17, మార్చి 2020, మంగళవారం
12, మార్చి 2020, గురువారం
ఓటు ఖరీదు – భండారు శ్రీనివాసరావు
ప్రస్తుత ప్రజాస్వామ్య వ్యవస్థను కుళ్ళబొడుస్తున్న సమస్త రుగ్మతలకు డబ్బు, మద్యం వంటి ప్రలోభాలకు ఓటరు గురవుతూ ఉండడమే కారణమని చాలామంది అభిప్రాయం. నిజానికి అది నిజం కూడా. ఎందుకంటే ఈ అభిప్రాయం కలిగివున్న వాళ్ళు కూడా ఓటర్లే. ఆ విషయాన్ని ఈ సిద్దాంతకర్తలు మరచిపోకూడదు.
‘పక్క వూళ్ళో ఓటుకి రెండువేలు ఇస్తున్నారు, మాకు కూడా అలాగే ఇవ్వండి’ అని డిమాండ్ చేసి మరీ పుచ్చుకుని ఓట్లను తెగనమ్ముకుంటున్నారు అనేది మరో ఆరోపణ. అంటే ఏమిటన్న మాట. ఒకరిని చూసి మరొకరు నేర్చుకుంటున్నారని ఒప్పుకుంటున్నట్టే కదా!
అదే నిజమైనప్పుడు ఓట్ల కోసం ఎమ్మెల్యేలను విమానాల్లో తరలించి పంచ నక్షత్రాల హోటళ్ళలో రాజభోగాలు అమర్చి రాజకీయ పార్టీలు ఇవ్వచూపుతున్న అనేకానేక ప్రలోభాలను గురించి సామాన్య జనం కూడా పత్రికల్లో చదువుతున్నారు, టీవీల్లో చూస్తున్నారు. కదా! మరి, రెండు వేలు పెట్టి కొనుగోలు చేసిన వారి ఓట్లతో నెగ్గిన ఆ ప్రజాప్రతినిధులు, అదే ఓటును గంటకు వేలాది రూపాయల ప్రలోభాలకు తాకట్టు పెడుతున్న సంగతి తెలిసినప్పుడు వారికి ఎలా అనిపిస్తుంది. రెండు పెద్ద కరెన్సీ నోట్లు, ఓ సీసాడు మద్యంతో కొన్న ఓటు విలువ తమ కళ్ళముందే కొన్ని వేలరెట్లు పెరిగిపోవడం చూసి వారి కడుపు రగలకుండా ఉంటుందా!
కాబట్టి ఓటును మద్యానికి అమ్మినా, కరెన్సీ నోట్లకు అమ్మినా, మహారాజ భోగాలకు, మంత్రి పదవులకు అమ్ముకున్నా ఒకటే అని సూత్రీకరించండి, అప్పుడు వాదన సబబుగా వుంటుంది. న్యాయం అందరికీ ఒకటే.
ఇలా అని, ఓటర్లను ప్రలోభపెట్టడాన్ని నేను సమర్ధిస్తున్నాను అని అనుకోవద్దు. నిజం నిష్టూరంగానే వుంటుంది.అది మరవద్దు.
షేర్ ఖాన్ లు – సింద్ బాదు
చిన్నప్పుడు చందమామ పత్రికలో ‘సింద్ బాద్ సాహస యాత్రలు’ అనే పేరుతో సీరియల్ కధలు వచ్చేవి.
సింద్ బాద్ అనే వర్తకుడు పడవల్లో సరుకులు నింపుకుని వేరే దేశాల్లో విక్రయించి అపార ధన రాశులతో తిరిగివస్తుంటే ప్రచండమైన తుపాను గాలులు చుట్టుముట్టడం, నడిసముద్రంలో నౌకలు మునిగిపోయి, సర్వస్వం కోల్పోయి ఈదుకుంటూ ఏదో వడ్డుకు చేరి భయంకరమైన దీవుల్లో నరరూప రాక్షసుల మధ్య రోజులు గడుపుతూ ఎన్నో సాహస కార్యాలు చేసి తిరిగి తన ఊరు చేరుకోవడం ఈ సీరియల్ కధల్లోని ప్రధాన ఇతివృత్తం.
ఇప్పుడు స్టాక్ మార్కెట్లు కుదేలై, లక్షల కోట్ల రూపాయల మేరకు మదుపరుల పెట్టుబడులు ఆవిరై పోతున్నాయనని అనుదినం పత్రికల్లో చదువుతున్నప్పుడు ఈ సింద్ బాద్ గుర్తుకువచ్చాడు. తుపాను వచ్చి సింద్ బాద్ సర్వస్వం కోల్పోతే, ఇప్పుడు కరోనా దెబ్బకు షేర్ల ధరలు దారుణంగా పడిపోతున్నాయట.
ఎక్కడో కొడితే, మరెక్కడో తగలడం అంటే ఇదేనేమో!
గమనిక: ఈ షేర్ మార్కెట్లకు సంబంధించి ఇసుమంత అవగాహన కూడా నాకు లేదు.
లేబుళ్లు:
షేర్ ఖాన్ లు – సింద్ బాదు కరోనా
ఇలా గుర్తుంచుకుంటారన్న మాట:
మందలపర్తి వారు, గతంలో నేను ఏదో ఒక సందర్భంలో చెప్పిన (రాసిన) సంగతిని ఇలా గుర్తు చేశారు.
“అనగనగా ఓ వాడకట్టులో ఇద్దరు ఇల్లాళ్లు.
ఒకామె పేరు రసజ్ఞత; మరొకామె విజ్ఞత.
రసజ్ఞత, చాలాకాలం తర్వాత, ఓ రోజున విజ్ఞత ఇంటికివెళ్ళింది. విజ్ఞత ఆమెని ఇల్లంతా తిప్పి బాల్కనీలోకి తీసుకొచ్చి కూర్చోపెట్టింది.
టీ-బిస్కెట్ మర్యాదలయ్యాక, రసజ్ఞత తృప్తిగా ఇలా అంది:
'ఏమో అనుకున్నా కానీ, పర్వాలేదే! నువ్వూ, కష్టపడి, బాగానే పోగేశావ్!'
మిత్రురాలి మాటలకు చిన్నగా నవ్వి, విజ్ఞత ఇలా బదులిచ్చింది.
'అబ్బే! ఇందులో మనకష్టం ఏముంది? అంతా అయాచితంగా వచ్చిపడిందే!!
మన రాజకీయుల త్యాగనిరతి వల్ల ఇది సాధ్యమైంది, అంతే! ప్రతి రాజకీయనాయకుడూ, సర్వం ప్రత్యర్థి విజ్ఞతకే వదిలేస్తున్నాడు. అతగాడికేమో అది అక్కర్లేదు. అన్నీ అలా మన వొళ్ళో వచ్చి పడిపోతున్నాయి!'
"!!!!"
“అనగనగా ఓ వాడకట్టులో ఇద్దరు ఇల్లాళ్లు.
ఒకామె పేరు రసజ్ఞత; మరొకామె విజ్ఞత.
రసజ్ఞత, చాలాకాలం తర్వాత, ఓ రోజున విజ్ఞత ఇంటికివెళ్ళింది. విజ్ఞత ఆమెని ఇల్లంతా తిప్పి బాల్కనీలోకి తీసుకొచ్చి కూర్చోపెట్టింది.
టీ-బిస్కెట్ మర్యాదలయ్యాక, రసజ్ఞత తృప్తిగా ఇలా అంది:
'ఏమో అనుకున్నా కానీ, పర్వాలేదే! నువ్వూ, కష్టపడి, బాగానే పోగేశావ్!'
మిత్రురాలి మాటలకు చిన్నగా నవ్వి, విజ్ఞత ఇలా బదులిచ్చింది.
'అబ్బే! ఇందులో మనకష్టం ఏముంది? అంతా అయాచితంగా వచ్చిపడిందే!!
మన రాజకీయుల త్యాగనిరతి వల్ల ఇది సాధ్యమైంది, అంతే! ప్రతి రాజకీయనాయకుడూ, సర్వం ప్రత్యర్థి విజ్ఞతకే వదిలేస్తున్నాడు. అతగాడికేమో అది అక్కర్లేదు. అన్నీ అలా మన వొళ్ళో వచ్చి పడిపోతున్నాయి!'
"!!!!"
లేబుళ్లు:
ఇలా గుర్తుంచుకుంటారన్న మాట:
6, మార్చి 2020, శుక్రవారం
పొత్తూరి ఇక లేరు
తెలుగు పాత్రికేయ దిగ్గజం పొత్తూరి
(Published in Andhra Prabha daily on 06-03-2020)
‘ఒక పత్రిక ఎడిటర్ అనేవాడు ఎలావుంటాడు? ఎలా వుండాలి?’ అని కళ్ళుమూసుకుని ప్రశాంతంగా ఆలోచిస్తూ నెమ్మదిగా కళ్ళు తెరిచినప్పుడు కనబడే రూపమే శ్రీ పొత్తూరి వెంకటేశ్వరరావు.
ముఖ్యమంత్రి కేసీఆర్ సీపీఆర్వో వనం జ్వాలా నరసింహారావు నేనూ కలిసి ఒకసారి పొత్తూరి వారి ఇంటికి వెళ్లాం. వారు రాసిన ‘బులేనా’ పుస్తకం సంతకం చేసి ఇచ్చారు. ‘ఎలా వున్నారు, ఆరోగ్యం ఇప్పుడు కులాసా కదా’ అని మేము అడగడం తప్పిస్తే ఆయన అంతట ఆయన తన అనారోగ్యం గురించి ఒక్క మాటా మాట్లాడలేదు. ఎంతో ఖరీదయిన వైద్యం. మామూలు మందులు కాక అదనంగా మూడు వారాలపాటు రోజుకొక కాప్స్యూల్ వేసుకోవాలి. ఒక్కొక్కటి అక్షరాలా వెయ్యి రూపాయలు. సాదా సీదా అట్టపెట్టెలోవున్న ఆ మాత్రల బాటిల్ ఇరవై వేల రూపాయలు అంటే నమ్మ బుద్దికాలేదు, కానీ కళ్ళెదుట కనబడుతున్న వాస్తవం అది.
వున్న ఆ కొద్ది సమయంలోనే ఆయన ఎన్నో కబుర్లు చెప్పారు. ప్రత్యేకతెలంగాణా ఉద్యమం కొన్ని దశాబ్దాల క్రితం సికిందరాబాదులోని ఒక హోటల్లో ఎలా ఊపిరి పోసుకున్నదో చెబుతూ ఆనాటి విశేషాలు వివరించారు.
ఇంట్లో పెంచుకుంటున్న ఈశ్వర నామం కలిగిన ఒక మొక్కను చూపించారు. పచ్చటి వర్ణం కలిగిన ఆకులు. వాటి మీద కపిల వర్ణంలో ‘నాగుపాము పడగ’ మీద వుండే కృష్ణ పాద ముద్రలు. ఆ మొక్క చాలా అరుదుగా దొరుకుతుందట. ఆ మొక్క వుంటే పాములు ఆ దరికి కూడా రావట. ఆయుర్వేద వైద్యులు మాత్రమే ఈ మొక్కను గుర్తించగలరట. ప్రాచీన ఔషధీ శాస్త్రంలో ఇటువంటివి ఎన్నో వున్నాయని చెప్పారు.
నిజం కావచ్చు. నిజం కాదని నమ్మే వాళ్ళూ వుంటారు.
నమ్మేవారు మొక్కితే రాయే సాయి, నమ్మనివారు తొక్కితే అదే రాయి.
అదలా ఉంచి వెంకటేశ్వరరావు గారు స్వయంగా చెప్పిన కొన్ని విశేషాలు నెమరు వేసుకుందాం.
ఈనాటి పత్రికారంగం వాళ్ళు తెలుసుకోవాల్సిన అంశాలు వాటిల్లో వున్నాయి.
పత్రిక యజమానికి తన పత్రిక గురించి ఆరా తీసే అధికారం ఉంటుందా?
ఇప్పటి రోజుల్లో అయితే ఇదొక ప్రశ్నే కాదు. ఆరా తీయడమేమిటి, వార్తలను అదుపు చేసే అధికారం కూడా వుంటుంది.
అయితే దాన్ని గురించి ఒక పాత విషయం చెప్పారు. కొంచెం అటూ ఇటూగా మూడు దశాబ్దాల నాటి సంగతి.
అప్పటి ఆంద్రప్రభ దినపత్రికకు పొత్తూరి వెంకటేశ్వరరావు గారు ఎడిటర్.
విజయవాడలో రంగా హత్య దరిమిలా జరిగిన విధ్వంస కాండపై, రామోజీరావు గారు చైర్మన్ గా ఉన్న ఎడిటర్స్ గిల్డ్ ఒక నిజనిర్ధారణ కమిటీ వేసింది. కుల్ దీప్ నాయర్, చెన్నై ఇండియన్ ఎక్స్ ప్రెస్ ఎడిటర్ జగన్నాధన్ తో పాటు ఆంధ్రప్రభ ఎడిటర్ హోదాలో పొత్తూరి వెంకటేశ్వర రావు గారు కూడా అందులో ఒక సభ్యులు. పొత్తూరివారు విడిగా బెజవాడ వెళ్లి పరిస్తితులను పరిశీలించి ఒక నివేదిక పంపారు. అది ఎలా చేరిందో ఇండియన్ ఎక్స్ ప్రెస్ అధినేత రామనాద్ గోయంకాకు చేరింది. అది ఆయనకు రుచించినట్టు లేదు. వెంటనే వెంకటేశ్వర రావు గారికి ఒక లేఖ పంపారు. ‘మీ నివేదిక నాకు దిగ్భ్రాంతితో కూడిన నిరుత్సాహాన్ని కలిగించింది’ అన్నది దాని సారాంశం. గోయంకా యజమాని. పొత్తూరి వారు ఆయన దగ్గర ఒక ఉద్యోగి. అయినా అలా ఉత్తరం రాయడం ఆయనకు నచ్చలేదు. వెంటనే నిరసనగా రాజీనామా లేఖ గోయంకాకు పంపించారు.
గోయంకా నుంచి పిలుపు వచ్చింది, మద్రాసు వస్తున్నాను అక్కడికి రమ్మని. పొత్తూరిగారు వెళ్ళారు.
“నా ఎడిటర్ అభిప్రాయంతో విబేధించే స్వేచ్చ నాకు లేదా?” అని సూటిగా అడిగారు, రాజీనామా విషయం ప్రస్తావించకుండా గోయంకా.
ఇంకా ఇలా అన్నారు.
“మన పత్రికలో పాఠకుల ఉత్తరాలు ప్రచురిస్తాము కదా. పత్రిక విధానాలతో విబేధించే ఉత్తరాలు కూడా వేస్తుంటాం. యజమానిగా ఒక విషయం మీ దృష్టికి తెచ్చాను. అది మీకు నచ్చలేదు. సరే! ఒక సాధారణ పాఠకుడికి వుండే ఈ వెసులుబాటు కూడా ఒక యజమానిగా నాకు లేదా చెప్పండి”
ఇలాంటి యజమానికి ఏ సంపాదకుడు అయినా ఏం జవాబు చెబుతారు.
అందుకే గుంభనగా వుండిపోయారు. రాజీనామా విషయం పట్టుబట్టలేదు.
గోయంకానే స్వయంగా రాజీనామా లేఖ పొత్తూరి వారి చేతిలో పెట్టి సాదరంగా సాగనంపుతూ అన్నారు.
“మీరు ఎడిటర్ గా ఉన్నంత కాలం మీరు మీ అభిప్రాయాలనే రాస్తూ వుండండి”
పొత్తూరివారి ఆరోగ్యం బాగాలేదని జ్వాలా ద్వారా తెలుసుకున్న తెలంగాణా ముఖ్యమంత్రి శ్రీ కే. చంద్రశేఖరరావు స్వయంగా పొత్తూరి వారిని చూడడానికి విజయనగర్ కాలనీలోని వారి ఇంటికి వెళ్ళారు. అక్కడి పరిస్తితిని ఓ కంట గమనించిన కేసీఆర్ తనదైన శైలిలో స్పందించారు. వారికి పూర్తి స్వస్థత చేకూరేవరకు ఆ బాధ్యత తమ ప్రభుత్వం తీసుకుంటుందని హామీ ఇచ్చారు. ఒక ప్రాంతీయ పార్టీ నాయకుడు అయినప్పటికీ, సుదీర్ఘ కాలం ప్రాంతీయ ఉద్యమాన్ని నడిపిన నేత అయినప్పటికీ ప్రాంతీయతత్వం ఏ కోశానా లేని కేసీఆర్, పొత్తూరి వారిని ఒక పాత్రికేయుడుగా గుర్తించారు కాని, అయన ఏప్రాంతం వారనే వివక్ష చూపలేదు. ఆయనలోని ఈ విలక్షణత్వం పొత్తూరివారికి కూడా తెలుసు. కానీ మొదటే చెప్పినట్టు విలువలకు కట్టుబడి జీవిస్తూ వచ్చిన పాత్రికేయుడాయన. అంచేత కేసీఆర్ సాదరంగా ఇవ్వచూపిన సాయాన్ని వారు సున్నితంగా తిరస్కరించారు. అయితే వారిరువురి నడుమ సాగిన సంభాషణలో పొత్తూరి వారు ఒక ఆసక్తికరమైన వ్యాఖ్య చేశారు.
“రెండో ప్రపంచయుద్ధంలో నాయకత్వం వహించిన నాటి బ్రిటన్ ప్రధానమంత్రి విన్ స్టన్ చర్చిల్ ఆ తరువాత జరిగిన బ్రిటన్ ఎన్నికల్లో ఆట్లీ చేతిలో ఓడిపోయారు. కానీ సుదీర్ఘకాలం ప్రత్యేక తెలంగాణా ఉద్యమానికి సారధ్యం వహించిన కేసీఆర్, తెలంగాణా రాష్ట్రంలో జరిగిన తొలి ఎన్నికలలోనే విజయబావుటా ఎగురవేసి తన నాయకత్వ పటిమను నిరూపించుకున్నారు”
తెలుగు పత్రికా రంగంలో తరాల నడుమ నడుమ వారధిలా ఉంటూ వచ్చిన పొత్తూరివారి మరణం పాత్రికేయ లోకానికి ఎన్నటికీ తీరని లోటే.
(Published in Andhra Prabha daily on 06-03-2020)
‘ఒక పత్రిక ఎడిటర్ అనేవాడు ఎలావుంటాడు? ఎలా వుండాలి?’ అని కళ్ళుమూసుకుని ప్రశాంతంగా ఆలోచిస్తూ నెమ్మదిగా కళ్ళు తెరిచినప్పుడు కనబడే రూపమే శ్రీ పొత్తూరి వెంకటేశ్వరరావు.
ముఖ్యమంత్రి కేసీఆర్ సీపీఆర్వో వనం జ్వాలా నరసింహారావు నేనూ కలిసి ఒకసారి పొత్తూరి వారి ఇంటికి వెళ్లాం. వారు రాసిన ‘బులేనా’ పుస్తకం సంతకం చేసి ఇచ్చారు. ‘ఎలా వున్నారు, ఆరోగ్యం ఇప్పుడు కులాసా కదా’ అని మేము అడగడం తప్పిస్తే ఆయన అంతట ఆయన తన అనారోగ్యం గురించి ఒక్క మాటా మాట్లాడలేదు. ఎంతో ఖరీదయిన వైద్యం. మామూలు మందులు కాక అదనంగా మూడు వారాలపాటు రోజుకొక కాప్స్యూల్ వేసుకోవాలి. ఒక్కొక్కటి అక్షరాలా వెయ్యి రూపాయలు. సాదా సీదా అట్టపెట్టెలోవున్న ఆ మాత్రల బాటిల్ ఇరవై వేల రూపాయలు అంటే నమ్మ బుద్దికాలేదు, కానీ కళ్ళెదుట కనబడుతున్న వాస్తవం అది.
వున్న ఆ కొద్ది సమయంలోనే ఆయన ఎన్నో కబుర్లు చెప్పారు. ప్రత్యేకతెలంగాణా ఉద్యమం కొన్ని దశాబ్దాల క్రితం సికిందరాబాదులోని ఒక హోటల్లో ఎలా ఊపిరి పోసుకున్నదో చెబుతూ ఆనాటి విశేషాలు వివరించారు.
ఇంట్లో పెంచుకుంటున్న ఈశ్వర నామం కలిగిన ఒక మొక్కను చూపించారు. పచ్చటి వర్ణం కలిగిన ఆకులు. వాటి మీద కపిల వర్ణంలో ‘నాగుపాము పడగ’ మీద వుండే కృష్ణ పాద ముద్రలు. ఆ మొక్క చాలా అరుదుగా దొరుకుతుందట. ఆ మొక్క వుంటే పాములు ఆ దరికి కూడా రావట. ఆయుర్వేద వైద్యులు మాత్రమే ఈ మొక్కను గుర్తించగలరట. ప్రాచీన ఔషధీ శాస్త్రంలో ఇటువంటివి ఎన్నో వున్నాయని చెప్పారు.
నిజం కావచ్చు. నిజం కాదని నమ్మే వాళ్ళూ వుంటారు.
నమ్మేవారు మొక్కితే రాయే సాయి, నమ్మనివారు తొక్కితే అదే రాయి.
అదలా ఉంచి వెంకటేశ్వరరావు గారు స్వయంగా చెప్పిన కొన్ని విశేషాలు నెమరు వేసుకుందాం.
ఈనాటి పత్రికారంగం వాళ్ళు తెలుసుకోవాల్సిన అంశాలు వాటిల్లో వున్నాయి.
పత్రిక యజమానికి తన పత్రిక గురించి ఆరా తీసే అధికారం ఉంటుందా?
ఇప్పటి రోజుల్లో అయితే ఇదొక ప్రశ్నే కాదు. ఆరా తీయడమేమిటి, వార్తలను అదుపు చేసే అధికారం కూడా వుంటుంది.
అయితే దాన్ని గురించి ఒక పాత విషయం చెప్పారు. కొంచెం అటూ ఇటూగా మూడు దశాబ్దాల నాటి సంగతి.
అప్పటి ఆంద్రప్రభ దినపత్రికకు పొత్తూరి వెంకటేశ్వరరావు గారు ఎడిటర్.
విజయవాడలో రంగా హత్య దరిమిలా జరిగిన విధ్వంస కాండపై, రామోజీరావు గారు చైర్మన్ గా ఉన్న ఎడిటర్స్ గిల్డ్ ఒక నిజనిర్ధారణ కమిటీ వేసింది. కుల్ దీప్ నాయర్, చెన్నై ఇండియన్ ఎక్స్ ప్రెస్ ఎడిటర్ జగన్నాధన్ తో పాటు ఆంధ్రప్రభ ఎడిటర్ హోదాలో పొత్తూరి వెంకటేశ్వర రావు గారు కూడా అందులో ఒక సభ్యులు. పొత్తూరివారు విడిగా బెజవాడ వెళ్లి పరిస్తితులను పరిశీలించి ఒక నివేదిక పంపారు. అది ఎలా చేరిందో ఇండియన్ ఎక్స్ ప్రెస్ అధినేత రామనాద్ గోయంకాకు చేరింది. అది ఆయనకు రుచించినట్టు లేదు. వెంటనే వెంకటేశ్వర రావు గారికి ఒక లేఖ పంపారు. ‘మీ నివేదిక నాకు దిగ్భ్రాంతితో కూడిన నిరుత్సాహాన్ని కలిగించింది’ అన్నది దాని సారాంశం. గోయంకా యజమాని. పొత్తూరి వారు ఆయన దగ్గర ఒక ఉద్యోగి. అయినా అలా ఉత్తరం రాయడం ఆయనకు నచ్చలేదు. వెంటనే నిరసనగా రాజీనామా లేఖ గోయంకాకు పంపించారు.
గోయంకా నుంచి పిలుపు వచ్చింది, మద్రాసు వస్తున్నాను అక్కడికి రమ్మని. పొత్తూరిగారు వెళ్ళారు.
“నా ఎడిటర్ అభిప్రాయంతో విబేధించే స్వేచ్చ నాకు లేదా?” అని సూటిగా అడిగారు, రాజీనామా విషయం ప్రస్తావించకుండా గోయంకా.
ఇంకా ఇలా అన్నారు.
“మన పత్రికలో పాఠకుల ఉత్తరాలు ప్రచురిస్తాము కదా. పత్రిక విధానాలతో విబేధించే ఉత్తరాలు కూడా వేస్తుంటాం. యజమానిగా ఒక విషయం మీ దృష్టికి తెచ్చాను. అది మీకు నచ్చలేదు. సరే! ఒక సాధారణ పాఠకుడికి వుండే ఈ వెసులుబాటు కూడా ఒక యజమానిగా నాకు లేదా చెప్పండి”
ఇలాంటి యజమానికి ఏ సంపాదకుడు అయినా ఏం జవాబు చెబుతారు.
అందుకే గుంభనగా వుండిపోయారు. రాజీనామా విషయం పట్టుబట్టలేదు.
గోయంకానే స్వయంగా రాజీనామా లేఖ పొత్తూరి వారి చేతిలో పెట్టి సాదరంగా సాగనంపుతూ అన్నారు.
“మీరు ఎడిటర్ గా ఉన్నంత కాలం మీరు మీ అభిప్రాయాలనే రాస్తూ వుండండి”
పొత్తూరివారి ఆరోగ్యం బాగాలేదని జ్వాలా ద్వారా తెలుసుకున్న తెలంగాణా ముఖ్యమంత్రి శ్రీ కే. చంద్రశేఖరరావు స్వయంగా పొత్తూరి వారిని చూడడానికి విజయనగర్ కాలనీలోని వారి ఇంటికి వెళ్ళారు. అక్కడి పరిస్తితిని ఓ కంట గమనించిన కేసీఆర్ తనదైన శైలిలో స్పందించారు. వారికి పూర్తి స్వస్థత చేకూరేవరకు ఆ బాధ్యత తమ ప్రభుత్వం తీసుకుంటుందని హామీ ఇచ్చారు. ఒక ప్రాంతీయ పార్టీ నాయకుడు అయినప్పటికీ, సుదీర్ఘ కాలం ప్రాంతీయ ఉద్యమాన్ని నడిపిన నేత అయినప్పటికీ ప్రాంతీయతత్వం ఏ కోశానా లేని కేసీఆర్, పొత్తూరి వారిని ఒక పాత్రికేయుడుగా గుర్తించారు కాని, అయన ఏప్రాంతం వారనే వివక్ష చూపలేదు. ఆయనలోని ఈ విలక్షణత్వం పొత్తూరివారికి కూడా తెలుసు. కానీ మొదటే చెప్పినట్టు విలువలకు కట్టుబడి జీవిస్తూ వచ్చిన పాత్రికేయుడాయన. అంచేత కేసీఆర్ సాదరంగా ఇవ్వచూపిన సాయాన్ని వారు సున్నితంగా తిరస్కరించారు. అయితే వారిరువురి నడుమ సాగిన సంభాషణలో పొత్తూరి వారు ఒక ఆసక్తికరమైన వ్యాఖ్య చేశారు.
“రెండో ప్రపంచయుద్ధంలో నాయకత్వం వహించిన నాటి బ్రిటన్ ప్రధానమంత్రి విన్ స్టన్ చర్చిల్ ఆ తరువాత జరిగిన బ్రిటన్ ఎన్నికల్లో ఆట్లీ చేతిలో ఓడిపోయారు. కానీ సుదీర్ఘకాలం ప్రత్యేక తెలంగాణా ఉద్యమానికి సారధ్యం వహించిన కేసీఆర్, తెలంగాణా రాష్ట్రంలో జరిగిన తొలి ఎన్నికలలోనే విజయబావుటా ఎగురవేసి తన నాయకత్వ పటిమను నిరూపించుకున్నారు”
తెలుగు పత్రికా రంగంలో తరాల నడుమ నడుమ వారధిలా ఉంటూ వచ్చిన పొత్తూరివారి మరణం పాత్రికేయ లోకానికి ఎన్నటికీ తీరని లోటే.
4, మార్చి 2020, బుధవారం
మాడపాటి సత్యవతి గారు ఇక లేరు
(Published in Andhra Jyothy Daily on 07-03-2020, Saturday)
నాలుగు మాసాల క్రితం...
నాలుగు మాసాల క్రితం...
ఫోన్ మోగింది...
AIR Madapati Satyavati
AIR Madapati Satyavati
ఫోన్ చేసినవారి పేరు డిస్ ప్లే అయింది. ఏం చెయ్యాలి. మాట్లాడాలా! వదిలేయాలా!
మూడు నెలల నుంచీ ఆవిడ అడపాదడపా ఫోన్ చేస్తూనే వున్నారు.
“శ్రీనివాసరావు గారూ. మీకు పెద్ద కష్టం వచ్చిపడింది. మీకు కుడి భుజం పడిపోయింది. నిర్మల పోయినప్పుడు రాలేకపోయాను. మిమ్మల్ని వెంటనే చూడాలి. ఇంట్లో ఉంటారా?”
ఆవిడ వుండేది గాంధీ హాస్పిటల్ వెనుక. నేనుండేది ఎల్లారెడ్డి గూడా. పైగా మాడపాటి సత్యవతి గారి వయసు ఎనభై ఎనిమిదేళ్ళు.
అంత దూరం నుంచి ఆవిడను రమ్మని అంటే నేను తప్పు చేస్తున్నట్టే లెక్క. ఎలా! నేను పోలేను. రమ్మని చెప్పలేను. అందుకే ఫోన్ ఎత్తకపోవడం. అంతేకాని ఆవిడను అవమానించడం కాదు.
నేనే ఫోన్ చేశాను. ‘సత్యవతి గారూ. ఈ సాయంత్రం వెంకట్రామయ్య గారిని తీసుకునే నేనే మీ ఇంటికి వస్తాను”.
‘అంతకంటేనా! తప్పకుండా రండి” అన్నారావిడ ఎంతో సంబరంగా. మొహం కనిపించకపోయినా ఆ స్వరంలోనే తెలుస్తోంది ఆ ఆనందం.
అనుకున్న సమయానికి కారులో వివేకానంద నగర్, ఈనాడు కాలనీకి వెళ్లాను. అక్కడ ఉంటున్న డి.వెంకట్రామయ్య గారిని ఎక్కించుకుని సికింద్రాబాదు బయలుదేరాము.
సత్యవతి గారింటికి వెళ్ళాము.
మా ఇద్దర్నీ చూడగానే ఆవిడ మొహం వెలిగి పోయింది. మళ్ళీ ఏమి గుర్తుకువచ్చిందో ఏమిటో వదనంలో విచారం తొంగి చూసింది.
‘మనం లోగడ వెంకట్రామయ్య గారింట్లో కలిసాము. అప్పుడు మీ వెంట నిర్మల వచ్చారు’ అన్నారు. తర్వాత ఏమీ మాట్లాడలేకపోయారు. నా సంగతి సరే.
వెంకట్రామయ్యగారు కల్పించుకుని సంభాషణ మార్చారు. పాత రేడియో రోజులు నెమరేసుకున్నాం. నేను రాస్తున్న రేడియో రోజుల ప్రసక్తి వచ్చింది. ‘ఏమిటండీ నన్నలా ఆకాశానికి ఎత్తేశారు’ అన్నారు తన గురించి రాసిన వ్యాసాన్ని ప్రస్తావిస్తూ.
చాలా సేపు కూర్చున్నాం. చాలా విషయాలు మాట్లాడారు. మాటలో అదే నెమ్మదితనం. ఎనభయ్ ఎనిమిదేళ్ళ వృద్ధాప్యపు ఛాయలు శరీరంలో కానవస్తున్నా ఆవిడ కంఠం మాత్రం అలాగే మునుపటి మాదిరిగానే శ్రావ్యంగా వుంది.
మళ్ళీ వీలు చిక్కినప్పుడు వస్తామని చెప్పి వచ్చాము.
పాత పరిచయస్తులను, స్నేహితులను ఇలా కలుస్తుంటే అదో తృప్తి. కానీ ఈ వేగయుగంలో మనసులో అనుకున్నాకుదరని విషయాల్లో ఇదొకటి.
ఇప్పుడు ఆ వెంకట్రామయ్య గారూ లేరు. సత్యవతి గారూ లేరు.
మూడు నెలల నుంచీ ఆవిడ అడపాదడపా ఫోన్ చేస్తూనే వున్నారు.
“శ్రీనివాసరావు గారూ. మీకు పెద్ద కష్టం వచ్చిపడింది. మీకు కుడి భుజం పడిపోయింది. నిర్మల పోయినప్పుడు రాలేకపోయాను. మిమ్మల్ని వెంటనే చూడాలి. ఇంట్లో ఉంటారా?”
ఆవిడ వుండేది గాంధీ హాస్పిటల్ వెనుక. నేనుండేది ఎల్లారెడ్డి గూడా. పైగా మాడపాటి సత్యవతి గారి వయసు ఎనభై ఎనిమిదేళ్ళు.
అంత దూరం నుంచి ఆవిడను రమ్మని అంటే నేను తప్పు చేస్తున్నట్టే లెక్క. ఎలా! నేను పోలేను. రమ్మని చెప్పలేను. అందుకే ఫోన్ ఎత్తకపోవడం. అంతేకాని ఆవిడను అవమానించడం కాదు.
నేనే ఫోన్ చేశాను. ‘సత్యవతి గారూ. ఈ సాయంత్రం వెంకట్రామయ్య గారిని తీసుకునే నేనే మీ ఇంటికి వస్తాను”.
‘అంతకంటేనా! తప్పకుండా రండి” అన్నారావిడ ఎంతో సంబరంగా. మొహం కనిపించకపోయినా ఆ స్వరంలోనే తెలుస్తోంది ఆ ఆనందం.
అనుకున్న సమయానికి కారులో వివేకానంద నగర్, ఈనాడు కాలనీకి వెళ్లాను. అక్కడ ఉంటున్న డి.వెంకట్రామయ్య గారిని ఎక్కించుకుని సికింద్రాబాదు బయలుదేరాము.
సత్యవతి గారింటికి వెళ్ళాము.
మా ఇద్దర్నీ చూడగానే ఆవిడ మొహం వెలిగి పోయింది. మళ్ళీ ఏమి గుర్తుకువచ్చిందో ఏమిటో వదనంలో విచారం తొంగి చూసింది.
‘మనం లోగడ వెంకట్రామయ్య గారింట్లో కలిసాము. అప్పుడు మీ వెంట నిర్మల వచ్చారు’ అన్నారు. తర్వాత ఏమీ మాట్లాడలేకపోయారు. నా సంగతి సరే.
వెంకట్రామయ్యగారు కల్పించుకుని సంభాషణ మార్చారు. పాత రేడియో రోజులు నెమరేసుకున్నాం. నేను రాస్తున్న రేడియో రోజుల ప్రసక్తి వచ్చింది. ‘ఏమిటండీ నన్నలా ఆకాశానికి ఎత్తేశారు’ అన్నారు తన గురించి రాసిన వ్యాసాన్ని ప్రస్తావిస్తూ.
చాలా సేపు కూర్చున్నాం. చాలా విషయాలు మాట్లాడారు. మాటలో అదే నెమ్మదితనం. ఎనభయ్ ఎనిమిదేళ్ళ వృద్ధాప్యపు ఛాయలు శరీరంలో కానవస్తున్నా ఆవిడ కంఠం మాత్రం అలాగే మునుపటి మాదిరిగానే శ్రావ్యంగా వుంది.
మళ్ళీ వీలు చిక్కినప్పుడు వస్తామని చెప్పి వచ్చాము.
పాత పరిచయస్తులను, స్నేహితులను ఇలా కలుస్తుంటే అదో తృప్తి. కానీ ఈ వేగయుగంలో మనసులో అనుకున్నాకుదరని విషయాల్లో ఇదొకటి.
ఇప్పుడు ఆ వెంకట్రామయ్య గారూ లేరు. సత్యవతి గారూ లేరు.
(మాడపాటి సత్యవతి)
లేబుళ్లు:
మాడపాటి సత్యవతి గారు ఇక లేరు
దీనికి సబ్స్క్రయిబ్ చేయి:
పోస్ట్లు (Atom)
