3, మార్చి 2015, మంగళవారం

పిచ్చిమాలోకం


ఓ జర్నలిష్టు పిచ్చాసుపత్రికి వెళ్ళి అక్కడి డాక్టర్ని అడిగాడు, 'మీ దగ్గరకు వచ్చిన రోగికి పిచ్చి వుందని యెలా నిర్దారిస్తారని'
డాక్టర్ చెప్పాడు.
'వెరీ సింపుల్. ఒక బాత్ టబ్ నిండా నీళ్ళు నింపి వచ్చిన రోగికి ఒక బక్కెట్టు, ఒక చెంచా ఇచ్చి నీళ్ళు తోడమని చెబుతాం"
జర్నలిష్టు కల్పించుకుని అన్నాడు.  ' ఓ తెలిసింది. బక్కెట్టుతో తోడితే అతడికి పిచ్చి లేనట్టు. అంతే కదా!'
'కాదు, బాత్ టబ్ కింద నాబ్ వుంటుంది. అది తిప్పితే నీళ్ళు అవే పోతాయి. నర్స్, మూడో నెంబరు బెడ్డు ఖాళీ వుండాలి కదా! ఇతగాడిని ఎడ్మిట్ చేసి పరీక్షలు మొదలు పెట్టు, నేను తరవాత వచ్చి చూస్తాను'


(NOTE: Courtesy Image Owner)

కామెంట్‌లు లేవు: