భాష పరిపుష్టి కావాలంటే కొత్త పదాలు పుట్టాల్సిందే. అలా పుట్టించిన వాళ్లకి వీర తాళ్ళు వేయాల్సిందే. కాదనను. కానీ అనువాదం పేరుతొ పుట్టించే కొత్త అనువాద పదాలతోనే చిక్కంతా.
19, జులై 2021, సోమవారం
అభ్యసన అనగానేమి? – భండారు శ్రీనివాసరావు
పార్లమెంటు సమావేశాలు
ఈరోజు సోమవారం నుంచి పార్లమెంటు సమావేశాలు మొదలు.
సాంప్రదాయకంగా
జరిగే అఖిలపక్ష సమావేశం ఒక రోజు ముందుగా నిర్వహించారు. సభ సజావుగా సాగడానికి
ప్రతిపక్షాలు సహకరించాలని ప్రభుత్వం, ప్రజాసమస్యల ప్రస్తావన చేయడానికి తమకు తగినంత వ్యవధానం ఇవ్వాలని
విపక్షాలు పరస్పరం విన్నవించుకున్నాయి. అలా ఈనాటి సమావేశంలో ఉభయులు అంగీకారానికి
వచ్చినట్టు టీవీల్లో స్క్రోలింగులు అయితే పరుగులు తీసాయి.
ఈ బుద్ధి
బుధవారం దాకా వుంటే బూరెలు వండి పెడతాను అందట ఓ భార్య మొగుడితో.
చూద్దాం
ఏం జరుగుతుందో!
17, జులై 2021, శనివారం
దేవుళ్ళు మిస్సింగ్
ఏదో ఛానల్ కు వెళ్ళి ఇంటికి తిరిగొచ్చేసరికి ముక్కోటి దేవుళ్ళందరూ హూష్ కాకి.
మిస్సింగ్ కేసు
కాదనీ,
వాళ్ళందరికీ మా
ఆవిడ గ్రహణం విడుపు అభ్యంగనస్నానం చేయిస్తోందని ఆలస్యంగా అందిన సమాచారం.
అమ్మయ్య! గ్రహణం
విడుపు స్నానాలు పూర్తయి దేవుళ్ళందరూ తమ గూటికి చేరారు. పుష్పాలంకరణ ఒక్కటే ఈ
పూటకి మిగిలింది.
ఆ పని కూడా పూర్తి
చేస్తేనే కానీ మా ఆవిడ టీవీ రిమోట్ ముట్టుకోదు. సీరియళ్ళ రేటింగుల్లో కాస్త
ఆటుపోట్లు వుండే అవకాశం వుంది.
17-7-2019
సరిగ్గా నెల తర్వాత ఆ దేవుళ్ళు అందరూ వున్నారు, ఒక్క మా ఆవిడ
తప్ప.
16, జులై 2021, శుక్రవారం
మా ఆవిడతో మాట్లాడాలని వుంది
కాలం చెల్లినవాటికి చెల్లుచీటీ – భండారు శ్రీనివాసరావు
(Published in Andhraprabha dated 18-07-2021, SUNDAY)
భారత ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ ఎన్వీ రమణ చక్కని మాట చెప్పారు.
కాలం
చెల్లిన చట్టాలకు ఇకనైనా చెల్లు చీటీ రాయాలని.
భేషైన
మాట. అందరి మనసులో వున్న మాట.
భారత
శిక్షాస్మృతి లోని 124 -ఏ సెక్షన్
అనేది ఈనాటిది కాదు. దేశానికి స్వాతంత్రం రానప్పుడు, 1860 లో నాటి బ్రిటిష్ ప్రభుత్వం మొదటిసారి శిక్షాస్మృతిని అమల్లోకి తెచ్చింది.
మొదట్లో దేశద్రోహ నేరానికి సంబంధించిన ఈ 124 -ఏ సెక్షన్ అనేది భారత శిక్షాస్మృతి (ఐ.పి.సి.) లో
లేదు. తర్వాత పదేళ్లకు అంటే 1870లో ఈ నిబంధనను కొత్తగా చేర్చారు. జాతిపిత గాంధీజీ పుట్టి ఆనాటికి ఏడాది మాత్రమే అయింది. తదనంతర
కాలంలో అంటే స్వాతంత్ర ఉద్యమం తీవ్రంగా సాగుతున్న రోజుల్లో ఈ సెక్షన్ ను నాటి
బ్రిటిష్ పాలకులు దుర్వినియోగం చేస్తున్న తీరుకు కినిసి, మహాత్మా గాంధి సయితం ఈ సెక్షన్ ను గట్టిగా వ్యతిరేకించారు.
పౌరుల స్వేచ్ఛను అణచివేయడానికే దీన్ని రూపొందించారని ఆయన పలుమార్లు విమర్శించారు.
గాంధీజీ ఒక్కరే కాదు,
స్వాతంత్రానంతరం మొదటి ప్రధాని అయిన పండిట్ జవహర్ లాల్ నెహ్రూ సయితం, ప్రధాని
హోదాలోనే ఈ 125 -ఏ సెక్షన్ ను తప్పుబట్టారు.
”ఇది చాలా చెడ్డది. ఎంత త్వరగా వదిలించుకుంటే అంత మంచిది”
అని అనేవారు.
నెహ్రూ చనిపోయి ఏండ్లూపూండ్లు గడిచిన తర్వాత కూడా ఏ
పాలకులు కూడా ఈ సెక్షన్ గురించి పట్టించుకోకపోవడంతో ఈ బ్రిటిష్ చట్టం 150 ఏళ్ళ నుంచి
అమల్లోనే వుంది. ఉపయోగించిన సందర్భాలు, విచారణ జరిగి శిక్షలు పడిన సందర్భాలు తక్కువే
అయినప్పటికీ ప్రజాస్వామ్య దేశంలో ఇంకా రాజద్రోహ చట్టం ఏమిటి అనే ప్రశ్నకు సరయిన
జవాబు ఇంకా దొరకలేదు.
గతంలో కూడా 124 -ఏ సెక్షన్
న్యాయస్థానాల దృష్టికి రాకపోలేదు. 1958 లోనే అలహాబాదు హైకోర్టు ఈ సెక్షన్ రాజ్యాంగ వ్యతిరేకమని
అంటూ దాన్ని కొట్టివేసింది. దరిమిలా పంజాబు హైకోర్టు సయితం కొట్టివేసింది. అయితే
సుప్రీంకోర్టు ఒక కేసును విచారిస్తూ ఈ రెండు హైకోర్టుల తీర్పులను పక్కన పెట్టింది.
ఈ సెక్షన్ రాజ్యాంగపరంగా చెల్లుతుందని, అయితే అదొక మినహాయింపు మాత్రమేనని
పేర్కొంది. కేవలం ప్రభుత్వాన్ని విమర్శించడం అనేది రాజద్రోహ నేరం కాదని స్పష్టం
చేసింది. దాంతో ఈ చట్టానికి మళ్ళీ సంజీవని పుల్ల తాకించినట్టు అయింది.
ఇప్పుడు మళ్ళీ ఎడిటర్స్ గిల్డ్ తో పాటు ఒక మాజీ
సైనికాధికారి ఈ అంశంపై వేసిన పిటీషన్లను సుప్రీం ధర్మాసనం గత గురువారం నాడు
విచారణకు స్వీకరించడమే కాకుండా కేంద్ర ప్రభుత్వానికి నోటీసులు జారీ చేయడంతో ఈ అంశం
మళ్ళీ దేశ వ్యాప్త చర్చకు దారి తీసింది. ఈ సందర్భంగా ధర్మాసనానికి నేతృత్వం
వహించిన ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ రమణ చేసిన వ్యాఖ్యలు మరింత తీవ్రమైన వాడివేడి
చర్చలకు కారణమయ్యాయి.
“వలసవాద ప్రభుత్వం రూపొందించిన ఈ చట్టం ఇంకా ఎన్నాళ్ళు? రాజద్రోహం
సెక్షన్ ను ఎందుకు రద్దు చేయడం లేదు? స్వాతంత్రోద్యమ కాలంలో గాంధి, బాలగంగాధర్ తిలక్ వంటి నాయకుల నోళ్ళు నొక్కడానికినాటి
ప్రభుత్వం ఈచట్టాన్ని వాడుకుంటే, ఈనాడు అదే చట్టాన్ని అధికారులు ఎడాపెడా వాడేస్తున్నారు”
అని ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ రమణ అని వ్యాఖ్యానించారు.
సుప్రీం తన అభిప్రాయం తెలిపింది. అయితే దీనిమీద కేంద్రం
ఏ చర్య తీసుకుంటుందో చూడాల్సివుంది. సుప్రీం సూచనలకు అనుగుణంగా 124 -ఏ సెక్షన్
ను రద్దు చేయాలని నిర్ణయిస్తే ఏ పేచీ వుండదు.
ఏ చట్టాన్ని
అయినా దాన్ని రద్దు చేసేంతవరకు అది చట్టం దృష్టిలో చెల్లుబాటు అయ్యే చట్టమే
అని కొందరు న్యాయ కోవిదులు అంటున్నారు.
లోగడ
కృష్ణయ్యర్ గారని ఓ న్యాయాధిపతి వుండేవారు. ఆయనది ఓ కొత్తదారి. పేరుకు ముందు
జస్టిస్ అని తగిలించకపోయినా ఏమీ అనుకునేవారు కాదు. జడ్జీలకు, న్యాయవాదులకు మధ్య సాంప్రదాయ
గౌరవవాచకాలు ఆయనకు గిట్టేవి కావు. న్యాయమూర్తులు
పొడుగుపాటి గౌన్లు,
రోబ్స్ ధరించాలనే సాంప్రదాయాలు ఆయనకు నచ్చేవి కావు. అంతే కాదు, న్యాయ పీఠం మీద కూర్చున్న
న్యాయమూర్తికి, కోర్టులో వాదించే న్యాయవాదులకు నడుమ దూరం పాటించడం, జడ్జీలు తమ ఆసనాలపై కూర్చునేటప్పుడు, తిరిగి లేచేటప్పుడు బంట్రోతులు వారు ఆసీనులు కావడానికి,
లేవడానికి వీలుగా వారి ఆసనాలను వెనక్కీ
ముందుకు జరపడం అసలు ఇష్టపడేవారు కాదు. ‘లీగల్లీ స్పీకింగ్’ అనే పేరుతొ రాసిన పుస్తకంలో జస్టిస్ కృష్ణయ్యర్
ఈ అంశాలను పేర్కొన్నారు. న్యాయ వ్యవస్థలో ఇటువంటి సమూల సంస్కరణలు రావాలని ఆయన
కోరుకున్నారు కానీ ఆయన జీవిత కాలంలో నెరవేరలేదు.
ఇప్పుడు
మళ్ళీ న్యాయ వ్యవస్థలో సంస్కరణలు గురించిన మాటలు వినబడుతున్నాయి. మంచిదే. సుప్రీం
కోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ ఎన్వీ రమణ కూడా పలుసందర్భాలలో ఈ విషయం
ప్రస్తావిస్తూ వస్తున్నారు. ఒక అడుగు అంటూ ముందుకు పడితే అది భారీ సంస్కరణలకు
దోహదపడే అవకాశం వుంటుంది.
అచ్చంగా ఇలాంటిది కాకపోయినా కాలం చెల్లిన తర్వాత కూడా
చెల్లుబాటులో ఉన్న కొన్ని అంశాలు మనకు చరిత్రలో దొరుకుతాయి.
వాటిల్లో కొన్ని.
ఉద్యోగం
వుండదు కానీ ఉద్యోగం చేసే ఉద్యోగి ఉంటాడు. ఇదెక్కడి విరోధాభాసం అంటారా!
మనలో
చాలామంది హైదరాబాదులోని ఆకాశవాణి కేంద్రాన్ని ఎప్పుడో ఒకప్పుడు సందర్శించే వుంటారు.
రేడియో కేంద్రం సింహద్వారం పక్కనే ఓ స్తంభానికి వేలాడుతూ తళతళ మెరుస్తూ వుండే ఓ
ఇత్తడి గంట కనిపిస్తుంది.
రేడియో
స్టేషన్ లో ఈ ధర్మగంట అవసరం ఏమిటి? అనే
ఆలోచన నిత్యం నన్ను వేధిస్తూ
వుండేది.(అక్కడ పనిచేసే రోజుల్లో)
విచారించగా
తెలిసింది ఏమిటంటే ఏదైనా ఎమర్జెన్సీ పరిస్థితి తలెత్తినప్పుడు, అదే సమయంలో కరెంటు సరఫరాకు అంతరాయం ఏర్పడినప్పుడు అందరినీ
అప్రమత్తం చేయడానికి ఆ గంటను మోగిస్తారని
తెలిసింది. మూడు దశాబ్దాల నా
ఉద్యోగపర్వంలో ఒక్కసారి కూడా ఆ గంట మోగించిన దాఖలా లేదు. ఆ గంటను శుభ్రంగా తుడిచి
పదిలంగా కాపాడడానికి ప్రత్యేకంగా ఓ
ఉద్యోగి వుండేవాడేమో కూడా తెలియదు.
ఒకానొకకాలంలో,
బహుశా
స్వాతంత్రానికి పూర్వం అనుకుంటాను, భద్రాచలం ఏజెన్సీ ప్రాంతంలో పనిచేసే ప్రభుత్వ
వైద్యులకు రవాణా సదుపాయాలు సరిగా ఉండేవి కావు. రహదారులు అధ్వానంగా ఉండేవి. ఎటు
పోవాలన్నా ఎడ్ల బండ్లే శరణ్యం. ఆ రోజుల్లో, అలాంటి ప్రాంతాల్లో ప్రభుత్వ వైద్యులకు జీపు బదులు ఎడ్ల బండి
ఏర్పాటు వుండేది. ఒక బండి, అది
సర్కారు వాహనం కాబట్టి జత ఎడ్లు,
వాటికి గ్రాసం, బండిని నడపడానికి జీపు డ్రైవర్
మాదిరిగా ఒక పనివాడు, ఈ
తతంగం అంతా నడవడానికి ప్రభుత్వ ఖజానా నుంచి బిల్లుల చెల్లింపు ఇలా సాగిపోయేది.
కొన్నేళ్ళ
తరువాత ఆ ప్రాంతాల్లో రహదారి సౌకర్యాలు కొద్దో గొప్పో మెరుగు పడడం వల్ల సర్కారీ
విల్స్ జీపులు రంగ ప్రవేశం చేయడంతో,
ఎడ్లబండ్ల
అవసరం లేకుండాపోయింది. అయినా కూడా చాలా కాలంపాటు ఆ వ్యవస్థ రికార్డుల్లో కొనసాగేది
అని చెప్పుకునేవారు. 1970 ప్రాంతాల్లో
అక్కడ పనిచేయడానికి వెళ్ళిన ఒక డాక్టరు గారికి మనుషులకు వైద్యం చేసే
దవాఖానాలో ఈ పశుగ్రాసం బిల్లులేమిటి అని అనుమానం వచ్చి ఆరా తీస్తే ఈ అసలు
విషయం బయట పడింది.
మనలో
చాలామంది పూర్వపు తహసీల్ కచేరీలు చూసి వుంటారు.
పంకాలు లేని ఆ కాలంలో తహసీల్ దొరగారు కూర్చొనే సీటు మీద ఒక పెద్ద గుడ్డ
పంకా వుండేది. ఒక బంట్రోతు దొరవారు దాన్ని అటూఇటూ తాడుతో లాగుతూ వుంటే అయ్యవారు
మెల్లగా వీచే ఆ చల్లగాలిలో సేద తీరుతూ రాచకార్యాలు చక్కబెడుతూ వుండేవారు.
తరవాత్తరవాత
విద్యుత్ పంకాలు వచ్చాయి కానీ గుడ్డ పంకాలు లాగే కొలువు మాత్రం చాలాకాలం
కొనసాగింది.
మన
దేశానికి స్వతంత్రం వచ్చిన కొత్తల్లో అమలు చేసిన పంచవర్ష ప్రణాళికల ధర్మమా అని
అన్ని స్థాయిల్లో రకరకాల ప్రభుత్వ ఉద్యోగాలు పుట్టుకు వచ్చాయి. మా చిన్నతనంలో మా
ఊరికి వి.ఎల్.డబ్ల్యు. అనే ఉద్యిగి
కొత్తగా వచ్చాడు. అప్పటిదాకా కరణం,
మునసబు మాత్రమే ప్రభుత్వం అనుకునేవారు. అలాగే బ్లాకు డెవలప్మెంట్ ఆఫీసర్ (బీడీవో)
ఉద్యోగం కూడా కొత్తగా వచ్చిందే. ఇప్పుడు అవే ఉద్యోగాలు పాతపడి పేర్లు మారిపోయి వుంటాయి.
‘ఒక
గుంతను తవ్వు. ఆ గుంతను పూడ్చు. గుంత తవ్విన వాడికి ఓ ఉద్యోగం, దాన్ని పూడ్చిన వాడికి మరో ఉద్యోగం”
ఈ పద్దతిలో అనేక ఉద్యోగాలు. అయినా దేశంలో నిరుద్యోగ సమస్య అలాగే వుంది.
(EOM)
15, జులై 2021, గురువారం
డాక్టర్ కె.ఎల్. రావు రోడ్డు - భండారు శ్రీనివాసరావు
(జులై,15, డాక్టర్ కె.ఎల్.రావు జయంతి)
13, జులై 2021, మంగళవారం
గుర్తింపుకో కార్డు
రోడ్డు మీద పోతుంటే పోలీసు ఆపి నువ్వెవరు అంటే పలానా అని చెబితే సరిపోదు. జేబులోనుంచి ఓ కార్డు తీసి ఇదిగో ఇది నేను అని చెప్పాలి. అప్పుడే అతడు నమ్మే వీలుంది, నమ్ముతాడని నమ్మకం లేకపోయినా. అంటే ఏమిటన్నమాట. మనమెవరో మన నోటితో చెప్పినా నమ్మని వాడు, మన కార్డు తీసి పలానా అంటే నమ్మే చాన్స్ వుంది. అందుకే ఈ కలియుగంలో మనుషులకన్నా కార్డులకే విలువ ఎక్కువ. అవి మనకి ఒక గుర్తింపు ఇస్తాయి.
జ్ఞానపీఠాలు, పద్మశ్రీలు, దాదా సాహెబ్ లు, స్వర్ణ
నందులు ఒక రకం గుర్తింపులే. అవి పెట్టిపుట్టిన
వారికి.
పుట్టి
కూడా పుట్టినట్టు దాఖలా కోసం కావాల్సిన గుర్తింపులు మరి కొన్ని. ఉదాహరణకు బర్త్ సర్టిఫికేట్. స్కూలు ఫైనల్ లేదా టెన్త్ క్లాస్ (పుట్టిన తేదీ
నిర్ధారణ కోసం), కులం సర్టిఫికేట్ (అవసరాన్ని బట్టి), నివాస స్థలం గుర్తింపు, బ్యాంకు (ఏటీఎం) కార్డు, ఇక ఆధార్ సరేసరి. ఇవన్నీ ఓ మోస్తరు బతుకులకోసం.
ఇంకొంచెం ముదిరితే పాస్ పోర్టు,
వీసా, బ్యాంక్ క్రెడిట్ కార్డు ప్లాటినం, గోల్డ్ ఎట్సెట్రా ఎట్సెట్రా.
పాతికేళ్ళు
వచ్చేవరకు ఈ కార్డుల గోల పెద్దగా లేదు. పుట్టిన తేదీ పదో తరగతి సర్టిఫికేట్ లోనే
వుంది కాబట్టి ఉద్యోగ పర్వం వరకు దానితోనే నెట్టుకొచ్చాను.
హైదరాబాదులో
ఉద్యోగం వచ్చిన తర్వాత మొదట అవసరం పడింది రేషన్ కార్డు. అదీ పంచదార కోసం.
అందరిలాగే ప్రయత్నించాను. లాభం లేకపోయింది. చేస్తున్న ఉద్యోగం దుర్వినియోగం చేయక
తప్పలేదు. వెళ్లి అప్పటి రెవెన్యూ మంత్రి
పి. నరసారెడ్డి గారితో చెప్పాను. ఆయన పియ్యేను పిలిచి నాకు సంబంధించిన ఏరియా
తాసీల్దారును ఆఫీసుకు పిలిపించారు. అధికార ముద్రతో సహా రమ్మని చెప్పారు. ఆయన
ఆఘమేఘాల మీద సచివాలయానికి వచ్చారు. నన్ను కూర్చోబెట్టుకుని వివరాలు తీసుకుని
స్టాంపు వేసి రసీదు ఇచ్చారు. సాయంత్రం కల్లా రేషన్ కార్డు నాకు ఆఫీసులో ఇచ్చి
వెళ్ళారు.
తరువాత
కౌలాలంపూర్ తెలుగు మహాసభలకు వెళ్ళడానికి పాస్ పోర్టు అవసరం వచ్చింది. అప్పుడు
ముఖ్యమంత్రి అంజయ్య గారు. సీఎం ఆఫీసు చొరవతో అది ఇంటికే వచ్చింది, ఇరవై నాలుగ్గంటల్లో.
అమెరికా
వెళ్ళడానికి పదేళ్ల వీసా కూడా చెన్నై వెళ్ళకుండా, ఇంటర్వ్యూ కు హాజరు కాకుండా చెన్నై
ఎంబసీ వాళ్ళే పోస్టులో పంపారు. అలాగే మా ఆవిడ వీసా కూడా. అది నేను చేస్తున్న
ఉద్యోగం చలవే.
బ్యాంకు
కార్డు వద్దనుకున్నాను. కానీ ఒక బ్యాంకు వాళ్ళు ఆఫీసుకు వచ్చి మొహమాట పెట్టి మరీ
ఇచ్చారు. ఇవ్వడం ఇచ్చారు కానీ దానితో పడ్డ బాధలు అన్నీ ఇన్నీ కాదు. ఆ క్రెడిట్
కార్డు లేకపోతె బహుశా నాకు జీవితంలో బీపీ
రోగం వచ్చేది కాదేమో! అది మాత్రం ఆ బ్యాంకు వాళ్ళ పుణ్యమే. బ్యాంకుల వాళ్ళు కూడా
డబ్బు(బాకీ) వసూళ్ళకు ప్రైవేటు ఏజెన్సీల (గూండాల) ను నియమించుకుంటారని అప్పుడే
తెలిసింది. దాంతో క్రెడిట్ కార్డు వదుల్చుకుని డెబిట్ కార్డు తీసుకున్నాను.
ఆధార్
కార్డుకు పెద్ద ప్రయాస పడలేదు. ఆధార్ కార్డుల శకం మొదలయిన కొత్తల్లోనే
తీసుకున్నాను, పెద్ద ఇబ్బంది పడకుండా. ఇంటిపక్కనే ఆధార్ నమోదు కేంద్రం పెట్టారు. వెళ్లి
పదిహేను నిమిషాల్లో నేనూ మా ఆవిడా వేలిముద్రలు, కనుపాప ముద్రలు ఇచ్చి కార్డులు తెచ్చేసుకున్నాం. కాకపోతే దానిమీద ఫోటో decomposed dead body లాగా వుందని, ఇంటి నుంచి
కంప్యూటర్ ద్వారా ప్రయత్నించి మరో కార్డు తీసుకున్నాము. అలాగే ఓటరు గుర్తింపు కార్డు.
విధిగా
తీసుకోవాల్సి వచ్చిన మరో రెండు కార్డులు
వెహికిల్ రిజిస్ట్రేషన్ కార్డు, PAN కార్డు,
స్కూటర్ కొన్న కొత్తల్లో డ్రైవింగ్ లైసెన్స్ కార్డు. ఈ మూడు కూడా
పెద్ద కష్టపడకుండానే నా కార్డుల సంతానంలో చేరాయి.
ఇక
వృత్తి రీత్యా అవసరమైన ప్రెస్ అక్రిడేషన్ కార్డు. 1975 నుంచి ఇప్పటివరకు అవిచ్చిన్నంగా కొనసాగుతోంది, గత నలభయ్ ఆరేళ్లుగా.
దానికి అనుబంధ కార్డులు మరి కొన్ని వుంటాయి. ఆర్టీసీ వాళ్ళు ఇచ్చే ఉచిత సిటీ బస్సు
కార్డు,
రాష్ట్రంలో ఎక్కడికైనా మూడో వంతు
టిక్కెట్టు ధరతో తిరిగే మరో కార్డు. స్కూటరు యోగం పట్టిన తర్వాత సిటీ బస్సు పాసు
వదిలేసాను. కారు కొన్న తర్వాత రెండోదానికీ నీళ్ళు వదిలాను.
వృత్తికి అవసరమైన మరో కార్డు వుంది. విజిటింగ్ కార్డు. ఈ శ్రీనివాసరావు పలానా సుమా అని తెలియచెప్పే
కార్డు. అయితే దానితో నాకు ఎప్పుడూ అవసరం పడలేదు. నా పేరే నా విజిటింగ్ కార్డు
అనుకునేవాడిని. ఎవరినైనా కలవాల్సినప్పుడు చీటీ మీద నా పేరు రాసి పంపేవాడిని. అయితే
ఈ పప్పులు ఈ కాలంలో ఉడకవు అనుకోండి.
పొతే, సగంధరతో దేశంలో ఏ తరగతిలో అయినా ప్రయాణించే రైల్వే
పాసు. అదేదో గుర్తుకోసం అన్నట్టుగా వుండేది కానీ వాడిన సందర్భాలు బహు తక్కువ.
మాస్కోలో వున్న అయిదేళ్ళూ మాస్కో రేడియో వారి గుర్తింపు
కార్డు (ప్రోపుస్కా) వుండేది. రేడియోలో ప్రవేశానికే కాదు, మాస్కోలో తిరిగేటప్పుడు కూడా గుర్తింపు కోసం హమేషా అది
దగ్గర ఉంచుకోవాల్సి వచ్చేది.
విచిత్రం ఏమిటంటే నేను సుదీర్ఘ కాలం పనిచేసిన రేడియో, దూరదర్సన్
లలో కూడా సిబ్బందికి ప్రత్యేక గుర్తింపు కార్డులు ఇచ్చేవాళ్ళు. కానీ నేను
తీసుకోలేదు. ఇక ప్రెసిడెంట్, ప్రధాని వంటి వీవీఐపీల పర్యటనల సందర్భంలో ప్రత్యేకంగా
జారీ చేసే ఫోటో గుర్తింపు కార్డులు. సరే. ఇవి తాత్కాలికం అనుకోండి.
రిటైర్ అయిన తర్వాత పెన్షనర్ కార్డు,
సీ.జీ.హెచ్.ఎస్. కార్డు అదనంగా వచ్చి పర్సులో చేరాయి.
మరోటి వుంది. అది ప్రెస్ క్లబ్ కార్డు. ఢిల్లీ, బెంగుళూరు
క్లబ్బుల్లో పనికొస్తుంది కాబట్టి అదొకటి వుంటుంది ఎప్పుడూ.
జేబులు కొట్టేవాడి కన్ను నా వాలెట్ మీద పడితే ఆశ్చర్యం
లేదు, ఎందుకంటే
అన్ని కార్డులు కడుపులో పెట్టుకుని నా పర్సు బలిసిన పిల్ల పందిలా వుండేది. కానీ
అదేమిటో విచిత్రం చాలా ప్రాంతాలు తిరిగాను, కొన్ని
దేశాలు తిరిగాను. ఒక్కసారంటే ఒక్కసారి కూడా నా జేబు కొట్టే జేబుదొంగ నాకు తారసపడలేదు.
ఇప్పుడు కొన్ని కాలనీల్లో నివసించేవారికి లోపలకు వచ్చేందుకు కొత్తరకం ఎలెక్ట్రానిక్ కార్డులు ఇస్తున్నారట. ఇంతవరకు ఆ కార్డు అవసరం పడలేదు.