telugu లేబుల్‌తో ఉన్న పోస్ట్‌లను చూపుతోంది. అన్ని పోస్ట్‌లు చూపించు
telugu లేబుల్‌తో ఉన్న పోస్ట్‌లను చూపుతోంది. అన్ని పోస్ట్‌లు చూపించు

14, ఏప్రిల్ 2010, బుధవారం

ముఖ్య మంత్రులు

ముఖ్య మంత్రులు
(హైదరాబాద్ స్టేట్, ఆంద్ర, ఆంద్ర ప్రదేశ్)  
హైదరాబాద్ స్టేట్ :
వెల్లోడి        26 జనవరి 1950  నుంచి 6  మార్చి 1952 వరకు  (కేరళ రాష్ట్రం)       మొత్తం  770 రోజులు
బూర్గుల  
డాక్టర్ బూర్గుల రామకృష్ణారావు - మార్చి ఆరు 1952 నుంచి  31 అక్టోబర్ 1956 వరకు  మొత్తం 1855 రోజులు
ఆంద్ర రాష్ట్రం

టంగుటూరి
టంగుటూరి ప్రకాశం పంతులు  -  1 అక్టోబర్ 1953 నుంచి  27 మార్చి 1955 వరకు మొత్తం 631 రోజులు
గోపాలరెడ్డి

బెజవాడ గోపాలరెడ్డి  - 28 మార్చి 1955 నుంచి 1 నవంబర్ 1956 వరకు మొత్తం 584 రోజులు
ఆంద్ర ప్రదేశ్

సంజీవరెడ్డి

నీలం సంజీవరెడ్డి 1 నవంబర్ 1956 నుంచి 11 జనవరి 1960 వరకు మొత్తం 1166 రోజులు
దామోదరం

దామోదరం సంజీవయ్య 11 జనవరి 1960 నుంచి  12 మార్చి 1962  వరకు మొత్తం 791  రోజులు
సంజీవరెడ్డి

నీలం సంజీవరెడ్డి – 12 మార్చి  1962  నుంచి  29 ఫిబ్రవరి 1964  వరకు -  మొత్తం  719 రోజులు(రెండో పర్యాయం

బ్రహ్మానందరెడ్డి

కాసు బ్రహ్మానందరెడ్డి  - 29 ఫిబ్రవరి 1964  నుంచి 30 సెప్టెంబర్ 1971  వరకు -  మొత్తం  2770 రోజులు

పీవీ నరసింహారావు


పీవీ నరసింహారావు  - 30 సెప్టెంబర్ 1971 నుంచి  10 జనవరి  1973 వరకు -  మొత్తం – 468  రోజులు
                                         రాష్ట్రపతి పాలన - (11-01-1973 TO 10-12-1973 -  మొత్తం  335 రోజులు)
జలగం

జలగం  వెంగళరావు 10 డిసెంబర్ 1973 నుంచి  6 మార్చి 1978 వరకు మొత్తం  1547 రోజులు
చెన్నారెడ్డి

మర్రి చెన్నారెడ్డి -  6 మార్చి 1978 నుంచి  11 అక్టోబర్ 1980  వరకు మొత్తం – 950 రోజులు
అంజయ్య

టి . అంజయ్య  -    11 అక్టోబర్ 1980 నుంచి  24 ఫిబ్రవరి  1982 వరకు మొత్తం – 501 రోజులు
భవనం

భవనం వెంకట్రాం  -  24 ఫిబ్రవరి  1982 నుంచి  20 సెప్టెంబర్ 1982 వరకు మొత్తం – 208 రోజులు
కోట్ల

కోట్ల విజయ భాస్కరరెడ్డి  -  20 సెప్టెంబర్ 1982 నుంచి  9 జనవరి 1983 వరకు మొత్తం – 111 రోజులు
ఎన్టీ రామారావు

                                                          
ఎన్టీ రామారావు  -  9 జనవరి 1983 నుంచి  16 ఆగష్టు 1984  వరకు మొత్తం – 585 రోజులు
నాదెండ్ల

నాదెండ్ల భాస్కర రావు  -  16 ఆగష్టు 1984 నుంచి  16  సెప్టెంబర్ 1984  వరకు మొత్తం – 31 రోజులు
ఎన్టీయార్

ఎన్టీ రామారావు  - 16  సెప్టెంబర్ 1984 నుంచి  2 డిసెంబర్ 1989 వరకు మొత్తం – 1903 రోజులు (రెండో పర్యాయం)
చెన్నారెడ్డి

మర్రి చెన్నారెడ్డి  - 3 డిసెంబర్ 1989 నుంచి  17  డిసెంబర్  1990  వరకు మొత్తం- 379 రోజులు (రెండో పర్యాయం)
జనార్ధనరెడ్డి

నేదురుమల్లి  జనార్ధనరెడ్డి  -  17  డిసెంబర్  1990 నుంచి  9 అక్టోబర్  1992 వరకు మొత్తం- 662  రోజులు
విజయభాస్కరరెడ్డి

కోట్ల విజయభాస్కరరెడ్డి  - 9 అక్టోబర్  1992 నుంచి  12 డిసెంబర్ 1994  వరకు మొత్తం – 794 రోజులు
ఎన్టీ రామారావు

ఎన్టీ రామారావు 12   డిసెంబర్ 1994 నుంచి 1 సెప్టెంబర్ 1995 వరకు మొత్తం – 263 రోజులు (మూడో పర్యాయం)
చంద్రబాబు  

నారా చంద్రబాబు నాయుడు -    1 సెప్టెంబర్ 1995 నుంచి  14  మే  2004 వరకు మొత్తం 3178 రోజులు (రెండు పర్యాయాలు)
రాజశేఖరరెడ్డి

వైఎస్ రాజశేఖరరెడ్డి -  14  మే  2004 నుంచి 2 సెప్టెంబర్ 2009 తేదీన హెలికాప్టర్ దుర్ఘటనలో మరణించే  వరకు మొత్తం- 1938 రోజులు (రెండు పర్యాయాలు)

రోశయ్య
కొణిజేటి రోశయ్య  - 3 సెప్టెంబర్ నుంచి ఇప్పటి వరకు  ( 2010  మార్చినాటికి ఆరుమాసాల పదవీ కాలం పూర్తీ చేసుకున్నారు)
(సంకలనం భండారు శ్రీనివాసరావు 14-04-2010)

NOTE: All the images in this blog are copy righted to their respective owners.


24, డిసెంబర్ 2009, గురువారం

మహిళలపై టీవీ ప్రభావం

మహిళలపై టీవీ ప్రభావం




ప్రస్తుతం నడుస్తున్నది కలియుగం కాదు హింసాయుగం.

'ఎందెందు వెదికిచూసిన అందందే శ్రీహరి కనిపిస్తాడని' ప్రహ్లాదుడు తండ్రి హిరణ్యకశిపుడితో అంటాడు. కానీ హింస కోసం అలా వెతకాల్సిన పని కూడా లేదు.



హింస ఎక్కడ లేదు? నగరాల్లో- గ్రామాల్లో- ఇళ్ళల్లో- వీధుల్లో- మాటల్లో- చర్చల్లో ఎక్కడ చూసినా హింస విలయతాండవం చేస్తోంది. అంతెందుకు - సినిమాల్లో చూపిస్తున్న హింస నేరుగా టీవీల ద్వారా డ్రాయింగ్ రూముల్లోకి జొరబడుతోంది. అవునా? కాదా?



అయిదేళ్ళక్రితం అమెరికా వెళ్లాను. మన దగ్గరినుంచి వెళ్లి అక్కడ పెద్ద పెద్ద ఉద్యోగాలు చేసుకుంటూ రెండు చేతులా సంపాదిస్తున్న అనేకమంది తెలుగు పిల్లలు కనిపించారు. 'మీ ఈ అభివృద్దికి కారణం ఏవిటన్న నా ప్రశ్నకు వాళ్ళు చెప్పిన సమాధానాలలో ఒకటి ఈనాటి ఈ చర్చకు సంబంధించినది వుంది. స్కూల్లో చదువుకుంటున్నప్పుడు క్రమం తప్పకుండా దూరదర్శన్ లో క్విజ్ ప్రోగ్రాములు చూసే వాళ్ళమనీ, ఆ నాలడ్జే తరువాత జీవితంలో అక్కరకు వచ్చిందనీ వాళ్ళు చెప్పారు.

టీవీల వల్ల పాజిటివ్ ఎఫెక్ట్ ఉంటుందనడానికి దీన్ని ఉదాహరణగా తీసుకోవచ్చు.



లాహోర్ లో ఇన్ష్టిట్యూట్ ఆఫ్ బిజినెస్ ఆఫ్ ఎడ్మినిస్ట్రేషన్ లో చదువుకునే విద్యార్ధులు నిరుడు ఒక పరిశోధనా పత్రం ఒకటి రూపొందించారు. ఎలక్ట్రానిక్ మీడియా ఎఫెక్ట్ ఆన్ చిల్ద్రెన్ అన్నది సబ్జెక్టు. వాళ్ళ లెక్క ప్రకారం-

అక్కడి పిల్లల్లో -

పన్నెండు సంవత్సరాల లోపు వాళ్ళు రోజుకి రెండుగంటలు టీవీ చూస్తారట. ఓ అరగంటపాటు హోం వర్క్ చేసుకుని -ఓ గంట టీవీ గేమ్స్ చూస్తారట.

ఓ యిరవయి నిమిషాలు రేడియో వింటారు. మరో యిరవయి నిమిషాలు పుస్తకాలు చదవడానికీ, ఓ గంట ఆటలకీ, రెండున్నర గంటలు స్నేహితులతో ముచ్చట్లకీ ఖర్చు చేస్తారని తేలింది.

మరో ఆసక్తి కరమయిన విషయం ఏమిటంటే - చాలామంది పిల్లలు టీవీ తమకు సెకండ్ పేరెంట్ లాంటిదని చెప్పారు. టీవీ వల్ల ఇమాజినేటివ్ పవర్ పెరుగుతుందన్నారు. కొత్త భాషలు, కొత్త పదాలు నేర్చుకోవచ్చన్నారు. అదేసమయంలో వాళ్ళు మరో మాట కూడా చెప్పారు. పేద పిల్లలు టీవీ వల్ల నష్టపోతున్నారన్నారు. అలాగే పెద్దల నుంచి వేధింపులకు గురయ్యే పిల్లలు - టీవీలు చూసి హింసా మార్గం పడుతున్నారని, దౌర్జన్యకారులుగా తయారవుతున్నారని, చదువులో వెనకబడుతున్నారని వెల్లడించారు. ఈ పరిశోధన చేసిన విద్యార్ధులు కొన్ని విలువయిన సూచనలు కూడా చేశారు. బెడ్ రూముల్లో టీవీలు ఉండకూడదన్నారు. వాణిజ్యపరంగా నిర్వహించే టీవీ చానళ్ళను రెగ్యులేట్ చేయాలన్నారు. పిల్లలు చూసే ప్రోగ్రాములపై పెద్దలు ఓ కన్నేసి వుంచాలన్నారు.



రాజ్యాంగంలోని ఆర్టికిల్ యిరవై ఒకటి మనందరికీ జీవించే హక్కు ఇచ్చింది. రయిట్ టు లివ్ విత్ డిగ్నిటి అంటే హుందాగా, గౌరవంగా జీవించే హక్కు కూడా ఈ అధికరణం పౌరులకు ఇస్తోందని - హైకోర్టు, సుప్రీంకోర్టు కూడా గతంలో స్పష్టం చేసాయి. టీవీల్లో మహిళలని అసభ్యంగా చూపించడం ఈ ఆర్టికిల్ కి విరుద్ధం. కానీ ఏ టీవీ చానల్ కూడా దీన్ని పట్టించుకున్న దాఖలా లేదు.



వంటలు-ఆరోగ్యం- ఎడ్యుకేషన్ - వీటి మీద చాలా ఛానళ్ళు అనేక చక్కటి ప్రోగ్రాములు అందిస్తున్నాయి. వీక్షకుల స్పందన కూడా వీటికి బాగా వుంది. మంచి సంగతులు సరే. చెడు ప్రభావం తలచుకుంటేనే భయపడాల్సి వస్తోంది. ఆడవాళ్ళల్లో- ముఖ్యంగా గృహిణుల్లో చాలామందికి టీవీ చూడడంతోనే సరిపోతోంది. సరయిన వ్యాయామం లేక ఊబకాయం సమస్యలు తలెత్తుతున్నాయి. పిల్లలు ఆకర్షణీయమయిన టీవీ యాడ్స్ చూసి పిల్లలు జంక్ ఫుడ్స్ కి అలవాటుపడుతున్నారు. పత్రికల్లో ఇలాంటి ప్రకటనలు మామూలే కదా అనవచ్చు. కానీ నిరక్ష్యరాస్యులపై వాటి ప్రభావం అంతగా వుండదు. టీవీల యుగం వచ్చాక చదువుతో నిమిత్తం లేదు. చూసి కొత్త అలవాట్లు నేర్చుకుంటున్నారు. కన్స్యూమరిజం బాగా ప్రబలడానికి ఈ డ్రాయింగ్ రూం టీవీలే కారణం. ఇన్ని రకాల టీవీలు లేని రోజుల్లో పల్లెటూళ్ల లోని ఆడవాళ్ళకు అనేక రకాల కాలక్షేపాలు ఉండేవి. కుట్లు. అల్లికలు, సంగీతం అలా ఏదో ఒక ప్రయోజనకరమయిన వాటితో పొద్దు పుచ్చుకునేవాళ్ళు. ఇప్పుడో- సీరియళ్లు చూస్తూ వాటిపై చర్చోపచర్చలు చేసుకోవడంతోనే సరిపోతోంది. పిల్లలని చూడడానికి అమెరికా వెళ్ళిన వాళ్ళు కూడా ఇక్కడి సీరియల్ ఏమయిపోతోందో అని బెంగ పడుతున్నారని వింటుంటే వాటికి ఎంతగా ఎడిక్ట్ అయ్యారో అర్ధం చేసుకోవచ్చు.



ఒక సూర్యుండు సమస్త జీవులకు తానొక్కొక్కడయి తోచు చందాన - ఈ నాడు ప్రయివేటు ఛానళ్ళు కుటుంబంలో అందరికీ కావాల్సిన ప్రోగ్రాములను నేత్రానందంగా తయారుచేసి అందిస్తున్నాయి. కొన్నిసందర్భాలలో ఇవి కుటుంబ సభ్యుల నడుమ పొరపొచ్చాలకు కూడా కారణమవుతున్నాయి. దానితో ఎవరికి వాళ్ళు తమ విభవం కొద్దీ ఎవరి గదుల్లో వాళ్ళు విడిగా టీవీ సెట్లు ఏర్పాటుచేసుకుంటున్నారు. కుటుంబ సభ్యుల మధ్య అసలే అంతంత మాత్రంగా వున్న 'మాటా మంతీ' దీనితో నామమాత్రంగా మారిపోయింది. ఎవరి ఇళ్ళల్లో వాళ్ళే 'గెస్టులు' గా తయారవుతున్నారు. ఇరుగు పొరుగు- చుట్టపక్కాలతో సంబంధబాంధవ్యాలే కనుమరుగవుతున్నాయి. టీవీ చూస్తున్న సమయంలో ఫోన్ వస్తే సమాధానం చెప్పేవారే కరువవుతున్నారు.



ఇక అశ్లీల కార్యక్రమాలను గురించి ఎంత తక్కువ చెప్పుకుంటే అంత మంచిది.

అశ్లీలాన్ని అరికట్టే సదాశయంతో రూపొందించే ప్రోగ్రాములే అశ్లీల దృశ్యాలతో నిండిపోతున్నాయి.



ఒక్క మాటలో చెప్పాలంటే- తీరిక పుష్కలంగా ఉన్నవాళ్ళకోసం ఛానళ్ళు తీరిక లేకుండా పనిచేస్తున్నాయి.



-భండారు శ్రీనివాసరావు -