19, జనవరి 2013, శనివారం

చింతించి వగచిన ఏమి ఫలము ?




చింతించి వగచిన ఏమి ఫలము ?


వచ్చే సార్వత్రిక ఎన్నికల అనంతరం రాహుల్ గాంధీని ప్రధానమంత్రిగా చూడాలనే కలను సాకారం చేసుకోవడానికి కాంగ్రెస్ పార్టీకి వోట్లు, సీట్లు కావాలి.
అందుకు మొదటి మెట్టయిన ఆంధ్ర ప్రదేశ్ లో అత్యధిక వోట్లు, సీట్లు  గతంలో మాదిరిగా కాంగ్రెస్ కు రావాలి.
ఇందుకు అవసరమయితే రాష్ట్రాన్ని రెండుగా చీల్చాలి.
ప్రజల ఆకాంక్షలమేరకు ఇలాటి నిర్ణయం తీసుకుంటే ఎవ్వరూ తప్పుపట్టరు. కానీ రాజకీయ ప్రయోజనాలకోసం రాష్ట్ర విభజనకు పూనుకునే ప్రయత్నం చేస్తే మాత్రం  అంతకంటే అమానుషం మరొకటి వుండదు.
కిందటి ఎన్నికల్లో రెండోమారు యూపీయే అధికార పీఠం ఎక్కడానికి తోడ్పడింది రాష్ట్రం నుంచి కాంగ్రెస్ పార్టీ గెలుచుకున్న అత్యధిక స్థానాలు. ఈ సంగతి కేంద్ర మంత్రివర్గ విస్తరణ సమయంలో ఆ పార్టీ  అధినాయకులకు గుర్తు రాదు. కొత్త రైళ్ళు మంజూరు చేసేటప్పుడు స్మరణకు రాదు. నిధుల కేటాయింపుల సమయంలో సరేసరి.  
పోతే, జైపూర్ లో జరుగుతున్న కాంగ్రెస్ పార్టీ సమావేశం గురించి  ‘చింతన్ శిబిర్, చింతన్ సివిర్’ అంటూ తెలుగు మీడియాలో వస్తున్న పదాలు వింటుంటే, తాము వోట్లు,సీట్లు కోరుకుంటున్న  దక్షిణాది రాష్ట్రాల  పౌరులకు కూడా  అర్ధమయ్యే రీతిలో ఈ సమావేశానికి పేరు పెడితే బాగుండేది అనిపిస్తోంది.  అందరికీ అర్ధం అయ్యే పదాలు హిందీలో కూడా వున్నాయి. ఈ  విషయం నిర్వాహకులకు గుర్తు రాకపోవడమే నిజానికి చింతించ వలసిన విషయం.
(19-01-2013)

1 కామెంట్‌:

అజ్ఞాత చెప్పారు...

చింతన్ బైఠక్ అంటే కూర్చుని చింతకాయ తొక్కు చేసుకోవడం కాదా?