11, మార్చి 2015, బుధవారం

బడ్జెట్లు


ఒక టీవీ చానల్ డిబేట్ లో నాతొ పాటు పాల్గొన్న ప్రొఫెసర్ హర గోపాల్ చెప్పారు. గతంలో బడ్జెట్ రోజుకు ముందుగానే దుకాణాల్లో సిగరెట్లు, అగ్గిపెట్టెలు, పాల పొడి డబ్బాలు మాయమై పోయేవని. కొత్త పన్నులు పడితే పాత రేటుకు కొన్న సరకులు కొత్త రేట్లకు అమ్ముకుని లాభాలు సంపాదించవచ్చని వ్యాపారులు అలా చేసేవాళ్ళు. మార్కెట్ మీద ప్రభుత్వాలకు పట్టు వున్న రోజులవి. ఇప్పుడో, మార్కెట్ శక్తులే ప్రభుత్వాలని శాసిస్తున్న రోజులాయె!
అందుకే బడ్జెట్లు ఈనాడు ఓ తంతుగా ముగిసే ప్రభుత్వ  కార్యక్రమాలు అయ్యాయి. వాటి మీద మీడియాకు తప్ప మామూలు జనాలకు ఆసక్తి లేకుండా పోతోంది. లోగడ కేంద్ర బడ్జెట్ అంటే రేడియో పెట్టుకుని వినేవారు. గాస్ సిలిండర్  ధరలు, పెట్రోలు ధరలు ఏవన్నా పెరిగాయా, కుక్కర్లు, ఫ్రిజ్  ల ఖరీదులు పెరిగాయా అనే ఆసక్తితో. ఇప్పుడు బడ్జెట్లకు, ధరల పెరుగుదలకు లంకె తెంపేసారు. వేటి దోవ వాటిదే. 'కోడి గుడ్డు ధర' మాదిరిగా, ఏరోజు రేటు ఆ రోజుదే!


లక్షలు కోట్లు అంటున్నారు. చిన్న అంకెలు పెద్ద ప్రభువులకు ఆనడం లేదు. మిగులు రాష్ట్రం కనుక కొన్నేళ్ళు పరవాలేదేమో. కానీ, తింటూ కూర్చుంటే కొండలు కూడా తరిగిపోతాయని అంటారు. కాస్త కళ్ళెం బిగబట్టడం అవసరమేమో.  (11-03-2015)    

కామెంట్‌లు లేవు: