18, మార్చి 2014, మంగళవారం

అయోమయం పార్టీలు


గెలుపు తధ్యం అంటారు. ఎదుటి పార్టీలు తుడిచిపెట్టుకుపోతాయంటారు. ప్రజలు తమకు పట్టం కట్టడానికే సిద్ధమైపోయారని చెబుతారు. రాబోయే రాజ్యం తమదే అని కాబోయే సీఎం  తామే అని బల్లగుద్ది చెబుతుంటారు. అన్ని పెద్దపార్టీలదీ దాదాపు ఇదే వరస. మరి అంత భరోసా వుంటే పక్క గూటి పక్షులు వచ్చి చేరుతుంటే అంత సంతోషపడడాలు, కండువాలు కప్పి ఫోటోలు తీయించుకోవడాలు, పత్రికల్లో వేయించుకోవడాలు   ఎందుకో అర్ధం కాదు. ఎన్నికల ముహూర్తం దగ్గర పడే సమయంలో కంచె దూకుతున్న జంపు జిలానీలు పార్టీలకి బలుపా వాపా. ఏవిటో అంత వరదలో కొట్టుకుపోతున్నట్టుగా వుంది. నిలబడి ఆలోచించే తీరిక వోపిక ఎవరికీ వున్నట్టు లేవు.       

కామెంట్‌లు లేవు: