నృత్యాల వేదికలుగా మారిపోతున్నాయి. కోలాటాలు, పందిరి నాటకాలు, హరికథలు, బురక్రథలు, పిట్టలదొర కథలు చరిత్రపుటల్లో చేరి కనుమరుగవుతున్నాయి.
ఆరోజుల్లో సెలవులు ఇస్తే చాలు - పిల్లలంతా పల్లెటూళ్లకి పరిగెత్తే వాళ్ళు.  ఇన్ని రకాల ఆటలుంటాయా అనేట్టు అనేక రకాల ఆటలతో, పాటలతో కాలం గిర్రున తిరిగిపోయేది. అష్టాచెమ్మాలు, తొక్కుడు బిళ్లలు, వామన గుంటలు, వెన్నెలముద్దలు, వైకుంఠపాళీలు, పచ్చీసాటలు, చింతపిక్కలు, బావుల్లో ఈతలు, వాగు ఒడ్డున కబడ్డీ పోటీలు- ఒకటేమిటి - ఒక జీవితానికి సరిపడా ఆనందాన్ని గుండెల్లో నింపేసుకుని- ఇంకా ఇంకా ఇలాగే రోజుల్ని సరదాగా గడపాలన్న కోరికని మనసులోనే చంపేసుకుని - పాడు సెలవులు అప్పుడే అయిపోయాయా అని నిట్టూరుస్తూ బడిబాట పట్టేవాళ్ళు.
ఇక మా పిల్లల కాలం వచ్చేసరికి - మాయాబజారు సినిమాలో మాదిరిగా - కళ్లముందు ప్రపంచం ఒక్క మారుగా మారిపోయింది. గతం తలచుకోవడానికే మిగిలింది. చిన్నతనంలో చూసినవేవీ - ఈనాడు కలికానికి కూడా కానరావడం లేదు. జీవితం, ఇంత చిన్నదా అనిపించేలా, విన్న పదాలు, చూసిన దృశ్యాలు - ఆడిన ఆటలు, పాడిన పాటలు - కనురెప్పలకిందే కరిగి పోతున్నాయి. జ్ఞాపకాల పొరల్లోకి జారిపోతున్నాయి.
ఆ గురుతుల దారుల్లో వెనక్కి వెడుతుంటే - జొన్న చేల నడుమ కాలిబాటలో పరుచుకున్న దోసతీగెలూ-
లేత జొన్న కంకుల్ని వొడుపుగా కొట్టి తీసి వేయించిన ఊచ బియ్యం-
రోజూ తినే వరి అన్నానికి - ఎప్పుడో ఒకప్పుడు సెలవిచ్చేసి - పని వాళ్ళు  వండిన జొన్నన్నంతో కూడిన మృష్టాన్న భోజనం-
కళ్లాల„సమయంలో - కొత్త వడ్లు కొలిచి - కొనుక్కుతినే కట్టె మిఠాయి-
సాయంత్రం చీకటి పడేవేళకు - మైకులో ఊరంతా వినవచ్చే పంచాయితీ రేడియోలో సినిమా పాటలు-
వెన్నెల్లో ఆరుబయట నులకమంచాలపై పడుకుని ఊ కొడుతూ వినే అమ్మమ్మ కథలూ-
ఏవీ ! అవేవీ! ఎక్కడా కనబడవేం! ఇవన్నీ ఒక నాడు వున్నాయని అన్నా - కంప్యూటర్లతో ఒంటరిగా ఆడుకునే ఈనాటి పిల్లలు  నమ్ముతారా?? కళ్లతో చూసిందే  నమ్ముతాం  అని వాళ్లంటే మీరేం చేస్తారు?



16 -7-2008







..........................................

26, డిసెంబర్ 2009, శనివారం

గుబులు పుట్టిస్తున్న ఉప ఎన్నికలు - భండారు శ్రీనివాసరావు

ఏమి సేతురా లింగా !

ముని  మంత్రంబు నొసంగ నేల? 
నొసగె బో -
మున్ముందు మార్తాండు రమ్మని నేకోరగానేల?
కోరితిని బో -
అతండు రానేల?
వచ్చెను బో -
కన్నియనంచు నెంచక నను చేపట్టగా నేల?
పట్టెను బో -
పట్టి నొసంగ నేల?
అడుగంటెన్‌ కదా! కుంతి సౌభాగ్యముల్‌!


                                           
కరుణశ్రీ పద్య రూపంలో పలికించిన ` కుంతీ విలాపం' మాదిరిగా ఉంది నేడు రాష్ట్రంలో ఉప ఎన్నికల నేపధ్యంలో వివిధ పార్టీల పరిస్థితి.
గెలిచి తీరతాం! అన్న ధీమా కాస్తా
గెలవకపోతామా! అన్న ఆశగా మారి
గెలుస్తామా! అన్న సంశయ రూపం ధరిస్తే -
మిగిలేది కుంతీ విలాపమే!

కోరిన వరాలిచ్చు కొండంత దేవుళ్ళలాంటి వాళ్ళు  కాదు ఓటర్లు.  వాళ్ళ నాడి కనిపెట్టడం రాజకీయ పార్టీలను పుట్టించిన బ్రహ్మదేవుడి తరం కూడా కాదు. వాళ్ళ మూడ్‌ ఎప్పుడు ఎలా మారుతుందో ఎవ్వరూ చెప్పలేరు. అలాగని గాలి వాటం కాదు. సమయం వచ్చినప్పుడు కీలెరిగి వాత పెట్టడంలో వారికి వారే సాటి. ఈ పాటి వాస్తవం ఎరగబట్టే పార్టీ నేతల్లో ఇంత గుబులు.

ఆవిరయ్యే హామీలు 

రాష్ట్రం అగ్ని గుండంగా మారి, వేసవితాపం, భానుడి ప్రతాపం రోజురోజుకూ పెరిగిపోతున్న సమయంలో ఉప ఎన్నికల వేడితోడయి జనం ఉక్కిరిబిక్కిరవుతున్నారు. ప్రధాన పార్టీలు ఎడాపెడా కురిపిస్తున్న హామీల వర్షాలు కూడా వారితాపాన్ని తీర్చలేకపోతున్నాయి. ఉపశమనాన్ని కలిగించలేకపోతున్నాయి.

ఇక పార్టీలు, పార్టీల నేతలు, ఉపనేతలు, కార్యకర్తల పరిస్థితి మరీ ఘోరం. మండు వేసవిలో వచ్చిపడ్డ ఈ ఉప ఎన్నికలు నిజంగా వారి పాలిట అగ్ని పరీక్షగా తయారయ్యాయి. కరెంటు కోతలు, ఉక్కపోతల నడుమ పరీక్షలు రాసే విద్యార్ధుల మాదిరిగా ఉంది వారి పరిస్థితి.
పైకి ఎంత ధీమాగా ఉన్నా -  బింకంగా కనబడ్డా -
` ఎందుకొచ్చిన ఎన్నికలు రా' అన్న బాధ వారి మనసులను ఏదో మూల తొలుస్తూనే వుండాలి!
ఇది ఇలా ఎందుకు జరిగింది? అన్న ప్రశ్న  ఎంత స్వాభావికమైనదో -
అలా జరిగి వుంటే - ఇలా జరిగేది కాదేమో అన్న భావన కూడా అంత స్వాభావికమైనదే?
`` ఆ నాడు సర్కారు ఎక్‌‌సప్రెస్‌ లేటుగా వచ్చి - మీరు పెళ్ళి చూపులకు ఆలస్యంగా వచ్చివుంటే - మా నాన్న ఎంచక్కా నాకు ఆ భీమవరం సంబంధమే ఖాయం చేసివుండేవాడు' అన్నదట ఓ ఇల్లాలు శోభనం రోజున కట్టుకున్న మొగుడితో.
అలాగే - భవనం వెంట్రామ్‌ ముఖ్యమంత్రిగా ప్రమాణస్వీకారం చేసిన రోజు, తన స్నేహితుడు ఎన్‌. టీ. రామారావుని రాజభవన్‌కు ఆహ్వానించకపోయి ఉంటే - వెంట్రామ్‌ సలహా మేరకు రామారావుకు కాంగ్రెస్‌ అధిష్టానం రాజ్యసభ సభ్యత్వం ఇచ్చివుంటే - అసలు తెలుగుదేశం పార్టీ పుట్టేదే కాదన్నాడొక రాజకీయ విశ్లేషకుడు.
మరో విశ్లేషకుడు మరో అడుగుముందుకువేసి - డిప్యూటీ స్పీకర్‌కు బదులుగా - చంద్రశేఖరరావుకు చంద్రబాబు తన మంత్రివర్గంలో స్థానం కల్పించి ఉంటే తెలంగాణా రాష్ట్ర సమితి ఉండేదే కాదు. ఈ ఉప ఎన్నికలు వచ్చేవే కావు పొమ్మన్నాడు.
అందుకే మన జనం వేదాంతాన్ని నమ్ముకున్నది
కానున్నది కాకమానదు. కానిది కానే కాదు.


భండారు శ్రీనివాసరావు
జయీ భవ! దిగ్విజయీభవ

గత మూడు దశాబ్దాల కాంగ్రెస్‌ ముఖ్యమంత్రుల చరిత్రను వై ఎస్సా ర్‌ తిరగరాస్తున్నారు. నాలుగేళ్ళ పదవీకాలాన్ని విజయవంతంగా ఈ నెలలో పూర్తి చేసుకుని అయిదో ఏట అడుగుపెడుతున్నారు. ఏ విధంగా చూసినా - రాజశేఖరరెడ్డిది ఒక రికార్డే. 48 నెలల్లో ఎన్ని పథకాలు? ఎన్ని ప్రణాళికలు? ఎన్ని ప్రాజెక్టులు?
అధికార యంత్రాంగాన్ని ఊపిరి సలపనివ్వకుండా అమలు చేస్తున్న పథకాల తీరుతెన్నులు గమనించిన వారికి కాంగ్రెస్‌ ముఖ్యమంత్రుల్లో రాజశేఖరరెడ్డి విశిష్టత బోధపడుతుంది. ఎన్నికల హామీలను అమలు పరచడమే కాకుండా - ఎప్పటికప్పుడు ప్రజల అవసరాలను గమనిస్తూ - కొత్త ఆలోచనలకు రూపం కల్పిస్తూ ముఖ్యమంత్రి ముందుకు సాగుతున్న తీరు హర్షనీయం! అభినందనీయం!
అందుకే అంటున్నారు జనం
రాజశేఖరా ! నీపై మోజుతీరలేదురా !!

( జూన్ - 2008 )

జనహితమే సర్వజన సమ్మతం - భండారు శ్రీనివాసరావు

జనహితమే సర్వజన సమ్మతం  - భండారు  శ్రీనివాసరావు

ఎక్కడి వీవిస్ లక్ష్మణ్! ఎక్కడి గిల్‌క్రిస్ట్! ఎక్కడి సెహ్వాగ్! ఎక్కడి జయసూర్య! ఎక్కడి హర్భజన్! ఎక్కడి హేడెన్! హద్దుల్ని కాదనుకుని - సరిహద్దుల్ని దాటుకుని క్రీడా స్పూర్తితో క్రికెట్ చరిత్రని తిరగరాస్తున్న ఐ పీ ఎల్ పోటిల్లో పాల్గొంటున్న దిగ్గజాలని చూస్తుంటే ఏమనిపిస్తుంది? విశ్వమంతా ఒకటై - ఒకే వేదికగా మారుతున్న తరుణంలో 'మన రాజకీయం ' ఏ దిశగా సాగుతోంది? ఏ దరి చేరబోతుంది?

రాష్ట్ర విభజనని ప్రజలు మనస్పూర్తిగా కోరుకుంటే ఏ రాజకీయ శక్తీ దాన్ని ఆడ్డుకోలేదు. ఈ ఆకాంక్ష జనానిదయితే మన్నించాల్సిందే. రాజకీయమైనదయితే ఆలోచించాల్సిందే'. ఇటీవలికాలంలో - దాదాపు అన్ని పార్టీలు - ఏదో ఒక రూపంలో - ఏదో ఒక స్థాయిలో తెలంగాణా సెంటిమేంట్‌ని కొద్దో గొప్పో పులుముకోవాలిని ప్రయత్నిస్తూ ఉన్నాయి.

ఈ పార్టీల్లోని కొందరు పెద్దలకి ఇది తక్షణ రాజకీయ అవసరంగా మారింది. అదే ఇందులోని విషాదం. అయితే, సమైక్యవాదం నుంచి అంగుళమైనా ఎడం జరగని ఎడమ పార్టిల్లో సీపియంని ప్రధమంగా చెప్పుకోవాలి. ముఖ్యమంత్రి రాజశేఖరరెడ్డి కూడా ఈ కోవలోకే వస్తారు. అభివృద్ధి నినాదం ప్రాతిపదికపైనే ఉప ఎన్నికల సమరాంగణంలోకి అడుగు పెట్టాలన్నది ఆయన అభిమతం. సమైక్య రాష్ట్ర సిద్ధాంతాన్ని బలపరిచే పార్టీల్లో పెద్ద పీట వేయాల్సిన మరో పార్టి టీడీపి.

ప్రత్యేక రాష్ట్రమే పరమావధిగా పుట్టుకోచ్చిన తెలంగాణా రాస్ట్ర సమితి నాయకుడు చంద్రశేఖరావు - వ్యూహాత్మకంగానో లేదా గత్యంతరం లేకనో తెచ్చిపెట్టిన ఉప ఎన్నికల ఉసురు అన్ని పార్టిలనూ చుట్టుముడుతోంది. తెలంగాణా పట్ల అనేక రాజకీయ పక్షాల్లో నెలకొని ఉన్న అసందిగ్ధ పరిస్థితికి - ఈ ఉప ఎన్నికల ఫలితాలే స్వస్తి వాచకం పలకగలవన్నది రాజకీయ పరిశీలకుల అంచనా.

దేశం స్వాతంత్ర్యం పొందిన దరిమిలా - అనేక కొత్త రాష్ట్రాలు పురుడు పోసుకున్నాయి. పొరుగున ఉన్న అనాటి మద్రాసు(తమిళనాడు) రాష్ట్రం నుంచి విడిపోయి ఏర్పడ్డ ఆంధ్ర రాష్ట్రం - తరువాత కొద్ది కాలానికే - భాషా ప్రయుక్త రాష్ట్రాల సిద్దాంత ప్రాతిపదిక పై - తెలంగాణా ప్రాంతాన్ని కలుపుకుని - ఆంధ్ర ప్రదేశ్ గా ఆవిర్భవించింది. ఒకే భాష మాట్లాడే వారికి కూడా, విడివిడిగా రాస్ట్రాలు వున్నప్పుడు - ఆంధ్ర ప్రదేశ్ ని కూడా ప్రజాభిష్టం మేరకు విభజించడంలో తప్పేమి లేదు. అయితే తప్పల్లా - ప్రజల ఆకాంక్షని అంచనా వేయడంలో చేస్తున్న తప్పులే. రాష్ట్ర విభజన అన్నది ఎవరో కొందరి రాజకీయావసరాల కోసం కాకుండా మెజారిటీ ప్రజల అబీష్టం మేరకు జరగాలి. జరగనున్న ఉప ఎన్నికల ఫలితాలు ఈ దిశగా కొంతమేరకు ఉపకరించే అవకాశం ఉంది.

ఏ వేర్పాటు ఉద్యమానికయినా, వెనుకబడినతనమే ప్రాతిపదిక. దీని ఆధారంగా పెచ్చరిల్లే భావోద్వేగాలే విభజన ఉద్యమాలకు ఊపిరిపోస్తాయి. ఈ విధంగా ప్రజ్వరిల్లే శక్తిని అడ్డుకోవడం అతికష్టం అని గతంలో తెలంగాణా ప్రజా సమితి నిరూపించింది కూడా. అయితే, అప్పటికి అంటే 1969 నాటికి ఇప్పటికీ పరిస్థితుల్లో ఇసుమంత కూడా మార్పు రాలేదంటే నమ్మడం కష్టం. తెలంగాణాలో ఇంకా కొన్ని ప్రాంతాలు అభివృద్ధికి నోచుకోలేదంటే నమ్మచ్చుకాని తెలంగాణాలో అసలు అభివృద్ధి జరగలేదని వాదించడం కేవలం రాజకీయమే అవుతుంది. ఇక్కడ మరో విషయం కూడా చెప్పుకోవాలి. 1969 నాటికి వూహకు సయితం అందని ఉదార ఆర్ధిక విధానాలు ఈనాడు శరవేగంగా అమలవుతున్నాయి. ప్రపంచీకరణ సిద్దాంతం నేల నాలుగు చెరగులా బలంగా వేళ్ళూనుకుంటున్న నేపధ్యంలో - అసలు దేశాలు మధ్యనే హద్దులు చెరిగిపోతున్నాయి.

పొట్ట గడవక కొందరూ - డాలర్లు వేటలో మరికొందరూ - ఉపాథి కోసం ఇంకొందరూ ఉన్నవూరు వదిలిపెట్టి వెళ్ళడం అన్నది ఏ ఒక్క ప్రాంతానికో పరిమితం కావడంలేదు. అవకాశాలు వెతుక్కుంటూ అన్ని ప్రాంతాలవారు అన్ని చోట్లకీ వలస వెడుతున్నారు.
ఏదో ఒకనాడు - తెలుగువాడే అమెరికాకి అధ్యక్షుడు కాగలడని ఆ దేశంలో ఉంటున్న తెలుగువారే భరోసాగా చెబుతున్నారంటే ఇక భౌగోళిక రేఖలకి, దేశాల సరిహద్దులకీ - అర్థమేముంటుంది? పోతే - ఆర్థిక సంస్కరణల పుణ్యమా అని - భవిష్యత్తులో ప్రభుత్వ ఉద్యోగాలు ఏపాటి మిగులుతాయో అర్ధం చేసుకోలేని విషయమేమి కాదు.
ఆ మాటకి వస్తే - దేశాలయినా, రాష్ట్రాలైనా, ప్రజలైనా విడిపోవడం - కలిసిపోవడం పెద్ద విషయమేమి కాదు. విభజన కుడ్యాన్ని కూలగొట్టుకుని - రెండు జర్మనీలు కలిసిపోయాయి. అమెరికాని సయితం శాసించగలిగిన స్థాయికి ఎదిగిన సోవియెట్ యూనియన్ - అంగ, వంగ, కళింగ దేశాల మాదిరిగా విచ్చిన్నమయింది.

కాబట్టి - చరిత్ర నుంచి నేర్చుకున్నవారు - చరిత్ర హీనులు కాలేరు. మనసులూ - మనుషులూ కలుషితం కావడం ఏ సమాజానికి క్షేమకరం కాదు. విడీపోయినా చేతులు కలిసే వుండాలి. మనసులు మసి బారకుండా ఉండాలి .
సర్వేజనాః సుఖినోభవంతు!
(మే - 2008 )

తెలంగాణా గురి మళ్ళీ తప్పుతోందా ? - భండారు శ్రీనివాసరావు

తెలంగాణా గురి మళ్ళీ తప్పుతోందా ? 

ద్రోణాచార్యుడు కురు, పాండు కుమారులకు విలు విద్య పోటీ పెట్టాడు. చెట్టుపై పిట్టబొమ్మను పెట్టి పిట్ట కంటిని గురిపెట్టి కొట్టమన్నాడు. ముందుగా ధుర్యోధనాదులను పిలిచి బాణం ఎక్కుపెట్టి ఏం కనపడుతున్నదో చెప్పమన్నాడు.`చెట్టు చెట్టు కొమ్మలు కొమ్మలనడుమ పిట్టబొమ్మ కనపడుతున్నాయని' వారు సమాధానం చెప్పారు.

ద్రోణుడు అర్జునుని పిలిచి అదే ప్రశ్న అడిగాడు. `పిట్ట కన్ను మాత్రమే కనపడుతోందని' కిరీటి జవాబిచ్చాడు. లక్ష్యం పట్ల గురి ఎలా ఉండాలో తెలియ చెప్పడానికి ఈ కథ చెప్పేవాళ్ళు. అంటే లక్ష్య సాధనకు ఏకాగ్రత కావాలి. సాధించాల్సింది తప్ప మరో దానిపై మనసు మరల్చరాదు, అన్నది ఈ కథలోని నీతి. కానీ `తెలంగాణా రాష్ట్ర సాధన అనే ఉద్యమం ఏ మలుపు తిరుగుతోంది? `తెలంగాణా నా ప్రాణం తెలంగాణా రాష్ట్ర సాధనే నా ధ్యేయం' అనే నినాదంతో ఆవిర్భవించిన తెలంగాణా రాష్ట్ర సమితి అధ్యక్షుడైన చంద్రశేఖరరావు నోట `మహా కూటమితో కాంగ్రెస్‌ ఓటమి' అనే మాట ఎలా వచ్చింది? అంటే తెలంగాణా సాధన అన్న ప్రధాన లక్ష్యాన్ని కాంగ్రెస్‌ ఓటమి అనే ఉమ్మడి ధ్యేయం వెనక్కు నెట్టి వేసిందని అనుకోవాలా? కూటమిలోని మిగిలిన పార్టీలకు కాంగ్రెస్‌ ఓటమి ప్రధాన ధ్యేయం కావడానికి తప్పుపట్టాల్సింది ఏమీలేదు. కానీ తెలంగాణా అన్న ఏకైక లక్ష్యంతో ఏర్పాటైన తెలంగాణా రాష్ట్ర సమితి చేస్తున్నదేమిటి.

మహా కూటమిలోని మిగిలిన పార్టీల విషయం వేరు తెరాస పరిస్థితి వేరు. మహాకూటమో, మెగా కూటమో ఏదో ఒక కూటమి అవసరం వారి వారి రాజకీయ అవసరాల కోణం నుంచి చూస్తే ఒక తక్షణావసరం కావచ్చు కానీ, తెరాస దాని తీరు మార్చుకోకపోయినా, ప్రాధాన్యతల క్రమం మార్చుకోవడాన్ని తెలంగాణా అభిమానులు ఎలా జీర్ణించుకుంటారో అన్నది భవిష్యత్‌ తేలుస్తుంది.

సామ , దాన, భేద, దండోపాయాలతోనైనా సరే కార్యాన్ని సాధించాలనే సూత్రం తెలంగాణా సాధన లక్ష్యసాధనకు అన్వయింపచేయాలని చూడడం తగని పని. తెలంగాణా ప్రాంతంలోని అధిక సంఖ్యాకులకు ప్రత్యేకరాష్ట్రం పట్ల మక్కువ లేదన్న సంకేతాలను పంపే ప్రమాదం ఈ కూటములవల్ల కలిగే అవకాశం ఉంది. బహుశా, తెరాస నేతకు కూడా ఈ అంశం బోధపడే, `మహా కూటమితో కాంగ్రెస్‌ ఓటమి' అనేనినాదంతో అంతరంగాన్ని అవిష్కరించి ఉంటారు.

ఈ రోజున నిజానికి తెలంగాణా ఊసెత్తని పార్టీ అంటూ రాష్ట్రంలో కలికానికి కూడా కానరాదు. కానీ నాలుక తెలంగాణా అంటున్నా మనసులో మర్మం మరోటి ఉందన్న అనుమానం అందరికీ ఉంది. వేరే ఉద్దేశ్యాలను మనసులో ఉంచుకుని తెలంగాణా నామజపం చేసేవాళ్ల వల్లే తెలంగాణాకు ఎక్కువ ముప్పు పొంచి ఉంది. తెలంగాణా మేధావులు కూడా ఈ విషయంలో పెదవి విప్పకపోవడం విషాదకరం.

తెలంగాణా వాదులకూ, తెలంగాణా పేరుతో పబ్బం గడుపుకోవాలని చూసే తెలంగాణా రాజకీయ వాదులకూ నడుమ ఎంతో అంతరం ఉంది. 1969 నుంచి జరుగుతున్నది ఇదే. మహా కూటమి ఏర్పాటుతో ఇది పునరావృతం అయ్యే అవకాశాలు పెరిగాయి. అన్ని జండాలు కలుపుకుని రాజశేఖరరెడ్డిని గద్దె దింపాలన్న ఒకే ఒక ఎజెండాతో ముందుకు సాగే ఈ కూటమి కలలు ఫలించి కాంగ్రెస్‌ ఓటమి పాలయినా తెలంగాణా వస్తుందన్న గ్యారంటీ లేదు. కాంగ్రెస్‌ పరాజయం వల్ల మహా కూటమిలోని ఇతర పార్టీలకు లబ్ది చేకూరవచ్చునేమో కానీ, తెలంగాణా రాష్ర్ట సమితికి అదనంగా ఒకటో అరో సీట్లు పెరగడం మినహా ప్రత్యేక రాష్ట్ర ఆవిర్భావ లక్ష్య దిశగా వొరిగేదేమీ ఉండదు. కాంగ్రెస్‌ ప్రజా వ్యతిరేక పాలనపై మడమ తిప్పని పోరాటం చేయాలని తామంతా కలసి ప్రతిజ్ఞ చేశామని చంద్రశేఖర రావు చెప్పడాన్ని బట్టి చూస్తే ప్రత్యేక రాష్ట్ర లక్ష్యానికి ఎడం జరుగుతున్నట్లు ఎవరికైనా అనిపిస్తే అందుకు ఆయన అభ్యంతరం పెట్టకూడదు. మరోసారి మోసపోవడమే తెలంగాణాను నిజంగా కోరుకునే వారికి మిగిలిందా అని అనిపిస్తే కూడా తప్పు పట్టాల్సిన పనిలేదు. ఎవరు శ్రేయోభిలాషులు అన్నది తెలంగాణా వారే అర్ధంచేసుకుని ఆదరించాల్సి ఉంది. మరోసారి తప్పటడుగు పడితే కాలు కూడదీసుకోవడానికి కూడా వీలుండదు. ( ఫిబ్రవరి - 2009 )

మరో ఉచితం - వార్త - వ్యాఖ్య

మరో ఉచితం
వార్త - వ్యాఖ్య (భండారు శ్రీనివాసరావు )

ముగింపు ఇంతకంటే గొప్పగా, హుందాగా వుంటుందని " శాశనసభ సమావేశాల తీరు తెన్నులపట్ల అవగాహన వున్నవారు ఎవ్వరూ అనుకోరు. ఏమయితేనేం " 12 వ శాశనసభ ఆఖరి సమావేశాలు " "గతకాలము మేలు" అన్న చందంలోనే ముగిశాయి. సభ జరిగింది కొద్ది రోజులే అయినా, ఏనాడూ ఎజెండా ప్రకారం కార్యక్రమాలు సాగిన దాఖాలా లేదు. ఆరోపణలు, ప్రత్యారోపణలతో చర్చలు పక్కదారి పట్టడం మినహా పక్కాగా సాగిన సందర్భంలేదు. సభా సమయాన్ని "సొంతానికి" వాడుకోవడంలో ఈ పార్టీ " ఆ పార్టీ అన్న తేడా లేకుండా, అన్ని పార్టీలు పోటి పడ్డాయి. వాటి దృష్టిలో "దుర్వినియోగం" అన్న ప్రసక్తే లేదు. ప్రత్యక్ష ప్రసారాల పుణ్యమా అని " ప్రజల దృష్టిని ఆకర్షించేందుకు చేయాల్సినవన్నీ చేసి చూపించాయి. రాజకీయ లబ్ధి కోణం నుంచే ప్రసంగాలు సాగాయి. చర్చలు జరిగాయి. విమర్శలు వెల్లువెత్తాయి. ఆరోపణలు హోరెత్తాయి. సంభాషణలు శృతిమించాయి. అసలు ఎజెండా పక్కకు తొలిగింది. రాజకీయ ఎజెండా లెక్కకు మిగిలింది.
చట్టసభల వ్యవహారం "యూపీ" నుంచి "ఏపీ" దాకా ఇదే తంతు. ఇతర రాష్ట్రాలతో పోల్చుకుని మనమే నయమని మనకు మనమే కితాబు ఇచ్చుకోవాలో లేక " ఒక అయ్యదేవర, ఒక పుచ్చలపల్లి, ఒక నాగిరెడ్డి, ఒక సందీవరెడ్డి వంటి ఉద్ధండుల కాలం తలచుకుని బావురుమనాలో " అర్ధంకాని పరిస్థితి.

ఈ పరిస్థితి మరింత దిగజారి "దుస్థితి " గా మారకుండా వుండాలంటే ఏం చెయ్యాలన్నది ప్రధాన ప్రశ్న. శాసనసభ సమావేశాల ప్రత్యక్ష ప్రసారాన్ని నిలుపుచేస్తే " అడ్డగోలు ప్రవర్తనకు అడ్డుకట్ట పడుతుందన్నది ఒక సూచన. ఇందులోని మంచి చెడులపై విశ్లేషణలు కూడా మొదలయ్యాయి. యనమల రామకృష్ణుడు అసెంబ్లీ స్పీకర్ గా వున్న కాలంలో ఈ ప్రత్యక్ష ప్రసారాలకు అనుమతి లభించింది. ఆనాడు వున్న టెలివిజన్ ఛానళ్ల సంఖ్య పరిమితం కావడం వల్ల " ఫలితాలనూ, దుష్ఫలితాలనూ వెనువెంటనే బేరీజు వేయడం జరగలేదు. పైపెచ్చు తొలిరోజుల్లో " ఈ ప్రయోగం సప్ఫలితాలను ఇచ్చిన విషయం కూడా మరచిపోకూడదు. ప్రజా సమస్యలను ప్రజాప్రతినిధులు సభలో లేవనెత్తడం ద్వారా ఆయా ప్రాంతాల ప్రజల మన్నననూ, విశ్వాసాన్నీ పెంపొందింపచేసుకోవడానికి ఈ ప్రసారాలు ఉపయోగపడ్డాయి.

కానీ క్రమేణా ఈ ప్రత్యక్ష ప్రసారాల తీరుతెన్నులు మారిపోయాయి. సభ సజావుగా జరుగుతున్నప్పుడు, ప్రజా సమస్యలపై చర్చ ప్రశాంతంగా సాగుతున్నప్పుడు " అనేక ఛానళ్లు ప్రసారాలను నిలిపివేసి. రొటీన్ కార్యక్రమాలను చూపిస్తూ వుండడంతో సంచలనం ఒక్కటే ఛానళ్లను ఆకర్షించే మార్గంగా ఎంచుకోవాల్సిన దుస్థితి దాపురించింది. పేపర్లు చింపడం, ప్లకార్డులు ప్రదర్శించడంతో ప్రారంభమై " స్పీకర్ పోడియంని ముట్టడించడం, మైకులు విరవడం వరకూ ఈ సంచలనాత్మక ధోరణి పెచ్చరిల్లింది. సస్పెన్షన్‌కు గురైన వారిని మార్షల్స్ మోసుకుపోవడం అన్నది ఈ ప్రత్యక్ష ప్రసారాలతోనే మొదలయిందని శాసనసభ వ్యవహారాలను కవర్‌చేసే ఏ సీనియర్ జర్నలిస్టుని అడిగినా చెబుతారు. ప్రత్యక్ష ప్రసారాల ద్వారా " తాము ఎన్నుకున్న ప్రతినిధుల ప్రవర్తనని అంచనా వేసుకునే అవకాశం ఓటర్లకి లభిస్తుందన్న వాదన సబబైనదే. కానీ ప్రజాస్వామ్యాన్నే ఈసడించుకునే స్థితికి ప్రజలు చేరుకోవడం కూడా అభిలషణీయం కాదు. ప్రత్యక్ష ప్రసారాల వల్ల నిజానికి జరుగుతున్నదిదే! సంచలనాలకు పెద్దపీట వేసే విధానాన్ని ఛానళ్లు కొంతమేరకయినా సడలించుకోగలిగితే " ఇక పేచీ ఏమీ లేదు.

కానీ, అంతమాత్రంతో సమస్య పరిష్కారం అవుతుందనుకోలేము. ఎందుకంటే సభలో మాట్లాడినదానికి, మాట్లాడనిదానికి మరికొంత జోడించి చెప్పడానికి సభా ప్రాంగణంలోనే ప్రత్యక్ష ప్రసారాలను నిలుపు చేయడంలో లేదు. ఏది, ఎంతమేరకు ప్రసారం చేయాలనే మీడియా విధానంలో వుంది. అంటే స్వీయ నియంత్రణ ద్వారా పరిస్థితిని మెరుగుపరచడానికి వీలుంది. కానీ, సర్వం వ్యాపారమయమయిపోయి " విలువలకన్నా రేటింగులకు ప్రాధాన్యం ఇచ్చే పోటీ యుగంలో ఈ స్వీయ నియంత్రణ మంత్రం వల్ల ఏ పాటి ప్రయోజనం సిద్ధిస్తుందో అంత అర్థం చేసుకోలేని విషయమేమీ కాదు.
భరించగలిగినంతవరకూ భరిస్తూ- ఉచిత వినోదమని సరిపెట్టుకుంటూ ఆనందించడమే ఇక జనాలకు మిగిలింది.

వార్తా - వ్యాఖ్య - ఓటరు ఓడిపోకూడదు

వార్త  - వ్యాఖ్య - ఓటరు ఓడిపోకూడదు
- భండారు శ్రీనివాసరావు

రాష్ట్ర ఎన్నికల ప్రక్రియలో ప్రధానమైన అధ్యాయం ముగిసింది. గౌరవనీయులైన ఓటర్లు పవిత్రమైన ఓటు హక్కుని వినియోగించుకుని తమ నిర్ణయాన్ని ఓటింగ్ యంత్రాల్లో నిక్షిప్తం చేసి తప్పుకున్నారు. గర చాలా రోజులుగా రాష్ట్రం మొత్తాన్ని తమ ప్రచార భేరీతో అట్టుడికించిన రాజకీయ పార్టీల అగ్రనాయకులు వేసవి విడిదుల్లో అలుపుతీర్చుకునే పనిలో పడ్డారు. ద్వితీయ శ్రేణి నాయకులు పోలింగ్ బూత్ ల వారీగా పోలయిన ఓట్ల లెక్కలు తీస్తూ - గెలుపోటములను బేరీజు వేసే కార్యక్రమంలో బిజీగా ఉన్నారు. అయిన జమాఖర్చులను అభ్యర్ధులు ఆరా తీస్తుంటే వారి అనుచరగణం బాకీ పడ్ద పద్దుల్ని బేబాకీ చేసే పనిలో మునిగితేలుతున్నారు. ఎన్నికల పుణ్యమా అని, కార్యక్రమాలకు కొరతలేకుండా ప్రసారాలు సాగించిన ఇరవైనాలుగుగంటలు టీవీ ఛానళ్లు - ఫలితాల గురించి అంచనాలు, అంచనాల గురించిన విశ్లేషణలు గుప్పించేందుకు ఏగూటి చిలకలతో ఆ గూటి పాటలు పాడించే పనిలో తలమునకలుగా వున్నాయి.

రెండో దశ పోలింగ్ ముగిసిన తర్వాత లోక్ సత్తా నాయకుడు జయప్రకాశ్ నారాయణ్ ప్రచారపర్వంలో పత్రికల తీరుతెన్నులపై ’సత్యాగ్రహాన్ని’ వ్యక్తం చేశారు. ఆయన విమర్శలకు ప్రాతిపదిక లేకపోలేదు. ప్రజాస్వామ్యానికి పత్రికలు పట్టుకొమ్మలు అని గొప్పలు చెప్పుకునే పత్రికా యాజమాన్యాలు - ఆయన పలుకుల్లోని తీవ్రతను అర్ధం చేసుకుని వక్రమార్గం పట్టిన విధానాలను సరిదిద్దుకోవాలి. లేకపోతే - ’పత్రికలన్నీ’ (ప్రతులన్నీ) అమ్ముడుపోయాయి అని ఘనంగా చెప్పుకునే స్థితి నుంచి, పత్రికలే అమ్ముడు పోయాయి అనే దారుణమైన అపప్రధను మూటగట్టుకోవాల్సి వస్తుంది.

’రోజులు దుర్భరంగా గడపడం - ఈ పూట ఎలా గడుస్తుందని మధనపడడం’ ఈ దేశంలో సామాన్యుడనేవాడికి పుట్టుకతో సిద్ధించే స్థితి. వచ్చేనెల 16వ తేదీ వరకూ ఆయా రాజకీయ పక్షాలన్నింటికీ ఈ మానసిక స్థ్తితి అయాచితంగా లభిస్తోంది. గెలుపుమీద నిబ్బరం ప్రదర్సించడం. విజయంపై ఎనలేని ధీమాను వ్యక్తం చేయడంలాంటివి జనం కోసం చేస్తూ వున్నా - అంతరాంతరాల్లో ఎక్కడో కనబడని భీతి, నిజంగా గెలుస్తామా? అన్న అనుమానం, ఓడిపోతామేమోనన్న ఆందోళన అన్ని పార్టీలనూ పట్టి పీడిస్తూ వుండడం అన్నది ఈ ఎన్నికల్లోని కొత్తకోణం.

ఏదీ ఏమైనా 2009 ఎన్నికలు కొత్త నేపథ్యంలో జరిగాయి. గతంలో ఎన్నడూ లేనంతగా ఓటు హక్కు గురించి ప్రజల్లో అవగాహన పెరిగింది. ఇందులో మీడియా పాత్ర అభినందనీయం! ఓటరు గుర్తింపు కార్డుల జారీలో ఎన్నో అవకతవకలు జరిగాయన్న అరోపణలు వున్నప్పటికీ - ఈ కార్డు సంపాదించుకోవడానికి జనం స్వచ్చందంగా పోటీ పడ్దారు. ఈ ప్రక్రియను సులభరతం చేయడానికి రాష్ట్ర ఎన్నికల సంఘం చేసిన ఏర్పాట్లు అమోఘంగా పనిచేశాయి కొత్తగా ఓటరు కార్డు పోందిన యువతీయువకులు పాస్ పోర్ట్ దొరికినంతగా సంబరపడిపోయి మొట్టమొడటిసారి ఓటు హక్కు వినియోగించుకోవడంలో వున్న ఆనందాన్ని ఆస్వాదించారు. సహజంగా రాజకీయాలంటే ఏహ్యత కలిగి వుండే వయస్సులో వున్న ఈ కొత్త ఓటర్లు ఎవరి పుట్టి ముంచుతారో అన్న సరికొత్త భయం పార్టీలకు పట్టుకుంది. పోలింగ్ ముగియగానే ఎదుటి పక్షం అక్రమాలకు తలపడిందని ఆరోపిస్తూ రీపోలింగ్ జరపాలని డిమాండ్ చేయడం ఆనవాయితీగా వస్తోంది. ఈ సారి ఇందుకు భిన్నంగా, ఎన్నికల సంఘం తనంతటతాను గానే విచారణ జరిపి రీపోలింగ్ జరపడం విశేషం. ప్రచారంలో హోరెత్తిన అవేశకావేశాలను పరిగణలోకి తీసుకుంటే పోలింగ్ ప్రశాంతంగా ముగిసిందనే చెప్పాలి.మద్యం, ధనం విచ్చలవిడిగా పంపకం జరిగాయన్న ఆరోపణలు ఉన్నప్పటికీ ఈసారి దానికి అడ్డుకట్ట వేయడం జరిగిందన్న సంకేతాలను పంపడంలో యంత్రాంగం సఫలమైంది. సక్రమంగా ఎన్నికలను నిర్వహించడంలో ఎన్నికల కమీషన్ ఘోరంగా విఫలమైంది. ఏ పర్టీ కూడా విమర్సించకపోవడం కూడా ఈ సారి కొత్త సంగతి. రాజకీయపార్టీల గెలుపోటములు తేలడానికి ఇంకా మూడు వారాలకు పైగా వ్యవధి వున్నప్పటికీ - విధుల నిర్వహణలో - ఎన్నికల కమీషనర్ ఐ వి సుబ్బారావు. డీ జీ పీ మహంతి ఇప్పటికే విజయాలను మూటకట్టుకున్నారు. నిజానికి ఈ ఎన్నికల్లో తొలి విజేతలు వీరిద్దరే!

ప్రజాస్వామ్య పునాదులను మరింత పటిష్టం చేసే దిశగా సాగించే కృషిలో ఎన్నికల నిర్వహణ ప్రధానపాత్ర పోషిస్తోంది.అనుభవాల ఆధారంగా దాన్ని మరింత మెరుగు పరుచుకునే విధంగా కొత్త పాఠాలు నేర్చుకోవాలి.

ఆటోమేటిక్ ఓటింగ్ మిషన్లను ప్రవేశ పెట్టి. ఎలాంటి అవకతవకలకు ఆస్కారం లేకుండా, ఓటింగ్, కౌంటింగ్ ప్రక్రియలను సులభతరం, వేగవంతం చేసిన విధంగానే అందుబాటులోకి వచ్చిన ఆధునిక టెక్నాలజీని ఎన్నికల నిర్వహణ కోసం సమర్గవంతంగా ఉపయోగించుకునే అంశాన్ని లోతుగా పరిశీలించాలి. ఎన్నికలు జరిగే కాలానికి మాత్రమే ఎన్నికల కమీషన్ పాత్రను పరిమితం చేయకుండా పూర్తికాలం పనిచేసేలా తగిన సాధన, సంపత్తులు కలిగిన విశేషాధికార స్వరంత్ర శాశ్వత వ్యవస్థగా దానికి ప్రతిపత్తి కల్పించాలి.

ఏక పార్టీ పాలనకు కాలం చెల్లి, సంకీర్ణ ప్రభుత్వాలనేవి రాజకీయాల్లో సాధారణ అంశంగా మారి, ఏ ప్రభుత్వం కూడా పూర్తికాలం మనుగడ సాగించడం అనేది ప్రశ్నార్థకంగా తయారై - దేశంలో ఏదో ఒక రాష్టంలో ఎప్పుడైనా ఎన్నికలు జరిగే వీలున్న ప్రస్తుత పరిస్థితుల్లో - ఎన్నికల నిర్వహణకు శాశ్వత యంత్రాంగాన్ని నిర్మించాల్సిన ఆవశ్యకత పెరిగింది. ఎన్నికల తరుణంలో ప్రభుత్వంతో ప్రమేయంలేని సొంత యంత్రాంగాన్ని ఎన్నికల సంఘం శాశ్వత ప్రాతిపదికన ఏర్పాటు చేసుకోవాలి. ప్రజాస్వామ్యం అనే విలువైన వ్యవస్థను కాపాడుకోవడానికి ఈ మాత్రం ఖర్చు భరించలేనిదేమీ కాదు.

ఓటర్ల కొనసాగాలి. కొత్త్త ఓటర్ల నమేదుకు తీసుకునే శ్రద్ధను - మరణించిన లేదా వేరే ప్రాంతాలకు మకాం మార్చిన ఓటర్ల పేర్లను జాబితాల నుంచి తొలగించే పనిలోనూ కనబర్చాలి. ఓటర్ల కులాల వివరాలను నియోజక వర్గాల వారీగా బహిరంగపరిచే పద్దతులను నిషేధించాలి.

శాంతి భద్రతల పరిరక్షణ బాధ్యత పోలింగ్ ముగియటంతోనే తీరిపోదు. రోగికి శస్త్ర చికిత్స జయప్రదం కావడం అన్నది- ఆపరేషన్ తరువాత తీసుకునే శ్రద్ధపై ఆధారపడి ఉన్నట్టే - పోలింగ్ ముగిసిన తరువాత కూడా పోలీసులు పరిస్థితులను కనిపెట్టి చూడాలి. ఏమరుపాటు పనికిరాదు. పోలింగ్ అనంతరం జరిగిన తాడిపత్రి సంఘటనలు ఈ అవసరాన్ని నొక్కి చెబుతున్నాయి.

ఎన్నికలంటే ’కలవారు’మాత్రమే ఆడుకునే ఆట కాకుండా-ఎన్నికలంటే కులాలవారీగా కొట్లాడుకునే పోట్లాట కాకుండా ఎన్నికలంటే డబ్బూ దస్కం, మనీ మధ్యంతో కూడుకున్న వ్యవహారం కాకుండా-

చూడగలిగే చేయగల్లిగే సంస్కరణలు కావాలి!
ఆ సంస్కరణలను అమల్లోకి తేగలిగే రోజులు రావాలి!
ఆ మంచి రోజుల కోసం ఎదురుచూడాలి!
ఎన్నికల్లో పార్టీలు ఓడిపోవచ్చు.
కానీ ఓటరు ఓడిపోకూడదు.

(ఏప్రిల్ - 2009)

వార్తా-వ్యాఖ్య - ‘ఓటరు ఓడిపోలేదు’

  ఓటరు ఓడిపోలేదు
- భండారు శ్రీనివాస రావు

ఎన్ని ప్రలోభాలు చూపినా..
ఎన్నెన్ని రకాలుగానో ఓటరు నిర్ణయాన్ని ప్రభావితం చేసే ప్రయత్నాలు జరిగినా - దాదాపు రెండు మాసాలకు పైగా వ్యాఖ్యలలాంటి వార్తలతో, సమాచారం పేరుతొ ప్రచారం చేస్తూ మీడియా హోరెత్తించినా-
ఓటరు ఓడిపోలేదు!

పైపెచ్చు విశ్వసనీయతకు పట్టం కట్టారు. ఈ ఎన్నికల్లో గెలిచిన వాళ్లు ఎంతోమంది వుండవచ్చు కానీ వాస్తవంగా గెలిచింది సాధారణ ఓటరు మాత్రమే! కానీ, ఓడిపోయిన వారి జాబితా చాంతాడంత వుంది.

ఇందులో మంత్రులుగా అధికారం చలాయించిన వాళ్లు - ప్రతి పక్షంలో వుండి అయిన దానికీ, కాని దానికీ ప్రభుత్వాన్ని చేటలతో చెరిగిన వాళ్లు ఎంతో మంది వున్నారు.

అయితే, నిజానికి ఓడిపోయింది వీళ్లు కాదు. ఉనికి కోసమో, ఉనికిని నిలబెట్టుకోవడం కోసమో, ఉనికిని చాటుకోవడం కోసమో పాత్రికేయ విలువలకు నిలువు పాతర వేసిన మీడియా ఓడిపోయింది.

రాజకీయ పక్షాలు పరస్పరం విమర్శించుకోవడం వాటి తప్పుకాదు. ఎన్నికల పోరాట క్రమంలో హద్దులు దాటి వుండవచ్చు. మాటల్లో , చేతల్లో సభ్యత, సంస్కారంపాలు తగ్గి వెగటు పుట్టేలా వాటి ప్రవర్తన వుండి వుండవచ్చు.

కానీ - వాటిని ఎత్తి చూపి, సరిదిద్దడానికి దోహదం చేసే సలహాలు, సూచనలు ఇవ్వాల్సిన పవిత్ర బాధ్యతను విస్మరించి, రాజకీయ పార్టీలకు కొమ్ముకాస్తూ, తమ మనసులోని మాటల్ని మేధావుల విశ్లేషణలుగా ప్రచురించి, ప్రసారం చేసిన మీడియా ఈ ఎన్నికల్లో చిత్తుగా ఓడిపోయింది!
ఓడిపోయిన రాజకీయపక్షాలు వాటి మనుగడ కోసం ఎలాగూ ఆత్మ విమర్శ చేసుకుంటాయి.
ఆ పాట్లు వాటికి ఎలాగూ తప్పవు.
కానీ, మీడియా మాట ఏమిటి?
( మే - 2009 )

మాట్లాడడం అంటే మాటలు కాదు.

మాట్లాడడం అంటే మాటలు కాదు
-భండారు శ్రీనివాసరావు


నిజానికి అరవై నాలుగు కళల్లో ఇది ఒకటి.ఇది నిజమో కాదో తెలియకపోయినా ఇలాంటి స్టేట్మెంట్లని అలవోకగా, ఘంటాపధంగా ఇవ్వగల కళలో ఆరితేరినవరే గట్టి వక్తలుగా పేరు తెచ్చుకోగలుగుతారు. పెళ్ళిళ్ళల్లో -పబ్బాల్లో నలుగుర్ని చేరదీసి- అంతకు ముందు అందరూ చదివేసిన పేపర్లలోని వార్తలూ, విశేషాలూ అన్నీ తనకే ముందు తెలిసినట్టుగా రంగులద్ది చెప్పడం ఇంకో కళ. దీన్నే సంభాషణా చాతుర్యం అని కూడా అందురు. ఐతే, ఈ కళ ద్వారా ఆకట్టుకోగల శ్రోతల సంఖ్య పరిమితం. రాగల పేరూ, ప్రఖ్యాతలు కూడా ఆ పాళ్ళలోనే వుంటాయి. వేదికలెక్కి ఉపన్యాసాలు దంచగల స్ఠాయికి ఎదగగలిగితే అభిమానుల సంగతి అటుంచి ఎదో కొంత గిట్టుబాటుగా కూడా వుంటుంది. సభా నిర్వాహకులు సయితం తమ తమ విభవాన్నిబట్టి చదివించుకుంటూ వుంటారు. సాధారణంగా అవార్డులూ-సత్కారాలకు సంబంధించిన కార్యక్రమాల్లో ఈ రకం వక్తలకు కొంత గిరాకీ వుంటుంది. పొగడడం మినహా మరో అంశానికి ప్రాధాన్యం వుండదు కాబట్టి మాట్లాడడం కూడా అంత శ్రమ అనిపించదు. అవార్దులు తీసుకునేవారూ, ప్రేక్షకులూ ప్రతిసారి మారిపోతుంటారు కావున ప్రసంగాల్లో పునరుక్తి దోషాలు ఎన్ని దొర్లినా ఎలాంటి ఇబ్బంది ఇసుమంత కూడా వుండదు. అతిశయోక్తులు దట్టించి ఎలా పొగడాలో తెలుసుకోవడానికి ప్రత్యేక శిక్షణా తరగతుల అవసరమే లేదు. ప్రోగ్రాం కంపీర్ అనో, వ్యాఖ్యాత అనో ఎదో ఒక పేరుతో మైకు ముందు నిలబడే శాల్తీ- సభకు వచ్చిన అతిధుల్నీ, అభ్యాగతుల్నీ(శ్రోతల్నీ) అదే పనిగా ఎలా పొగుడుతున్నారో కొద్దిగా గమనిస్తే చాలు సరిపోతుంది.
ఈ మధ్య ఒక సభకు వెళ్ళాను. బయట బాగా ఎండగా వుండడం వల్ల, సభా మందిరం ఏసీ హాలు కావడం వల్లా లోపల జనం నిండుగానే వున్నారు. భజంత్రీల్లో ఎవరో రాకపోవడంతో నన్ను మాట్లాడమన్నారు. ససేమిరా అన్నాను. ఒక్కసారి స్టేజి ఎక్కి మాట్లాడడం మొదలు పెడితే ఆ మత్తులో పడిపోతానేమోనని భయం. పైగా మొగమాటాలకు పోయి అనేక సభలకి హాజరైన అనుభవం వుంది. వేదికమీద వున్న, సారీ- వేదికను అలంకరించిన- ఇంకో సారి సారీ- (రంగురంగుల పూలతో, కాగితాలతో వేదికను అలంకరించినవారని అర్థం కాదు) పదిమందో, పదహారు మందో- ఒక్కొక్కరుగా లేచి తమ ప్రసంగం ప్రారంభించినప్పుడల్లా - వేదిక మీద వున్న మిగిలినవారిని పేరు పేరునా స్మరించడం-పనిలో పనిగా పొగుడుకోవడం గమనిస్తే చిర్రెత్తుకొస్తుంది. ఈ పరస్పర కుచమర్ధనాలకే సగం సమయం గడిచిపోతుంది. దండలు, పుష్పగుచ్చాలు, శాలువలు అందించేవారి పేర్లూ, అందుకుంటున్నవారి పేర్లూ - ఎలా సహస్రనామార్చన కొనసాగుతుంది.

ఈ కార్యక్రమంలో వీలైనంతమందికి వీలు కల్పించడంవల్ల సభ హాజరుకి మినిమం గ్యారంటీ వుంటుంది. ఈలోగా ప్రధమ తాంబూలం, లేదా ప్రధాన సత్కారం అందుకోవడానికి అన్నిరకాలుగా అన్నీ సమర్పించుకున్న శాల్తీ వేదిక మీదనే విలవిలలాడిపోతుంటాడు. కవర్ చేయడానికి వచ్చిన స్థానిక విలేకరులు తన సన్మాన కార్యక్రమాన్ని కవర్ చేయకుండానే మరో "గిఫ్టుబాటు" కార్యక్రమానికి వెళ్ళిపోతారేమోనని విలేకరుల గ్యాలరీ వైపు పిచ్చి చూపులు చూస్తూ దొంగ దండాలు పెడుతుంటాడు. ఎద్దు పుండు కాకికి రుచి అన్న సామెత మాదిరిగా నిర్వాహకులకు మాత్రం ఇదేమీ పట్టదు. అతిధులు, విశిష్ట అతిధులు, పరమ విశిష్ట అతిధులతో పాటు అతిధి ఆఫ్ ది డే - అతిధి ఆఫ్ ది ఇయర్తోటే వారికి గడిచిపోతుంటుంది. తెచ్చిన శాలువాలు, కప్పాల్సిన భుజాలు లెక్క పెట్టుకుంటూ వాళ్ళు కాలక్షేపం చేస్తుంటారు. వక్తలు కూడా ఎవరికి వారు తమ ప్రసంగం పూర్తి కాగానే ఒకరి వెంట మరొకరు - కారణం చెప్పో చెప్పకుండానో వేదిక మీద నుంచి నిష్క్రమిస్తుంటారు. రైలుకో, బస్సుకో పోదామని బయలుదేరి మధ్యలో దొరికిన టైములో కాలక్షేపం కొసం శ్రోతల అవతారాలెత్తినవాళ్ళు కూడా ఆవులించుకుంటూ లేచి నిలబడి చేతి వాచీలవైపు, నిర్గమన ద్వారాల వైపు చూస్తుంటారు. ఇవన్నీ చూస్తూ నిర్వాహకులు - ఆనాటి "వ్యయ ప్రదాత"ను పిలిచి, తమకు జరిగిన ఈ అపూర్వ సన్మానానికి ముక్తసరిగా మూడు ముక్కల్లో ఉచిత రీతిన ధన్యవాదాలు తెలపాల్సిందిగా మనవి చేసుకుంటారు.

ఇదొక్కటే మొత్తం కాంట్రాక్టులో ఉచితంగా దొరికిన అవకాశంగా పరిగణించిన సదరు శాల్తీ - అలవాటులేని ప్రసంగాన్ని అధాటుగా ప్రారంభించి మధ్యలో దారితప్పి -అవాకులు, చవాకులతో శ్రోతల సహనాన్ని పరీక్షించే సమయంలో- సభా నిర్వహణ విధి విధానాలను "స్కాచి" వడబోసిన నిర్వాహకులు సత్కార కార్యక్రమాన్ని హడావిడిగా ముగించి సభకి మంగళం పాడతారు. కరిగిన సొమ్ముకూ, జరిగిన సన్మానానికీ బేరీజు వేసుకుంటూ బేజారైన గుండెతో సత్కార గ్రహీత ఇంటిదారి పడతాడు. నిర్వాహకులు విందు చేసుకుంటూ మరో "బఖరా" వేటలో పడతారు. (ఆగష్టు- 2008)

పత్రికలు - రాజకీయాలు (వార్త - వ్యాఖ్య) - భండారు శ్రీనివాసరావు

పత్రికలు - రాజకీయాలు (వార్త - వ్యాఖ్య)
- భండారు శ్రీనివాసరావు


హెలి కాఫ్టర్ దుర్ఘటనలో రాజశేఖర్ రెడ్డిగారు మరణించి రెండు వారాలు గడచి పోయాయి. మొదటి రెండు మూడు రోజులు- తెలుగునాట ’మీడియా’ నిర్వహించిన పాత్ర అభినందనీయం. ఇప్పుడు మీడియా అనే పదాన్ని పత్రికలకు, టెలివిజన్ ఛానెళ్ళకు అన్వయించి విస్తృతార్ధంలో వాడుతున్నారు. ఈ రెండు మాథ్యమాలు - దుర్ఘటన్ గురించిన సవివరమైన సమాచారాన్ని ప్రజలకు ఎప్పటికప్పుడు తెలియజెప్పటానికి శక్తివంచన లేకుండా పాటుపడ్డాయి. దుర్గమారణ్యంలో వాగులు, వంకలు కాలి నడకన దాటుకుంటూ వెళ్ళి - సమాచార సేకరణలో తెలుగు జర్నలిజాన్ని కొత్త పుంతలు తొక్కించాయి. స్థానిక ఛానెళ్ళు చిత్రీకరించిన దృశ్యాలనే అనేక జాతీయ, అంతర్జాతీయ ఛానెళ్ళు ఉపయోగించుకున్న తీరే ఇందుకు నిదర్శనం. ఇంతవరకు తెలుగు మిడియా నిర్వహించిన పాత్రను కొనియాడితిరవలసిందే.అయితే, క్రమేపీ రాజశేఖరరెడ్డి గారు జివించి ఉన్నప్పటి - అంటే గత రెండు మూడేళ్ళ కాలంగా జనం గమనిస్తూ వచ్చిన అంశాలే మళ్ళీ మీడియాలో చోటు చేసుకుంటూ వస్తున్నాయి. ఇది దురదృష్టకర పరిణామం.

పదవిలో ఉంటూ ఒక ముఖ్యమంత్రి చనిపోవడం అన్నది మన రాష్టానికి సంబంధించినంతవరకు ఇదే ప్రథమం. గతంలో కాంగ్రెస్ హయాంలో ముఖ్యమంత్రులను మార్చిన సందర్భాలకు, ప్రస్తుత సన్నివేశానికి హస్తి మశకాంతరం తేడా ఉంది. చనిపోయిన వ్యక్తి సాక్షాత్తూ ముఖ్యమంత్రి. అందునా రాజశేఖర రెడ్డి. వ్యక్తిత్వ శోభతో, నాయకత్వ పటిమతో, దీక్షా దక్షతలతో రాష్ట్ర కాంగ్రెస్ రాజకీయాల్లో తనదైన ముద్రవేసి పార్టీ అధిష్టానాన్ని సైతం ప్రభావితం చేసిన ప్రతిభాశాలి. ఆయన లేని లోటును ఊహించడం ఆషామాషీ వ్యవహారం కాదు. వై.ఎస్సార్ మృతితో రాష్ట్రం యావత్తూ దిగ్భ్రాంతికి గురయ్యింది. జనం చేష్టలుడిగి పోయారు. సొంత మనిషి మరణించినట్టుగా తెలుగు నాట ప్రతి ఇంటా విషాద చాయలు అలముకున్నాయి. ’వై.ఎస్సార్ ఇక లేరు’ అన్న దారుణ వార్త జీర్ణించుకోలేక దాదాపు మూడు వందలపై చిలుకు అభిమానులు, ఆపన్నులు గుండె పగిలి చనిపోవడం, ఆత్మహత్యలు చేసుకోవడం జరిగిందంటే - ఈ దుర్ఘటన ప్రజలను ఏ స్థాయిలో ఏరకంగా కలచివేసిందో తేలిగ్గా అర్ధం చేసుకోవచ్చు.
ఈ నేపథ్యంలో కాంగ్రెస్ అధిష్టానం ముందుగా తేరుకుని తక్షణ కర్తవ్యానికి నడుం బిగించింది. రాజశేఖరరెడ్డి మంత్రివర్గంలో వయసు రీత్యా అనుభవం రీత్యా అత్యంత సీనియర్ అయిన రోశయ్య గారికి ముఖ్యమంత్రిగా బాధ్యతలు అప్పగించింది.

వై.ఎస్సార్ మంత్రి మండలిలోని ఇతర మంత్రుల చేత కూడా మరోసారి ప్రమాణ స్వీకారం చేయించి అవే శాఖలు అప్పగించి ప్రభుత్వ యంత్రాంగ నిర్వహణ సజావుగా సాగిపోయేందుకు ఏర్పాటు చేసింది.

రోశయ్య గారికి సంబంధించినంతవరకు ఇది అయాచిత పదవి. ముఖ్యమంత్రిగా పదవీ స్వీకారం చేసిన తరువాత కూడా పలుకులో, నడవడికలో ఏ మాత్రం మార్పు లేదు.ఆయన తొలిసారి మంత్రి అయినపుడు ఐ.ఏ.ఎస్., ఐ.పి.ఎస్ ప్రొఫెషనర్లుగా రాష్ట్ర సర్వీసులో ప్రవేశించిన అధికారులు - ఆయన కళ్ళముందే ప్రభుత్వ ప్రధాన కార్యదర్శులుగా డీ.జీ.పీగా ఎదిగారు. రాష్ట్రస్థాయిలోను, జిల్లా స్థాయిలోనూ అధికారులను పేరుతో పిలిచి గుర్తుపట్టగల సుదీర్ఘ అనుభవం ఆయనది. పోతే ఫైళ్ళూ,ప్రోజెక్టులు, నిధులు, జమాఖర్చులు కొట్టిన పిండి. అసాధారణ శక్తితో, ప్రసంగాలతోనే ప్రత్యర్ధుల గుండెల్ని పీల్చి పిప్పిచేయగల ప్రతిభా సామర్ధ్యాలు ఆయన సొంతం.

