25, మే 2017, గురువారం

ఇక్కడిలా! అక్కడలా!!

  
మిట్ట మధ్యాన్నం, ఎర్రటి ఎండలో కారు ఆగిపోయింది. ఆగిపోలేదు, డ్రైవర్ ఆపాడు. ముందు రెండు కార్లు ఆగివున్నాయి. ఒక కార్లో నుంచి దిగిన యువకుడు, రెండో కార్లో డ్రైవర్ సీట్లో కూర్చున్న వ్యక్తిని బయటకు లాగే ప్రయత్నం చేస్తున్నాడు. అసలే ఆ జంక్షన్లో ట్రాఫిక్ ఎక్కువ. నాలుగు వైపుల నుంచి ఎవరి దారి వారిదే అన్నట్టు వెడుతుంటారు.
ముందు వెడుతున్న  కారు వెనుక భాగానికి దెబ్బ తగిలింది. వాడు ఊరుకుంటాడా! వెనక కారు వాడితో పేచీ పెట్టుకుంటాడు. అదే అక్కడి సీను. రెండూ ఏసీ కార్లే. కానీ వాళ్ళ ఖర్మ. ఎర్రటి ఎండలో తగాదా పడుతున్నారు. అది ఎప్పటికి తేలేనో!
ఇది చూసిన తరువాత అనేక ఏళ్ళ క్రితం అమెరికాలో జరిగిన ఒక సంఘటన జ్ఞాపకం వచ్చింది. మా పిల్లలతో కలిసి ఎటో టూరు వెళ్లి తిరిగి వస్తున్నాము. దారిలో మెక్డొనాల్డ్ వద్ద కారు పార్కు చేసి వెళ్ళాము. తిరిగి వచ్చేసరికి, మరో కారువాడు రివర్స్ తీసుకుంటూ మావాడి కారుని కొట్టాడు. దెబ్బ బాగానే తగిలింది. చిత్రం! దెబ్బ కొట్టిన పెద్దమనిషి కారు దిగి సెల్ ఫోన్ లో దెబ్బతిన్న భాగాన్ని, కారు నెంబరు ప్లేటు ఫోటో తీసుకున్నాడు. అలాగే మా వాడూ. ఇద్దరూ వారి వారి భీమా కంపెనీలకి ఫోటోలు,  మెసేజ్ ద్వారా విషయం ఎరుక పరిచారు. అంతే! వాళ్ళ దారిన వాళ్ళు, మా దారిన మేము.
వారం తిరక్కముందే కారు దెబ్బ తిన్నందుకు పరిహారం చెక్కు రూపంలో మా వాడి బ్యాంకుకు పంపినట్టు భీమా కంపెనీ  నుంచి వర్తమానం వచ్చింది.      

1 కామెంట్‌:

అజ్ఞాత చెప్పారు...

that cant happen india, as our buggers are shameless,dishonest liars who claim false claims - so the insurance companies also put so many checks before giving money...

our buggers range is - you might have read the news about tejas trains - LCD screens damaged, head phones stolen...