18, జూన్ 2020, గురువారం

హైదరాబాదులో కాళేశ్వరం గోదావరి జల?

 


 కాళేశ్వరం ప్రాజెక్టు ద్వారా పారుతున్న గోదావరి జలాలతో భూగర్భ జలాల మట్టం బాగా పెరిగిందని తెలంగాణా మంత్రి శ్రీ కే.టీ.ఆర్. అన్నట్టు ఆ మధ్య పత్రికల్లో చదివాను. అది నిజమే అనిపిస్తోంది.

హైదరాబాదు ఎల్లారెడ్డి గూడాలో మేముంటున్న మధుబన్ అపార్ట్ మెంట్ బోరు బావి ఎండిపోయి ఏళ్ళు గడుస్తున్నాయి. వున్నవి పన్నెండు కుటుంబాలు మాత్రమే కావడంతో దాని రిపేరు ఖర్చులు భరించలేక అలాగే వదిలేసి మునిసిపల్ వాటర్ తోనూ, రెండ్రోజులకోసారి కొనే మునిసిపల్ వాటర్  టాంక్ లతోను నెట్టుకుంటూ వస్తున్నాము.

ఈసారి వర్షాలు ముందుగానే వచ్చినా కన్నూ మిన్నూ ఏకమయ్యే భారీ వర్షాలు ఏవీ పడలేదు. అయితే ఆశ్చర్యకరంగా అపార్ట్ మెంట్ కమిటీ వాళ్ళు ఒక చల్లని కబురు చెవిన వేసారు. ఎవరి ప్రమేయం లేకుండా బోరు బాగుపడిందనీ, ఇకనుంచీ ఇరవై నాలుగు గంటలు నీళ్ళ సప్లయి ఉంటుందని, వాటర్ ట్యాంకుల అవసరం కూడా ఉండదనీ తెలియచేశారు.

కేటీఆర్ చెప్పినట్టు భూగర్భ జలాల మట్టం కానీ పెరగలేదు కదా! (17-06-2020)


కామెంట్‌లు లేవు: