1, ఏప్రిల్ 2016, శుక్రవారం

పాత జ్ఞాపకం



2004 నుంచి 2009 వరకు ఐదేళ్ళపాటు ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ శాసనసభకు కే.ఆర్. సురేష్  రెడ్డి స్పీకర్ గా పనిచేశారు. ఆ రోజుల్లో ఆయన పూనికపై అసెంబ్లీ వ్యవహారాలు చూసే జర్నలిష్టులకు వృత్తిపరమైన విషయాల్లో తోడ్పడేందుకు అసెంబ్లీ ప్రెస్  గ్యాలరీ కమిటీ ఏర్పాటు చేశారు. దాసు కేశవరావు (హిందూ) చైర్మన్ గా, దేవులపల్లి అమర్ (అప్పట్లో ఆంధ్రప్రభ) కన్వీనర్ గా వున్న ఆ  కమిటీలో  రేడియో తరపున నేనూ ఒక సభ్యుడిని. ఆ రోజుల్లో  స్పీకర్ తో కలిసి ఈ కమిటీ సభ్యులం దిగిన ఒక ఫోటోను మిత్రుడు వ్యాకరణం రామ సుబ్రహ్మణ్యం షేర్ చేశాడు.


అతడికి కృతజ్ఞతలు.   

కామెంట్‌లు లేవు: