HAPPY NEW YEAR – 2011
వొత్తిలా వెలగండి
కత్తిలా మెరవండి
కొత్త ఏడాదిలో
ఎత్తుగా ఎదగండి
అత్తరువు గంధమై
చిత్తరువు చందమై
కొత్త ఏడాది
మిము హత్తుకోవాలి!
నూతన సంవత్సర శుభాకాంక్షలతో – HAPPY NEW YEAR
-నిర్మలాదేవి, భండారు శ్రీనివాసరావు – హైదరాబాద్
25, డిసెంబర్ 2010, శనివారం
17, డిసెంబర్ 2010, శుక్రవారం
నమ్మకం - భండారు శ్రీనివాసరావు
నమ్మకం - భండారు శ్రీనివాసరావు
ఆ మెయిన్ రోడ్డు తిన్నగా పొతే మా మనుమరాళ్ళు చదువుకునే బెల్ వ్యూ స్కూలు వస్తుంది. కానీ అది ఒక మలుపు తిరిగే చోట మరో రోడ్డు పక్కనుంచి వచ్చి దానిలో కలుస్తుంది. ఆ దోవన వచ్చే వాహనదారులు ఆ రెండు రోడ్లు కలిసే చోట కాసేపు ఆగి, మెయిన్ రోడ్డులో వేరే వాహనాలు ఏవీ రావడం లేదన్న సంగతి ధ్రువ పరచుకుని కానీ ఆ రోడ్డులోకి ప్రవేశించేవారు కారు.అయితే, హైదరాబాద్ ట్రాఫిక్కు అలవాటు పడివున్న నాకు మాత్రం ఆ వాహనాలు అదే వేగంతో మెయిన్ రోడ్డులోకి దూసుకు వస్తాయేమో అన్న భీతి పీడిస్తూ వుండేది. “ఎందుకంత స్పీడు. కాస్త పక్కగా వచ్చే కార్లను చూసుకుని నడపకూడదా!” అనేవాడిని మావాడితో.
“నమ్మకం” అనేవాడు మా వాడు స్తిరంగా.
“అలా దూసుకు రావని ఇక్కడ మా నమ్మకం. వచ్చి తీరుతాయని హైదరాబాదులో మీ నమ్మకం. మా నమ్మకంతో ఇక్కడ మేమిలా స్పీడుగా పోగలుగుతున్నాం. మీ నమ్మకంతో అక్కడ మీరలా ఆచి తూచి నడుపుతున్నారు. ఏదయినా అక్కడ మిమ్మల్నీ, ఇక్కడ మమ్మల్నీ నడుపుతోంది నమ్మకమే!” అన్నాడు అమెరికాలో పదేళ్ళ నుంచి వుంటున్న మా వాడు మరింత నమ్మకంగా.
అమెరికన్లు ఒక పట్టాన ఎవరినీ నమ్మరంటారు. కానీ వారి జీవితాలన్నీ కేవలం ‘నమ్మకం’ ప్రాతిపదికపై నిశ్చింతగా నడిచిపోతున్నాయి.
చెక్కు ఇస్తే చెల్లుతుంది అన్న నమ్మకం.
వస్తువు కొంటే నాణ్యత వుంటుందన్న నమ్మకం, నచ్చని వస్తువును తిరిగి వాపసు చేయగలమన్న నమ్మకం,
కారు నడిపేటప్పుడు వెనుకనుంచో, పక్కనుంచో అడ్డదిడ్డంగా వేరే వాహనాలు దూసుకు రావన్న నమ్మకం,
ఫ్రీ వేస్ మినహాయిస్తే మిగిలిన రోడ్లను జీబ్రా క్రాసింగ్ ల వద్ద దాటేటప్పుడు ఎంతటి వేగంతో వచ్చే వాహనమయినా స్పీడు తగ్గించి కాలినడకనపోయేవారికి దోవ ఇస్తుందన్న నమ్మకం,
బహిరంగ ప్రదేశాలలలో పొరబాటున యెంత ఖరీదయిన వస్తువును మరచిపోయినా దాన్ని పరాయివారు పొరబాటున కూడా వేలేసి తాకరన్న నమ్మకం,
పలానా టైం కు వస్తామని చెబితే ఖచ్చితంగా మాట నిలబెట్టుకుంటారన్న నమ్మకం,
అవతల వ్యక్తి ఏమిచెప్పినా అది మనల్ని మోసం చేయడానికే అన్న భావం ఏకోశానా వుండకూడదనే నమ్మకం-
ఇలా నమ్మకాలమీద ఆధారపడి వారి జీవితాలు నమ్మకంగా గడిచిపోతున్నాయి.
ఇలాటి నమ్మకం ఏదయినా,
ఒక్కటంటే ఒక్కటయినా మనకూ వుందని నమ్మకంగా చెప్పగలమా? లేదని మాత్రం ఘంటాపధంగా చెప్పగలము.
ఎందుకంటే – ఈ అరవై ఏళ్ళ పైచిలుకు స్వతంత్ర ప్రజాస్వామ్యం మనకిచ్చిందీ, మిగిల్చిందీ ఏమోకానీ ‘నమ్మకం’ అన్న పదాన్ని జీవితాల్లో కనబడకుండా చేసింది.
నాయకులు తమ అనుచరులనే నమ్మరు.
నీడలా వెన్నంటే వుంటూ, తందానా అనకముందే తాన అని అంటూ, ప్రతి చిన్న విషయంలో ఆహా ఓహో అని భజన చేసే కార్యకర్తలు – కడకంతా తమ వెంట వుండరన్న అపనమ్మకం నాయకులది.
అనుచరులు నాయకులని నమ్మరు.
తమ నాయకుడు ‘తన నాయకుడికి’ ఎలా పంగనామాలు పెట్టాడో అన్న వాస్తవానికి వాళ్ళే ప్రత్యక్ష సాక్షులు కాబట్టి. అవసరమయితే నిచ్చెన మెట్లెక్కినట్టు నాయకుడి తలపైనే కాలుమోపి పైమెట్టుకి ఎగబాకాలనే తాపత్రయం వారిది.
జనం ఈ కార్యకర్తలని నమ్మరు.
ఎందుకంటె తమపేరు చెప్పి వసూలు చేసే మొత్తంలో తమకు ముట్టినదెంతో అణాపైసలతో సహా వారికి లెక్కలు తెలుసు కాబట్టి.
జనాన్ని రాజకీయులు నమ్మరు.
ఎన్నికలు కాగానే మళ్ళీ ఎన్నికలు వచ్చేదాకా వారితో పనేమిటన్నది వారి నమ్మకం.
ఇక మీడియా.
ఒక ఛానల్ ను మరో ఛానల్ నమ్మదు. అందుకే ఒకే వార్త రెండురకాలుగా కనిపిస్తుంది. వినిపిస్తుంది.
ఒక పత్రికను మరో పత్రిక నమ్మదు. ఒక పత్రికలో వచ్చిన వార్తను మరో పత్రిక వ్యాఖ్యాన సహితంగా ఏకిపారేస్తుంది.
ఇప్పుడు చెప్పండి!
నమ్మకం గురించి ఎవరయినా మాట్లాడినా,
నమ్మకస్తులు గురించి ప్రస్తావించినా
నమ్మొచ్చునంటారా?
(17-12-2010)
ఆ మెయిన్ రోడ్డు తిన్నగా పొతే మా మనుమరాళ్ళు చదువుకునే బెల్ వ్యూ స్కూలు వస్తుంది. కానీ అది ఒక మలుపు తిరిగే చోట మరో రోడ్డు పక్కనుంచి వచ్చి దానిలో కలుస్తుంది. ఆ దోవన వచ్చే వాహనదారులు ఆ రెండు రోడ్లు కలిసే చోట కాసేపు ఆగి, మెయిన్ రోడ్డులో వేరే వాహనాలు ఏవీ రావడం లేదన్న సంగతి ధ్రువ పరచుకుని కానీ ఆ రోడ్డులోకి ప్రవేశించేవారు కారు.అయితే, హైదరాబాద్ ట్రాఫిక్కు అలవాటు పడివున్న నాకు మాత్రం ఆ వాహనాలు అదే వేగంతో మెయిన్ రోడ్డులోకి దూసుకు వస్తాయేమో అన్న భీతి పీడిస్తూ వుండేది. “ఎందుకంత స్పీడు. కాస్త పక్కగా వచ్చే కార్లను చూసుకుని నడపకూడదా!” అనేవాడిని మావాడితో.
“నమ్మకం” అనేవాడు మా వాడు స్తిరంగా.
“అలా దూసుకు రావని ఇక్కడ మా నమ్మకం. వచ్చి తీరుతాయని హైదరాబాదులో మీ నమ్మకం. మా నమ్మకంతో ఇక్కడ మేమిలా స్పీడుగా పోగలుగుతున్నాం. మీ నమ్మకంతో అక్కడ మీరలా ఆచి తూచి నడుపుతున్నారు. ఏదయినా అక్కడ మిమ్మల్నీ, ఇక్కడ మమ్మల్నీ నడుపుతోంది నమ్మకమే!” అన్నాడు అమెరికాలో పదేళ్ళ నుంచి వుంటున్న మా వాడు మరింత నమ్మకంగా.
అమెరికన్లు ఒక పట్టాన ఎవరినీ నమ్మరంటారు. కానీ వారి జీవితాలన్నీ కేవలం ‘నమ్మకం’ ప్రాతిపదికపై నిశ్చింతగా నడిచిపోతున్నాయి.
చెక్కు ఇస్తే చెల్లుతుంది అన్న నమ్మకం.
వస్తువు కొంటే నాణ్యత వుంటుందన్న నమ్మకం, నచ్చని వస్తువును తిరిగి వాపసు చేయగలమన్న నమ్మకం,
కారు నడిపేటప్పుడు వెనుకనుంచో, పక్కనుంచో అడ్డదిడ్డంగా వేరే వాహనాలు దూసుకు రావన్న నమ్మకం,
ఫ్రీ వేస్ మినహాయిస్తే మిగిలిన రోడ్లను జీబ్రా క్రాసింగ్ ల వద్ద దాటేటప్పుడు ఎంతటి వేగంతో వచ్చే వాహనమయినా స్పీడు తగ్గించి కాలినడకనపోయేవారికి దోవ ఇస్తుందన్న నమ్మకం,
బహిరంగ ప్రదేశాలలలో పొరబాటున యెంత ఖరీదయిన వస్తువును మరచిపోయినా దాన్ని పరాయివారు పొరబాటున కూడా వేలేసి తాకరన్న నమ్మకం,
పలానా టైం కు వస్తామని చెబితే ఖచ్చితంగా మాట నిలబెట్టుకుంటారన్న నమ్మకం,
అవతల వ్యక్తి ఏమిచెప్పినా అది మనల్ని మోసం చేయడానికే అన్న భావం ఏకోశానా వుండకూడదనే నమ్మకం-
ఇలా నమ్మకాలమీద ఆధారపడి వారి జీవితాలు నమ్మకంగా గడిచిపోతున్నాయి.
ఇలాటి నమ్మకం ఏదయినా,
ఒక్కటంటే ఒక్కటయినా మనకూ వుందని నమ్మకంగా చెప్పగలమా? లేదని మాత్రం ఘంటాపధంగా చెప్పగలము.
ఎందుకంటే – ఈ అరవై ఏళ్ళ పైచిలుకు స్వతంత్ర ప్రజాస్వామ్యం మనకిచ్చిందీ, మిగిల్చిందీ ఏమోకానీ ‘నమ్మకం’ అన్న పదాన్ని జీవితాల్లో కనబడకుండా చేసింది.
నాయకులు తమ అనుచరులనే నమ్మరు.
నీడలా వెన్నంటే వుంటూ, తందానా అనకముందే తాన అని అంటూ, ప్రతి చిన్న విషయంలో ఆహా ఓహో అని భజన చేసే కార్యకర్తలు – కడకంతా తమ వెంట వుండరన్న అపనమ్మకం నాయకులది.
అనుచరులు నాయకులని నమ్మరు.
తమ నాయకుడు ‘తన నాయకుడికి’ ఎలా పంగనామాలు పెట్టాడో అన్న వాస్తవానికి వాళ్ళే ప్రత్యక్ష సాక్షులు కాబట్టి. అవసరమయితే నిచ్చెన మెట్లెక్కినట్టు నాయకుడి తలపైనే కాలుమోపి పైమెట్టుకి ఎగబాకాలనే తాపత్రయం వారిది.
జనం ఈ కార్యకర్తలని నమ్మరు.
ఎందుకంటె తమపేరు చెప్పి వసూలు చేసే మొత్తంలో తమకు ముట్టినదెంతో అణాపైసలతో సహా వారికి లెక్కలు తెలుసు కాబట్టి.
జనాన్ని రాజకీయులు నమ్మరు.
ఎన్నికలు కాగానే మళ్ళీ ఎన్నికలు వచ్చేదాకా వారితో పనేమిటన్నది వారి నమ్మకం.
ఇక మీడియా.
ఒక ఛానల్ ను మరో ఛానల్ నమ్మదు. అందుకే ఒకే వార్త రెండురకాలుగా కనిపిస్తుంది. వినిపిస్తుంది.
ఒక పత్రికను మరో పత్రిక నమ్మదు. ఒక పత్రికలో వచ్చిన వార్తను మరో పత్రిక వ్యాఖ్యాన సహితంగా ఏకిపారేస్తుంది.
ఇప్పుడు చెప్పండి!
నమ్మకం గురించి ఎవరయినా మాట్లాడినా,
నమ్మకస్తులు గురించి ప్రస్తావించినా
నమ్మొచ్చునంటారా?
(17-12-2010)
లేబుళ్లు:
అమెరికన్లు,
నమ్మకం,
భండారు శ్రీనివాసరావు
15, డిసెంబర్ 2010, బుధవారం
ముళ్ళ బాటలో ముఖ్యమంత్రి - భండారు శ్రీనివాసరావు
ముళ్ళ బాటలో ముఖ్యమంత్రి - భండారు శ్రీనివాసరావు
అద్దంలో మొహం ఎలా కనబడుతుంది?
ఉన్నది ఉన్నట్టుగానే కనబడుతుంది. ఎందుకంటె అద్దం అబద్దం చెప్పదు కనుక.
మరోలా కనబడాలంటే ఏమి చెయ్యాలి? ఊహించుకోవడం ఒక్కటే మిగిలినదారి.
అదే ఇప్పుడు జరుగుతోంది ఆంద్ర ప్రదేశ్ లో.
పత్రికల్లో, మీడియాలో ఎక్కడ చూసినా ఊహాగానాలే! ఏమిజరుగుతుందో విశ్లేషించి వివరించేవారికన్నా ఏమి జరగాలని తమ అంతరాంతరాల్లో అభిలషిస్తున్నారో దాన్నే ప్రస్తుత పరిస్తితులకు అన్వయించి భాష్యం చెప్పేవారు ఎక్కువయ్యారు. రాజకీయనాయకులకే కాదు రాజకీయ విశ్లేషకులకు కూడా మినహాయింపు లేకపోవడమే ఇందులోని విషాదం.
నిన్న మొన్నటివరకు ప్రాంతీయ సమస్య ప్రధాన భూమిక పోషించిన రాష్ట్రంలో ఈనాడు రాజకీయమంతా ఒక వ్యక్తి చుట్టూ పరిభ్రమిస్తోంది. నిజానికి నిండా నాలుగు పదుల వయస్సు లేదు. క్రియాశీలక రాజకీయాల్లోకి అడుగుపెట్టి ఏన్నర్ధం కూడా కాలేదు. చూడగానే ఆకట్టుకునే విగ్రహం కాదు. పట్టుమని పది నిమిషాలపాటయినా తన ప్రసంగాలతో ప్రజలను కట్టిపడేసే చాతుర్యం ఏమయినా వుందా అంటే అదీ లేదు.
అయినా వై ఎస్ జగన్ మోహన రెడ్డి సభలకు వేలం వెర్రిగా జనం ఎందుకలా వస్తున్నారు?
ఈ ఒక్క ప్రశ్నే అందర్నీ కలవరపెడుతోంది. అయితే, ఇది సమాధానం లేని ప్రశ్న కాదు. పైపెచ్చు అనేక సమాధానాలున్న ప్రశ్న. ముందు చెప్పినట్టు ఎవరి ఉద్దేశ్యాలకు తగ్గట్టుగా వారు ఊహించుకుంటూ జవాబులు వెతుక్కుంటూ వుండడంవల్ల ఎన్నెన్నో రకాల ఊహాగానాలు ఊపిరి పోసుకుంటున్నాయి. ఏమి జరగబోతున్నదన్న దానిపై మరెన్నో రకాల వదంతులు చెలరేగుతున్నాయి. జగన్ అనుకూల, ప్రతికూల కధనాలతో మీడియా వీటికి మరింత ఊతం ఇస్తోంది.
నూటపాతికేళ్ల చరిత్ర కలిగిన కాంగ్రెస్ పార్టీకి ఇలాటి వొడిదుడుకులు కొత్తేమీ కాదన్నది ఆ పార్టీలోని జగన్ వ్యతిరేకుల భావం. ఈరకమయిన తిరుగుబాటుదార్లు లోగడ ఎంతోమంది పార్టీని వొదిలిపెట్టి వెళ్లి, ఆ తరువాత జరిగిన ఎన్నికల్లో తమది బలుపుకాదు వాపు అని తెలుసుకుని మళ్ళీ పార్టీలో బుద్ధిగా చేరిపోయిన గతాన్ని గుర్తుచేయడం వారి వాదం లోని భాగం. కొత్తొక వింత అన్న చందాన జనం జగన్ ని చూడడానికి వెడుతున్నారని కొందరూ, గత ఎన్నికల్లో చిరంజీవి, జూనియర్ ఎన్టీయార్ సభలకు వచ్చిన జనాలను గుర్తుచేస్తూ – అప్పుడేమి జరిగిందో ఇప్పుడూ అదే జరగబోతోందని మరికొందరూ, డబ్బులు వెదజల్లే స్తోమత వుండాలే కానీ ఈ మాత్రం జనం తమ సభలకూ వస్తారని ఇంకొందరూ తమ వాదనలకు పదును పెట్టుకుంటున్నారు. ఇప్పుడున్న వాడినీ వేడినీ
మరో మూడేళ్ళు పైబడి కొనసాగించడం అంత ఆషామాషీ వ్యవహారం కాదని, ఈనాడు జగన్ కు వున్న ధన వనరులు, జన వనరులు వచ్చే ఎన్నికలకల్లా కళ్ళ ఎదుటే కరిగిపోవడం ఖాయమన్నది వారి నిశ్చితాభిప్రాయం. అధికారం వున్నప్పుడు అంటిపెట్టుకు తిరిగే వీరవిధేయులు అది దూరం కాగానే అంత త్వరగానే దూరం జరుగుతారనే రాజకీయ ధర్మసూక్ష్మాలను జగన్ వ్యతిరేకులు గుర్తు చేస్తున్నారు. ప్రజాసేవమీద కన్నా జగన్ కు ముఖ్యమంత్రి గద్దెపై యావ ఎక్కువన్నది వారు ఎక్కుబెడుతున్న విమర్శనాస్త్రాలలో ప్రధానమైనది. వైఎస్ రాజశేఖరరెడ్డి నిరుడు హెలికాప్టర్ దుర్ఘటనలో మరణించిన తరవాత వారసత్వంగా లభించాల్సిన ముఖ్యమంత్రి పదవిని తనకు దక్కనివ్వ లేదన్న అక్కసుతో, పార్టీ అధిష్టానంపై కక్ష కట్టి కొత్త పార్టీ పెట్టేందుకు జగన్ సిద్ధపడ్దాడన్నది ఆ బోంట్ల మరో ఆరోపణ. అవినీతి మార్గాలలో సంపాదించిన డబ్బును పెట్టుబడిగా పెట్టి మరో మార్గంలో అధికార పీఠం అధిరోహించడం అతడి ఏకైక లక్ష్యమని గత ఏడాది పైగా సాగుతూ వస్తున్న జగన్ వ్యతిరేక ప్రచారం లోని మరో పార్శ్వం. ఓదార్పు యాత్ర పేరుతొ రాష్ట్రమంతటా కలయ తిరగడం వెనుక, పైకి కనబడని రాజకీయ ఉద్దేశ్యాలున్నాయన్నది జగన్ వ్యతిరేకులు పార్టీ అధిష్టానానికి చేరవేసిన ఆంతరంగిక సమాచారం.
ఏతావాతా ఏమయితేనేమి – ఏడాది గడవకముందే ఈ ప్రచారం పనిచేసింది. జగన్ కూ, ఢిల్లీ లోని పార్టీ పెద్దలకు నడుమ దూరం పెరిగింది. వైఎస్సార్ జీవించి వున్నంతవరకు ఢిల్లీ నాయకులవద్ద ఆటలు సాగని వైఎస్ వ్యతిరేకులకూ, వైఎస్ హయాములో రాష్ట్ర వ్యవహారాలపై పట్టు కోల్పోయిన అధిష్టాన దేవతలకూ- వైఎస్ ఆకస్మిక మరణం ఒక మహత్తర అవకాశంగా దొరికింది. స్వతంత్ర భావాలుకలిగి, పిన్న వయస్సులోవున్న జగన్ కు ముఖ్యమంత్రి పదవి అప్పగిస్తే మరో నాలుగేళ్ళు రాష్ట్రం వంక కన్నెత్తి చూసే అవకాశం, పెత్తనం చేసే సావకాశం వుండదనే వైఎస్ వ్యతిరేకుల మంత్రం అధిష్టానం పై పనిచేసింది. ఫలితం- అధికార పగ్గాలను రోశయ్యగారికి అప్పగించడం. తాత్కాలిక ఏర్పాటు అన్నది శాశ్వితంగా కొనసాగే సూచనలు కానరావడంతో జగన్ వర్గం లో అలజడి మొదలయింది. పార్టీలో, ప్రభుత్వంలో నామమాత్రపు గుర్తింపు లేకపోవడం ఆ వర్గాన్ని అసహనానికి గురిచేసింది. ప్రజలకిచ్చిన మాట పేరుతొ ఓదార్పు యాత్ర ప్రారంభించడం ఒక్కటే జగన్ వర్గానికి ప్రత్యామ్నాయంగా మిగిలింది. రాష్ట్ర కాంగ్రెస్ లోని వైఎస్ వ్యతిరేకులు- ఈ యాత్రకు రాజకీయ రంగు పులమడం జగన్ వర్గానికి బాగా కలిసొచ్చింది. వైఎస్ హఠాన్మరణంతో గుండె పగిలిన వారి కుటుంబాలకు సొంత డబ్బుతో ఆర్ధిక సాయం అందించేందుకు జగన్ తలపెట్టిన ఓదార్పు యాత్రకు అడ్డంకులు కల్పించడం జగన్ పట్ల సానుభూతిని పెంచింది. ఈ క్రమంలో జగన్ సానుకూల, ప్రతికూల వర్గాల నడుమ సాగిన వాదప్రతివాదాలు ముదిరి పాకానపడి జగన్ కు జనం లో హీరో స్తాయిని కట్టబెట్టాయి. పార్టీలో పెద్దలంతా ఒకవైపు, జగన్ ఒక్కడూ ఒకవైపూ వుండి నడిపిన ‘రాజకీయం’ సాధారణ జనంలో జగన్ పట్ల సానుభూతి మరింత పెరిగేలా చేసింది. జగన్ అంశాన్ని పిల్ల కాకి వ్యవహారంగా పరిగణిస్తూ వచ్చిన పార్టీ అధిష్టానం – రోశయ్యను ముఖ్యమంత్రిగా తొలగించి ఆ స్తానంలో కిరణ్ కుమార్ రెడ్డిని కూర్చోబెట్టి రాష్ట్ర పార్టీపై తన పట్టును మరో మారు ప్రదర్శించింది.
ఇటు జగన్ కూడా ఈ రాజకీయ క్రీడలో ఏమాత్రం వెనుకబడకుండా మరో అడుగు ముందుకు వేసి పార్లమెంట్ సభ్యత్వాన్నీ, పార్టీ ప్రాధమిక సభ్యత్వాన్నీ వొదులుకుని, తల్లి విజయమ్మతో అసెంబ్లీకి రాజీనామా చేయించి అధిష్టానంపై తొలి యుద్ధభేరి మోగించాడు. అటు పార్టీ పెద్దలు కూడా త్వరత్వరగా పావులు కదిపి జగన్ వర్గాన్ని దెబ్బతీసేందుకు వైఎస్ సోదరుడు వివేకానందరెడ్డికి మంత్రి పదవి కట్టబెట్టి ఎదురు దెబ్బతీసారు. గత్యంతరం లేని స్తితిలో జగన్ కొత్త పార్టీ ఏర్పాటు చేస్తున్నట్టు ప్రకటించి రాష్ట్ర కాంగ్రెస్ రాజకీయాలను కొత్త మలుపు తిప్పారు. తమిళనాడు తరహాలో ప్రాంతీయ పార్టీల ఆవిర్భావానికీ, భవిష్యత్తులో వాటి ప్రాబల్యానికి నాంది పలికారు.
కిరణ్ కుమార్ రెడ్డి ముఖ్యమంత్రిగా బాధ్యతలు స్వీకరించగానే అనుసరించిన వ్యవహార శైలి సీనియర్ సహచరులకు మనస్తాపం కలిగించినప్పటికీ – స్వతంత్రంగా వ్యవహరించగల ముఖ్యమంత్రి మళ్ళీ లభించాడని సాధారణ జనం సంతోషించారు. యువకుడు, విద్యాధికుడు స్వయంగా క్రీడాకారుడు అయిన కొత్త ముఖ్యమంత్రి, సమధికోత్సాహంతో పనిచేసి రాజశేఖరరెడ్డి మాదిరిగా కాంగ్రెస్ ముఖ్యమంత్రుల్లో మంచి పేరు తెచ్చుకోగలడని చాలామంది ఆశించారు. కానీ మంత్రుల శాఖల పంపిణీలో తలెత్తిన విభేదాలు, వాటిని సర్దుబాటు చేయడానికి ముఖ్యమంత్రి చేసిన ఢిల్లీ యాత్రలు - ఈ ఆశలపై నీళ్ళు చల్లాయి. అలాగే ముఖ్యమంత్రి గద్దెపై కూర్చున్నమొదటి రోజునుంచీ సొంత పార్టీలో చెలరేగిన లుకలుకలు ఆయన ప్రతిష్టను పెంచకపోగా కొంతమేరకు మసకబార్చాయనే చెప్పాలి. మంత్రివర్గ కూర్పులో సొంత సామాజిక వర్గానికి పెద్ద పీట వేసి, బలహీనవర్గాలను చిన్న చూపు చూసారన్న విమర్శ కొత్త ముఖ్యమంత్రికి తగిలిన తొలి దెబ్బ.
భారీ వర్షాలకు దెబ్బతిన్న ప్రాంతాలను పరిశీలించే సమయంలో కూడా తన వయస్సుకు తగ్గ వ్యవహారశైలిని ఆయన ప్రదర్శించ లేకపోయారన్నది ఆయన ఎదుర్కుంటున్న మరో విమర్శ. గతంలో ముఖ్యమంత్రులుగా పనిచేసిన చంద్రబాబు నాయుడు కానీ, రాజశేఖరరెడ్డి కానీ ఇటువంటి సందర్భాలను సద్వినియోగం చేసుకున్న దాఖలాలను పరిశీలకులు ప్రస్తావిస్తున్నారు. రాజీవ్ గాంధీ ప్రధాన మంత్రిగా వున్నప్పుడు ఖమ్మం జిల్లాలో వరద తాకిడికి గురయిన ప్రాంతాలలో పర్యటించినప్పుడు, మండుటెండలో ఇసుక మేట వేసిన పొలాల్లో చెమటలు కక్కుతూ తిరుగుతూ - ప్రభుత్వం ప్రజల వెంటే వుందన్న భరోసా కలిగించిన సంఘటనలను గుర్తు చేస్తున్నారు. మరోపక్క, అదేసమయంలో - జగన్, చంద్రబాబు, చిరంజీవి - బాధిత ప్రాంతాల్లో కలయ తిరిగి తమ పర్యటనల నుంచి రాజకీయ ప్రయోజనం రాబట్టుకునే ప్రయత్నం చేసిన విషయాలను ఉదహరిస్తున్నారు.
అలాగే, రైతు సంక్షేమ రాజ్యం తెస్తామన్న రాజశేఖరరెడ్డి ప్రభుత్వానికి వారసుడిగా వచ్చిన కిరణ్ కుమార్ రెడ్డి –శాసనసభలో ప్రతిపక్షాలు, రైతుల దుస్తితిపై లేవనెత్తిన వివాదాలను సమర్ధంగా ఎదుర్కోవడంలో విఫలమయ్యారనే విమర్శలను మూట గట్టుకోవాల్సిన పరిస్తితిలో పడిపోవడం మరో విషాదం. అలాగే విద్యార్ధుల అరెస్ట్ వ్యవహారం –అసెంబ్లీ స్పీకర్ గా విశేష అనుభవం గడించిన కిరణ్ కుమార్ రెడ్డికి గొంతులో వెలక్కాయ మాదిరిగా తయారయింది. గోటితో పోయేదాన్ని గొడ్డలి వరకు తెచ్చుకున్నారనే అపవాదును అంటగట్టింది. శాసన సభ జరుగుతున్న సమయంలోనే కొందరు పార్టీ శాసన సభ్యులు జగన్ అనుకూల వైఖరిని బాహాటంగా ప్రదర్శించడం నూతన ముఖ్యమంత్రికి అదనపు తలనొప్పిగా మారింది.
తెలంగాణా ప్రాంతానికి ఉపముఖ్యమంత్రి పదవి ఇవ్వడం జరుగుతుందని బాధ్యతలు స్వీకరించగానే ఆర్భాటంగా ప్రకటించి ఇంతవరకు మళ్ళీ ఆ ఊసు ఎత్తకపోవడం, స్పీకర్ పదవిని భర్తీ చేయకుండానే డిప్యూటీ స్పీకర్ తోనే శాసన సభ సమావేశాలను ముగించాలని చూడడం – ముఖ్యమంత్రి స్వతంత్ర వ్యవహార శైలికి అద్దం పట్టేవిగా లేని విషయాన్ని కూడా పరిశీలకులు ఎత్తి చూపుతున్నారు.
అధిష్టానం ఆశీస్సులతో ముఖ్యమంత్రి పీఠం ఎక్కిన కిరణ్ కుమార్ రెడ్డికి ఆ పదవి ముళ్ళ కిరీటం వంటిదని ఈపాటికే అర్ధం అయివుండాలి. ఒక్క కిరీటం మాత్రమె కాదు ముందున్న దారి కూడా ముళ్ళ బాట మాదిరిగానే కానవస్తోంది. అన్నింటికంటే పెద్ద సమస్య ఈ నెలాఖరులో ఎదురవబోతోంది. యావదాంధ్రలోకం ఎంతో ఆసక్తిగా ఎదురు చూస్తున్న శ్రీ కృష్ణ కమిషన్ నివేదిక ఆలోపునే వెలువడబోతోంది. ఈ లోపున రైతు సమస్యలపై తాడో పేడో తేల్చుకోవడానికి అటు జగన్, ఇటు చంద్రబాబు సంధించిన నిరాహార దీక్షల తూటాలు పేలబోతున్నాయి. కేసుల ఎత్తివేత గురించి విద్యార్ధుల ఆందోళన, వాళ్ల పక్షాన నిలబడుతున్న టీ ఆర్ ఎస్ తాకిడినీ ప్రభుత్వం ఏకకాలంలో ఎదుర్కోవాల్సి వుంది. ఈ మధ్యలో సందట్లో సడేమియా లాగా సొంత పార్టీలో రాజుకుంటున్న ‘కుంపట్ల’ విషయం సరేసరి.
బహుశా ఇన్ని రకాల వొత్తిళ్లకు ఏకైక ఉపశమనం ‘ఆటలు’ మాత్రమె అనే నిర్ణయానికి వచ్చి- స్వయంగా క్రీడాకారుడయిన ముఖ్యమంత్రి కిరణ్ కుమార్ రెడ్డి, ‘ఇండియా ఓపెన్ గ్రాండ్ ప్రిక్స్ బాడ్మింటన్ టోర్నమెంట్’ ప్రారంభోత్సవం సందర్భాన్ని అనువుగా తీసుకుని కోట్ల విజయభాస్కరరెడ్డి ఇండోర్ స్టేడియంలో కాసేపు బాడ్మింటన్ ఆడి సేదదీరే ప్రయత్నం చేసి వుంటారని అనుకోవాలి. (15-12-2010)
వినదగునెవ్వరు చెప్పిన: 'నిన్న మొన్నటివరకు తెలివిలవాడినన్నఅహంకారంతో ఈ ప్రపంచాన్నే మార్చాలనుకున్నాను. కానీ ఈ రోజు తెలివినపడ్డాను. అందుకే నన్ను నేనే మార్చుకుందామనే నిర్ణయానికి వచ్చాను.'
అద్దంలో మొహం ఎలా కనబడుతుంది?
ఉన్నది ఉన్నట్టుగానే కనబడుతుంది. ఎందుకంటె అద్దం అబద్దం చెప్పదు కనుక.
మరోలా కనబడాలంటే ఏమి చెయ్యాలి? ఊహించుకోవడం ఒక్కటే మిగిలినదారి.
అదే ఇప్పుడు జరుగుతోంది ఆంద్ర ప్రదేశ్ లో.
పత్రికల్లో, మీడియాలో ఎక్కడ చూసినా ఊహాగానాలే! ఏమిజరుగుతుందో విశ్లేషించి వివరించేవారికన్నా ఏమి జరగాలని తమ అంతరాంతరాల్లో అభిలషిస్తున్నారో దాన్నే ప్రస్తుత పరిస్తితులకు అన్వయించి భాష్యం చెప్పేవారు ఎక్కువయ్యారు. రాజకీయనాయకులకే కాదు రాజకీయ విశ్లేషకులకు కూడా మినహాయింపు లేకపోవడమే ఇందులోని విషాదం.
నిన్న మొన్నటివరకు ప్రాంతీయ సమస్య ప్రధాన భూమిక పోషించిన రాష్ట్రంలో ఈనాడు రాజకీయమంతా ఒక వ్యక్తి చుట్టూ పరిభ్రమిస్తోంది. నిజానికి నిండా నాలుగు పదుల వయస్సు లేదు. క్రియాశీలక రాజకీయాల్లోకి అడుగుపెట్టి ఏన్నర్ధం కూడా కాలేదు. చూడగానే ఆకట్టుకునే విగ్రహం కాదు. పట్టుమని పది నిమిషాలపాటయినా తన ప్రసంగాలతో ప్రజలను కట్టిపడేసే చాతుర్యం ఏమయినా వుందా అంటే అదీ లేదు.
అయినా వై ఎస్ జగన్ మోహన రెడ్డి సభలకు వేలం వెర్రిగా జనం ఎందుకలా వస్తున్నారు?
ఈ ఒక్క ప్రశ్నే అందర్నీ కలవరపెడుతోంది. అయితే, ఇది సమాధానం లేని ప్రశ్న కాదు. పైపెచ్చు అనేక సమాధానాలున్న ప్రశ్న. ముందు చెప్పినట్టు ఎవరి ఉద్దేశ్యాలకు తగ్గట్టుగా వారు ఊహించుకుంటూ జవాబులు వెతుక్కుంటూ వుండడంవల్ల ఎన్నెన్నో రకాల ఊహాగానాలు ఊపిరి పోసుకుంటున్నాయి. ఏమి జరగబోతున్నదన్న దానిపై మరెన్నో రకాల వదంతులు చెలరేగుతున్నాయి. జగన్ అనుకూల, ప్రతికూల కధనాలతో మీడియా వీటికి మరింత ఊతం ఇస్తోంది.
నూటపాతికేళ్ల చరిత్ర కలిగిన కాంగ్రెస్ పార్టీకి ఇలాటి వొడిదుడుకులు కొత్తేమీ కాదన్నది ఆ పార్టీలోని జగన్ వ్యతిరేకుల భావం. ఈరకమయిన తిరుగుబాటుదార్లు లోగడ ఎంతోమంది పార్టీని వొదిలిపెట్టి వెళ్లి, ఆ తరువాత జరిగిన ఎన్నికల్లో తమది బలుపుకాదు వాపు అని తెలుసుకుని మళ్ళీ పార్టీలో బుద్ధిగా చేరిపోయిన గతాన్ని గుర్తుచేయడం వారి వాదం లోని భాగం. కొత్తొక వింత అన్న చందాన జనం జగన్ ని చూడడానికి వెడుతున్నారని కొందరూ, గత ఎన్నికల్లో చిరంజీవి, జూనియర్ ఎన్టీయార్ సభలకు వచ్చిన జనాలను గుర్తుచేస్తూ – అప్పుడేమి జరిగిందో ఇప్పుడూ అదే జరగబోతోందని మరికొందరూ, డబ్బులు వెదజల్లే స్తోమత వుండాలే కానీ ఈ మాత్రం జనం తమ సభలకూ వస్తారని ఇంకొందరూ తమ వాదనలకు పదును పెట్టుకుంటున్నారు. ఇప్పుడున్న వాడినీ వేడినీ
మరో మూడేళ్ళు పైబడి కొనసాగించడం అంత ఆషామాషీ వ్యవహారం కాదని, ఈనాడు జగన్ కు వున్న ధన వనరులు, జన వనరులు వచ్చే ఎన్నికలకల్లా కళ్ళ ఎదుటే కరిగిపోవడం ఖాయమన్నది వారి నిశ్చితాభిప్రాయం. అధికారం వున్నప్పుడు అంటిపెట్టుకు తిరిగే వీరవిధేయులు అది దూరం కాగానే అంత త్వరగానే దూరం జరుగుతారనే రాజకీయ ధర్మసూక్ష్మాలను జగన్ వ్యతిరేకులు గుర్తు చేస్తున్నారు. ప్రజాసేవమీద కన్నా జగన్ కు ముఖ్యమంత్రి గద్దెపై యావ ఎక్కువన్నది వారు ఎక్కుబెడుతున్న విమర్శనాస్త్రాలలో ప్రధానమైనది. వైఎస్ రాజశేఖరరెడ్డి నిరుడు హెలికాప్టర్ దుర్ఘటనలో మరణించిన తరవాత వారసత్వంగా లభించాల్సిన ముఖ్యమంత్రి పదవిని తనకు దక్కనివ్వ లేదన్న అక్కసుతో, పార్టీ అధిష్టానంపై కక్ష కట్టి కొత్త పార్టీ పెట్టేందుకు జగన్ సిద్ధపడ్దాడన్నది ఆ బోంట్ల మరో ఆరోపణ. అవినీతి మార్గాలలో సంపాదించిన డబ్బును పెట్టుబడిగా పెట్టి మరో మార్గంలో అధికార పీఠం అధిరోహించడం అతడి ఏకైక లక్ష్యమని గత ఏడాది పైగా సాగుతూ వస్తున్న జగన్ వ్యతిరేక ప్రచారం లోని మరో పార్శ్వం. ఓదార్పు యాత్ర పేరుతొ రాష్ట్రమంతటా కలయ తిరగడం వెనుక, పైకి కనబడని రాజకీయ ఉద్దేశ్యాలున్నాయన్నది జగన్ వ్యతిరేకులు పార్టీ అధిష్టానానికి చేరవేసిన ఆంతరంగిక సమాచారం.
ఏతావాతా ఏమయితేనేమి – ఏడాది గడవకముందే ఈ ప్రచారం పనిచేసింది. జగన్ కూ, ఢిల్లీ లోని పార్టీ పెద్దలకు నడుమ దూరం పెరిగింది. వైఎస్సార్ జీవించి వున్నంతవరకు ఢిల్లీ నాయకులవద్ద ఆటలు సాగని వైఎస్ వ్యతిరేకులకూ, వైఎస్ హయాములో రాష్ట్ర వ్యవహారాలపై పట్టు కోల్పోయిన అధిష్టాన దేవతలకూ- వైఎస్ ఆకస్మిక మరణం ఒక మహత్తర అవకాశంగా దొరికింది. స్వతంత్ర భావాలుకలిగి, పిన్న వయస్సులోవున్న జగన్ కు ముఖ్యమంత్రి పదవి అప్పగిస్తే మరో నాలుగేళ్ళు రాష్ట్రం వంక కన్నెత్తి చూసే అవకాశం, పెత్తనం చేసే సావకాశం వుండదనే వైఎస్ వ్యతిరేకుల మంత్రం అధిష్టానం పై పనిచేసింది. ఫలితం- అధికార పగ్గాలను రోశయ్యగారికి అప్పగించడం. తాత్కాలిక ఏర్పాటు అన్నది శాశ్వితంగా కొనసాగే సూచనలు కానరావడంతో జగన్ వర్గం లో అలజడి మొదలయింది. పార్టీలో, ప్రభుత్వంలో నామమాత్రపు గుర్తింపు లేకపోవడం ఆ వర్గాన్ని అసహనానికి గురిచేసింది. ప్రజలకిచ్చిన మాట పేరుతొ ఓదార్పు యాత్ర ప్రారంభించడం ఒక్కటే జగన్ వర్గానికి ప్రత్యామ్నాయంగా మిగిలింది. రాష్ట్ర కాంగ్రెస్ లోని వైఎస్ వ్యతిరేకులు- ఈ యాత్రకు రాజకీయ రంగు పులమడం జగన్ వర్గానికి బాగా కలిసొచ్చింది. వైఎస్ హఠాన్మరణంతో గుండె పగిలిన వారి కుటుంబాలకు సొంత డబ్బుతో ఆర్ధిక సాయం అందించేందుకు జగన్ తలపెట్టిన ఓదార్పు యాత్రకు అడ్డంకులు కల్పించడం జగన్ పట్ల సానుభూతిని పెంచింది. ఈ క్రమంలో జగన్ సానుకూల, ప్రతికూల వర్గాల నడుమ సాగిన వాదప్రతివాదాలు ముదిరి పాకానపడి జగన్ కు జనం లో హీరో స్తాయిని కట్టబెట్టాయి. పార్టీలో పెద్దలంతా ఒకవైపు, జగన్ ఒక్కడూ ఒకవైపూ వుండి నడిపిన ‘రాజకీయం’ సాధారణ జనంలో జగన్ పట్ల సానుభూతి మరింత పెరిగేలా చేసింది. జగన్ అంశాన్ని పిల్ల కాకి వ్యవహారంగా పరిగణిస్తూ వచ్చిన పార్టీ అధిష్టానం – రోశయ్యను ముఖ్యమంత్రిగా తొలగించి ఆ స్తానంలో కిరణ్ కుమార్ రెడ్డిని కూర్చోబెట్టి రాష్ట్ర పార్టీపై తన పట్టును మరో మారు ప్రదర్శించింది.
ఇటు జగన్ కూడా ఈ రాజకీయ క్రీడలో ఏమాత్రం వెనుకబడకుండా మరో అడుగు ముందుకు వేసి పార్లమెంట్ సభ్యత్వాన్నీ, పార్టీ ప్రాధమిక సభ్యత్వాన్నీ వొదులుకుని, తల్లి విజయమ్మతో అసెంబ్లీకి రాజీనామా చేయించి అధిష్టానంపై తొలి యుద్ధభేరి మోగించాడు. అటు పార్టీ పెద్దలు కూడా త్వరత్వరగా పావులు కదిపి జగన్ వర్గాన్ని దెబ్బతీసేందుకు వైఎస్ సోదరుడు వివేకానందరెడ్డికి మంత్రి పదవి కట్టబెట్టి ఎదురు దెబ్బతీసారు. గత్యంతరం లేని స్తితిలో జగన్ కొత్త పార్టీ ఏర్పాటు చేస్తున్నట్టు ప్రకటించి రాష్ట్ర కాంగ్రెస్ రాజకీయాలను కొత్త మలుపు తిప్పారు. తమిళనాడు తరహాలో ప్రాంతీయ పార్టీల ఆవిర్భావానికీ, భవిష్యత్తులో వాటి ప్రాబల్యానికి నాంది పలికారు.
కిరణ్ కుమార్ రెడ్డి ముఖ్యమంత్రిగా బాధ్యతలు స్వీకరించగానే అనుసరించిన వ్యవహార శైలి సీనియర్ సహచరులకు మనస్తాపం కలిగించినప్పటికీ – స్వతంత్రంగా వ్యవహరించగల ముఖ్యమంత్రి మళ్ళీ లభించాడని సాధారణ జనం సంతోషించారు. యువకుడు, విద్యాధికుడు స్వయంగా క్రీడాకారుడు అయిన కొత్త ముఖ్యమంత్రి, సమధికోత్సాహంతో పనిచేసి రాజశేఖరరెడ్డి మాదిరిగా కాంగ్రెస్ ముఖ్యమంత్రుల్లో మంచి పేరు తెచ్చుకోగలడని చాలామంది ఆశించారు. కానీ మంత్రుల శాఖల పంపిణీలో తలెత్తిన విభేదాలు, వాటిని సర్దుబాటు చేయడానికి ముఖ్యమంత్రి చేసిన ఢిల్లీ యాత్రలు - ఈ ఆశలపై నీళ్ళు చల్లాయి. అలాగే ముఖ్యమంత్రి గద్దెపై కూర్చున్నమొదటి రోజునుంచీ సొంత పార్టీలో చెలరేగిన లుకలుకలు ఆయన ప్రతిష్టను పెంచకపోగా కొంతమేరకు మసకబార్చాయనే చెప్పాలి. మంత్రివర్గ కూర్పులో సొంత సామాజిక వర్గానికి పెద్ద పీట వేసి, బలహీనవర్గాలను చిన్న చూపు చూసారన్న విమర్శ కొత్త ముఖ్యమంత్రికి తగిలిన తొలి దెబ్బ.
భారీ వర్షాలకు దెబ్బతిన్న ప్రాంతాలను పరిశీలించే సమయంలో కూడా తన వయస్సుకు తగ్గ వ్యవహారశైలిని ఆయన ప్రదర్శించ లేకపోయారన్నది ఆయన ఎదుర్కుంటున్న మరో విమర్శ. గతంలో ముఖ్యమంత్రులుగా పనిచేసిన చంద్రబాబు నాయుడు కానీ, రాజశేఖరరెడ్డి కానీ ఇటువంటి సందర్భాలను సద్వినియోగం చేసుకున్న దాఖలాలను పరిశీలకులు ప్రస్తావిస్తున్నారు. రాజీవ్ గాంధీ ప్రధాన మంత్రిగా వున్నప్పుడు ఖమ్మం జిల్లాలో వరద తాకిడికి గురయిన ప్రాంతాలలో పర్యటించినప్పుడు, మండుటెండలో ఇసుక మేట వేసిన పొలాల్లో చెమటలు కక్కుతూ తిరుగుతూ - ప్రభుత్వం ప్రజల వెంటే వుందన్న భరోసా కలిగించిన సంఘటనలను గుర్తు చేస్తున్నారు. మరోపక్క, అదేసమయంలో - జగన్, చంద్రబాబు, చిరంజీవి - బాధిత ప్రాంతాల్లో కలయ తిరిగి తమ పర్యటనల నుంచి రాజకీయ ప్రయోజనం రాబట్టుకునే ప్రయత్నం చేసిన విషయాలను ఉదహరిస్తున్నారు.
అలాగే, రైతు సంక్షేమ రాజ్యం తెస్తామన్న రాజశేఖరరెడ్డి ప్రభుత్వానికి వారసుడిగా వచ్చిన కిరణ్ కుమార్ రెడ్డి –శాసనసభలో ప్రతిపక్షాలు, రైతుల దుస్తితిపై లేవనెత్తిన వివాదాలను సమర్ధంగా ఎదుర్కోవడంలో విఫలమయ్యారనే విమర్శలను మూట గట్టుకోవాల్సిన పరిస్తితిలో పడిపోవడం మరో విషాదం. అలాగే విద్యార్ధుల అరెస్ట్ వ్యవహారం –అసెంబ్లీ స్పీకర్ గా విశేష అనుభవం గడించిన కిరణ్ కుమార్ రెడ్డికి గొంతులో వెలక్కాయ మాదిరిగా తయారయింది. గోటితో పోయేదాన్ని గొడ్డలి వరకు తెచ్చుకున్నారనే అపవాదును అంటగట్టింది. శాసన సభ జరుగుతున్న సమయంలోనే కొందరు పార్టీ శాసన సభ్యులు జగన్ అనుకూల వైఖరిని బాహాటంగా ప్రదర్శించడం నూతన ముఖ్యమంత్రికి అదనపు తలనొప్పిగా మారింది.
తెలంగాణా ప్రాంతానికి ఉపముఖ్యమంత్రి పదవి ఇవ్వడం జరుగుతుందని బాధ్యతలు స్వీకరించగానే ఆర్భాటంగా ప్రకటించి ఇంతవరకు మళ్ళీ ఆ ఊసు ఎత్తకపోవడం, స్పీకర్ పదవిని భర్తీ చేయకుండానే డిప్యూటీ స్పీకర్ తోనే శాసన సభ సమావేశాలను ముగించాలని చూడడం – ముఖ్యమంత్రి స్వతంత్ర వ్యవహార శైలికి అద్దం పట్టేవిగా లేని విషయాన్ని కూడా పరిశీలకులు ఎత్తి చూపుతున్నారు.
అధిష్టానం ఆశీస్సులతో ముఖ్యమంత్రి పీఠం ఎక్కిన కిరణ్ కుమార్ రెడ్డికి ఆ పదవి ముళ్ళ కిరీటం వంటిదని ఈపాటికే అర్ధం అయివుండాలి. ఒక్క కిరీటం మాత్రమె కాదు ముందున్న దారి కూడా ముళ్ళ బాట మాదిరిగానే కానవస్తోంది. అన్నింటికంటే పెద్ద సమస్య ఈ నెలాఖరులో ఎదురవబోతోంది. యావదాంధ్రలోకం ఎంతో ఆసక్తిగా ఎదురు చూస్తున్న శ్రీ కృష్ణ కమిషన్ నివేదిక ఆలోపునే వెలువడబోతోంది. ఈ లోపున రైతు సమస్యలపై తాడో పేడో తేల్చుకోవడానికి అటు జగన్, ఇటు చంద్రబాబు సంధించిన నిరాహార దీక్షల తూటాలు పేలబోతున్నాయి. కేసుల ఎత్తివేత గురించి విద్యార్ధుల ఆందోళన, వాళ్ల పక్షాన నిలబడుతున్న టీ ఆర్ ఎస్ తాకిడినీ ప్రభుత్వం ఏకకాలంలో ఎదుర్కోవాల్సి వుంది. ఈ మధ్యలో సందట్లో సడేమియా లాగా సొంత పార్టీలో రాజుకుంటున్న ‘కుంపట్ల’ విషయం సరేసరి.
బహుశా ఇన్ని రకాల వొత్తిళ్లకు ఏకైక ఉపశమనం ‘ఆటలు’ మాత్రమె అనే నిర్ణయానికి వచ్చి- స్వయంగా క్రీడాకారుడయిన ముఖ్యమంత్రి కిరణ్ కుమార్ రెడ్డి, ‘ఇండియా ఓపెన్ గ్రాండ్ ప్రిక్స్ బాడ్మింటన్ టోర్నమెంట్’ ప్రారంభోత్సవం సందర్భాన్ని అనువుగా తీసుకుని కోట్ల విజయభాస్కరరెడ్డి ఇండోర్ స్టేడియంలో కాసేపు బాడ్మింటన్ ఆడి సేదదీరే ప్రయత్నం చేసి వుంటారని అనుకోవాలి. (15-12-2010)
వినదగునెవ్వరు చెప్పిన: 'నిన్న మొన్నటివరకు తెలివిలవాడినన్నఅహంకారంతో ఈ ప్రపంచాన్నే మార్చాలనుకున్నాను. కానీ ఈ రోజు తెలివినపడ్డాను. అందుకే నన్ను నేనే మార్చుకుందామనే నిర్ణయానికి వచ్చాను.'
లేబుళ్లు:
కిరణ్ కుమార్ రెడ్డి,
వై ఎస్ జగన్ మోహన రెడ్డి,
వైఎస్సార్
11, డిసెంబర్ 2010, శనివారం
Unwarranted row - Bhandaru Srinivas Rao (I.I.S.)
Unwarranted row - Bhandaru Srinivas Rao (I.I.S.)
High-profile Dr Jayaprakash Narayan of Lok Satta is in eye of a storm. His remarks on the floor of the AP Legislative Assembly on 'withdrawal' of cases against students indeed kicked up a row. He had not volunteered to speak, but was asked to express his opinion by the Deputy Speaker, Mr Nadendla Manohar, while dealing with the 'issue of withdrawing cases against those agitating students for separate statehood", along with other floor leaders of various parties.
Being honest IAS officer all though, what he felt he expressed it more explicitly. All he said was law should take its own course in case of those who really indulged in arson, looting and extortion. In the same breath he said petty cases registered against those students can be withdrawn. If one looks at his remarks, none should find fault. But, ironically it has come at wrong time when tempers boiling high. This was when the separatist Telangana Rashtra Samiti (TRS) determined to stall the business in the six-day assembly which begun on Friday. Comes rebuttal from the TRS young leader K T R Rao, son of the TRS President K Chandrasekhara Rao; "it’s an insult to the entire student community of the region and sought an unconditional apology." He also went to the extent of warning the former bureaucrat-turned politician of dire consequences and his movements in the city will be put to threat.
This was followed by quick pro and against protests. As a result, the Osmania University JAC held protests burning the effigies of JP (as the bureaucrat popularly known in the state). The Andhra University Students JAC too indulged in burning the effigy of the TRS leaders in their region to register their protest.
Perhaps, JP's remarks might have come in the backdrop of state police suspecting some anti-social elements indulgence during the riots and arson in the campus and elsewhere in Telangana region. More over, as a genuine concerned of student community, perhaps, he might have made such remarks. As a matter of fact, as per the law once a case is registered, it cannot be withdrawn, without trial. Can a person, who indulges in arson (burning or damaging public property) or extortion (forcible collection of money), be allowed to go scot free? Should that form part of a student's academic curriculum or pursuits? However, emotive an issue may be, law of the land spares none.
At the most, stone pelting in the recent agitation can be treated as a 'petty' case. But certainly not burning of public property like buses and extortion from business houses! If any government permit such persons go scot- free, then it would be setting a wrong precedent and future agitations, for whatever may be reasons, bound to turn more volatile and dangerous.
Having said that it also the responsibility of government to ensure that 'justice' done to the student community too! There are allegations that the police exceeded its brief while dealing with agitating students on the campus. Gory reports appeared in a section of press stating that the police not only beat up stone-pelting students, but also journalists covering it. I remember reading a report with visual how an irresponsible police official pie on a floored TV camera journalist, who was running for cover. In that backdrop, the police too might have acted in partisan manner by registering false cases. Who is right and who is wrong can be known, if one carefully examine video clips of all TV channels.
I also remember reading of a report in which none other than the Home Minister Sabita Indra Reddy apologising on behalf of police for their high handedness in OU campus.
As an observer feel, nothing wrong in demanding for withdrawal of cases against those students against whom false cases were foisted, instead wholesome, I also equally feel no fault in JP's remarks. (11-12-2010)
High-profile Dr Jayaprakash Narayan of Lok Satta is in eye of a storm. His remarks on the floor of the AP Legislative Assembly on 'withdrawal' of cases against students indeed kicked up a row. He had not volunteered to speak, but was asked to express his opinion by the Deputy Speaker, Mr Nadendla Manohar, while dealing with the 'issue of withdrawing cases against those agitating students for separate statehood", along with other floor leaders of various parties.
Being honest IAS officer all though, what he felt he expressed it more explicitly. All he said was law should take its own course in case of those who really indulged in arson, looting and extortion. In the same breath he said petty cases registered against those students can be withdrawn. If one looks at his remarks, none should find fault. But, ironically it has come at wrong time when tempers boiling high. This was when the separatist Telangana Rashtra Samiti (TRS) determined to stall the business in the six-day assembly which begun on Friday. Comes rebuttal from the TRS young leader K T R Rao, son of the TRS President K Chandrasekhara Rao; "it’s an insult to the entire student community of the region and sought an unconditional apology." He also went to the extent of warning the former bureaucrat-turned politician of dire consequences and his movements in the city will be put to threat.
This was followed by quick pro and against protests. As a result, the Osmania University JAC held protests burning the effigies of JP (as the bureaucrat popularly known in the state). The Andhra University Students JAC too indulged in burning the effigy of the TRS leaders in their region to register their protest.
Perhaps, JP's remarks might have come in the backdrop of state police suspecting some anti-social elements indulgence during the riots and arson in the campus and elsewhere in Telangana region. More over, as a genuine concerned of student community, perhaps, he might have made such remarks. As a matter of fact, as per the law once a case is registered, it cannot be withdrawn, without trial. Can a person, who indulges in arson (burning or damaging public property) or extortion (forcible collection of money), be allowed to go scot free? Should that form part of a student's academic curriculum or pursuits? However, emotive an issue may be, law of the land spares none.
At the most, stone pelting in the recent agitation can be treated as a 'petty' case. But certainly not burning of public property like buses and extortion from business houses! If any government permit such persons go scot- free, then it would be setting a wrong precedent and future agitations, for whatever may be reasons, bound to turn more volatile and dangerous.
Having said that it also the responsibility of government to ensure that 'justice' done to the student community too! There are allegations that the police exceeded its brief while dealing with agitating students on the campus. Gory reports appeared in a section of press stating that the police not only beat up stone-pelting students, but also journalists covering it. I remember reading a report with visual how an irresponsible police official pie on a floored TV camera journalist, who was running for cover. In that backdrop, the police too might have acted in partisan manner by registering false cases. Who is right and who is wrong can be known, if one carefully examine video clips of all TV channels.
I also remember reading of a report in which none other than the Home Minister Sabita Indra Reddy apologising on behalf of police for their high handedness in OU campus.
As an observer feel, nothing wrong in demanding for withdrawal of cases against those students against whom false cases were foisted, instead wholesome, I also equally feel no fault in JP's remarks. (11-12-2010)
7, డిసెంబర్ 2010, మంగళవారం
ఉసురు -భండారు శ్రీనివాసరావు
ఉసురు
చలి వొంటిని చుట్టినట్టు పట్టె పాడు ముసురు
పొయ్యి తడిసె కట్టె బిగిసె ఎట్ట కాగు ఎసరు
కలిగినింట గాసువంట లేదుకదా తంటా
వానయినా వొగ్గయినా పేదోడికే గుబులు
కడుపు చల్ల కదలకుండ
ఏసీల్లో టీవీలతో
గడిపెటోనికేముంటది
కడుపులోన దిగులు
-భండారు శ్రీనివాసరావు (07-12-2010)
చలి వొంటిని చుట్టినట్టు పట్టె పాడు ముసురు
పొయ్యి తడిసె కట్టె బిగిసె ఎట్ట కాగు ఎసరు
కలిగినింట గాసువంట లేదుకదా తంటా
వానయినా వొగ్గయినా పేదోడికే గుబులు
కడుపు చల్ల కదలకుండ
ఏసీల్లో టీవీలతో
గడిపెటోనికేముంటది
కడుపులోన దిగులు
-భండారు శ్రీనివాసరావు (07-12-2010)
19, నవంబర్ 2010, శుక్రవారం
అగ్నిమీళే పురోహితం ........ అను గ్రామఫోన్ రికార్డ్ కధ
చాలా చాలా వస్తువులు మన కళ్ళ ముందే కనుమరుగవుతున్నాయి. విశ్వనాధవారి బాణీలో చెప్పాలంటే ఇదొక పెను విషాదము.
కానీ పరిణామ క్రమంలో ఇవన్నీ తప్పని విష పరిణామాలు.
లాంతర్లు, చిమ్నీలు, రోళ్ళు, రోకళ్ళు, ఎడ్లబళ్ళు, కచ్చడం బళ్ళు, చల్ల కవ్వాలు, మేనాలు, వాటిని మోసే బోయీలు, మేనా మోస్తూ వాళ్ళు చేసే ఒహోం ఒహోం వొహ్ వోహోం వోహోంలు – ఎక్కడన్నా కనవస్తున్నాయా? ఎప్పుడన్నా వినబడుతున్నాయా?
నా చిన్నతనంలో మా సుబ్బయ్య తాతయ్య గారి దగ్గర ఓ గ్రామఫోన్ వుండేది. ధ్వని నలుగురికీ బాగా వినబడడానికి దానికి గమ్మత్తయిన ఆకారంలో వుండే ఒక స్పీకర్ తగిలించేవాళ్ళు. గ్రామ ఫోనుకు అదొక గుర్తుగా వుండేది. పాటల రికార్డులు మందపాటి భోజన పళ్ళాల మాదిరిగా పెద్దగా వుండేవి. వాటిమీద గాయనీగాయకుల పేర్లు, సినిమా పేరు, సంగీత దర్శకుడి వివరాలు ముద్రించేవాళ్ళు. గ్రామఫోనుకు గడియారం మాదిరిగా కీ ఇచ్చి, రికార్డు దానిమీదవుంచి అది తిరుగుతున్నప్పుడు ముల్లును జాగ్రత్తగా గాడిలో పెట్టేవాళ్ళు. ఆ ముల్లును గవర్నర్ అనే పరికరంలో బిగించే వాళ్ళు. రికార్డు తిరగడం ప్రారంభం కాగానే పాట మొదలయ్యేది. మా తాత గారు సంగీతం అంటే చెవికోసుకునేవారు.అందువల్ల ఆయన దగ్గర వున్నరికార్డుల్లో అన్నీ జావళీలే. ఒక్క ముక్క అర్ధం అయ్యేది కాదు. అయినా వూరు వూరంతా ఆ పాటలు వినడానికి పోగయ్యేవాళ్ళు. అంత చిన్న పెట్టెలో నుంచి పాటలు పాడుతున్నదెవరో తెలియక విస్తుపోయేవాళ్ళు. ఏదో మంత్రం పెట్టె పట్టుకొచ్చారని మా తాతగారిని అనుమానించిన వాళ్ళు కూడా వున్నారు.
పొతే, నేను రేడియోలో చేరినప్పుడు గ్రామఫోన్ రికార్డులు వుండేవి. కాకపొతే కాస్త నాజూకుగా చిన్నగా వుండేవి. ఇప్పడు వాటి జాడ కూడాలేదు. అన్నీ కంప్యూటర్ డిస్క్ లే.
రేడియోలో చేరిన కొత్తల్లో ఓ రోజు జంధ్యాల స్వయంగా రేడియో స్టేషన్ కు వచ్చి తను మొదట డైరెక్ట్ చేసిన ‘ముద్దమందారం’ సినిమా పాటల రికార్డ్ ను ప్రసారం నిమిత్తం తెచ్చి నాకిచ్చివెళ్లడం ఇప్పటికీ ఓ మధుర విషాద స్మృతి.
తన గొంతు తాను వినాలని, తన మొహం తాను చూసుకోవాలని – ప్రతి మనిషికీ కొన్ని బలహీనతలు వుంటాయంటారు. ఇలా మనసుపడని మనుషులు వుండరేమో కూడా. రేడియోలో తమ గొంతు ఒక్కసారయినా వినపడాలని తాపత్రయపడి అందుకోసం ఎంతగానో ప్రయత్నించిన పెద్దవాళ్ళు ఎందరో నా వృత్తి జీవితంలో పరిచయం అయ్యారు. అలాగే ఋష్యశృంగుడు లాటి పెద్దమనుషులు కూడా ఫోటోలో తమ మొహం ఎలావుందో చూసుకోవాలని ముచ్చటపడడం కద్దు. అలాటి వాళ్లకు వాళ్ళ ఫోటో వాళ్ళకే చూపింఛి చూడండి. పైకి మొహమాటపడి చూసీ చూడనట్టు చూసి వొదిలేసినా, నలుగురు లేని సమయం చూసి ఒక్కమారయినా ఆ ఫోటోను తనివితీరా చూసుకోవడం మాత్రం ఖాయం అనే చెప్పాలి. ఆ రోజుల్లో రేడియోకు, ఈ రోజుల్లో టీవీలకు జనం వెంపర్లాడటం అన్నది జనంలో అంతరాంతరాలలో దాగివున్న వున్న ఈ బలహీనతవల్లే అని అనుకోవాలి.
సరి. మళ్ళీ గ్రామ ఫోన్ రికార్డుల సంగతికి వద్దాం.
ఈ రికార్డులకు హెచ్ ఎం వి (హిజ్ మాస్టర్ వాయిస్)ది పెట్టింది పేరు. ఈ కంపెనీ లోగో పై వుండే కుక్క బొమ్మ జగత్ ప్రసిద్ధం. అసలీ గ్రామ ఫోను రికార్డుల కధాకమామిషు గురించి ఈ కంపెనీ ఓ బుల్లి కరపత్రాన్ని ప్రచురించింది. ఇప్పుడు చెప్పబోయే కధనానికి అదే ఆధారం కనుక ఇది వొండివార్చిన వార్తా కధనం కాదని నమ్మడానికి ఆస్కారాలు వున్నాయి.
పందొమ్మిదవ శతాబ్దం లో థామస్ ఆల్వా ఎడిసన్ అనే శాస్త్రవేత్త గ్రామఫోను తయారు చేసారు. ఈ ఒక్కటే కాదు - విద్యుత్ దీపం, కెమెరా మొదలయిన వాటిని తొలిసారి కనుక్కున్నది కూడా ఎడిసన్ మహాశయులవారే అన్నది ఎలిమెంటరీ స్కూలు విద్యార్ధికి సయితం తెలిసిన విషయమే.
గ్రామఫోను రికార్డుని తయారు చేసిన ఎడిసన్ గారు – ఎవరయినా సుప్రసిద్ధ వ్యక్తి స్వరాన్ని మొదటి రికార్డుపై భద్రపరచాలని తలపోశారు. ప్రొఫెసర్ మాక్స్ ముల్లర్ ఆయన మదిలో మెదిలారు.
“మీ స్వరాన్ని రికార్డు చేయాలనుకుంటున్నాను, ఎప్పుడు కలవాలని” కోరుతూ మాక్స్ ముల్లర్ కి ఆయన వెంటనే లేఖ రాసారు. ఎడిసన్ పై ఎంతో గౌరవ ప్రతిపత్తులు కలిగిన మాక్స్ ముల్లర్, ఎడిసన్ అభ్యర్ధనను అంగీకరించారు. పలానా సమయంలో యూరోపులోని శాస్త్రవేత్త లందరూ ఇంగ్లాండ్ లో సమావేశం అవుతారనీ, అప్పుడువస్తే బాగుంటుందనీ ముల్లర్ జవాబు రాసారు.
ఆవిధంగానే ఎడిసన్ ఆ సమావేశానికి వెళ్లారు. మాక్స్ ముల్లర్ ఆయన్ని సభికులకు పరిచయం చేసారు. అప్పటికే ఎడిసన్ శాస్త్ర ప్రయోగ విజయాలను కర్ణాకర్ణిగా వినివున్న ఇతర శాస్త్రవేత్తలు ఆయన్ని సగౌరవంగా స్వాగతించారు.
తరువాత ఎడిసన్ అభ్యర్ధనపై మాక్స్ ముల్లర్ వేదికపైకి వచ్చి ఎడిసన్ వెంట తెచ్చుకున్న రికార్డింగ్ పరికరం ఎదుట నిలబడ్డారు. ఆయన చెప్పిన మాటలు రికార్డు చేసుకున్న ఎడిసన్ బయటకు వెళ్లి మళ్ళీ అదే రోజు మధ్యాహ్నం సమావేశ మందిరానికి తిరిగి వచ్చారు. ఈ సారి ఆయన చేతిలో ఒక రికార్డు కూడా వుంది. దాన్ని గ్రామ ఫోనుపై వుంచి ఆ ఉదయం రికార్డు చేసిన ముల్లర్ స్వరాన్ని సభికులకు వినిపించారు.
అందులో నుంచి వినిపిస్తున్న ముల్లర్ స్వరాన్ని వింటూ యావన్మందీ చేష్టలుడిగి పోయారు. భావి తరాలకోసం ముల్లర్ స్వరాన్ని భద్రపరచిన ఎడిసన్ కృషిని అంతా చప్పట్లు చరుస్తూ మెచ్చుకున్నారు. కరతాళధ్వనులు సద్దుమణిగిన తరవాత మాక్స్ ముల్లర్ మళ్ళీ వేదిక మీదకు వచ్చారు. సభికుల నుద్దేశించి ప్రసంగించడం ప్రారంభించారు.
“ఈ ఉదయం ఎడిసన్ మహాశయులు నా గొంతు రికార్డు చేస్తున్నప్పుడు మీరది విన్నారు. ఇప్పుడు మళ్ళీ గ్రామఫోను నుంచి వెలువడిన నా మాటలు కూడా విన్నారు. నేను ఉదయం ఏమి మాట్లాడానో, ఇప్పుడు మీరు ఏమి విన్నారో ఏమయినా, ఎవరికయినా అర్ధం అయిందా?” అని సభికులను సూటిగా ప్రశ్నించారు.
ఒక్కసారిగా సభలో నిశ్శబ్దం తాండవించింది.హాజరయిన వారందరూ వారి వారి విభాగాలలో నిపుణులు.అయితే మాక్స్ ముల్లర్ ఏమి మాట్లాడారో వారిలో ఎవరికీ అర్ధం కాని మాట నిజం. ఎందుకంటె ఆ భాష వారికి తెలవదు కాబట్టి. గ్రామఫోను నుంచి వెలువడుతున్న ముల్లర్ స్వరాన్ని వింటూ మైమరచిపోయిన సభికులు ఆ ఆశ్చర్యంలో ఆయన ఏభాషలో మాట్లాడారన్నది గమనించలేదు. వాళ్ళంతా యూరోపు కు చెందినవాళ్ళు కాబట్టి ఆ భాషను వారెప్పుడూ వినివుండలేదు.
సభికుల అశక్తతను అర్ధం చేసుకున్న మాక్స్ ముల్లర్ తానేమి మాట్లాడిందీ తానే స్వయంగా వివరించారు. తాను మాట్లాడింది సంస్కృత భాషలో అన్నది ఆయన చెప్పేవరకు తెలియని శాస్త్రవేత్తలందరూ ఆశ్చర్యంతో నోళ్ళు వెళ్ళబెట్టారు.గ్రామ ఫోను రికార్డింగ్ కోసం అంతకుముందు పేర్కొన్న రిగ్వేదం లోని మొదటి శ్లోకాన్ని ఆయనమళ్ళీ చదివి వినిపించారు.
“అగ్నిమీళే పురోహితం – యజ్ఞ స్వదేవ మృత్విజం హాతారం రత్నశాసనం” – ఇలా సాగిపోతుందా శ్లోకం. ప్రపంచంలో మొట్టమొదటి గ్రామఫోను రికార్డుపై రికార్డయిన రికార్డ్ - రిగ్వేద శ్లోకానికి - మాక్స్ ముల్లర్ ఆవిధంగా అందించారన్న విషయం తెలపడమే ఈ కధనం లోని విశేషం.
అదే ప్రసంగంలో మాక్స్ ముల్లర్ చెప్పిన విషయాలు వింటే సంస్కృత భాష గొప్పదనం ఈ కాలం వారికి తెలిసే అవకాశం వుంటుంది. ఆయన ఇంకా ఇలా అన్నారు.
“మొత్తం మానవేతిహాసంలో వేదాలు మొట్టమొదటి పాఠాలు. అందులో అగ్నిమీళే పురోహితం అనేది తొలి వేదం అయిన రిగ్వేదం లోని మొదటి శ్లోకం. వెనుకటి రోజుల్లో,ఆదిమ యుగంలో- వొళ్ళు దాచుకోవడానికి దుస్తులు ధరించాలన్న ఆలోచన కూడా లేకుండా,చెట్టుకొమ్మలపై చింపాంజీల మాదిరిగా గెంతుతూ యూరోపులోని జనం అనాగరిక జీవనం గడుపుతున్న కాలంలోనే- నివసించడానికి ఇళ్లు అవసరమనే ధ్యాసకూడా లేకుండా కొండ గుహల్లో కాలక్షేపం చేస్తున్న రోజుల్లోనే- భారతీయలు నాగరిక జీవనం సాగిస్తూ, మొత్తం ప్రపంచానికి ఉపయోగపడే రీతిలో సార్వత్రిక వేదాంతాన్ని ప్రబోధించే జీవన సూత్రాలను వేదాల రూపంలో అందించారు. ఎడిసన్ మహాశయులు నా స్వరాన్ని రికార్డు చేస్తానని ముందుకు వచ్చినప్పుడు ఈ వేద శ్లోకాన్ని ఎంచుకోవడానికి కారణం ఇదే” అని ముగించారు మాక్స్ ముల్లర్.
(ప్రముఖ పండితులు పుల్లెల శ్రీరామచంద్రుడు గారికి కృతజ్ఞతలతో –భండారు శ్రీనివాసరావు)
కానీ పరిణామ క్రమంలో ఇవన్నీ తప్పని విష పరిణామాలు.
లాంతర్లు, చిమ్నీలు, రోళ్ళు, రోకళ్ళు, ఎడ్లబళ్ళు, కచ్చడం బళ్ళు, చల్ల కవ్వాలు, మేనాలు, వాటిని మోసే బోయీలు, మేనా మోస్తూ వాళ్ళు చేసే ఒహోం ఒహోం వొహ్ వోహోం వోహోంలు – ఎక్కడన్నా కనవస్తున్నాయా? ఎప్పుడన్నా వినబడుతున్నాయా?
నా చిన్నతనంలో మా సుబ్బయ్య తాతయ్య గారి దగ్గర ఓ గ్రామఫోన్ వుండేది. ధ్వని నలుగురికీ బాగా వినబడడానికి దానికి గమ్మత్తయిన ఆకారంలో వుండే ఒక స్పీకర్ తగిలించేవాళ్ళు. గ్రామ ఫోనుకు అదొక గుర్తుగా వుండేది. పాటల రికార్డులు మందపాటి భోజన పళ్ళాల మాదిరిగా పెద్దగా వుండేవి. వాటిమీద గాయనీగాయకుల పేర్లు, సినిమా పేరు, సంగీత దర్శకుడి వివరాలు ముద్రించేవాళ్ళు. గ్రామఫోనుకు గడియారం మాదిరిగా కీ ఇచ్చి, రికార్డు దానిమీదవుంచి అది తిరుగుతున్నప్పుడు ముల్లును జాగ్రత్తగా గాడిలో పెట్టేవాళ్ళు. ఆ ముల్లును గవర్నర్ అనే పరికరంలో బిగించే వాళ్ళు. రికార్డు తిరగడం ప్రారంభం కాగానే పాట మొదలయ్యేది. మా తాత గారు సంగీతం అంటే చెవికోసుకునేవారు.అందువల్ల ఆయన దగ్గర వున్నరికార్డుల్లో అన్నీ జావళీలే. ఒక్క ముక్క అర్ధం అయ్యేది కాదు. అయినా వూరు వూరంతా ఆ పాటలు వినడానికి పోగయ్యేవాళ్ళు. అంత చిన్న పెట్టెలో నుంచి పాటలు పాడుతున్నదెవరో తెలియక విస్తుపోయేవాళ్ళు. ఏదో మంత్రం పెట్టె పట్టుకొచ్చారని మా తాతగారిని అనుమానించిన వాళ్ళు కూడా వున్నారు.
పొతే, నేను రేడియోలో చేరినప్పుడు గ్రామఫోన్ రికార్డులు వుండేవి. కాకపొతే కాస్త నాజూకుగా చిన్నగా వుండేవి. ఇప్పడు వాటి జాడ కూడాలేదు. అన్నీ కంప్యూటర్ డిస్క్ లే.
రేడియోలో చేరిన కొత్తల్లో ఓ రోజు జంధ్యాల స్వయంగా రేడియో స్టేషన్ కు వచ్చి తను మొదట డైరెక్ట్ చేసిన ‘ముద్దమందారం’ సినిమా పాటల రికార్డ్ ను ప్రసారం నిమిత్తం తెచ్చి నాకిచ్చివెళ్లడం ఇప్పటికీ ఓ మధుర విషాద స్మృతి.
తన గొంతు తాను వినాలని, తన మొహం తాను చూసుకోవాలని – ప్రతి మనిషికీ కొన్ని బలహీనతలు వుంటాయంటారు. ఇలా మనసుపడని మనుషులు వుండరేమో కూడా. రేడియోలో తమ గొంతు ఒక్కసారయినా వినపడాలని తాపత్రయపడి అందుకోసం ఎంతగానో ప్రయత్నించిన పెద్దవాళ్ళు ఎందరో నా వృత్తి జీవితంలో పరిచయం అయ్యారు. అలాగే ఋష్యశృంగుడు లాటి పెద్దమనుషులు కూడా ఫోటోలో తమ మొహం ఎలావుందో చూసుకోవాలని ముచ్చటపడడం కద్దు. అలాటి వాళ్లకు వాళ్ళ ఫోటో వాళ్ళకే చూపింఛి చూడండి. పైకి మొహమాటపడి చూసీ చూడనట్టు చూసి వొదిలేసినా, నలుగురు లేని సమయం చూసి ఒక్కమారయినా ఆ ఫోటోను తనివితీరా చూసుకోవడం మాత్రం ఖాయం అనే చెప్పాలి. ఆ రోజుల్లో రేడియోకు, ఈ రోజుల్లో టీవీలకు జనం వెంపర్లాడటం అన్నది జనంలో అంతరాంతరాలలో దాగివున్న వున్న ఈ బలహీనతవల్లే అని అనుకోవాలి.
సరి. మళ్ళీ గ్రామ ఫోన్ రికార్డుల సంగతికి వద్దాం.
ఈ రికార్డులకు హెచ్ ఎం వి (హిజ్ మాస్టర్ వాయిస్)ది పెట్టింది పేరు. ఈ కంపెనీ లోగో పై వుండే కుక్క బొమ్మ జగత్ ప్రసిద్ధం. అసలీ గ్రామ ఫోను రికార్డుల కధాకమామిషు గురించి ఈ కంపెనీ ఓ బుల్లి కరపత్రాన్ని ప్రచురించింది. ఇప్పుడు చెప్పబోయే కధనానికి అదే ఆధారం కనుక ఇది వొండివార్చిన వార్తా కధనం కాదని నమ్మడానికి ఆస్కారాలు వున్నాయి.
పందొమ్మిదవ శతాబ్దం లో థామస్ ఆల్వా ఎడిసన్ అనే శాస్త్రవేత్త గ్రామఫోను తయారు చేసారు. ఈ ఒక్కటే కాదు - విద్యుత్ దీపం, కెమెరా మొదలయిన వాటిని తొలిసారి కనుక్కున్నది కూడా ఎడిసన్ మహాశయులవారే అన్నది ఎలిమెంటరీ స్కూలు విద్యార్ధికి సయితం తెలిసిన విషయమే.
గ్రామఫోను రికార్డుని తయారు చేసిన ఎడిసన్ గారు – ఎవరయినా సుప్రసిద్ధ వ్యక్తి స్వరాన్ని మొదటి రికార్డుపై భద్రపరచాలని తలపోశారు. ప్రొఫెసర్ మాక్స్ ముల్లర్ ఆయన మదిలో మెదిలారు.
“మీ స్వరాన్ని రికార్డు చేయాలనుకుంటున్నాను, ఎప్పుడు కలవాలని” కోరుతూ మాక్స్ ముల్లర్ కి ఆయన వెంటనే లేఖ రాసారు. ఎడిసన్ పై ఎంతో గౌరవ ప్రతిపత్తులు కలిగిన మాక్స్ ముల్లర్, ఎడిసన్ అభ్యర్ధనను అంగీకరించారు. పలానా సమయంలో యూరోపులోని శాస్త్రవేత్త లందరూ ఇంగ్లాండ్ లో సమావేశం అవుతారనీ, అప్పుడువస్తే బాగుంటుందనీ ముల్లర్ జవాబు రాసారు.
ఆవిధంగానే ఎడిసన్ ఆ సమావేశానికి వెళ్లారు. మాక్స్ ముల్లర్ ఆయన్ని సభికులకు పరిచయం చేసారు. అప్పటికే ఎడిసన్ శాస్త్ర ప్రయోగ విజయాలను కర్ణాకర్ణిగా వినివున్న ఇతర శాస్త్రవేత్తలు ఆయన్ని సగౌరవంగా స్వాగతించారు.
తరువాత ఎడిసన్ అభ్యర్ధనపై మాక్స్ ముల్లర్ వేదికపైకి వచ్చి ఎడిసన్ వెంట తెచ్చుకున్న రికార్డింగ్ పరికరం ఎదుట నిలబడ్డారు. ఆయన చెప్పిన మాటలు రికార్డు చేసుకున్న ఎడిసన్ బయటకు వెళ్లి మళ్ళీ అదే రోజు మధ్యాహ్నం సమావేశ మందిరానికి తిరిగి వచ్చారు. ఈ సారి ఆయన చేతిలో ఒక రికార్డు కూడా వుంది. దాన్ని గ్రామ ఫోనుపై వుంచి ఆ ఉదయం రికార్డు చేసిన ముల్లర్ స్వరాన్ని సభికులకు వినిపించారు.
అందులో నుంచి వినిపిస్తున్న ముల్లర్ స్వరాన్ని వింటూ యావన్మందీ చేష్టలుడిగి పోయారు. భావి తరాలకోసం ముల్లర్ స్వరాన్ని భద్రపరచిన ఎడిసన్ కృషిని అంతా చప్పట్లు చరుస్తూ మెచ్చుకున్నారు. కరతాళధ్వనులు సద్దుమణిగిన తరవాత మాక్స్ ముల్లర్ మళ్ళీ వేదిక మీదకు వచ్చారు. సభికుల నుద్దేశించి ప్రసంగించడం ప్రారంభించారు.
“ఈ ఉదయం ఎడిసన్ మహాశయులు నా గొంతు రికార్డు చేస్తున్నప్పుడు మీరది విన్నారు. ఇప్పుడు మళ్ళీ గ్రామఫోను నుంచి వెలువడిన నా మాటలు కూడా విన్నారు. నేను ఉదయం ఏమి మాట్లాడానో, ఇప్పుడు మీరు ఏమి విన్నారో ఏమయినా, ఎవరికయినా అర్ధం అయిందా?” అని సభికులను సూటిగా ప్రశ్నించారు.
ఒక్కసారిగా సభలో నిశ్శబ్దం తాండవించింది.హాజరయిన వారందరూ వారి వారి విభాగాలలో నిపుణులు.అయితే మాక్స్ ముల్లర్ ఏమి మాట్లాడారో వారిలో ఎవరికీ అర్ధం కాని మాట నిజం. ఎందుకంటె ఆ భాష వారికి తెలవదు కాబట్టి. గ్రామఫోను నుంచి వెలువడుతున్న ముల్లర్ స్వరాన్ని వింటూ మైమరచిపోయిన సభికులు ఆ ఆశ్చర్యంలో ఆయన ఏభాషలో మాట్లాడారన్నది గమనించలేదు. వాళ్ళంతా యూరోపు కు చెందినవాళ్ళు కాబట్టి ఆ భాషను వారెప్పుడూ వినివుండలేదు.
సభికుల అశక్తతను అర్ధం చేసుకున్న మాక్స్ ముల్లర్ తానేమి మాట్లాడిందీ తానే స్వయంగా వివరించారు. తాను మాట్లాడింది సంస్కృత భాషలో అన్నది ఆయన చెప్పేవరకు తెలియని శాస్త్రవేత్తలందరూ ఆశ్చర్యంతో నోళ్ళు వెళ్ళబెట్టారు.గ్రామ ఫోను రికార్డింగ్ కోసం అంతకుముందు పేర్కొన్న రిగ్వేదం లోని మొదటి శ్లోకాన్ని ఆయనమళ్ళీ చదివి వినిపించారు.
“అగ్నిమీళే పురోహితం – యజ్ఞ స్వదేవ మృత్విజం హాతారం రత్నశాసనం” – ఇలా సాగిపోతుందా శ్లోకం. ప్రపంచంలో మొట్టమొదటి గ్రామఫోను రికార్డుపై రికార్డయిన రికార్డ్ - రిగ్వేద శ్లోకానికి - మాక్స్ ముల్లర్ ఆవిధంగా అందించారన్న విషయం తెలపడమే ఈ కధనం లోని విశేషం.
అదే ప్రసంగంలో మాక్స్ ముల్లర్ చెప్పిన విషయాలు వింటే సంస్కృత భాష గొప్పదనం ఈ కాలం వారికి తెలిసే అవకాశం వుంటుంది. ఆయన ఇంకా ఇలా అన్నారు.
“మొత్తం మానవేతిహాసంలో వేదాలు మొట్టమొదటి పాఠాలు. అందులో అగ్నిమీళే పురోహితం అనేది తొలి వేదం అయిన రిగ్వేదం లోని మొదటి శ్లోకం. వెనుకటి రోజుల్లో,ఆదిమ యుగంలో- వొళ్ళు దాచుకోవడానికి దుస్తులు ధరించాలన్న ఆలోచన కూడా లేకుండా,చెట్టుకొమ్మలపై చింపాంజీల మాదిరిగా గెంతుతూ యూరోపులోని జనం అనాగరిక జీవనం గడుపుతున్న కాలంలోనే- నివసించడానికి ఇళ్లు అవసరమనే ధ్యాసకూడా లేకుండా కొండ గుహల్లో కాలక్షేపం చేస్తున్న రోజుల్లోనే- భారతీయలు నాగరిక జీవనం సాగిస్తూ, మొత్తం ప్రపంచానికి ఉపయోగపడే రీతిలో సార్వత్రిక వేదాంతాన్ని ప్రబోధించే జీవన సూత్రాలను వేదాల రూపంలో అందించారు. ఎడిసన్ మహాశయులు నా స్వరాన్ని రికార్డు చేస్తానని ముందుకు వచ్చినప్పుడు ఈ వేద శ్లోకాన్ని ఎంచుకోవడానికి కారణం ఇదే” అని ముగించారు మాక్స్ ముల్లర్.
(ప్రముఖ పండితులు పుల్లెల శ్రీరామచంద్రుడు గారికి కృతజ్ఞతలతో –భండారు శ్రీనివాసరావు)
లేబుళ్లు:
పుల్లెల శ్రీరామచంద్రుడు,
భండారు శ్రీనివాసరావు
10, నవంబర్ 2010, బుధవారం
Hell with gains & losses of Obama’s visit. Feel good… -Bhandaru Srinivas Rao (I.I.S.)
What India has gained from three-day visit of US President Barrack Obama? That’s the question now seems every one asking. Skeptics continue to accuse that Obama walked away ensuing 50,000 jobs back home and demanding Indian Prime Minister Dr Manmohan Singh to spell out the list of agreements that have been signed between the two largest democracies benefiting us.
But, I as a commoner feel India got more than what it expected. That’s the warmth and affection from world’s powerful nation’s head. The very statement of Obama that India no more can be called an emerging economic power, but already emerged, itself is the biggest compliment that every Indian feel to receive. This apart, assuring US support to India to fulfill it’s to dream of a permanent seat United Nations Security Council, is another immeasurable ‘gift’ soon after Diwali. Still many critics may say what is so great about becoming UNSC member? Well that’s the rare honor to feel we too have accomplished a role to play alongside other developed nations for promotion of international peace. Yes, thus far, it is most admired and envied institutional bodies in the world.
Having said that these two gains, India could also achieve another major goal of neutralizing our most envious neighbor China, which, now in fact, has agreed to support our claim for a permanent seat in UNSC as it too recognizes us as ‘emerged economic power’ in the world. What more one can expect from US President’s trip?
What most impressed me as an Indian is of Obama couple’s warmth towards whomever they met and interacted during their visit. None of the US Presidents in the past have shown such warmth towards their Indian counterparts. Was it due to Obama being an African American, or a white American like Clinton or Bush?
True back home, Obama too has problems aplenty. He made no bones of that. That’s another factor which really impressed me most. I am sure millions of my brethren in this country too might felt the same way when he bluntly said; “I too have to reply to my people as there is mounting criticism over my visit to India. Tomorrow when I return, I can proudly say that my visit to India help generate 50,000 job opportunities.”
Undoubtedly, Obama, unlike his predecessors, who visited India, appears to have done homework to perfection. He floored doubting Thomases in India over US stand on Pakistan, while addressing the Joint Parliament session a day before he left the shores to Indonesia. His explicit remarks, of course with a regret, that Pakistan unfortunately allowing its soil to be used by the terrorists who creating havoc elsewhere in the world surmises Indian sentiments. Perhaps, may not to the extent that one expected of calling or declaring our neighbors a ‘rogue’ or ‘terror’ state. That’s another eloquent high quality diplomacy characteristic which indeed floored almost all Indian politicians, barring the Left leaders who had no other option but to search week-ends just for heck of it.
US President’s categorical assurance to look into several issues, including that of “visas”, ‘outsourcing’ and ‘turban’ should be taken into right perspective as we could for the first time in history come across a honest man to do future business and further concretize our relations.
That Obama has done greater homework to understand Indian psyche is also evident from his in-depth knowledge of Mahatma Gandhi, whom we adore as ‘Father of the Nation”, and also of our cultures and ethos. His amazing mention of Panchatantra, which many our present day politicians might have bother to know, and other aspects like saying ‘Jai Hind’ at the end of speech, indeed were great acts to perfection.
He time and again reiterated describing US and India as largest democracies in the world and his keenness to work together for benefit of world community. As far his passing comment on Mynmar should not be viewed seriously as India’s foreign policy is not to ‘poke its nose’ into their neighbors internal problems. Even on Kashmir issue, Obama appears to have understood the complexity of the issue which tagged on with emotions, chose to restrain him tactfully.
Thus far, the overall visit of Obama to India was more than fruitful. India bound to benefit with its new-found US friendship and so is US. I wish to join chorus of those millions of pessimists to say Jai ho Obama.(10-11-2010)
But, I as a commoner feel India got more than what it expected. That’s the warmth and affection from world’s powerful nation’s head. The very statement of Obama that India no more can be called an emerging economic power, but already emerged, itself is the biggest compliment that every Indian feel to receive. This apart, assuring US support to India to fulfill it’s to dream of a permanent seat United Nations Security Council, is another immeasurable ‘gift’ soon after Diwali. Still many critics may say what is so great about becoming UNSC member? Well that’s the rare honor to feel we too have accomplished a role to play alongside other developed nations for promotion of international peace. Yes, thus far, it is most admired and envied institutional bodies in the world.
Having said that these two gains, India could also achieve another major goal of neutralizing our most envious neighbor China, which, now in fact, has agreed to support our claim for a permanent seat in UNSC as it too recognizes us as ‘emerged economic power’ in the world. What more one can expect from US President’s trip?
What most impressed me as an Indian is of Obama couple’s warmth towards whomever they met and interacted during their visit. None of the US Presidents in the past have shown such warmth towards their Indian counterparts. Was it due to Obama being an African American, or a white American like Clinton or Bush?
True back home, Obama too has problems aplenty. He made no bones of that. That’s another factor which really impressed me most. I am sure millions of my brethren in this country too might felt the same way when he bluntly said; “I too have to reply to my people as there is mounting criticism over my visit to India. Tomorrow when I return, I can proudly say that my visit to India help generate 50,000 job opportunities.”
Undoubtedly, Obama, unlike his predecessors, who visited India, appears to have done homework to perfection. He floored doubting Thomases in India over US stand on Pakistan, while addressing the Joint Parliament session a day before he left the shores to Indonesia. His explicit remarks, of course with a regret, that Pakistan unfortunately allowing its soil to be used by the terrorists who creating havoc elsewhere in the world surmises Indian sentiments. Perhaps, may not to the extent that one expected of calling or declaring our neighbors a ‘rogue’ or ‘terror’ state. That’s another eloquent high quality diplomacy characteristic which indeed floored almost all Indian politicians, barring the Left leaders who had no other option but to search week-ends just for heck of it.
US President’s categorical assurance to look into several issues, including that of “visas”, ‘outsourcing’ and ‘turban’ should be taken into right perspective as we could for the first time in history come across a honest man to do future business and further concretize our relations.
That Obama has done greater homework to understand Indian psyche is also evident from his in-depth knowledge of Mahatma Gandhi, whom we adore as ‘Father of the Nation”, and also of our cultures and ethos. His amazing mention of Panchatantra, which many our present day politicians might have bother to know, and other aspects like saying ‘Jai Hind’ at the end of speech, indeed were great acts to perfection.
He time and again reiterated describing US and India as largest democracies in the world and his keenness to work together for benefit of world community. As far his passing comment on Mynmar should not be viewed seriously as India’s foreign policy is not to ‘poke its nose’ into their neighbors internal problems. Even on Kashmir issue, Obama appears to have understood the complexity of the issue which tagged on with emotions, chose to restrain him tactfully.
Thus far, the overall visit of Obama to India was more than fruitful. India bound to benefit with its new-found US friendship and so is US. I wish to join chorus of those millions of pessimists to say Jai ho Obama.(10-11-2010)
లేబుళ్లు:
Bhandaru Srinivasa Rao,
Obama
దీనికి సబ్స్క్రయిబ్ చేయి:
పోస్ట్లు (Atom)
