8, మే 2017, సోమవారం

ప్రెస్ మాన్ వేణుగోపాల్

వేణుగోపాల్. తెలుగు తెలియని వేణుగోపాల్. హైదారాబాదు ఎప్పుడు వచ్చినా కలిసేవాడు. ఎం.ఎస్. శంకర్ కి ఆత్మీయ మిత్రుడు. ప్రెస్ మాన్ ప్రకటన సంస్థలో, తరువాత బిర్లా సంస్థలో చాలాకాలం పనిచేసాడు. నేనూ, జ్వాలా, శంకర్ మూడేళ్ళ క్రితం చెన్నై వెళ్లి నప్పుడు కూడా మాతో గడిపాడు. నిగర్వి. స్నేహశీలి.
ఈ నెల ఇరవై నాలుగో తేదీన శంకర్ తిరుపతి ప్రయాణం పెట్టుకున్నాడు. స్వామి దర్శనం ముగించుకుని తిరుగు ప్రయాణంలో చెన్నై మీదుగా వేణుగోపాల్  ని చూసి రావాలని శంకర్ ఆలోచన. ఈ సంగతి చెబుదామని ఈ ఉదయం వేణుగోపాల్  కి ఫోను చేశాడు. అయన భార్య ఫోను ఎత్తింది. పరిచయం వుంది కాబట్టి శంకర్ గబగబా తాను పలానా రోజు  చెన్నై వస్తున్నానని, వేరే పనులు ఏవీ పెట్టుకోవద్దని. అంతా చెప్పేసిన తరువాత అవతల నుంచి వినబడింది సన్నగా ఆవిడ ఏడుపు. ఏడుస్తూనే  చెప్పింది, వేణుగోపాల్ ఇక లేరని, ఈ తెల్లవారుజామునే  చనిపోయాడని.
శంకర్ ఒక్క మాటుగా షాక్ తిన్నాడు, తేరుకున్న తరువాత నాతొ పంచుకున్నాడు.

నిన్న వుండి ఈరోజు వుండడం జీవితం అయితే, క్షణం క్రితం వుండి మరుక్షణం లేకపోవడమే మరణం.           

కామెంట్‌లు లేవు: