18, నవంబర్ 2020, బుధవారం

ఢిల్లీ తెలుగు అకాడమి నాగరాజు ఇకలేరు

 

ఢిల్లీలో తెలుగు వారి  మరో సాంస్కృతిక కార్యశూరుడు కన్ను మూశారు.

ఢిల్లీ తెలుగు అకాడమీ వ్యవస్థాపకులు శ్రీ ఎన్.వి.ఎల్. నాగరాజు కరోనా కాటుకు బలయ్యారు. సన్ షైన్ ఆసుపత్రిలో గత పదమూడు రోజులుగా చికిత్స తీసుకుంటూ కొద్ది సేపటి క్రితమే మరణించినట్టు సీనియర్ జర్నలిస్ట్ శ్రీ ఆనంద కుమార్ తెలియచేసారు. విషాదం ఏమిటంటే నాగరాజు అమ్మగారు కూడా కరోనా చికిత్స తీసుకుంటూ వారం క్రితమే చనిపోయారు.


(ఢిల్లీ తెలుగు అకాడమి  నాగరాజు)


ఢిల్లీ కేంద్రంగా తెలుగు అకాడమీ స్థాపించి పెద్ద సంఖ్యలో సాంస్కృతిక కార్యక్రమాలను ఒంటి చేత్తో నిర్వహించిన నాగరాజు మృతి తెలుగు సాంస్కృతిక లోకానికి తీరని లోటు.

ఆలిండియా రేడియో న్యూస్ రీడర్ గా ఉంటూ ఢిల్లీలో తెలుగువారికి తలలో నాలుకలా మసలుకున్న ఏడిద గోపాల రావు మరణించిన కొద్ది రోజులకే నాగరాజు కూడా కన్నుమూయడం సాంస్కృతిక  ప్రియులకు తట్టుకోలేని విషాదం.

(17-11-2020)

కామెంట్‌లు లేవు: