26, మే 2015, మంగళవారం

దేవుడు నిర్దయుడు


శనివారం ఉదయం పదిన్నరకు ఫోను మోగిందంటే అది ఖచ్చితంగా  టీవీ నిస్సార్ నుంచే.

(నిస్సార్)

'రేపు ఆదివారం ఉదయం మాకు టైం ఇవ్వాలి' వద్దువద్దన్నా ఇదే మాట ప్రతిసారీ, ప్రతివారం  చెప్పేవాడు. కల్మషం లేని నమ్రత అతడి మాటల్లో నాకు కనబడేది.
ఎన్నో ఏళ్ళుగా ప్రతి శనివారం తప్పనిసరిగా నిస్సార్ నుంచి వచ్చే ఫోను ఇక నుంచి నాకు రాదు. ఫోన్ కాదు ఎప్పుడూ నవ్వుతూ వుండే అతడి మొహాన్ని కూడా నేను జీవితంలో చూడలేను. ఎందుకంటె అతడిక లేడు.
పొద్దున్న మహా టీవీకి వెడుతుంటే టీవీ 5  విజయ్ నారాయణ్ ఫోను చేసి చెప్పారు. నిస్సార్ కి  రాత్రి మాసివ్ హార్ట్ అటాక్ వచ్చి కన్ను మూసాడని. సొంతూరు కర్నూలు జిల్లా కొడుమూరుకు తీసికెళ్ళారని.  
మూడు పదులు దాటిన నిస్సార్ కి అప్పుడే నూరేళ్ళు నిండిపోయాయి. యెంత కష్టమో అతడి కుటుంబానికి.

దేవుడు నిర్దయుడు. ఎవరికీ ఇష్టం లేని ఇలాటి పనులు చేస్తుంటాడు. దయామయుడు కూడా. తెలిసిన వారందరూ ఇష్టపడే నిస్సార్ ని తాను  కూడా ఇష్టపడి తన దగ్గరకు రప్పించుకున్నాడు.  

PHOTO COURTESY SRI NARAYANA MURTHY  

కామెంట్‌లు లేవు: