వచ్చే నెల మొదటి వారంలో ప్రధానమంత్రి నరేంద్ర మోడీ జరిపే ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర పర్యటనకు దూరంగా వుండి నిరసన తెలపాలని ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు భావిస్తున్నట్టు పత్రికల్లో వచ్చింది. ప్రధాని వచ్చినప్పుడు ముఖ్యమంత్రి స్వాగతం పలకడం అనేది ప్రోటోకాల్ విధుల్లో భాగం కావచ్చు. గతంలో దాన్ని పక్కన బెట్టి ముఖ్యమంత్రులు వ్యవహరించిన దాఖలాలు వున్నాయి. ఉదాహరణకు తమిళనాడు ముఖ్యమంత్రి జయలలిత. కేంద్ర రాష్ట్ర సంబంధాలు బాగా లేని స్తితిలోకూడా ఈ మర్యాదలు పాటించిన ముఖ్యమంత్రులు లేకపోలేదు. వీరిలో అగ్రగణ్యులు కీర్తిశేషులు నందమూరి తారక రామారావు. ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీ నూతన భవనం ప్రారంభానికి అప్పటి ప్రధాని రాజీవ్ గాంధి వచ్చినప్పుడు రాజీవ్ ప్రసంగిస్తున్నంత సేపూ రామారావు ఆయన చెంతనే నిలబడిపోయారు. అలాగే ప్రధాని శ్రీ పీవీ నరసింహారావుకు భార్యతో కలిసి పాదాలు కడిగారు. ఆయన మర్యాదలు ఆవిధంగా ఉండేవి. రాజకీయంగా విబేధించినప్పుడు ఆ పాత్రలో ఆయన వేరేగా కనబడేవారు.
ఇది మామూలు షేరింగ్ కాదు. నా సొంత గొడవ కొంత వుంది. నా జీవితంలో మూడో వంతు రాజకీయ నాయకులతో గడిచిపోయింది, వృత్తి రీత్యా. రాజకీయ చర్చల్లో పాల్గొనేటప్పుడు వివిధ రాజకీయ పార్టీల అధికార ప్రతినిధులు కూడా వుంటారు. అలాగే ప్రేక్షకుల్లో సయితం అన్ని పార్టీల వాళ్ళు వుంటారు. నేను చెప్పే విషయాలు కొందరికి నచ్చితే, మరికొందరికి నచ్చక పోవచ్చు. ప్రశ్నని బట్టి జవాబు వుంటుంది. కానీ ప్రతి ఒక్కరికీ తమకు నచ్చినదే నా నోటంట వినాలని వుండడం సహజం. కానీ కుదరదు కదా! అలాంటప్పుడు నేను ఏదో మనసులో పెట్టుకుని కావాలనే అలా మాట్లాడుతున్నానని అనుకోవడం కూడా సహజం. కాబట్టి ఇది మనసులో పెట్టుకుని మా వ్యాఖ్యలను మంచి మనసుతో అర్ధం చేసుకోవాలని మనవి.
ప్రతి మంగళవారం మాదిరిగానే ఈరోజు ఉదయం సాక్షి టీవీ KSR LIVE SHOW చర్చాకార్యక్రమంలో నాతోపాటు పాల్గొన్నవాళ్ళు : శ్రీ ప్రకాశ రెడ్డి, వైసీపీ (అనంతపురం నుంచి), శ్రీ రామచంద్రారెడ్డి (కాంగ్రెస్), శ్రీ విల్సన్ (బీజేపీ), శ్రీ పి. ఎల్. శ్రీనివాస్ ( టీఆర్ ఎస్)
ప్రతి మంగళవారం మాదిరిగానే ఈరోజు ఉదయం సాక్షి టీవీ KSR LIVE SHOW చర్చాకార్యక్రమంలో నాతోపాటు పాల్గొన్నవాళ్ళు : శ్రీ ప్రకాశ రెడ్డి, వైసీపీ (అనంతపురం నుంచి), శ్రీ రామచంద్రారెడ్డి (కాంగ్రెస్), శ్రీ విల్సన్ (బీజేపీ), శ్రీ పి. ఎల్. శ్రీనివాస్ ( టీఆర్ ఎస్)
సోమవారం రాత్రి ABN Andhra Jyothy న్యూస్ ఛానల్లో కవిత నెల్లుట్ల నిర్వహించిన చర్చాకార్యక్రమంలో నాతోపాటు పాల్గొన్నవాళ్ళు: శ్రీ లంకా దినకర్ (టీడీపీ), శ్రీ అంబటి రామకృష్ణ (కాంగ్రెస్), శ్రీ రఘునాధ బాబు (బీజేపీ).
"మా పనిమనిషికి రాజకీయాలు బొత్తిగా తెలవ్వు. టీవీ చర్చల్లో పాల్గొనే ఆయా పార్టీల ప్రతినిధుల పేర్లు కూడా తెలియవు. అయినా వాళ్ళు మాట్లాడే విషయాన్ని బట్టి వాళ్ళు ఏపార్టీవాళ్ళో చెప్పగలిగేస్థాయికి చేరుకుంది."
సోమవారం రాత్రి ABN Andhra Jyothy న్యూస్ ఛానల్లో కవిత నెల్లుట్ల నిర్వహించిన చర్చాకార్యక్రమంలో నాతోపాటు పాల్గొన్నవాళ్ళు: శ్రీ లంకా దినకర్ (టీడీపీ), శ్రీ అంబటి రామకృష్ణ (కాంగ్రెస్), శ్రీ రఘునాధ బాబు (బీజేపీ).
"మా పనిమనిషికి రాజకీయాలు బొత్తిగా తెలవ్వు. టీవీ చర్చల్లో పాల్గొనే ఆయా పార్టీల ప్రతినిధుల పేర్లు కూడా తెలియవు. అయినా వాళ్ళు మాట్లాడే విషయాన్ని బట్టి వాళ్ళు ఏపార్టీవాళ్ళో చెప్పగలిగేస్థాయికి చేరుకుంది."
ప్రతి సోమవారం మాదిరిగానే ఈరోజు ఉదయం AP
24 X 7 న్యూస్
ఛానల్ లో Debate With Venkata
Krishna చర్చాకార్యక్రమం. శ్రీ రవిచంద్రారెడ్డి
(కాంగ్రెస్), శ్రీ మాల్యాద్రి (టీడీపీ), శ్రీ సత్యమూర్తి (బీజేపీ), శ్రీ
పార్ధసారధి (జనసేన), శ్రీ కరణం ధర్మశ్రీ (వైసీపీ).
ఇలాంటి టీవీ చర్చల్లో ఎన్నో చెప్పాలని
అనుకుంటాం. సమయాభావం కారణంగా కుదరక పోవచ్చు. అలాగేఅడగాలని అనుకుంటారు. పరిమితుల కారణంగా అడక్క
పోవచ్చు. కొంప మునిగేదేమీ వుండదు. తెల్లారి లేస్తే మళ్ళీ ఏదో ఒక టీవీలో ఈ చర్చలు
తప్పవు.
ఈరోజు ప్రధానమైన చర్చ టీడీపీ వెలువరించిన
శ్వేత పత్రం.
గత ఆరేడు నెలలకు పైగా కేంద్ర, రాష్ట్ర
ప్రభుత్వాల నడుమ, మరీ చెప్పాలంటే బీజేపీ, టీడీపీ ల నడుమ నిధుల విడుదల, వాటి
జమాఖర్చుల విషయంపై బహిరంగ మాటల పోరాటమే నడుస్తోంది. వచ్చే వారంలో ప్రధానమంత్రి నరేంద్ర మోడీ ఆంధ్రప్రదేశ్ పర్యటన
దీన్ని పరాకాష్టకు చేర్చింది. హామీల అమలుకు పూనుకోని ప్రధాని రాష్ట్ర పర్యటన వల్ల
రాష్ట్రానికి ఒరిగేది ఏమిటని టీడీపీ ప్రశ్న. అనేక శ్వేత పత్రాల రూపంలో ఈ
ప్రశ్నల్ని సంధించడానికి, వాటిని ప్రజల్లోకి తీసుకువెళ్ళి చర్చకు తెర తీయాలన్నది
చంద్రబాబు సంకల్పం. తానూ ఏది చేసినా దానికి తగు ప్రాచుర్యం కల్పించడంలో ఘనాపాటి
అయిన బాబుకు ఇదేమీ పెద్ద విషయం కాదు. అదికాదు విషయం.
ఇదేదో రెండుపార్టీల మధ్య వ్యవహారం
కాదు. రాష్ట్రానికి చాలా చేశానని కేంద్రం చెబుతోంది. విభజన హామీలు నెరవేర్చడంలో
కేంద్రం పూర్తిగా విఫలం అయిందని రాష్ట్ర ప్రభుత్వం అంటోంది. ఈ మాటలు జనాలకు
కొత్తేమీ కాదు. వాళ్ళు పదేపదే చెబుతున్నవే.
కేంద్రం ఎంత ఇచ్చింది, రాష్ట్రము ఎంత
ఖర్చు పెట్టింది అనే విషయంలో ఎవరి లెక్కలు వారివి. ఈ శ్వేత పత్రాలు అయినా ఆ
సందేహాలను తీరుస్తాయా అంటే అనుమానమే. మామూలు ప్రకటనలకు శ్వేత పత్రాలకు చాలా తేడా
వుంది. ఇవి సాధికారకం. చెప్పి తప్పించుకోవడానికి వీలు వుండదు.
గత కొంత కాలంగా చెబుతున్న విషయాలనే
చర్విత చరణం మాదిరిగా వీటిలో వల్లె వేస్తె ప్రజలకు సరయిన సమాధానం దొరకదు. కేంద్రం
కూడా శ్వేత పత్రాల రూపంలో జవాబు ఇస్తే సందేహాలు కొంతవరకయినా తీరతాయి.
కేంద్ర సాయం లేకుండా రాష్ట్రము
ఇబ్బందుల నుంచి గట్టెక్కడం కష్టం. అందుకోసం ధర్మ పోరాటాలు చంద్రబాబు
కొనసాగిస్తున్నారు. ప్రధాని రాకను పురస్కరించుకుని అఖిలపక్షాన్ని వెంటబెట్టుకుని
ప్రధానమంత్రిని రాష్ట్ర పర్యటనలో కలుసుకుని ఉమ్మడిగా ఒక విజ్ఞాపన పత్రం ఇస్తే
దానికి రాజకీయంగా చాలా బలం వుంటుంది. ఒకవేళ ప్రధాని అప్పాయింట్ మెంటు ఇవ్వకపోతే
అప్పుడు తప్పు అటువైపు వుంటుంది.
ఎన్నికలు గుమ్మం ముందు ఉన్న సమయంలో
పాలకపక్షం ఇటువంటి చొరవ తీసుకుంటుందా, అందుకు ప్రతిపక్షాలు కలిసి వస్తాయా?
అనుమానమే. ఎలాంటి అనుమానం లేకుండా ఈ
జవాబు చెప్పొచ్చు.
ఎందుకంటే ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాన్ని
రాజకీయ తుపాను కమ్ముకుని వుంది. ఎన్నికలు అయ్యేంతవరకు ఇది తీరాన్ని దాటదు.