27, నవంబర్ 2016, ఆదివారం

పబ్లిక్ పల్స్

“ఆంధ్రప్రదేశ్ లో ఇప్పటికిప్పుడు ఎన్నికలు జరిగితే ఏమవుతుంది? జనం ఏమనుకుంటున్నారు? మళ్ళీ చంద్రబాబే కావాలనుకుంటున్నారా? జగన్ రావాలనుకుంటున్నారా? చంద్ర బాబు పధకం పారుతోందా?” అనే పలు ప్రశ్నలకు తాము జరిపిన సర్వేలో వెల్లడయిన సమాధానాలను  రేపటి నుంచి అందించబోతున్నట్టు ఒక పత్రిక నేడు ప్రకటించింది.
‘ఆ పత్రిక  పాలసీ  తెలిసినదే కాబట్టి జవాబులు ఎలా వుండబోతున్నాయో తెలుసుకోవడానికి రేపటివరకు ఆగక్కరలేద’ని వాట్స్ ఆప్ లో ఒక అభిప్రాయం చక్కర్లు కొడుతోంది. మరో పత్రిక ఇదే రకమైన సర్వే చేస్తే పబ్లిక్  పల్స్ మరో రకంగా వుంటుందని ముక్తాయింపు ఇచ్చారు కూడా!

సర్వేల మీద జనం నమ్మకం తగ్గిపోతోందా! పత్రికల మీద విశ్వాసం సడలిపోతోందా!!  
ఇది తెలుసుకోవడానికి ఇంకో సర్వే అవసరమవుతుందేమో!
సర్వే జనా సుఖినోభవంతు  

కామెంట్‌లు లేవు: