17, అక్టోబర్ 2014, శుక్రవారం

ఓ నీతి కధ


సీ.ఈ.ఓ. ఏకాంబరం కారు దిగుతున్నాడని తెలిస్తే చాలు ఆఫీసు ఆఫీసంతా నిశ్శబ్దం. ఎవరి పనుల్లోకి వాళ్ళు దూరిపోతారు. ఎవరన్నా ఖాళీగా వున్నట్టు కనబడితే చాలు ఇక అంతే  సంగతులు. ఆఫీసులో అదే ఆఖరి రోజనుకోవాలి. ఒకరోజు ఆయన మెట్లు దిగివస్తుంటే ఒకడు వరండాలో  దిక్కులు చూస్తూ కనబడ్డాడు. ఏకాంబరం కోపం నషాళానికి అంటింది. 'నీ ఫేస్ నచ్చలేదు. నీ తరహా నచ్చలేదు. ఒక్క క్షణం ఇక్కడ వుంటానికి వీల్లేదు' అంటూ, 'నీ జీతం యెంత' అని అడిగాడు.  వాడు బిక్కు బిక్కుమంటూ 'ఐదువేలు' అన్నాడు. ఏకాంబరం  మేనేజర్ని పిలిచాడు. మూడు నెలలు జీతం పదిహేను వేలు అప్పటికప్పుడే అతడి చేతిలో పెట్టించాడు. వాడు దణ్ణాలు పెడుతూ వెళ్ళిన తరువాత అడిగాడు ఏకాంబరం- 'వాడు ఎవడు, ఏ డిపార్ట్ మెంటులో పనిచేస్తాడ'ని. వచ్చిన సమాధానం విని ఏకాంబరం బిక్కచచ్చి పోయాడు.
ఆ వచ్చిన వాడు, ఎంచక్కా పదిహేనువేలు పట్టుకెళ్ళిన వాడు అసలు ఆ ఆఫీసు ఉద్యోగే కాదు. పిజ్జా డెలివరీ ఇవ్వడానికి వచ్చిన వాడు.
నీతి:  "అయినచోటా  కాని చోటా వూరికే ఎగిరెగిరి పడడం అంత మంచిది కాదు"
(పార్ధసారధి గారు పోస్ట్ చేసిన ఇంగ్లీష్ కధకు స్వేచ్చానువాదం)

1 కామెంట్‌:

hari.S.babu చెప్పారు...

ఆ పిజ్జా దెలివరీ వాడు నక్కని తొక్కి వచ్చి వుంటాడా?