19, మార్చి 2019, మంగళవారం

వ్యాసుడు, కార్ల్ మార్క్స్ వాహ్వ్యాళి


ఆదివారం  సాయంత్రం హైదరాబాదు ప్రెస్ క్లబ్ లో ఉషశ్రీ గారి సంస్మరణ కార్యక్రమం జరిగింది. మనసులో గట్టిగా వెళ్ళాలని అనుకున్నా చివరికి వెళ్ళలేకపోయాను. తన కలంతో ‘కలంకారీ’ చేసే చమత్కార రచయిత శ్రీ రమణ గారిని కలవలేకపోయాను. మిత్రులు కేవీఎస్  సుబ్రహ్మణ్యం గారిని అడిగి శ్రీరమణ గారి  కాంటాక్టు నెంబరు తీసుకున్నాను. చాలా రోజులయింది, గుర్తు పడతారో లేదో అని ‘నేను, భండారు శ్రీనివాసరావును’ అని మెసేజ్ కూడా పెట్టాను.
ఈరోజు ఉదయం ఫోను మోగింది. ఏదో కొత్త నెంబరు.
‘హలో! నేను శ్రీ రమణను మాట్లాడుతున్నాను’
ఎంతో సంతోషం అనిపించింది చాలా కాలం తర్వాత ఆయన గొంతు విని.
‘ఇదేమిటి, సుబ్రహ్మణ్యం మరో నెంబరు ఇచ్చాడే’ అన్నాను.
‘అదీ నాదే! ఆఫీసు వాళ్ళు ఇచ్చింది. ఇది నా పర్సనల్’
అదీ శ్రీ రమణ అంటే!
చాలా చాలా విషయాలు మాట్లాడుకున్నాం. లేదు లేదు, ఆయన చెబుతూ పోయారు, నేను వింటూపోయాను. నండూరి రామమోహన రావు గారు, పురాణం సుబ్రమణ్య శర్మ, బాపూ రమణలు, ఇంద్రగంటి శ్రీకాంత శర్మ, రావిశాస్త్రి  ఎందరెందరో మహానుభావులు, వారందరి కబుర్లు కలబోసారు. నేను నండూరి రామమోహన రావు గారు ఆంధ్రజ్యోతి ఎడిటర్ గా వున్నప్పుడు నేను ఆయన వద్ద అయిదేళ్ళు పనిచేసాను. తరువాత ఆలిండియా రేడియోలో ఉద్యోగం కోసం హైదరాబాదు వచ్చేసాను. ఆ తర్వాతనే  శ్రీ రమణ గారు జ్యోతిలో చేరారు.
ఉషశ్రీ తో కదా మొదలు పెట్టింది.
శ్రీ రమణ గారు ఓ సంగతి చెప్పారు, మాటల మధ్య.
ఉషశ్రీ ఆధునిక భావాలు కలిగిన ఆధ్యాత్మికవేత్త. రామాయణ మహా భారతాలను కాచివడబోసి వాటి సారాంశాన్ని రేడియో శ్రోతలకు తనదయిన బాణీలో వినిపించేవారు. వాల్మీకి రామాయణం మాదిరిగా ఉషశ్రీ రామాయణం అని చెప్పుకునేవారు.
శ్రీ రాఘవాచార్య. విశాలాంధ్ర ఎడిటర్ గా చాలా కాలం పనిచేసారు. ఒక తరం జర్నలిస్టులకు మార్గదర్శి. వామపక్ష భావజాలం నరనరాన నింపుకున్న వ్యక్తి. ఆరోగ్యం అంతగా సహకరించక పోయినా ఉషశ్రీ మీది అభిమానంతో శ్రీ రాఘవాచార్య నిన్నటి సమావేశానికి వచ్చారు. పత్రికల్లో చదివాను.
ఉత్తర దక్షిణ ధ్రువాల వంటి వీరిరువురూ మంచి స్నేహితులు.
విజయవాడ రోడ్ల మీద సరదాగా కలిసి తిరుగుతున్నప్పుడు వాళ్ళని చూసి ‘వ్యాసుడు, కార్ల్ మార్క్స్’ చెట్టాపట్టాలేసుకుని వస్తున్నట్టు వుందని జనం అనుకునేవారట!
శ్రీ రమణ చెప్పారు.
ఆయన ఒక్కరే ఇటువంటి చక్కటి కబుర్లు చెప్పగలరు.      

18, మార్చి 2019, సోమవారం

AP CM Chandrababu Controversial Comments on YCP over TRS Alliance | The ...

AP CM Chandrababu Controversial Comments on YCP over TRS Alliance | The ...

నన్ను’గోడ’ దించిన టీవీ జర్నలిస్ట్ వెంకట కృష్ణ - భండారు శ్రీనివాసరావు







నన్ను’గోడ’ దించిన టీవీ జర్నలిస్ట్ వెంకట
కృష్ణ  - భండారు శ్రీనివాసరావు
అంటీముట్టనట్టుగా, తామరాకుమీది నీటి
బొట్టులా, కాస్త ముదురుగా చెప్పాలంటే ‘గోడ మీది పిల్లి’లా టీవీ చర్చల్లో నా వైఖరి
ఉంటుందని చాలామంది చెప్పారు. ఇంతెందుకు, ఇంటికి రాగానే మా ఆవిడే అంటుంది, ఇక ‘గోడ’
దిగండని. మా ఆవిడ నాకు పెట్టిన ముద్దు పేరు ‘గోపి’
దీనికి కారణం నాకు నేనుగా పెట్టుకున్న
నిబంధన. ఎంతో అవసరం అయితే తప్ప పార్టీల పేర్లు, వ్యక్తుల పేర్లు,టీవీ చర్చల్లో  నా నోటి నుంచి రాకూడదని.
ఈరోజు సోమవారం ఎప్పటి మాదిరిగానే AP
24 X 7 న్యూస్ ఛానల్ లో  “The Debate With Venkata Krishna” చర్చాకార్యక్రమం. ఎప్పటి మాదిరిగానే నా విశ్లేషణ. చూసీ చూసీ, వినీ
వినీ  విసుగు పుట్టిందో ఏమో కానీ వెంకట
కృష్ణ నవ్వుతూనే ఈ అంశం లేవనెత్తారు. ‘నొప్పించక తానొవ్వక’ అనే ఈ విధానం వల్ల ఒక
జర్నలిష్టుగా మీ బాధ్యతను పూర్తిగా నెరవేర్చినట్టు అవుతుందా అని.
ఆ విధంగా ఆయన నా నెత్తిన పాలు పోశారు.
నేను ఎందుకిలా మాట్లాడాల్సి వస్తోంది అనే ప్రశ్నకు బహిరంగంగా ఒక టీవీ వేదికగా వివరణ
ఇచ్చుకునే ఓ మంచి అవకాశం నాకాయన కల్పించారు. అందుకు కృతజ్ఞుడిని.  

17, మార్చి 2019, ఆదివారం

పారాచూట్ పాలిటిక్స్ | News Scan Debate With Vijay On AP Politics | 17th ...







పాజిటివ్ ఓటింగ్
ప్రభుత్వాలు చేసిన మంచి పనులు,
అభివృద్ధి, సంక్షేమ  కార్యక్రమాలు చూసి
ప్రజలు ఓట్లు వేస్తే అది పాజిటివ్ ఓటింగ్. మేలు చేసిన వాళ్ళను గుర్తు పెట్టుకునే
సద్గుణం ప్రజలకు వుంది.
అయితే నాయకులకు ఓ వార్నింగ్. మీరు ఈ
విషయంలో   ఓటర్లకు ఆదర్శంగా వుండాలి.
‘మేము స్వప్రయోజనాలకోసం పార్టీలు
మారుతుంటాము, డబ్బులావాదేవీలు చక్కబెట్టుకుంటూ ఉంటాము. మీరు మాత్రం ప్రలోభాలకు
గురికాకుండా ఓటు వేయండి’ అని నీతి వాక్యాలు చెబితే కుదరదు.
‘ఎప్పటికెయ్యది ప్రస్తుత’మని మీరు
అనుకున్నట్టు ఓటర్లూ అనుకుంటే ఏం జరుగుతుందో ఒక్కసారి ఆలోచించుకోండి.   

16, మార్చి 2019, శనివారం

హెల్ప్ లెస్

రాజకీయ వ్యాసాలకు వ్యక్తిగత అభిమానాలకు లంకె కుదరదు. దేని దారి దానిదే. అలా అని మనసులో మాటలు ఎప్పుడో ఒకప్పుడు, ఎక్కడో ఒక చోట, ఏదోవిధంగా రచనలలో తొంగిచూడడం కద్దు. కీర్తిశేషులు, ప్రముఖ జర్నలిస్టు హిందూ పత్రిక రెసిడెంట్ ఎడిటర్ రాజేంద్ర ప్రసాద్ గారు కూడా టీడీపీ వ్యవస్థాపకులు ఎన్టీఆర్ పట్ల తన అభిమానాన్ని దాచుకోవడానికి సందేహించేవారు కాదు. ఆయన హయాములోనే బడుగు, బలహీన వర్గాలకు సముచిత ప్రాధాన్యం లభించిందని ఆయన అంటూ వుండేవారు. అయితే అది తన వ్యాసాల్లో ప్రతిఫలించకుండా జాగ్రత్త పడేవారు.
సినీ నటుల పట్ల అభిమానం పెంచుకునే రీతిలోనే రాజకీయ నాయకుల విషయంలో కూడా అభిమానులు తయారవుతున్నారు. ఇది తప్పేమీ కాదు.
మా కుటుంబం విషయమే తీసుకుందాం. దాదాపు తొంభయి శాతం మందికి చంద్రబాబునాయుడు అంటే చెప్పలేని ఇష్టం. మొదటి సారి ఆయన ఓటమి పాలయినప్పుడు, మా కుటుంబంలో కొందరు ఆడవాళ్ళు ఆయన్ని చూడాలని కోరితే వాళ్ళని ఆయన దగ్గరకు తీసుకువెళ్ళాను. అందులో గీత అనే ఆవిడ తన సానుభూతి వాక్యాలతో చంద్రబాబుకు కంటనీరు తెప్పించింది. వాళ్ళని సముదాయించాల్సిన పరిస్తితి ఆయనది. ఇన్నేళ్ళు గడిచినా ఆయన పట్ల వారి అభిమానంలో మార్పులేదు.
ఇక జగన్ అన్నా ఆయన పార్టీ అన్నా ప్రాణం పెట్టేవాళ్ళు రోజూ నా చుట్టూతా కనిపిస్తుంటారు. మా పనిమనిషి, వంట మనిషి, వాచ్ మన్ ఇలా అనేక కుటుంబాల వాళ్ళు నాకు తెలుసు. సాక్షి పత్రిక కేలండర్ పై వేసే వై ఎస్ ఫోటోను ఫ్రేము కట్టించి దాచుకుంటారు. ప్రతి ఏటా ఆ పని చేయడం చూసి నాకు చిత్రమనిపిస్తుంది. జగన్ జైలు నుంచి విడుదల అయిన రోజున తమ రోజువారీ పనులు పక్కన బెట్టి గంటలు గంటల పాటు జైలు పరిసరాల్లో ఆయన కోసం ఎదురు చూస్తూ గడిపారన్న తెలుసుకుని ఆశ్చర్య పోవడం నా వంతయింది. ఇన్నేళ్ళు గడిచినా వాళ్ళూ అంతే! జగన్ పట్ల వారి అభిమానం రవంతకూడా చెక్కుచెదరలేదు.
కాబట్టి, ఎవరి అభిమానాలు వారివి. మా కుటుంబంలోని బాబు అభిమానులకు, జగన్ అభిమానులకు నేను రాసే రాతల్లో కొన్ని బాగా నచ్చుతాయి. కొన్ని అస్సలే నచ్చవు. ఆ విషయం నాకు తెలుసు.
కానీ ఈ విషయంలో నేను హెల్ప్ లెస్.


(పైన పేర్కొన్న రాజేంద్ర ప్రసాద్ గారే మరో మాట కూడా చెప్పేవారు. జర్నలిస్టు అనేవాడు ప్రతిపక్షం పట్ల కొంత సానుభూతి చూపాలని అనేవారు. ప్రచారం చేసుకోవడానికి పెద్ద వ్యవస్థ ప్రభుత్వం చేతిలో వుంటుంది. ఆ వెసులుబాటు లేని ప్రతిపక్షాల సంగతి కనిపెట్టి చూడాలని దాని తాత్పర్యం)

దుర్గంధ భరితం - ఏపీ రాజకీయం

ఒక మంచి మనిషిని గుర్తు తెలియని వ్యక్తులు హత్య చేస్తారు. పోలీసులకంటే ముందు రాజకీయం రంగ ప్రవేశం చేస్తుంది. కారణం  అది ఆంధ్రప్రదేశ్.
ఉదయం గుండెపోటుతో మరణించారని వార్తలు. చనిపోయింది నిగర్వి, నిరాడంబరుడు అయిన వై.ఎస్. వివేకానంద రెడ్డి. అందరూ పార్టీలను పక్కన బెట్టి నివాళులు అర్పించారు. ఒక గొప్ప మనిషి, నేటి రాజకీయాలకు ఏమాత్రం సరిపోని వ్యక్తి కాబట్టి అందరూ ఆయనతో తన అనుబంధాలను, జ్ఞాపకాలను నెమరు వేసుకున్నారు.
గంటల్లో దృశ్యం మారిపోయింది. అది సహజ మరణం కాదు, హత్య అనే నిర్ధారణకు పోలీసులు వచ్చారు. అంతే! రాజకీయం రంగంలోకి వచ్చింది. చనిపోయింది సాక్షాత్తు ప్రతిపక్ష నేత వై.ఎస్. జగన్ మోహన్ రెడ్డి సొంత బాబాయి కావడంతో రాజకీయం తన డేగ రెక్కలు విప్పుకుంది. అందులోను ఎన్నికల కాలం. ఎవరు మాత్రం వదులుకుంటారు ఈ మహత్తర అవకాశం. అదే జరుగుతోంది. ఒక ఉత్తమ రాజకీయ నాయకుడి ఆకస్మిక మరణం అమానుష రాజకీయానికి ఒక వేదికగా మారింది. ఎక్కడయినా ఇలా జరుగుతుందా! జరగదు. కానీ అది ఆంధ్రప్రదేశ్. అక్కడ అలాగే జరుగుతుంది. జరిగితీరాలి.
సంఘటనపై పోలీసులు స్పందించారు. చనిపోయింది కడప జిల్లాకు చెందిన  ఒక ప్రముఖ రాజకీయ నాయకుడు కావడంతో డీజీపీ స్థాయి అధికారి పెదవి విప్పి మాట్లాడడంలో అసహజం ఏమీ లేదు. కానీ అది కూడా ఒక వివాదాంశం అయికూర్చుంది. ఎండుమంటే, అది ఆంధ్రప్రదేశ్.
వివాదం కావడానికి కూడా కారణం లేకపోలేదు. గతంలో విచారణ సాగుతుండగానే పోలీసు ఉన్నతాధికారులు, రాజకీయ నాయకులు తొందరపడి  స్పందించిన దాఖలాలు వున్నాయి. ఉన్నతస్తానాల్లో ఉన్న పోలీసు  అధికారులు ఇలా  బాధ్యతా రాహిత్యంగా వ్యాఖ్యానాలు చేయొచ్చా  అనే చర్చ అనవసరం. ఎందుకంటె అది ఆంధ్రప్రదేశ్.
ఈలోగా అధికార తెలుగు దేశం పార్టీకి చెందిన  ఒక నాయకుడు టీవీ తెరలపై కానవచ్చి ‘జగనే తన బాబాయిని హత్య చేయించాడని ఒక బాంబు పేల్చారు.  ఇలా తొందరపడి ఒక నిర్ధారణకు రావడం, ప్రతిపక్ష నేతపై ముందూ వెనకా చూసుకోకుండా తీవ్రమైన ఆరోపణలు చేయడం సబబా అంటే ఎంతమాత్రం కాదు. కానీ అది ఆంధ్రప్రదేశ్. అలాగే జరుగుతుంది.
వై.ఎస్.ఆర్. పార్టీ వాళ్ళు ఊరుకుంటారా! ఊరుకుంటే అది రాజకీయపార్టీ కానేరదు. ఏకంగా ఆ పార్టీ అధినాయకుడే స్పందించారు. ఇది ప్రభుత్వం చేయించిన హత్య అని జగన్ మోహన రెడ్డి ఆరోపించారు. దీని వెనుక చంద్రబాబు హస్తం వుందనేది అన్యాపదేశంగా ఆయన ఉద్దేశ్యం. ఒక ముఖ్యమంత్రి పై ఇలాంటి ఆరోపణలు చేయడం సహేతుకమా అంటే సమాధానం మళ్ళీ ఒక్కటే. అది ఆంధ్రప్రదేశ్.
మరో రెండు రోజుల్లో ఎన్నికల నోటిఫికేషన్ విడుదల అవుతుంది. నామినేషన్ల పర్వం మొదలవుతుంది. ప్రధాన రాజకీయ పార్టీలన్నీ అభ్యర్దులను ఖరారు చేయడంలో, అసంతృప్తులను బుజ్జగించడంలో, పార్టీ మారి వచ్చేవారికి కండువాలు కప్పి తమ పార్టీ తీర్దాలు ఇప్పించడంలో తలమునకలుగా ఉన్న ఈ తరుణంలో ముఖ్యమంత్రి, టీడీపీ అధ్యక్షుడు చంద్రబాబు నాయుడు రాత్రికి రాత్రి  విలేకరుల సమావేశం పెట్టి సంఘటన పూర్వాపరాలను వివరించారు. పనిలో పనిగా అనుమానపు వేలును జగన్ వైపు చూపించారు. ఇది అవసరమా అంటే అవసరమే. ఎందుకంటే అది ఆంధ్రప్రదేశ్.
విడ్డూరంగా అనిపించే విషయం ఏమిటంటే ఒక చిన్న స్థాయి పోలీసు అధికారి చెప్పాల్సిన మాటలు ముఖ్యమంత్రి చెప్పడం.
‘ఉదయం సహజ మరణం అన్నారు. గంటల్లో అది హత్య అని తేలింది. సంఘటన జరిగింది వారింట్లో. చనిపోయిన మనిషిని స్నానాలగది నుంచి పడక గదికి చేర్చారు.  రక్తపు మరకలు తుడిచేశారు. సాక్ష్యాధారాలు మాయం చేసే దురుద్దేశ్యంతో అలా చేసారు. ఆసుపత్రికి తీసుకెళ్ళి సహజ మరణం అని నమ్మించే ప్రయత్నం చేసారు. ఇంట్లో హత్య జరిగినప్పుడు ఎవరయినా ముందు పోలీసులకు సమాచారం అందిస్తారు. హత్యాప్రదేశంలో ఆనవాళ్ళు చెరిపేయరు. అందుకే అనుమానాలు. వీటి నివృత్తి జరగాలి. క్షుణ్ణంగా దర్యాప్తు జరగాలి. అందుకే ‘సిట్’ ఏర్పాటు’ అన్నారాయన. అది ఆంధ్రప్రదేశ్. అందుకే ప్రతి విషయంలో ముఖ్యమంత్రి స్థాయి వ్యక్తులు స్పందిస్తారు.
వైసీపీ ఊరుకుంటుందా! గతంలో హైదరాబాదులో నటుడు బాలకృష్ణ ఇంట్లో ఒక దుస్సంఘటన జరిగినప్పుడు పోలీసులు వచ్చేలోగా ఆ ఇంటి వాళ్ళు రక్తపు మరకలను శుభ్రం చేయలేదా అని గుర్తు చేస్తున్నారు.
‘ఒక ఘోరం జరిగింది. తెల్లారి చూస్తె ఇంటి పెద్ద బాత్ రూములో చనిపోయి పడివున్నాడు. ఆ దృశ్యం చూసిన ఇంట్లో వాళ్ళు ముందు ఏం చేస్తారు? ఆ విగత జీవిని వేరే గదిలోకి తరలిస్తారు. శరీరం మీద నెత్తురు మరకలు వుంటే తుడుస్తారు. చనిపోయిన వాడు పరాయి మనిషి కాదు, చూస్తూ చూస్తూ పోలీసులు వచ్చేదాకా అలా స్నానాల గదిలో  వదిలేయడానికి. మానవత్వం ఏ కోశానా  లేనివాళ్ళు మాత్రమే అలాంటి దుష్టపు ఆలోచనలు చేస్తారు’ అని చంద్రబాబుపై ఎదురు దాడికి దిగుతున్నారు.
ఇది సరే! ఒప్పుకుందాం. మరి సహజ మరణం అంటూ ఇచ్చిన పిర్యాదు సంగతేమిటి? ఈ ప్రశ్నకు జవాబు లేదు. ఉండదు. ఎందుకంటే  అది ఆంధ్రప్రదేశ్.     
జరిగింది హత్య అని ఇరుపక్షాలు నిర్ధారణకు వచ్చి బహిరంగంగా ఆ సంగతి అంగీకరిస్తున్నారు. పోలీసులు కూడా హత్యే అని అంటున్నారు. ప్రభుత్వం గంటల వ్యవధిలోనే ప్రత్యెక దర్యాప్తు బృందం (సిట్) ఏర్పాటు చేసింది.
‘ఠాట్!  ‘సిట్’ పనికిరాదు. అది రాష్ట్ర ప్రభుత్వం కనుసన్నల్లో పనిచేస్తుంది. సీబీఐ చేత దర్యాప్తు చేయించి నిజం నిగ్గు తేల్చాలి’ అని వైసీపీ నాయకుల డిమాండ్. డేటా చోరీ కేసులో తెలంగాణా ప్రభుత్వం ‘సిట్’ ఏర్పాటు చేస్తే తెలుగు దేశం పార్టీ  చేసిన ఆరోపణలను గుర్తుచేస్తూ.
‘వీళ్ళకి రాష్ట్ర పోలీసుల మీద నమ్మకం లేదు, వ్యవస్థల మీద నమ్మకం లేదు. మాట్లాడితే సీబీఐ అంటారు. తమ నేరాలను కప్పి పుచ్చుకోవడానికే ఆ డిమాండ్లు’ చంద్రబాబు ఆరోపణాస్త్రం.
‘గతంలో ఉమ్మడి రాష్ట్రంలో టీడీపీ ప్రతిపక్షంలో వున్నప్పుడు ఎన్నిసార్లు సీబీఐ దర్యాప్తుకు పట్టుబట్టలేదు. అంటే స్థానిక పోలీసుల మీద నమ్మకం లేకనేనా? మాకు పోలీసు వ్యవస్థ మీద నమ్మకం వుంది. విశ్వాసం లేనిది ప్రభుత్వం మీదనే. అందుకే సీబీఐ దర్యాప్తు కోరుతున్నాం’ వైఎస్ ఆర్ సి పీ నాయకుల ప్రత్యారోపణ.
నిన్నకాక మొన్న సీబీఐ ని మా రాష్ట్రంలోకి అడుగు పెట్టనివ్వం అని ఘీంకరించింది ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడే. ఈడీ మీద నమ్మకం లేదన్నదీ ఆయనే. తనకు నమ్మకం లేదంటే అందరూ దాన్ని నమ్మాలి. మాకు రాష్ట్ర పోలీసుల మీద నమ్మకం లేదంటే మాత్రం  మాకు వ్యవస్థల మీద నమ్మకం లేదని భాష్యం చెబుతుంటారు’ అనేది వారి ముక్తాయింపు.  
ఒక పెద్దమనిషి మరణించినప్పుడు అదీ హత్య అని నిర్ధారణ అయినప్పుడు జరగాల్సిన వాదోపవాదాలు ఇవేనా! ఖచ్చితంగా కాదు. కానీ అది ఆంధ్రప్రదేశ్.    
వివేకానంద రెడ్డిని వివాదరహితుడిగా అభివర్ణిస్తూ,  నివాళులు అర్పించిన రాజకీయ నాయకులే ఆయన మరణాన్ని వివాదగ్రస్తం చేస్తూ వుండడం ఓ విషాదం.
సరే! ఇవన్నీ ఒకెత్తు. మీడియా ఈ సంఘటనపై స్పందిస్తున్న తీరు.  చర్చల రూపంలో విచారణ సాగిస్తున్నవైనం. ఇది బాధ్యత కలిగిన మీడియా చేయాల్సిన పనేనా! ఈ ప్రశ్న కూడా అనవసరం. ఎందుకంటే అది ఆంధ్రప్రదేశ్.
సరే! ఈ ఆంధ్రప్రదేశ్ రాజకీయాలు ఎప్పుడూ ఇలాగే సాగేవే. వాటిని కాసేపు ఒదిలేద్దాం.
చనిపోయిన ఆ మంచి మనిషిని గురించి ఓ మంచి ముక్క చెప్పుకుందాం  
ఇది జరిగి చాలా ఏళ్ళయింది. అప్పుడు రాజశేఖర రెడ్డి ముఖ్యమంత్రి.
రవీంద్ర భారతిలో దూరదర్సన్ ఏదో సంగీత కార్యక్రమం ఏర్పాటు చేసింది. ముఖ్య అతిధులు, ముఖ్యుల కోసం ముందు రెండు వరసలు ఖాళీగా ఉంచారు. నేను మూడో వరసలో కూర్చున్నాను.
వెనుకవైపు జనం బాగా నిండి పోయారు. అక్కడక్కడా ఒకటో అరో కుర్చీలు ఖాళీగా వున్నాయి.
కార్యక్రమం మొదలు కావడానికి కాస్త ముందు బక్కపలచగా ఉన్న ఓ వ్యక్తి లోపలకు వచ్చి నాలుగో వరసలో ఖాళీగా ఉన్న ఓ కుర్చీ వెతుక్కుని కూర్చున్నారు. ఎక్కడో చూసినట్టుగా వుందే అనుకుంటూ తేరిపార చూస్తే అయన ఎవరో కాదు, పార్లమెంటు సభ్యుడు వై.ఎస్. వివేకానంద రెడ్డి. ముఖ్యమంత్రి రాజశేఖర రెడ్డికి స్వయానా సోదరుడు. ముందూ వెనకా సెక్యూరిటీ కూడాలేదు.
వెళ్లి ముందు వరసలోకి రమ్మంటే ఆయన సున్నితంగా తిరస్కరించారు. పరవాలేదు ఇక్కడే కూర్చుంటాను, నాకేమీ ఇబ్బంది లేదుఅన్నారాయన అంతకంటే సున్నితంగా.
రాజకీయాల్లో అటువంటి నిరాడంబరత్వం నిజంగా అపురూపమే.