7, నవంబర్ 2014, శుక్రవారం

అసెంబ్లీలో ఏం జరుగుతుంది?

(Published by 'SURYA" telugu daily in its Edit page on 09-11-2014, SUNDAY)

నాకు జ్యోతిష్యం తెలియదు. అయినా ఈ ఉదయం టీవీ  యాంఖర్ అడిగిన ఈ  ప్రశ్నకు తడుముకోకుండా జవాబు చెప్పాను.
'ఏం జరుగుతుంది? సభ ఖచ్చితంగా సమయం  ప్రకారం సమావేశమవుతుంది. స్పీకర్ ప్రతిపక్ష సభులు ఇచ్చిన వాయిదా తీర్మానం నోటీసులను వరసగా చదివి వినిపించి వాటిని తిరస్కరిస్తున్నట్టు ప్రకటించి ఎజెండాలోని  ప్రశ్నోత్తరాల కార్యక్రమం చేపడతారు. ప్రతిపక్ష సభ్యులు పోడియం దగ్గరకు వెళ్లి తమ వాయిదా తీర్మానాలపై చర్చకు పట్టుపడతారు. స్పీకర్ వారిని తమ స్థానాల్లోకి వెళ్లి కూర్చోండని పదే పదే విజ్ఞప్తి  చేస్తారు. పాలకపక్షం తరపున శాసనసభా వ్యవహారాల మంత్రో లేక ముఖ్యమంత్రో కలగచేసుకుని ప్రభుత్వం ఆ అంశాలు అన్నింటిపైనా చర్చకు సిద్దమనీ, వెనుకాడదనీ, అయితే నిబంధల ప్రకారం నడుచుకోవాలనీ స్పష్టం చేస్తారు. అయినా ప్రతిపక్షాలు తగ్గవు. కాసేపు చూసి స్పీకర్ సభను పది నిమిషాలు వాయిదా వేస్తారు. పేరుకు పది నిమిషాలు కానీ, ఓ అరగంట తరువాత మళ్ళీ మొదలవుతుంది. సభలో షరామామూలుగా ఏదో ఒక అంశంపై గొడవ మళ్ళీ షురూ. మళ్ళీ ఓ పది నిమిషాలు వాయిదా. తిరిగి సమావేశం అయినా సజావుగా పది నిమిషాలు సాగుతుందన్న నమ్మకం లేదు. వాయిదా పడ్డం కోసం మరోసారి సమావేశం అవుతుంది.'
నేను అలా చెప్పాను కనుక అలాగే జరగాలని నేనూ  కోరుకోను. సభ సజావుగా సాగాలనే నేనే కాదు ఎవరయినా కోరుకుంటారు. అయితే  కోరుకున్నవి జరగాలని రూలేమీ  లేదు కదా!



2 కామెంట్‌లు:

Jwala's Musings చెప్పారు...

Slight changes were there today!

భండారు శ్రీనివాసరావు చెప్పారు...

@ Jwala's Musings - Yes I know. CM agreed for a debate on farmers suicides.