రాజశేఖరరెడ్డి మంత్రివర్గంలో ఆర్ధిక మంత్రిగా - వై.ఎస్సార్ చేపట్టిన అనేక సంక్షేమ, అభివృద్ధి పథకాలు, ప్రాజెక్టుల గురించి రోశయ్య గారికి సంపూర్ణమైన సదవగాహన ఉంది. పైపెచ్చు వైఎస్సార్ కి అత్యంత ఆత్మీయుడు. అందుకే ముఖ్యమంత్రిగా ఆయనని ఎంపిక చేస్తూ అధిష్టానం తీసుకున్న నిర్ణయం. కాంగ్రెస్ వర్గాలను అంతగా కలవరపరచలేదు.అలాగే మంత్రుల సహాయ నిరాకరణ గురించి మీడియాలో కుప్పలు తెప్పలుగా వస్తున్న కథనాలను చూసి రోశయ్యగారు కూడా కలవర పడిన దాఖలాలు లేవు.కాబట్టే అప్పగించిన బాధ్యతలను శక్తి మేరకు నిర్వహించేందుకే ఆయన కృషి చేస్తున్నారు.
 కాగా, రాజశేఖర్ రెడ్డి గారికి నిజమైన రాజకీయ వారసుడు ఆయన కుమారుడైన జగన్ మోహన్ రెడ్డే కావాలనివై.ఎస్సార్ ని అభిమానించే వారు కోరుకోవడం అత్యంత సహజం. వై.ఎస్సార్ సంక్షేమ పథకాల వల్ల లబ్ధి పొందిన లక్షలాది మంది పేద ప్రజలు కూడా అందుకు మద్దతు పలకడం అంతే సహజం. అయితే జగన్ కు ఆశించిన రీతిలో అధిష్టానం మద్దతు దొరకడం లేదన్న విషయాన్ని గోరంతను కొండంతలుగా చేసి జనంలోకి తీసుకువెళ్లాడంలో మీడియా నిర్వహించిన పాత్రను కొందరు తప్పుపడుతున్నారు. జగన్ కు అనుకూలంగా మీడియాలోని ఒక వర్గం ఎంత గట్టిగా పనిచేస్తున్నదో, జగన్ కు వ్యతిరెకంగా మరొక వర్గం అంతే పట్టుదలతో పనిచేస్తున్నదని కాంగ్రెస్ రాజకీయాలను ఔపోసన పట్టిన సీనియర్ పాత్రికేయులు ప్రైవేటు సంభాషణల్లో పేర్కొంటున్నారు.

రాష్ట్ర కాంగ్రెస్ రాజకీయాల్లో అధిష్టానం బూచిని చూపించి ప్రత్యర్ధులను బెదిరించే సంస్కృతికి రాజశేఖర్ రెడ్డి హయాంలోనే నూకలు చెల్లిపోయాయి.ఒంటి చేత్తో కాంగ్రెస్ పార్టీకి సాధించి పెట్టిన విజయం దరిమిలా ఆయన్ని వేలెత్తి చూపగల చేవ, పన్నెత్తి ప్రశ్నించగల సత్తా పార్టీలో కొరవడింది. కాంగ్రెస్ అధ్యక్షురాలు సోనియాగాంధీ అనుసరిస్తూవస్తున్ననూతన దిశానిర్దేశనం కూడా దీనికి దొహదం చేస్తోంది.

మొదటి అయిదు సంవత్సరాల పదవీ కాలంలో అధిష్టానం వద్ద వై.ఎస్సార్ మాటే చెల్లుబడి అవుతూ వచ్చింది. దానితో రాష్ట్ర స్థాయిలో పార్టీలోని ఆయన ప్రత్యర్dహుల విమర్శలు, ఆరోపణలు ఒక స్థాయికి పరిమితం కావడం మాత్రమే కాకుండా క్రమేపీ వారి ఉనికే ప్రశ్నార్ధకంగా మారింది. రాజశేఖర రెడ్డి గారి అకాల మరణం తరువాత అసమ్మతి శక్తులు మళ్ళీ పుంజుకుంటాయని చాలామంది భావించారు. కానీ ఆయన ఆకస్మిక మృతి వల్ల రాష్ట్రవ్యాప్తంగా పెల్లుబుకిన భావోద్వేగాల నేపథ్యంలో అసమ్మతి స్వరాలు అంతరంగాలకే పరిమితం అయ్యాయి. దాంతో జగన్ ని ముఖ్యమంత్రి చేయాలన్న డిమాండ్ తప్ప జగన్ కి వ్యతిరేకంగా చేతులు కలిపి, బహిరంగంగా ముఠా కట్టి వాదం వినిపించగల వాళ్ళు లేకుండా పోయారు.

రాజశేఖర రెడ్డి మరణానంతర పరిణామాలను శ్రద్ధగా గమనిస్తున్న ప్రతి పక్షాలు కూడా పైకి పెదవి విప్పడం లేదు. ఆ పార్టీ అంతర్గత వ్యవహారాలని వాటితో తమకు సంబంధం లేదని పేర్కొంటున్నాయి. కానీ రాజశేఖర రెడ్డి మృతికి కొన్ని వారాల ముందు తమ పార్టీలను నిర్వీర్యం చేసే లక్ష్యంతో ఆపరేషన్ ఆకర్ష్హ్ ని వై.ఎస్సార్ అమలు చేస్తున్నారని

ఆయా పార్టీలు చేసిన ఆరోపణలను స్ఫురణకు తెచ్చుకుంటే కాంగ్రెస్ పార్టీలోపరిణామాల పట్ల అవి నిర్లిప్తంగా ఉంటాయనుకోలేము. అలాగని బహిరంగ వ్యాఖ్యానలకు కానీ లేదా కాంగ్రెస్ పార్టీలో ప్రస్తుత పరిణామాలను తమ రాజకియ అవసరాలకి అనుగుణంగా మార్చుకునే ప్రయత్నాలు చేస్తాయని కూడా భావించడం పొరపాటే అవుతుంది. కాకపొతే వై.ఎస్సార్ స్థానంలో ఆయన కుమారుడు జగన్ ముఖ్యమంత్రి కావడం ప్రతిపక్షాలకు ప్రధానంగా తెలుగు దేశం పార్టీకి మింగుడు పడకపోవచ్చు. రాజశేఖర్ రెడ్డి వారసుడిగా జగన్ కూడ తన తండ్రి బాటలోనే అదే విధమైన రాజకీయ ఎత్తుగడలను కొనసాగించే అవకాశం ఉంటుందని ఆ పార్టీ అంతర్లీనంగా
సందేహపడే వీలుంది.జగన్ కాకపోతే చాలు అన్న అభిప్రాయం ఆ పార్టీ శ్రేణుల్లో ఉన్నట్టు భోగట్టా.

అయితే రాజశేఖర రెడ్డి వంటి మహోన్నత వ్యక్తి మరణించిన వెంటనే ఆయన రాజకీయ వారసత్వానికి సంబంధించి రకరకాల కథనాలు, విశ్లెషణలు మీడియాలో తామర తంపరలుగా వెలువడుతూ ఉండటాన్ని సామాన్య జనం జీర్ణించుకోలేకపోతున్నారు. ఇన్ని దశాబ్దాల రాజకీయ జీవితంలో ఏనాడూ పన్నెత్తి మాట్లాడని కె.వి.పి.సైతం గాంధిభవన్ సమావేశంలో చెలరేగిన ఆవేశకావేశాలను సద్దుమణిగెలా చేసేందు ఉద్వేగంగానే కాకుండా సుదీర్ఘ్హ పోరాటం చేయడం ఒక కొసమెరుపు.

ఈ పరిణామాలను జగన్ వర్గానికి వ్యతిరేకంగా మార్చడానికి కొన్ని శక్తులు ప్రయత్నించడం సహజం. ఈ ప్రయత్నాలకు మీడియాలోని ఒక వర్గం సహకరిస్తోందన్నది తాజాగా వినిపిస్తున్న ఆరోపణ. కొన్ని పత్రికల్లో వస్తున్న కథనాలు ఇందుకు ఉదాహరణలుగా ఇ ఆరోపణలు చేస్తున్నవారు పేర్కొంటున్నారు. జగన్ కు అనుకూలంగా పార్టీ అధిష్టానానికి చెందిన ఒక సీనియర్ నాయకుడు ఉత్తరాది పత్రిక ఒక దానికిచ్చిన ఇంటర్వ్యూలోని అంశాలను యథాతథంగా తర్జుమా చేసి ప్రచురించిన ఒక తెలుగు దినపత్రిక - అలా మాట్లాడినందుకు ఆ నాయకుడిపై పార్టీ అధిష్టానం తీవ్ర ఆగ్రహాన్ని వ్యక్తం చేసిందంటూ ఆ కథనాన్ని ప్రారంభించిన వైనాన్నివారు ఉదహరిస్తున్నారు. కె.వి.పి. ఢిల్లీయాత్రల గురించీ, అధిష్టానం తీరు తెన్నుల గురించి ఊహాగానాలు చేస్తూ మీడియాలోవెలువడుతున్న కథనాలలోని నిబద్ధతను వారు ప్రశ్నిస్తున్నారు.జగన్ కాకపోతే కాంగ్రెస్ లో ఎవరైనా పర్వాలేదన్న పద్ధతిలో మీడియాలో ఒక వర్గం పనికట్టుకుని ప్రచారం చేస్తోందన్నది ఆ ఆరోపణలోని సారాంశం.రాజశేఖర రెడ్డి పత్రికలలోని విశ్వసనీయతని పదే పదే ప్రశ్నిస్తూ ప్రజల్లో తమ పత్రికల పట్ల గౌరవాదరాలు తగ్గిపోయేలా చేశాయన్న కినుకతో ఉన్నపత్రికాధిపతులే ప్రస్తుతం అందివచ్చిన అవకాశాన్ని ఇలా వాడుకుంటున్నారన్న ఆరోపణలు కూడా వారి మాటల్లో తొంగిచూస్తోంది.పత్రికల విశ్వసనీయత పట్ల రాజశేఖర్ రెడ్డి హయాంలో తలెత్తిన నీలినీడలు ఆయన అస్తమయం తర్వాత కారుమబ్బులుగా పరిణమించిడం విషాదం.

గతంలో కాంగ్రెస్ ముఖ్యమంత్రులు ఎవ్వరూ చేయలేని సాహసాన్ని - మీడియాలో ఒక వర్గంపై విమర్శలు గుప్పించడం ద్వారా రాజశేఖర రెడ్డి ప్ర్దదర్శించారు.అక్షరంపై ప్రారంభమైన దాడిగా కొందరు విశ్లేషకులు అభివర్ణించారు. అయినా వై.ఎస్సార్ తన సహజ స్వభావానికి తగ్గట్టుగానే ఏ మాత్రం వెనుకంజవేయలేదు.పైపెచ్చు తన విమర్శలకు మరింత పదును జోడించారు. పత్రికల్లో పనిచేసేవారిని, పత్రికలు నడిపే వారిని విడదీసి చూపిస్తూ పత్రికా స్వేచ్చకి తనదైన భాష్యం చెప్పారు.
ఆయన ఇప్పుడు లేరు. తిరిగి రారు. ఇది కఠోర సత్యం.

పత్రికలకు, మీడియాకి విమర్శించే హక్కు ఉంది. నిజాన్ని నిర్భయంగా చెప్పాల్సిన ధర్మం ఉంది.ఎవరికో కొమ్ము కాస్తున్నారన్న ఆరోపణలు లేశ మాత్రం కూడా తలెత్తకుండా పత్రికలను నడపాల్సిన పవిత్ర భాద్యత కూడా వారి భుజస్కంథాలపై ఉంది. ఈ బాధ్యతని సమర్ధంగా, విశ్వసనీయంగా,నిరూపిస్తున్నామని నిరూపించుకోడానికి ఇదే సరైన తరుణం.
ఒక వ్యక్తి ముఖ్యమంత్రి లేదా ప్రధానమంత్రి కావడం వలన సమాజంలోని కొన్ని వర్గాలకు ప్రయోజనం కలగవచ్చు. లేదా ఇబ్బందులు ఎదుర్కోవాల్సి రావచ్చు.
 కానీ -
ఈ సూత్రం మీడియాకి వర్తించదు అన్న వాస్తవాన్ని అర్ధం చేసుకోవాలి.

(సెప్టెంబర్- 2009)

వార్త - వ్యాఖ్య - స్వయంకృతాపరాధాలు

వార్త - వ్యాఖ్య - స్వయంకృతాపరాధాలు
- భండారు శ్రీనివాసరావు

‘పురుషులందు పుణ్య పురుషులు వేరయా’ అన్నాడు వేమన. అలాగే - ‘విభక్తుల్లో సంబోధనా ప్రథమా విభక్తి’ తరహాయే వేరన్న భావన ఈనాడు సమాజంలో కాలవస్తున్నట్లుగా తోస్తోంది. తల్లిని ‘ఒసే’ అనడం - తండ్రిని ‘ఒరే’ అనడం ఈ మధ్య సినిమాల్లో షరా మామూలుగా మారిపోయి అదే సంస్కృతి క్రమంగా, వడి వడిగా సాధారణ జీవితాల్లోకి జొరబడుతుంది.

వెనుకటి రోజుల్లో పిల్లలు ఒకర్నొకరు సరదాగా ‘గురూ-గురూ’ అని పిల్చుకుంటూ ఉంటే విని పెద్దలు గుర్రుమనే వారు. మాట తీరుకు ఆ రోజుల్లో అంత ప్రాధాన్యం ఉండేది. ఇళ్ళల్లో మాట్లాడుకునే దానికి - బయట సంభాషించే పద్ధతికి ఎంతో వ్యత్యాసం ఉండేది.ఇంట్లో అమ్మా అని పిలిచినా బయట నలుగురిలో మాత్రం అమ్మగారూ అంటూ గౌరవంగా చెప్పుకునే వారు. ఉత్తరాలు రాసేటప్పుడు - గంగా భాగీరథీ సమానురాలైన అత్తగారికి అనో, పూజ్యులైన తాతయ్యగారికి అనో వినమ్రత కనబరిచే వారికి వినయాన్ని సంస్కారంగా, విధేయతని సభ్యతగా పరిగణించేవారు. ఒదిగి ఒదిగి ఉండడాన్ని ఆత్మన్యూనతగా కాకుండా అణుకువగా అనుకునేవారు. సభ్యతా, సంస్కారాలక్కు అదే కొలమానంగా భావించేవారు.

ఇక, పత్రికల్లో వాడే భాష, సినిమాల్లో వినిపించే సంభాషణలు, చట్టసభల్లో జరిగే చర్చలు, చాలా వరకు పరిధులకు, ప్రమాణాలకు లోబడే ఉండేవి. ప్రభుత్వ ఆధ్వర్యంలోని ఆకాశవాణి, దూరదర్శన్ ల సంగతి చెప్పనక్కర్లేదు. వాటి కార్యక్రమాలు, వార్తలు గిరి గీసుకుని, మడికట్టుకుని తయారుచేసినట్టుగా ఉండేవని గిట్టనివారు అనుకునేవారు కూడా. నిజాలను నిదానమ్గా చెబుతాయన్న నింద తప్ప - సమాజానికి కాలుష్య కారకాలుగా మారాయన్న అపప్రధని అవి ఏనాడు మోయలేదు.
కానీ, కాలం ఒక్క తీరుగా ఉండదు కదా!జనం అభిరుచులు కూడా కాలాన్ని బట్టి, తరాలను బట్టి మారిపోతుంటాఅయి. కనుకే సంబోధనా ప్రథమా విభక్తి ప్రత్యయాలకు ఈనాడు ఇంతటి ఆదరణ. అందుకే మార్పులోని మంచి చెడ్డలతో నిమిత్తం లేకుండా దాన్ని స్వీకరించడం, అమోదించడం అంతా సజావుగా సాగిపోతున్నది. ఈ మార్పుని మరింత ‘వేగవంతం’ చేయడంలో ఈనాటి ‘ఎ టూ జెడ్’ చానెళ్ళు శక్తివంచన లేకుండా శ్రమిస్తున్నాయి.

తరాలు మారుతున్నప్పుడు - వర్తమాన తరం వెనుకటి తరాన్ని చిన్నబుచ్చడం, హేళన చేయడం తరతరాలుగా వస్తోంది. పెద్దల సుద్దులను చాదస్తంగా కొట్టివేయడం మార్పుకున్న ప్రధమ లక్షణం. ఇలా మారిపోతున్న జనాల్లోనుంచే నాయకులు పుడతారు. మేథావులు పుడతారు. జర్నలిస్టులు పుడతారు. సంపాదకులు పుడతారు. కవులు - రచయితలు పుడతారు. పాఠకులు పుడతారు. శ్రోతలు పుడతారు. వీక్షకులు పుడతారు. వీళ్ళ సభ్యతా సంస్కారాల కొలబద్దలు కూడా మార్పులకి తగ్గట్టుగానే మారిపోతుంటాయి. మార్పుని అంగీకరించని మునుపటి తరం మౌనవీక్షణలో మునిగి సణుగుతుంటే - ఏది ఒప్పో, ఏది తప్పో చెప్పేవాళ్ళు లేక, చెప్పినా ఒప్పుకునే తత్త్వం లేక నవతరం ముందుకు సాగుతోంది. తరాల అంతరాల్లోనుంచి మొలకెత్తిన వెఐరుధ్యాలు, వైకల్యాల ప్రతిరూపాలే ఈనాడు సమాజంలోని అన్ని వర్గాలను ఆశ్రయించుకుని బహుముఖ రూపాల్లో బయటపడుతున్నాయి. అమ్మను ఒసే అనడం, నాన్నను ఒరే అనడం వంటి కొత్త ధోరణులను ఆవిష్కరిస్తున్నాయి. ముందే చెప్పినట్టు ఇది క్రమంగా సినిమాల నుంచి ఛానళ్ళకు, పత్రికలకు, పుస్తకాలకు, చట్టసభలకు విస్తరించి - సభ్యతా సంస్కారాలకు కొత్త భాష్యం చెబుతున్నాయి. ఈ క్రమంలో నుంచే ఆవిర్భవించిన ప్రజా ప్రతినిధులు, మేధావులు, జర్నలిస్టులు, కవులు, రచయితలు, కళాకారులు - చెప్పే మాటల్లో, ప్రవచించే పలుకుల్లో, రాసే రాతల్లో - సభ్యతా సంస్కారాల ప్రమాణాలే మారిపోతున్నాయి. ఇందుకు సజీవ సాక్ష్యాలు - ఈనాటి సినిమాలే, ఈనాటి ఛానళ్ళే ఈనాటి పత్రికలే, ఈనాతి పుస్తకాలే ఈనాటి చట్ట సభలే!
రోజూ చచ్చేవాళ్ళకు ఏడ్చేవాళ్ళుండరు.రోజులు ఇలాగే గడిస్తే వర్తమాన వైరుధ్యాలకు బాధపడే వాళ్ళు మిగలరు.
 పాలితులను బట్టే పాలకులు- పాఠకులను బట్టే పత్రికలు - ప్రేక్షకులను బట్టే సినిమాలు - వీక్షకులను బట్టే ఛానెళ్ళు.
ఎవరు చేసిన ఖర్మ వారనుభవించక తప్పదు!

(సెప్టెంబర్- 2009)

వార్త - వ్యాఖ్య - ఇంకానా! ఇకపై సాగదు!

ఇంకానా! ఇకపై సాగదు!
- భండారు శ్రీనివాసరావు
రాను రాను - సామాన్యుడనే వాడికి - ఓటు వెయ్యడం మినహా ఏ ‘హక్కూ’ లేకుండా పోతోంది. కానీ, అతడ్ని అడ్డం పెట్టుకుని బతికేవారికి మాత్రం అన్ని హక్కులూ - హక్కుభుక్తమై పోతున్నాయి.
నిజానికి, పార్టీలూ,పర్టీల నాయకులూ, అమాత్యులూ, అధికారులు,ఉద్యోగులు, పోలీసులూ, అందరూ ప్రజల్లో భాగమే. ప్రజల నుంచి వచ్చిన వాళ్ళే. ఎదిగో - ఎన్నికయ్యో, హక్కులు సాధించుకుని అధికారం చెలాయిస్తున్నారు. సామాన్యులు ఎలాంటి హక్కులూ లేకుండా కునారిల్లుతున్నారు. అదే తానులోంచి వచ్చిన వాళ్ళు మాత్రం వృత్తుల పేరిటా, ఉద్యోగాల పేరిటా,సంఘాలు పెట్టుకుని, హక్కుల పోరాటాల పేరుతో లేని అధికారాలు అనుభవిస్తున్నారు. పై పదవులకు నిచ్చెనలు వేసుకుంటున్నారు.
సంఘాల కుంపట్లు పెట్టుకోని వర్గాలు ఈనాడు కాగడాలు వేసి గాలించినా కనిపించవు. ఎన్జీవోలకు సంఘాలున్నాయి.
ఐ.ఏ.ఎస్., ఐ.పి.ఎస్. అధికారులకు అసోసియేషన్లు ఉన్నాయి. రిక్షాలు లాగేవారికే కాదు, విమానాలు నడిపేవారికీ యూనియన్లు ఉన్నాయి. అమ్మేవారికి, కొనేవారికి సమాఖ్యలున్నాయి. రాసేవారికి, ఆ రాసిన వాటికి అచ్చేసేవారికీ సంస్థలు ఉన్నాయి. ఆడవారికీ, భార్యాబాధితులకు సయితం సమాజాలున్నాయి. వృత్తుల వారీగా, కులాలవారీగా, మతాలవారీగా ఎవరి సంఘాలు వారికి ఉన్నాయి. వీటన్న్టిటికీ, సొంతంగా ఏర్పరచుకున్న హక్కులు ఉన్నాయి. లేకపోయినా, వాటికోసం పోరాడగల యంత్రాంగ వ్యవస్తలున్నాయి.భావాలను విప్పిచెప్పగల గళాలు ఉన్నాయి. వాటిని ప్రజలకు చేరవేసే మాధ్యమాలు ఉన్నాయి. హక్కుల సాధనకోసం సమ్మెలు, బంద్ లు, ఆందోళనలు, నిరసనలు, రాస్తారోఖోలు, రైల్ రోఖోలు, ఘెరావ్ లు, ముట్టడులూ, ఊరేగింపులూ, బైఠాయింపులూ, అటకాయింపులూ, మానవహారాలు, దిష్టిబొమ్మల దహనాలు, ఇలా ఎన్నో రకాలుగా, ఎన్నెన్నో రూపాల్లో.. సామాన్యుడి సాదారణ జీవితాన్ని అతలాకుతలం చేస్తూ మరింత దుర్బరంగా మారుస్తూ - పై పెచ్చు తాము పడుతున్న ఈ పడరాని పాట్లన్నీ ఆ సామాన్యుడి కోసమే అని చెప్పి నమ్మించగల టక్కుటమార విద్యలన్నీ వీరికి వెన్నతో పెట్టిన విద్య. ఇవన్నీ లేనివాడు, అసలేమీ లేనివాడు మాత్రం రాజ్యాంగం తనకు కల్పించిన అన్ని రక్షణలకూ తూట్లు పొడుస్తున్న ఈ అస్తవ్యస్త మధ్య చిక్కుకుపోయి నానా అవస్థలు పడుతూ దిక్కుతోచక విలవిలలాడుతున్నాడు.
కారణాలు ఏమైనా, హేతుబధ్దత ఎంత ఉన్నా, బంద్ ల వల్లా, రాస్తారోఖోల వల్ల నష్టపోతున్నదీ, కష్టపడుతున్నదీ సామాన్యులే అన్నది నగ్న సత్యం. నిరసనలూ, ఆందోళనల పేరుతో రాజకీయపార్టీలు, వాటి అనుబంధ సంస్థలు, కార్మిక సంఘాలు, ఇతర సంస్థలూ, ఇష్టారాజ్యంగా నడిరోడ్లపై చేస్తున్న ధర్నాలు, బైఠాయింపులు నిత్యకృత్యంగా మారి జనజీవితాన్ని నరకప్రాయంగా మారుస్తున్నాయన్నది అంతే నిజం.
ప్రజల సమస్యల పరిష్కారం కోసం ప్రభుత్వాలపై ఒత్తిడి తెచ్చే నెపంతో రోడ్డెక్కుతున్న రాజకీయ పార్టీలు, కార్మికసంఘాలు తమ వైఖరులనూ, విధానాలను పునస్సమీక్షించుకోవాలి. ఏ సామాన్య జనం కోసమైతే ఉద్యమాలు, ఆందోళనలూ, నిర్వహిస్తున్నామని ఆయా పార్టీలూ, సంఘాలు అనుకుంటున్నాయో, ఆ సామాన్య జనాన్నే తమ విధానాలు మరింత చికాకు పరుస్తున్నాయన్న వాస్తవాన్ని అర్దం చేసుకోవాలి. పోరాటాల పేరుతోనో, ఇతరేతర రాజకీయ కారణాలతోనో బడుగుజీవి నడుం విరుస్తున్న ఈ అపబ్రంశపువిధానాలు ఏ నాగరిక దేశంలోనూ కానరావు. సాటి పౌరులకు ఇబ్బంది కలగని రీతిలో నిరసనలు ప్రకటించే పద్ధతులను సభ్యసమాజం పాటించి తీరాలన్న ప్రాధమిక స్పృహ మనదేశంలో కలికానికి కూడా కానరాదు.
ఒకసారి, సూర్యాపేట మీదుగా బస్సులో ఖమ్మం వెడుతుంటే నడుమ దారిలో వందలాది వాహనాలు నిలిచిపోయాయి. కారణం వాకబు చేయడానికి వెడితే కొంతదూరంలో ఏదో పార్టీకి చెందిన కార్యకర్త్గలు - పట్టుమని పదిమంది కూడా లేరు. - జండాలు పట్టుకుని, నినాదాలు చేస్తూ నడిరోడ్డు పై ధర్నా చేస్తున్నారు. ‘ఇలా ఎంతసేపు మీ తమాషా చూడాలనిగద్దిస్తే ఒక్క అరగంట ఓపిక పట్టండి సార్! ఫలానా టీవీ వాళ్ళు దోవలో ఉన్నామని ఇప్పుడే సెల్ ఫోన్లో చెప్పారు. అని వాళ్ళనాయకుడు జవాబిచ్చాడు. ఇలాంటి ఆందోళనలు, ధర్నాలు, రాస్తారోఖోలు ససేమిరా చూపించేది లేదని చానళ్ళన్నీ ఏకగ్రీవంగా నిర్ణయం తీసుకోగల్గితే మెరుగయిన సమాజం కోసం నిజంగా కృషి చేసినట్టవుతుంది. ప్రచారం కోసం కాకుండా ప్రజాక్షేమాన్ని కోరుకునే సంస్థలు కూడా తమ కార్యకర్తల్ని తక్షణం రంగంలోకి దింపి ‘ఇలా ప్రజలని ఇబ్బందుల పాలు చేసే వారికి దయచేసి ఓట్లు వెయ్యవద్దు అనే ప్లకార్డులను పట్టుకుని మౌనంగా ఆ పక్కన నిలబడితే, నవ్యత్వం కోసం పటుపడే ఛానెళ్ళన్నీ ఆ దృశ్యాలను ఒక్కమారైనా ప్రసారం చేయగలిగితే , ఇంకోసారి ఏపార్టీ, ఏయూనియన్ కూడా ఇలాంటి ఆందోళనలక్ సాహసించదు. కానీ సంచలనం ఒక్కటే సమస్తం అనుకునే ఈ పోటాపోటీ ప్రచార వ్యాపార యుగంలో ఇది నెరవేరని కలే.
కానీ, ఏదో ఒకరోజు ‘సామాన్యుడి రోజు’ కూడా వస్తుంది. నిరసనలని వ్యక్తం చేయడానికి ఎంచుకున్న విధానాల ద్వారా వేలాది మంది ప్రజలను అకారణంగా ఇబ్బంది పెట్టే హక్కు వీరికెవరిచ్చారన్న ప్రాధమిక ప్రశ్న ముందుకు వస్తుంది.
అర్భకుడు, అమాయకుడు అనుకున్న ఈ సామాన్యుడే తిరగబడి ‘ఇంకానా’ ఇకపై సాగదు!’ అంటూ హూంకరిస్తూ - తన జీవితంతో ఆటాడుకుంటున్న ‘వర్గాల’ మెడలు వంచే రోజు తప్పక వస్తుంది. తస్మాత్ జాగ్రత్త!

(ఆగష్టు -2009)

25, డిసెంబర్ 2009, శుక్రవారం

ముగ్గురు మిత్రులు

నలభయి ఏళ్ళ తర్వాత కలుసుకున్న ముగ్గురు మిత్రులు గురించిన ఆంద్ర జ్యోతి కధనం  
 




వార్తకు ప్రాణం విశ్వాసం - వార్త వ్యాఖ్య - భండారు శ్రీనివాస రావు

(November 16- National Press Day)



వార్తకు ప్రాణం విశ్వాసం 
- వార్త వ్యాఖ్య - భండారు శ్రీనివాస రావు (ఆకాశవాణి - హైదరాబాద్ - ప్రాంతీయ వార్తా విభాగం సౌజన్యంతో )
చాలా ఏళ్ళనాటి సంగతి.
కేంద్రంలో ఆనాడు సహాయ మంత్రిగావున్న డాక్టర్ కే ఎల్ రావు గారు మా వూరు రావాల్సివుంది. గంటలు గడిచిపోతున్నా మంత్రిగారి జాడ లేదు. చీకటి పడింది. ఇంతలొ దూరంగా వూరి పొలిమేరల్లో మోటార్ కార్ల హెడ్ లైట్ ల కాంతి కనబడింది. అమ్మయ్య వచ్చేసారులే అనుకున్నాం. కానీ, కాసేపటి తరవాత ఆ లైట్ ల వెలుతురు కూడా కానరాలేదు. మంత్రిగారి పర్యటన మొదలుకాకుండానే ముగిసిపోయింది.
మర్నాడు ఉదయం రేడియో లో ప్రాంతీయ వార్తలు విన్నప్పుడు అసలు విషయం తెలిసింది. సరయిన రహదారి లేకపోవడంవల్ల దారి తప్పిన మంత్రిగారి పరివారం- మా వూరికి వచ్చే దారి కనుక్కోలేక - విధి లేని పరిస్థితిలో ప్రోగ్రాం రద్దుచేసుకుని యెకాయెకిన విజయవాడ తిరిగి వెళ్ళిపోయిందట. ఆ సాయంత్రం వచ్చిన పత్రిక ద్వారా మరికొన్ని విశేషాలు తెలిసాయి. మునేటికి అవతల - దారీ తెన్నూ లేకుండావున్న అనేక గ్రామాలను కలుపుతూ రోడ్డు వేయాలని కే ఎల్ రావు గారు నిర్ణయించారట. మంత్రి గారు రాకపోయినా- రోడ్డు వస్తున్నందుకు గ్రామస్తులు సంతోషించారు.
పొతే- ఆరోజు సాయంత్రం వచ్చిందని చెప్పానే ఆ ఆంద్ర పత్రిక ఒక్కటే మా వూరు మొత్తానికి దిక్కు. ఉదయం ముద్రించిన పేపర్ సాయంకాలానికి కానీ మా వూరు చేరేది కాదు. బస్సు సదుపాయాలు అంతంత మాత్రం. రోడ్ల సంగతి సరేసరి. చెప్పాల్సిన పని లేదు.
ఆంద్ర పత్రిక - కాశీనాధుని నాగేశ్వరరావు పంతులుగారి పత్రిక. పందొమ్మిదివందల ఎనిమిది లోనే ఆనాటి బొంబాయి లో దాన్ని ప్రారంభించారు. అప్పటికే కొన్ని పత్రికలూ వస్తున్నప్పటికీ - తెలుగు పత్రికా రంగంలో ఆ పత్రిక స్థానం ఎవరూ కాదనలేనిది. పంతులు గారు కూడా పత్రికను వాణిజ్య ప్రాతిపదిక పై నడపలేదు. పైపెచ్చు- బొంబాయి నుంచి ప్రతి రోజూ తన స్వంత ఖర్చులపై పత్రికను ఆంద్ర ప్రాంతంలోని గ్రంధాలయాలకూ , రీడింగ్ రూంలకూ పంపేవారు. తెలుగునాట పత్రికలూ చదివే ఆసక్తి పెరగడానికి పంతులుగారి ఈ ప్రయత్నం దోహదం చేసింది కూడా.
ఇక మళ్ళీ మా వూరికి వెడితే-
గూడా సత్యనారాయణ సిద్దాంతి గారనే వయో వృద్దుడు - తనకొచ్చే కొద్దిపాటి ఆదాయంలో - మూడు రూపాయలు నెలసరి చందా కట్టి - పోస్ట్ లో పత్రికను తెప్పించుకునేవారు. పేపర్ రాగానే- వూళ్ళో చడువుకున్న వాళ్ళూ- చదువుకోని వాళ్ళూ - ఒక చోట చేరిపోయేవాళ్ళు. అప్పయ్య మాస్టారు - తన కంచు కంఠంతో వార్తలను ఆమూలాగ్రం చదివి వినిపించేవారు.
"అమెరికా అధ్యక్షుడిగా జాన్ ఫిట్జరాల్ద్ కెన్నడీ ఎన్నిక- వోటమి అంగీకరిస్తూ నిక్సన్ ప్రకటన-
" కాంగోలో జరిగిన విమాన ప్రమాదంలో ఐరాస సెక్రెటరీ జనరల్ దాగ్ హామర్ షెల్డ్ దుర్మరణం - దుర్ఘటనపై నీలినీడలు-
" మన సారధి- మన సచివుడు- మన జవహర్ - మనకిక లేడు-"
ఇలా సాగిపోయేవి ఆ వార్తలు.
వాటిని వినేవాళ్ళలో చాలామందికి అమెరికా అనే మరో దేశం వుందని తెలియదు. కాంగో ఎక్కడ వుందో- లియోపాల్డ్ విల్లీ అనేది వూరు పేరో - పూవు పేరో తెలియదు. తెలిసిందల్లా - తెలియనిది తెలుసుకుంటున్నామన్న తృప్తి . కొత్త సంగతులు తెలుసుకోవాలన్న ఆసక్తి. యిదే పత్రికలకు వున్న శక్తి.
అందుకనే- సమాచార మార్పిడికి వున్న ఈ బలాన్ని ఆవాహన చేసుకున్న పత్రికలు ప్రజలమీద పట్టుపెంచుకుంటూ వస్తున్నాయి.
అంతటి శక్తి స్తోమతలను ఇముడ్చుకున్న పత్రికా రంగం చరిత్ర గురించి- ఈ రోజు జాతీయ పత్రికా దినం పాటిస్తున్న సందర్భాన్ని పురస్కరించుకుని ముచ్చటించుకుందాం.
అనేక శతాబ్దాల క్రితం ప్రభుత్వ ప్రభుత్వ ప్రకటనలే - అంటే రాజ శాసనాలే- సమాచార పత్రాలుగా వెలువడేవి. ప్రాచీన రోము సామ్రాజ్యంలో - జూలియస్ సీజర్ - లోహ, శిలా ఫలకాలపై శాసనాలను చెక్కించి - బహిరంగ ప్రదేశాలలో ప్రదర్శించే వారట .చైనాలో- పదహారో శతాబ్దంలోనే - మింగ్ ప్రభువుల కాలంలో వార్తా పత్రికలను ప్రచురించిన దాఖలాలు వున్నాయి. పదహారు వందల యాభయ్ ఆరులో మొదలై ఇప్పటిదాకా వెలువడుతున్న పత్రిక ఒకటి వుంది. ఈ స్వీడన్ పత్రికను - ఆ తరవాత మరో పత్రికతో విలీనం చేసిన పిదప కూడా - పాత పేరుని దానికి జోడించి ప్రచురిస్తూ వుండడం ఒక విశేషం. అంటే మూడు వందల నలభయ్ మూడు సంవత్సరాలుగా ఏకబిగిన నడుస్తున్న అతి ప్రాచీన పత్రిక ఇదే అన్న మాట.
పోతే - పన్దొమ్మిదవ శతాబ్దం ఆరంభంలో పారిశ్రామిక విప్లవం పుణ్యమా అని - వార్తా పత్రికల తీరుతెన్నులే పూర్తిగా మారిపోయాయి. పద్దెనిమిది వందల పదునాలుగులోనే - లండన్ టైమ్స్ పత్రిక- నిమిషానికి పదకొండు వందల కాపీలు ముద్రించగల అచ్చు యంత్రాన్ని సమకూర్చుకుంది. క్రమంగా ఈ రంగంలో పోటీ పెరిగిపోయి- చవక పత్రికలు రంగ ప్రవేశం చేసాయి. పెన్నీ ప్రెస్ అనే వార్తా పత్రిక - తన ధరను సాటి పత్రికల ధరలో ఆరో వంతుకు తగ్గించి అమ్మడం మొదలుపెట్టి- అమ్మకాలను గణనీయంగా పెంచుకుంది.
ఇక ప్రస్తుతానికి వస్తే- ఆధునిక సాంకేతిక పరిజ్ఞానం అందిస్తున్న అవకాశాలను- సాధన సంపత్తులనూ అందిపుచ్చుకున్న ఈ నాటి పత్రికలూ సర్వాంగ సుందరంగా ముస్తాబై పాఠకులను ఆకర్షిస్తున్నాయి.
ఈరోజు జాతీయ పత్రికా దినం కాబట్టి- కనీసం ఈ రోజయినా పత్రికా విలువలను గురించి కొంత నిష్కర్షగా చర్చ జరగాల్సిన అవసరం వుంది. కాలానుగుణమైన మార్పుల మూలంగా- మిగిలిన రంగాల్లో కానవస్తున్న వికృత ధోరణుల నీలినీడలు పత్రికా రంగంపై కూడా ప్రసరిస్తున్నాయన్న ఆరోపణల నేపధ్యంలో ఈ చర్చ అవసరం మరింత పెరిగింది.
ఒక పెద్ద పత్రికలో వార్త పడినప్పుడు జనం దాని గురించి మాట్లాడుకోవడం సహజం. చదువుకున్న వాళ్ళు దాన్ని గురించి మరింత చర్చించుకుంటారు కూడా. నిరక్షరాస్యులయితే విని అవునా అని అనుకుంటారు. అధికారులు స్పందిస్తారు. అనధికారులు వీలుని బట్టి ఖండిస్తారు. లేదా హర్షిస్తారు. సాధారణంగా జరిగే వ్యవహారం ఇది.
నిజాయితీ, నిబద్దతా, విశ్వసనీయతా - వార్తకు ప్రాణం పోస్తాయి. ఇవి లేని వార్తకు ప్రాణం వుండదు. ప్రామాణికం వుండదు. కానీ- ఈనాటి పత్రికల్లో - ఆ మాటకి వస్తే - మీడియాలో - ఈ మూడింటికీ ఎంత విలువ ఇస్తున్నారో అందరికీ తెలిసిన విషయమే.
విశ్వసనీయత కంటే మనుగడే ప్రధానమనుకున్నప్పుడు - పత్రికల ద్వారా సాధించాలనుకున్నదీ - సంపాదించాలని అనుకున్నదీ 'ఇంకేదో' వుందనుకున్నప్పుడు - పత్రికా స్వేచ్ఛకి అర్ధమే మారిపోతుంది.
జాతీయ పత్రికా దినం సందర్బంగా ఏర్పాటు చేసే సభలు సమావేశాల్లో ఈ అంశానికి తగిన ప్రాధాన్యం లభించగలదని ఆశిద్దాం.
(భండారు శ్రీనివాస రావు - పదమూడు నవంబర్ )

24, డిసెంబర్ 2009, గురువారం

Kudos to Congress!

Kudos to Congress!







-Bhandaru Srinivasrao







The Congress high command has finally honored its promise that it made to people of Telangana. It has come in the form of a birthday ‘gift’ from none other than the UPA Chairperson and Congress President Sonia Gandhi. Like the midnight freedom to the country even the decision of the Congress high command indeed has come right close to the midnight on Wednesday, the December 9.







In fact, the Congress, which fought the 2004 assembly polls with Telangana Rashtra Samiti had promised its Chief K Chandrasekhara Rao that it would consider his demand for separate statehood at an appropriate time. And, Rao believed the Congress and also joined the Union cabinet of UPA government as Labour Minister. But, situation did not warrant the Congress to take a decision on Telangana as both the Left parties – the CPI and CPM extended the Congress-led minority UPA government at the Centre – were against smaller states. Added to this was the Lok Sabha having the CPM member, Mr Somnath Chatterjee, as the Speaker.







The CPM, time and again, expressed its opposition to any further disintegration of the country on the argument that the Indian Republic states were formed on linguistic basis. As a result, the Manmohan Singh headed Congress government was unable to fulfill its promise made to the TRS chief. On the other hand, the helpless TRS leader kept on giving dates to his supporters of the possible announcement from the UPA government. When he realized the Congress helplessness, he decided to call ‘quits’, first asking his colleagues in Andhra Pradesh legislative assembly to resign and later following suit.







He not only proved a point by re-seeking entry into parliament from the same Karimnagar parliament constituency and winning with handsome majority. Yet, he appears to have been faltered in case of his colleagues in the state assembly. Ironically, the party suffered humiliating defeat not only facing split before the bypolls, but also in its outcome. The party was split into two after the 2004 elections with only 14 of the 27 elected members decided to ‘stick’ with Rao and resign to contest bypolls. Even in the bypolls, KCR led group suffered further humiliation as only seven of the 14 returned to the state assembly.







But, unrelenting Rao did not leave his path for separate statehood and kept on putting pressure on the Congress-led UPA government at the Centre. In 2009 elections, he decided to align with the main Opposition Telugu Desam-led “Mahakutami” to fight Congress and yet again suffered humiliation as his party failed to perform any better. All the KCR’s “game-plans” were successfully “foiled” by a strong leader in Congress in the form of Dr Y S Rajasekhara Reddy.







Incidentally, the untimely death of Dr Reddy in chopper crash has given Rao a golden opportunity to raise the separate statehood demand. Added to that intra-party bickerings within the Congress helped him to intensify the agitation demanding for separate statehood. The clever move by him to take up fast-unto-death agitation too paid rich dividends.







The worsening situation arose out of fasting Rao’s deteriorating health condition panicked the Congress high command to hurry up its long-pending decision on Telangana issue. Today, as the Congress enjoys considerable numerical strength in the UPA dispensation could take such a bold decision to declare initiative for formation of separate statehood for Telangana, which was simmering for the past two to three decades.







With the Wednesday night’s decision, the Indian National Congress and its president Sonia Gandhi has proved its critics __ who have been calling the party the most undisciplined and not trust worthy __ that it has some political values. A handful of party members representing the Andhra and Rayalaseema regions, who boasted to abide by the decision of Sonia are now ‘revolting’ only prove their ‘dishonesty’. How, Sonia and her ‘think tank’ can overcome the situation only time will tell.

భండారు వంశం గోత్ర నామాలు

భండారు వంశం గోత్ర నామాలు




తండ్రి : రాఘవేశ్వర శర్మ (రాఘవరావు గారు) పరాశర గోత్రం

తాత: (తండ్రి తండ్రి) పర్వతాలేశ్వర శర్మ (పర్వతాలయ్య గారు) పరాశర గోత్రం

ముత్తాత (తండ్రి తాత) రామేశ్వర శర్మ (రామయ్య గారు) పరాశర గోత్రం

తల్లి వెంకట్రావమ్మ పరాశర గోత్రం

బామ్మ (తల్లి అత్తగారు-తండ్రి తల్లి) రుక్మిణమ్మ పరాశర గోత్రం

బామ్మ తండ్రి చిదంబరం రోహితస గోత్రం

బామ్మ తల్లి చెల్లమ్మ (చెల్లమ్ముమ్మ) రోహితస గోత్రం

బామ్మ తాత సీతారామయ్య పరాశర గోత్రం

బామ్మ బామ్మ వెంకటమ్మ పరాశర గోత్రం

తాత (తల్లి తండ్రి) శ్రీనివాస రావు కొండపల్లి శ్రీవత్స గోత్రం

ముత్తాత (తల్లి తాత) కృష్ణారావు శ్రీ వత్స గోత్రం

పినతండ్రి రామప్రసాదరావు (ప్రసాదం బాబాయి) పరాశర గోత్రం

పినతండ్రి భార్య రాంబాయి పరాశర గోత్రం

పినతాత లక్ష్మీనారాయణ (లక్ష్మయ్య తాతయ్య) పరాశర గోత్రం

పినతాత భార్య వరలక్ష్మి (వరం బామ్మ) పరాశర గోత్రం

పినతాత సుబ్బారావు (సుబ్బయ్య తాతయ్య) పరాశర గోత్రం

పినతాత భార్య సీతమ్మ (సీతం బామ్మ) పరాశర గోత్రం

మేనత్త రంగనాయకి (రంగమ్మత్తయ్య) కాశ్యపస

మేనమామ (మేనత్త భర్త) లక్ష్మీనరసింహారావు కొలిపాక కాశ్యపస

మేనత్త కమలాబాయి (చిన్నత్తయ్య) కాశ్యపస

మేనత్త భర్త శ్రీనివాసరావు పర్చా కాశ్యపస

మేనత్త సీత (చిదంబరం అత్తయ్య) కాశ్యపస

మేనత్త భర్త లక్ష్మీనరసింహారావు కాశ్యపస

పెత్తల్లి చుక్కమ్మ గౌతమ గోత్రం

పెత్తల్లి భర్త వెంకట నరసయ్య గౌతమ గోత్రం

మేనమామ రామచంద్రరావు కొండపల్లి శ్రీ వత్స గోత్రం

మేనమామ భార్య రాజ్యలక్ష్మి (రాజమ్మత్తయ్య) శ్రీ వత్స గోత్రం

మేనమామ కృష్ణారావు కొండపల్లి శ్రీ వత్స గోత్రం

మేనమామ భార్య వెంకట సుబ్బాయమ్మ(గండ్రాయత్తయ్య) శ్రీ వత్స గోత్రం

మేనబావ శ్రీనివాసరావు కొండపల్లి శ్రీ వత్స గోత్రం

మేనబావ వెంకటేశ్వరరావు కొండపల్లి శ్రీ వత్స గోత్రం

అక్క రాధ భరద్వాజ

బావ అయితరాజు రాంరావు భరద్వాజ

మేనల్లుడు ఏవీజీ కుమార్ (వెంకన్న) భరద్వాజ

బావ రామచంద్రరావు కొలిపాక కాస్యపస గోత్రం

బావ కవుటూరి కృష్ణమూర్తి కౌసికస గోత్రం

మేనల్లుడు శేషు కౌసికస గోత్రం

మేనల్లుడు తుర్లపాటి రాఘవరావు (పుతక) కణ్వస గోత్రం

అక్క అన్నపూర్ణ భరద్వాజ

బావ వెంకటప్పారావు భరద్వాజ



మేనల్లుడు చంద్ర కాంతారావు భరద్వాజ

మేనల్లుడు రంగారావు (రంగడు) భరద్వాజ

బావ పింగిలి మధుసూదనరావు భారద్వాజస గోత్రం

అన్నయ్య భండారు పర్వతాలరావు గారు పరాశర

అన్నయ్య భండారు వెంకటేశ్వర రావు పరాశర

అన్న (పినతండ్రి కొడుకు) భండారు సత్యమూర్తి పరాశర గోత్రం

గురువు హనుమంతరావు గారు భారద్వాజస గోత్రం

మేనమామ కొడుకు మోహనరావు శ్రీ వత్స గోత్రం

మేనమామ కొడుకు భార్య యజ్ఞ పదాయి శ్రీ వత్స గోత్రం

పర్వతాలరావు గారి షడ్డకుడు భావనారాయణ భారద్వాజ

పినతండ్రి అల్లుడు పట్టాభిరామారావు భారద్వాజ

గురువు రాఘవరావు పరాశర

గురువు హరినారాయణ భారద్వాజ

గ్రేట్ ఫెయిల్యూర్ స్టొరీ -భండారు శ్రీనివాస రావు

గ్రేట్ ఫెయిల్యూర్ స్టొరీ -భండారు శ్రీనివాస రావు ( డిసెంబరు ఆరు -రెండు వేల ఆరు)



పంతొమ్మిదివందల డెబ్బయి ఒకటి -ఆగష్టు నెల- ఇరయయ్యవ తేది.

విజయవాడ, లబ్బీపేట లోని 'ఆంద్ర జ్యోతి' కార్యాలయం.

అందులో అడుగు పెట్టి - ఎడిటర్ నార్ల వెంకటేశ్వర రావు గారిని కలుసుకున్నాను.

ఆయన ఎగాదిగా చూసి, నా పరిచయం కనుక్కుని-

'మీ అన్నయ్య ఒకటే చంపేస్తున్నాడయ్యా! పైకి పో. ఉపేంద్ర వుంటాడు. నేను పంపానని చెప్పు' అన్నారు ఫోన్ మీద చేయి వేస్తూ.

అదే నా తొట్ట తొలి ఉద్యోగ నియామకపు ఉత్తర్వు.





ఉపేంద్ర గారిని కలిసాను. కూర్చోమని సైగ చేసారు. గుర్రపు నాడా ఆకారంలో వున్నా బల్ల చివర్లో కూర్చున్నాను. పీ టీ ఐ , యు ఎన్ ఐ వార్తల్ని తెలుగులోకి తర్జుమా చేయమన్నారు. ఆ విధంగా మొదలయింది నా జర్నలిస్టు జీవితం.





ఉదయం ఎనిమిది గంటలకల్లా అన్నం తిని ఆంధ్ర జ్యోతి కి వెళ్ళే వాడిని. అన్నయ్య పర్వతాలరావు గారు ఇమ్మన్న రూపాయి నోటు వొదినె సరోజినీ దేవి నా చేతులో పెట్టేది. రాను పోను సిటీ బస్సుకు నలభై పైసలు. మధ్యాహ్నం ఆఫీసు కు ఎదురుగా వున్నా టీ స్టాల్లో ముప్పయి పైసలు పెట్టి ఒక సమోసా తిని టీ తాగేవాడిని. రోజుకు ము ప్పయి పైసలు మిగిలేవి. వేరే ఖర్చులు లేవు. అలా నెలకు సుమారు పది రూపాయలు ఆదా. అదే నా మొట్టమొదటి నెలసరి ఆదాయం.





అలా మూడు నెలలు గడిచాయి. జీతం విషయం నేను అడగను లేదు - వాళ్ళు చెప్పను లేదు. ఒక రోజు అటెండర్ నాగేశ్వరరావు నా దగ్గరకు వచ్చి ఎక్కవుంటేంట్ ని కలవమని చెప్పాడు. వెడితే- ఓ ఓచర్ మీద సంతకం చేయించుకుని పది- పది రూపాయల నోట్లు - వంద నా చేతిలో పెట్టారు. అదే నా తొలి వేతనం.







ఉద్యోగం తప్ప వేరే ధ్యాస లేని రోజులవి. రాసిన ప్రతిదీ మర్నాడు పేపర్లో రాకున్నా ప్రూఫ్ లో అచ్చయిన నా ఐటెంసుని నేనే చదువుకుని

మురిసిపోయేవాడిని. నేను చేరిన కొత్తల్లోనే నార్ల గారు హైదరాబాద్ వెళ్ళిపోవడం - నండూరి రామమోహనరావు గారు భాద్యతలు స్వీకరించడం జరిగిపోయాయి.ఎందుకో ఏమోగానీ,దిన,వార పత్రికలకు సంబంధిoచిన అన్ని అంశాలలో నాకు తర్ఫీదు ఇచ్చారు. ప్రతిరోజూ ఎడిట్ పేజీలో కార్టూన్ తో కూడిన నాలుగు వాక్యాల గేయాన్ని 'వాక్టూనులు ' అనే శీర్షికతో రాసేవాడిని. సినిమా సమీక్షలు, పుస్తక సమీక్షలు, ఆదివారాల్లో

పిల్లలకోసం ప్రత్యెక కధలు , బంగ్లాదేశ్ అవతరణకు దోహదం చేసిన పంతొమ్మిదివందల డెబ్బయి ఒకటి ఇండో-పాక్ యుద్ధంలో భారత సైన్యాల కదలికలను సూచించే మ్యాపులు - ఇలా అన్నింట్లో నేనున్నానంటూ వేలు పెట్టేవాడిని. శ్రీయుతులు ఉపేంద్ర, ఐ వెంకటరావు,కే.రామకృష్ణ, వీరభద్రరావు, ఎల్వీ రమణ ( ఈ మధ్యనే కాలం చేశారు), సత్యనారాయణ, ఆంజనేయులు, చంద్రశేఖర ఆజాద్ వంటి సహోద్యోగుల నడుమ నా ఆంధ్ర జ్యోతి ఉద్యోగ పర్వం నాలుగున్నర సంవత్సరాలపాటు ఇట్టే గడిచిపోయింది.



అన్నట్టు చెప్పడం మరిచాను. మొదట్లోనే నార్లగారు నాకో బ్రహ్మొపదేశం చేశారు. జర్నలిస్టు అనే వాడు ఎప్పుడూ, జేబులో రాజీనామా లేఖ సిద్ధంగా పెట్టుకోవాలనే వారు. చాలా కాలంపాటు దాని పాటించాను కూడా. తర్వాతి రోజుల్లో రేడియోలో ఏదో విషయంలో పేచీ వచ్చి,రాజీనామా ఇచ్చేసి ఇంటికి వచ్చేశాను. అంతే! నెలరోజులపాటు మళ్ళీ ఆఫీసు మొహం చూడలేదు. చివరికి ఎవరో పూనుకుని రాజీ చేయడం, ఉద్యోగంలో తిరిగి చేరడం జరిగిపోయాయి. అదో అధ్యాయం.



హైదరాబాద్ ఆకాశవాణి ప్రాంతీయ వార్తా విభాగంలో విలేకరిగా చేరడం యాద్రుచ్చికమే అని చెప్పాలి. అంతకుముందు ఈ ఉద్యోగాన్ని ఎంతో సమర్ధంగా నిర్వహించి మంచి పేరు తెచ్చుకున్న తురగా కృష్ణమోహన రావు గారు - గోల్కొండ ఎక్స్ ప్రెస్ ప్రారంభోత్సవ కార్యక్రమంలో పాల్గొనడానికి వెళ్లి- దురదృష్టవశాత్తు -నకిరేకల్ వద్ద జరిగిన రోడ్డు ప్రమాదంలో దుర్మరణం చెందారు. ఆ విధంగా ఏర్పడ్డ ఖాళీని భర్తీ చేయడానికి ఆకాశవాణి ఇచ్చిన ప్రకటనకు అనుగుణంగా నేను ధరకాస్తు చేసుకోవడం, ఇంటర్వ్యూ కు హాజరు కావడం - సెలెక్ట్ కావడం జరిగిపోయాయి. ఆంద్ర జ్యోతి అనుభవం ఈ ఉద్యోగం పొందడానికి అదనపు అర్హతగానే కాకుండా- అసలైన అర్హతగా తోడ్పడిందని నా నమ్మకం. రాసిన రాతలు అచ్చులో చూసుకునే అవకాశం ఆంద్ర జ్యోతి ద్వారా లభిస్తే- సొంత గొంతును తెలుగునాట నలుగురికీ వినిపించే వీలు రేడియోలో దొరికింది. వార్తా సేకరణ, కూర్పు, తెలుగులోకి అనువాదం ఇలాంటి ప్రక్రియలతో పాటు, రెగ్యులర్ న్యూస్ రీడర్లు రాని రోజున ఏకంగా స్టూడియో లోకి వెళ్లి వార్తలు చదివేయడం- వారానికి రెండు మార్లు వార్తా వాహిని - ఒకసారి జీవన స్రవంతి (రోజువారి జరిగే ఘటనలకు కొంత హాస్యాన్ని జోడించి తయారు చేసిన ప్రత్యెక వార్తలు ) ఇలా అన్నిరకాలుగా నా రేడియో జీవితాన్ని పూర్తిగా ఉపయోగించుకున్నాను.



ఆ రోజుల్లో ఇన్ని పత్రికలూ లేవు. ఇంత మంది విలేకరులు లేరు. ముఖ్య మంత్రి నిర్వహించే విలేకరుల సమావేశానికే పది, పన్నెండు మంది హాజరైతే గొప్పగా వుండేది. నేను రేడియోలో చేరింది ఎమర్జెన్సీ రోజుల్లో కావడం వల్ల-వార్తల విషయంలో రాష్ట్ర ప్రభుత్వ యంత్రాగం రేడియో పై ఎక్కువగా ఆధారపదాల్సిరావడం- రేడియో విలేకరిగా నా ప్రాధాన్యత కొంత పెరిగింది. అంజయ్య గారు ముఖ్యమంత్రిగా వున్నప్పుడు - రేడియో మీది అభిమానాన్ని, నా మీది వ్యక్తిగత అభిమానాన్ని కలబోసి ప్రదర్శించేవారు. విలేకరుల సమావేశాలను -'శ్రీనివాస్ వచ్చాడా!' అని కనుక్కుని మొదలు పెట్టడం అప్పుడప్పుడు నలుగురిలో ఇబ్బందిగా వుండేది. తన ఎయిర్ బస్ మంత్రివర్గంపై చెలరేగిన విమర్శల దరిమిలా- మంత్రుల మూకుమ్మడి రాజీనామాలను ప్రకటించడానికి ఓసారి విలేకరులకు కబురు పెట్టారు. మధ్యాన్నం వార్తల టైం దగ్గర పడుతుండడంతో-రాజీనామాల సంగతి ముందుగా నాకు చెప్పడం- విలేకరుల సమావేశం మొదలు కాకముందే ఆ సమాచారం ప్రాంతీయ వార్తల్లో ప్రసారం కావడం జరిగిపోయింది. ఇది నా వృత్తి జీవితంలో మరచిపోలేని సంఘటన



ఆ రోజుల్లో ప్రతి రోజు సచివాలయానికి వెళ్లి మధ్యాహ్నం దాకా ప్రెస్ రూం లోనో లేదా ప్రెస్ కాన్ఫరెన్స్ ల్లోనో గడిపి- అంతవరకు సేకరించిన సమాచారం తెసుకుని న్యూస్ బుల్లెటిన్ కు అందించడానికి కాలినడకన రేడియో స్టేషన్ కు వెడుతుండే వాడిని. ఒకరోజు అలా పోతున్నప్పుడు ముఖ్యమంత్రి పైలట్ వాహనం సైరన్ మోగిస్తూ వెళ్ళింది.అంజయ్య గారు- తన అధికారిక వాహనం అయిన అంబాసిడర్ కారులో డ్రైవర్ పక్కన ముందు సీట్ లో కూర్చునే వారు. ఆయనకు కార్యకర్తల తాకిడి ఎక్కువ. వెనుక సీట్ లో ఎవరికీ వారు దూరి పోయేవారు. ఈ ఇబ్బంది తట్టుకోవడం కోసమో ఏమో ఆయన ముందు సీట్ కి మారిపోయారు. సరే! ఆ రోజు నా పక్కనుంచి వెళ్ళిన ముఖ్యమంత్రి వాహనం కొద్దిగజాలు ముందుకు పోయి ఆగింది. ఆయన అంగరక్షకుడు బాలాజీ- - రిటైర్ అయిన తర్వాత ప్రస్తుతం అపోలో ఆస్పత్రిలో పనిచేస్తున్నారు- కిందికి దిగి సీఎం గారు పిలుస్తున్నారు రండి అనడం- నన్ను కారు ఎక్కించుకుని రేడియో స్టేషన్ లో దింపడం క్షణాల్లో జరిగిపోయాయి. అనుకోకుండా ముఖ్యమంత్రి రేడియో

స్టేషన్ కి రావడంతో మా వాళ్ళంతా అవాక్కయ్యారు. అంజయ్య గారు ఇలా నాపట్ల చూపిన అవ్యాజానురాగాలకి ఇంకా ఎన్నో ఉదాహరణలు వున్నాయి. అవి ఆయన గొప్పతనానికి, మంచి తనానికి తార్కాణాలుగా భావిస్తానే కాని , నా ప్రత్యేకత ఏమీ లేదు.



పొతే, ఎందరో మంత్రులు, ఎంతోమంది ముఖ్యమంత్రులు, డీజీపీలు ,చీఫ్ సెక్రటరీలు, సీనియర్ ఐ ఏ ఎస్ , ఐ పీ ఎస్ అధికారులు, కేంద్రమంత్రులు, ఎంపీలు, శాసన సభ్యులు - ఇందరితో సాన్నిహిత్యాలు, విందులు, వినోదాలు,విమాన యానాలు,విదేశీ ప్రయాణాలు, హెలికాఫ్టర్

చక్కర్లు - మాస్కో రేడియో ఉద్యోగ విజయాలు - ఓ విధమైన 'మత్తులో' వృత్తి జీవితం గడిచిపోయింది.



అటు చూస్తే, వ్యక్తిగత జీవితం ఓ గుండు సున్నా. జీతానికీ, జీవితానికీ పొంతన లేకపోవడంతో అందినంతవరకు అప్పులు చేయడం (చేబదుళ్లు పుట్టవు కానీ జర్నలిష్టులకు మాత్రం బ్యాంకు రుణాలు కోకొల్లలు ) వాటిని తీర్చడం కోసం మళ్ళీ కొత్తవి చేయడం - అదో రుణ చక్ర భ్రమణం. ఇలా ఊబిలో కూరుకుపోయిన జీవితానికి ఆసరాగా మా ఆవిడ నిర్మల- అమ్మ వొడిని ప్రారంభించింది. కన్న సంతానం ఇద్దరు పిల్లలతో పాటు - మరో పాతికమంది పసి పిల్లల ఆలనా పాలనా నెత్తిన వేసుకుంది. ఓ గృహిణిగా సంసార బాధ్యతలో పాలు పంచుకుంటున్నదని అనుకున్నానే కాని, అలవికాని భారం మోస్తున్నదని అనుకోలేదు. ఫలితం - పదేళ్ళ తరవాత ఆమెకు జరిగిన ఓపెన్ హార్ట్ సర్జరీ. మరో పదేళ్ళ అనంతరం మొన్నీమధ్య రెండో సర్జరీ.



ఇక వృత్తి జీవితం చివరి రెండేళ్ళు - కే ఎస్ శర్మ గారి పుణ్యమా అని హైదరాబాద్ దూర్ దర్శన్ వార్తా విభాగంలో ఆర్వీవీ గారి సారధ్యంలో దొర్లిపోయాయి. రెండువేల అయిదు డిసెంబరు ఆఖర్లో ఉద్యోగ విరమణ. మోహన్ కందా గారన్నట్టు- మనిషికి మరణం, ఉద్యోగికి రిటైర్మెంట్ రెండూ తప్పవు.



వెనక్కు తిరిగి చూసుకుంటే- ఎన్నో అనుభూతులు-అనుభవాలు.

అన్నింటి సమగ్ర సమాహారమే జీవితం.

నిజానికి జీవితంలో ఫెయిల్యూర్ స్టొరీ లు వుండవచ్చు కానీ, ఏ జీవితం ఫెయిల్యూర్ కాదు.





(డిసెంబర్. ఆరు - రెండువేల ఆరులో రాసినదానికి కొద్దిపాటి సవరణలతో )