13, ఆగస్టు 2021, శుక్రవారం

మంచి పలుకు

శ్రీ పీఠం ఆద్యాత్మిక మాస పత్రిక తాజా సంచికలో శ్రీ సామవేదం షణ్ముఖ శర్మ ప్రవచించిన సుభాషితం:


“గంగను భువికందించిన భగీరధుని కధను రామాయణంలో కూడా వివరించారు. సగరులను తరింపచేయడానికి గంగను భువికి తీసుకురావాలని వారి పుత్రుడు అంశుమంతుడు తపస్సు చేశాడు. కానీ తన జీవితకాలంలో సాధించలేకపోయాడు. తరువాత అతని కుమారుడు దిలీపుడు తపమాచరించాడు. ఆయన వల్ల కూడా సాధ్యం కాలేదు. అటుపై దిలీపతనయుడు భగీరధుడు తపస్సు చేసి గంగను సాధించాడు.
గంగను సాధించిన భగీరధుడి వద్దకు బ్రహ్మ వచ్చి, ‘నాయనా! నీ పెద్దలు సాధించలేనిది నువ్వు సాధించావు’ అని ప్రశంసించాడు. వెంటనే భగీరధుడు, ‘స్వామీ! అది నిజం కాదు. వారు చేసిన తపస్సు నా దాకా వచ్చి నా దగ్గర ఫలించింది. అంతే! నా పూర్వీకులే చేయకుంటే, నాతోనే తపస్సు ప్రారంభమైతే, ఇది ఫలించడానికి మరో రెండు తరాలు పట్టేది. మా పూర్వీకులు నా వరకు తీసుకువచ్చిన తపోరూప సూత్రాన్ని నేను అందుకుని సాధించగలిగాను’ అని సమాధానమిచ్చాడు.
దానికి విరించి, ‘అద్భుతంగా చెప్పావు. నీ వినయం, వివేకం గొప్పవి. నువ్వు గంగని సాధించడం ఒక ఎత్తు, ఈ మాట ఒక్కటీ ఒక ఎత్తు’ అని అభినందించాడు.
(శ్రీ పీఠం, ఆధ్యాత్మిక మాస పత్రిక, ఆగస్టు సంచిక నుంచి)
(13-08-2021)

1 కామెంట్‌:

అజ్ఞాత చెప్పారు...

adhbutham.