20, ఏప్రిల్ 2014, ఆదివారం

ఎండా వానకు పెళ్ళంట!


ఒక పక్క పెటపెట లాడించే వేసవి ఎండ. మరో పక్క అదేసమయంలో జనం తడిసి ముప్పందుం అయ్యేలా రాజకీయుల వాగ్దాన వర్షాలు.  ఇదీ స్థూలంగా  ఇప్పుడు ఆంధ్ర ప్రదేశ్ లో వాతావరణ పరిస్తితి.


నామినేషన్ల పర్వం ముగియడంతో నేతలు చెలరేగిపోతున్నారు. నోటికి వచ్చిన వాగ్దానాలను జనంమీద జడివానలా కురిపిస్తున్నారు. నరం లేని నాలుకతో కల్లబొల్లి కధలు చెబుతున్నారు. అరచేతిలో స్వర్గం చూపెడుతున్నారు. ఈరోజు చెప్పిన మాటలు కనీసం ఈ సాయంత్రానికి గుర్తుంటాయో లేదో ఆ పరాత్పరుడికే ఎరుక.

కామెంట్‌లు లేవు: