2, జులై 2012, సోమవారం

ప్రామిస్ మి ఫాదర్!


ప్రామిస్ మి ఫాదర్!

(ఎలాటి ఇంగ్లీష్ మూలప్రతినయినా భావం చెడకుండా తెలుగులోకి స్వేచ్చానువాదం చేయగల సామర్ధ్యం నాకున్నదని  మనసు మూలల్లో నాకో గర్వం. ఆ నా అహంభావం ‘నెట్లో’ కనబడ్డ ‘ ఓ కొడుకు లేఖ’ విషయంలో పటాపంచలయిపోయింది. అందుకే దాన్ని యధాతధంగా ఇంగ్లీష్ లోనే అందరితో పంచుకోవాలనిపించింది.) 

PROMISE ME FATHER!


Dad,


Firstly you should know that you are a hero for me, right from a young age, you were and are a source of admiration and inspiration. I talk proudly when I get to speak about you and all you have achieved in life,  you  did the best you could to earn the love and respect of not just the family but even the society. For that you should always be proud.


I wanted to tell this to you since a long time,   I am sure you would agree that the last thing I want to see is tears flowing through the toughest lady I have seen in my life, your wife and my mom. Yesterday, maybe she said what she said because she felt it, or a slip of tongue, whatever the case, maybe you could have not reacted to it...maybe you could have focused on the newspaper or Sunday  the cross word puzzle, then maybe you would not have said what you said. I know one thing,  when we are upset, we tend to say things we do not mean, we want to say things to the other person just with one intention, and this is to hurt them even harder than what we felt. I am not sure anger ever helped me convey a clear message. I realised that most often I get my message across while talking and not shouting. I am not trying to tell you to change, I am not a better judge than you on how to handle a life...you are far ahead of me in terms of everything.


What I am trying to say  is, try and keep yourself calm, if you can smile and accept a delay, a repair, a breakdown, an un-invited guest,  tasteless food, someone like mom wanting to do something else from you, the lift breakdown, power failure, the BSNL  line getting disconnected, driver coming in late, laptop issues, internet issues, traffic on the roads,...and anything else that you know isn't that important that it will change the direction of your life.


What's really important is to accept, we are loved even more when we have the courage to accept humility to apologize when we make a mistake and respecting every ones opinion. As I know  I have made many mistakes in the past   because of my temper...I can tell you safely, that a few things I said to  people very close to me hurt me even still.


Dad,

My only intention of writing this letter is  to share my feelings..not to hurt you in any way. I want you to know we have tremendous love and respect towards you and it won't change.

Maybe..life is best enjoyed when we see it as a spectator.You  get to look at everything around, but we get to choose what should affect us.

My limited experience told me that I could have avoided 90% of arguments, because at  the end of the day, it did not matter if I won an argument, because an argument has neither charm or serves a purpose. 

Remember, I will be always with you, behind you to support you as you have been supporting our family all these  years. And I also remember , the  life I have now is because you gave it.


Your son.


PS: What a maturity among younger generation? The present society needs more such sons and less such fathers. Hope you agree.


"HOLDING ONTO ANGER IS LIKE DRINKING POISON AND EXPECTING OTHER PERSON TO DIE - BUDDHA"

1, జులై 2012, ఆదివారం

డాక్టర్స్ డే


డాక్టర్స్ డే
అయిదేళ్లక్రితం డిసెంబర్ నెలలో ఓ మంగళవారం.
వైద్యుడనేవాడు ఎలావుండాలో అలాగే యెలా వుండకూడదో ఆనాడు  హైదరాబాదులోని నిలోఫర్ ఆసుపత్రిలో జరిగిన రెండు సంఘటనలు అద్దం పట్టి చూపించాయి.
ఆ ఆసుపత్రికి చెందిన జూనియర్ డాక్టర్లు (జూడాలు అని సంక్షిప్త నామం – ఎవరు పెట్టారో కాని బాగా ఆలోచించి పెట్టినట్టున్నారు) ‘హమ్ ఏక్ హై’  అంటూ ఆస్పత్రి వెలుపల చేరి నినాదాలు చేస్తున్న సమయంలో –
‘నిలో ఫర్ లో  మరో పసి కందు మృతి – వైద్య సాయం అందక  మరణించిన శిశువుల సంఖ్య పదికి పెరిగింది, పదిహేనుకు  పెరిగిందంటూ క్రికెట్ స్కోరు మాదిరిగా టీవీ ఛానళ్లలో అదేపనిగా స్క్రోలింగులు వస్తున్న సమయంలో-
ఒక మృత శిశువును  వొడిలో పెట్టుకుని ‘తల్లి తెలంగాణా’ అధినేత్రి ‘రాములమ్మ’ అదే ఆసుపత్రి ఆవరణలో టీవీ కెమెరాల ముందు వీరంగం వేస్తున్న సమయంలో-
అదే  ఆసుపత్రిలో అదే ఆసుపత్రికి చెందిన కొందరు సీనియర్ డాక్టర్లు  మూడు కాళ్లు, నాలుగు పాదాలు కలిగిన ఆరేళ్ళ అనాకారి బాలుడికి తొలి దశ శస్త్రచికిత్సను  విజయవంతంగా  పూర్తిచేసి, ‘వైద్యో నారాయణో హరి’ అనే సూక్తిని నిజం చేశారు.
అంతకుముందు ఆదివారం రాత్రి అదే  ఆసుపత్రిలో ఒక మజ్లిస్ శాసన  సభ్యుడికీ, జూడాలకూ నడుమ మొదలయిన  సంవాదం సాగి, సాగి, చిలికి చికి  గాలివానగా మారింది. ఆ శాసన సభ్యుడు  తమపై దాడికి దిగారని ఆరోపిస్తూ, అతడిని అరెస్టు చేయాలనీ, అతడి శాసనసభ్యత్వాన్ని రద్దు చేయాలనీ డిమాండు చేస్తూ జూడాలు ఆకస్మికంగా మెరుపు సమ్మెకు దిగి విధులను బహిష్కరించారు. విధి నిర్వహణలో  వున్న వైద్యులపై దాడులను ఎవ్వరూ సమర్ధించరు. కానీ, వైద్యం కోసం ఆసుపత్రిలో చేరిన పసిప్రాణాలతో చెలగాటమాడే వైఖరిని కూడా ఎవరూ హర్షించరు. సమాజంలో నానాటికీ పెరిగిపోతున్న అవాంచనీయ ధోరణులు, అసహన వైఖరులు పవిత్రమయిన వైద్య వృత్తిని కూడా వొదిలిపెట్టకపోవడమే ఆందోళన కలిగించే విషయం. ఆలోచించాల్సిన విషయం.
ప్రజాస్వామ్యంలో సమస్యల పరిష్కారానికి ఆందోళనలూ, సమ్మెలూ అవసరమని అందరూ ముక్త కంఠంతో చెబుతుంటారు. కానీ అవే ఆందోళనలు ప్రజలకు మరికొన్ని కొత్త కష్టాలను తెచ్చిపెడుతున్నాయన్న  వాస్తవాన్ని మరచిపోతుంటారు. నిజమే, ఆనాటి సంఘటనవల్ల  జూడాలలో ఒకరిద్దరి ప్రాణాలకు ముప్పు ఏర్పడిందని వారు  సమ్మెకు దిగారు సరే, కానీ వారి ఆందోళలన వల్ల వైద్యం సమయానికి అందక  అనేక నిండు ప్రాణాలే పోయాయి. వాటి సంగతేమిటి?  ఇలాటి వాస్తవాలను గుర్తించనంతవరకూ, అలా ఆందోళనలకు దిగే వారికి ప్రజల మద్దతు లభించదు. సరిగ్గా అదే జరిగింది కూడా.

మొత్తమ్మీద జూడాల సమ్మె ముగిసింది. అన్ని సమ్మెలు యెలా ముగుస్తాయో దీనికీ అలాటి ముగింపే లభించింది.
కానీ, వైద్యుల ప్రవర్తనపై మీడియాలో మాత్రం విస్తృత చర్చే జరిగింది.
వాస్తవానికి సమాజంలో వైద్యులది విశిష్టమయిన స్తానం. అందుకే డాక్టరును ‘డాక్టరు గారు’ అని గౌరవంగా
సంబోధిస్తారు. నలుగురిలో వారికి పెద్దపీటవేసి మన్నన చేస్తారు. రోగాలబారి నుంచి కాపాడే అపర ధన్వంతరులుగా, ప్రాణబిక్ష పెట్టే కలియుగ దైవాలుగా కొలుస్తారు. నాకిప్పటికీ గుర్తు. మా చిన్నతనంలో మా వూరికి వారానికోసారి ఓ డాక్టరుగారు సైకిలు మీద వచ్చేవారు. చిన్న చితకా జ్వరాలకు తనతో  తెచ్చుకున్న తోలుపటకా సంచీనుంచి మందు  గోలీలు ఇచ్చి వైద్యం చేసేవారు. పంటలు  చేతికందినప్పుడు వూళ్ళోని పెద్ద పెద్ద ఆసాములు ఏడాదికోసారి కొలిచి ఇచ్చే ధాన్యం మినహా ఆ డాక్టరు గారు ఏనాడూ రోగులనుంచి  ఫీజు వసూలు చేసిన దాఖలా లేదు. ఆయన వూరికి వస్తే చాలు దేవుడే నడిచివస్తున్నట్టుగా జనం భక్తి ప్రపత్తులు ప్రదర్శించేవారు. ‘సైకిల్ డాక్టరుగార’ని పిలవడం మినహా ఆయన అసలు పేరేమిటో ఎవరికీ తెలియదు. నాడి  పట్టుకుని చూసి ‘ఇప్పుడెలావుందయ్యా రాముడూ’ అని ఆప్యాయంగా అడగగానే సగం రోగం చేతులతో తీసివేసినట్టు వుండేది. చుట్టుపక్కల అయిదారు వూళ్ళకు ఆయనే దిక్కు. సైకిల్ తొక్కుకుంటూ రోజుకో వూరు చుట్టబెట్టేవారు. ఆ రోజుల్లో సౌకర్యాలు అంతంత మాత్రమే. కరెంటు వుండేది కాదు. ఉక్కపోస్తున్నా, నులక మంచంమీద కూర్చుని తన మానాన తాను రోగులకు వైద్యం చేస్తుండేవారు. కళ్ళల్లో కారుణ్యం. మోహంలో చెదరని చిరునవ్వు. ఆయన హస్తవాసిపట్ల అందరికీ అపరితమయిన గురి. జనాలకు కొండంత ధైర్యంగా వుండేది.
మరి ఇప్పుడో. ఆ చిత్రం పూర్తిగా మారిపోయింది.
రోగులు పెరిగారు. రోగాలు పెరిగాయి. వైద్యులూ పెరిగారు. ఇచ్చే మందులూ  పెరిగాయి. వాటి ఖరీదులూ పెరిగాయి.  పెరగనిదల్లా వైద్యులపట్ల రోగులకు వుండే భరోసా! వుండాల్సిన దిలాసా!!
మా చిన్న తనం రోజులు కానీ, అయిదేళ్ళ క్రితం సంఘటన కానీ గుర్తుచేసుకున్నప్పుడు, మార్పేమయినా కానవస్తున్నదంటారా!
కనీసం ఈనాడు ‘డాక్టర్స్ డే’ జరుపుకుంటున్న సమయంలోనయినా మంచి మార్పు వస్తుందని ఆశించవచ్చంటారా!!  (01-07-2012)

29, జూన్ 2012, శుక్రవారం

T-issue: Cong’s dilemma?


 T-issue: Cong’s dilemma?                                                                           

The 120-year-old Congress Party, Grandmother of politics arraigning left, centre and right ideologies for itself, is suffering from phenomenal dilemma and dithering. When there was opportunity to send a clear message, it took shelter under its obsession “time will bail it out in due course”.  Having lost opportunity to give a clear verdict and implemented “policy of divide and rule” by allowing group leaders to play with the sentiments and arousing emotions of the people, now it is too late for the Congress High Command to satisfy the war mongers on all sides.  The crisis remains more compounded than ever before due to own making – hit wicket or self goal.  Should the AP state be divided or kept united  keeping upper most in view its prospects to regain power in 2014 or in early general elections?
These are some of the questions on which the Congress core group seems to be holding brain-storming sessions as part of recent by-polls debacle reviews with the Andhra Pradesh party leaders before pronouncing its final decision of Telangana statehood.  Almost half of the cabinet, besides new aspirants are camping in Delhi seeking audience of the “ Uncrowned Empress” of India to impress on her that their unsolicited advice worth ‘two paise’ which should be counted. All of them are alike are  least  interested either in national interests – unity – or interested in peoples peace and prosperity.  Their sole obsession is politics – no-holds barred pursuit of power.
The Congress Party’s credibility is at an all time low among the people not only on the national scene but also in the AP state.  With the Congress Party   at cross-roads and the Presidential elections scheduled on July 15, what the party is doing is fire-fighting to ensure that their flock of MPs and MLAs exercise their franchise for the official candidate.  Otherwise left to themselves to exercise conscience vote, they may either abstain, particularly T-Congress MPs and MLAs, or vote against Pranab Mukerjee in protest to save their face among the voters.   In retrospect, it is the real ‘litmus’ test to its future existence in Indian political map.  Over the years, it has lost state after the state and now further threat of its shrinking in real numbers or sinking for ever into oblivion is looming large.  More so, when Sonia Gandhi is determined to ensure smooth handover of PM baton to her son Rahul Gandhi from Dr Manmohan Singh, who had one of the worst second term with his personal reputation knocking the lowest web.
Amidst this chaos, the hope of T-statehood optimists could smile and hope for the best outcome before the scheduled Presidential polls as Sonia and her coterie realized the importance of Andhra politics which has deteriorated from bad to worse.  Such false hopes or signals have been repeatedly given by the Congress High Command in the past.  Is it yet another false hope?
 Many feel Sonia will finally spell out her mind in favor of new T-state sooner than later - before July 10? But, which way will it decide is a million dollar question.  She is breaking her head with the three region people to massage their egos or stand over the bifurcation of state, which saw tremendous growth rate not so long ago.  As part of that exercise, she is apparently playing with idea of creating Rayala Telangana.   Is it yet another cruel joke being inflicted on culturally and historically united people of Rayalaseema of 1956 territories. 
Is Rayala Telangana acceptable to rest of Andhra leaders?  That too when all major resources situated in this region being denied to rest of Andhra or new Andhra state?  Yes resources like the major irrigation projects like Nagarjunasagar and Srisailam, besides the huge hydro-power generated at these two water sources?  Will not there be fresh war-fronts open on ‘river water’ disputes between the new two states?  Why water, even in power (electricity) sharing will become major contentious issue! 
Be that as it may, this is a classic example of phenomenal procrastination and failure of leadership to seize opportunities in a timely manner.  And, it is not resolve the political mess that has been created or its fallout.
Even when Telangana is created by a stroke of divine intervention, then also, peace and stability within is not guaranteed.  Since politics – pursuit of power – is ruthless, there will be bitter fight for power on caste, communal and class lines.  Let none suffer from illusions on the above score.  Alongside, the prospects of the grandmother Congress Party will be given a decent cremation or burial. (29-06-2012)

(Courtesy: MANA MLA GARU.COM)

28, జూన్ 2012, గురువారం

ఐ.సి.ఐ.సి.ఐ. నక్షత్రకులు


ఐ.సి.ఐ.సి.ఐ. నక్షత్రకులు
రాజీవ్ దంపతులు ఎక్కిన విమానం కొన్ని వేల అడుగుల ఎత్తున గాలిలో తేలిపోతోంది. తమ నలభయ్యవ వివాహ వార్షికోత్సవాన్ని ఆస్ట్రేలియాలో జరుపుకోబోతున్న సందర్భాన్ని తలచుకుంటూ ఆ దంపతులు కూడా వూహల్లో తేలిపోతున్నారు.
ఇంతలో పబ్లిక్ అడ్రెస్ సిస్టం నుంచి విమానం కెప్టెన్ గొంతు వినిపించింది. అతడి స్వరంలో తెలియని కంగారు ప్రయాణీకులకు ఇట్టే తెలిసిపోతోంది.
లేడీస్ అండ్ జెంటిల్మెన్! మీ అందరూ నిబ్బరంగా వుండాలని కోరుకుంటున్నాను. మన ఈ విమానం  ఇంజిన్లలో మరమ్మతు చేయలేని అవరోధం తలెత్తింది. అత్యవసరంగా కిందికి దింపాల్సిన అగత్యం ఏర్పడింది.  నిర్మానుష్యమయిన ఒక దీవిని కనుగొన్నాము. అక్కడ విమానాన్ని సురక్షితంగా దింపే ప్రయత్నాలు చేస్తున్నాము. అవి ఫలించాలని మనమందరం మనసారా కోరుకుందాం. కాకపోతే ఇంకో విషయం కూడా మీకు చెప్పాలి. ఒకసారి అక్కడ దిగడం అంటూ జరిగితే మనకు బయట ప్రపంచంతో సంబంధాలు శాశ్వితంగా తెగిపోతాయి. ఆ తరువాత మనమందరం ఆ దీవిలోనే జీవితాంతం మన బతుకులు తెల్లవార్చుకోవాలి. మనం ఎక్కడ వున్నదీ ఇక ఎవ్వరూ కనుక్కోలేని దీవిలో మనం కాలుమోపబోతున్నాం.
విమానం పైలట్లు తమ నైపుణ్యం అంతా ఉపయోగించి విమానాన్ని ఆ దీవిలో సురక్షితంగా దించగలిగారు. చీమ చిటుక్కుమంటే వినిపించే నిశ్శబ్ధం నడుమ ప్రయాణీకులందరూ బిక్కుబిక్కుమంటూ మాటామంతీ లేకుండా అందులోనే కూర్చుండిపోయారు.
ఓ గంట  గడిచింది.
రాజీవ్ పక్కకు తిరిగి భార్య చెవిలో చెప్పాడు.
ఈ నెల మనం ఐ.సి.ఐ.సీ.ఐ. బ్యాంకుకు పంపాల్సిన ఇంటి లోను వాయిదా చెక్కు పంపించావా?’
రాజీవ్ భార్యకు ముందు మొగుడు ఏం అడుగుతున్నాడో అర్ధం కాలేదు. అర్ధం అయిన తరువాత అర్ధం కానట్టు మొహం పెట్టింది. అనుకోకుండా ఎదురయిన ఈ అవాంతరం వల్ల మొగుడు ఇలా ఈ సమయంలో అర్ధం పర్ధం లేని మాటలు  మాట్లాడుతున్నాడేమో అని సరిపుచ్చుకుంది.
చెక్కు పంపలేదు. అయినా ఆ విషయం మాట్లాడుకునే సందర్భమా ఇది?’ అంటూ ఎదురు ప్రశ్న వేసింది.
పోనీబ్యాంకు క్రెడిట్ కార్డు  ఇన్ స్టాల్ మెంటు  కట్టావా! అదీ మరచిపోయి వచ్చావా?’ అంటూ రాజీవ్ ఇంకో ప్రశ్న సంధించాడు. భార్య ఖచ్చితంగా ఇది సంధిప్రేలాపనే  అని ఓపక్క  భయపడుతూనే లేదని జవాబిచ్చింది.
అది వింటూనేనలభయ్ ఏళ్లలో ఎన్నడూ ఎరగని విధంగా భార్యను గట్టిగా వాటేసుకుని  తోటి ప్రయాణీకులు ఉలిక్కిపడేలా రాజీవ్ పెద్దగా అరిచాడు.
ఇక మనమెంతమాత్రం భయపడాల్సిన పనిలేదు. ఈ దీవిలోనే కాదు అతల,సుతల,పాతాళ  లోకాల్లో ఎక్కడున్నాసరే  బ్యాంకు వాళ్లు మనల్ని కనిపెట్టితీరతారు.
(నెట్లో సంచారం చేస్తున్న ఓ ఇంగ్లీష్ జోక్కి స్వేచ్చానువాదం –రచయిత) (28-06-2012)

26, జూన్ 2012, మంగళవారం

అనగనగా ఓ మేక కధ


అనగనగా ఓ మేక కధ

అనగనగా ఓ వూరు. ఆ వూర్లో ఓ రైతు. ఆ రైతు దగ్గరో గుర్రం. దానికి తోడు ఓ మేక.
ఆ గుర్రానికి వున్నట్టుండి జబ్బు చేసింది. యజమాని పశువుల వైద్యుడికి కబురు చేసాడు.
అతడొచ్చి గుర్రానికి పరీక్షలు చేసాడు. జబ్బు బాగా ముదిరిందని నిర్ధారించుకున్న వైద్యుడు రైతుతో చెప్పాడు.
‘నేను మళ్ళీ రేపు వస్తాను. వరసగా మూడు రోజులు మందిస్తాను.  మూడు రోజుల్లో నేనిచ్చిన మందు పనిచేసిందా సరి లేకపోతే ఇక అది బతకడం కష్టం’ అని తేల్చి చెప్పాడు.
పక్కనే వున్న మేక ఆ సంభాషణ విన్నది. పోయి గుర్రంతో చెప్పింది.        
“నువ్వు ఎలాగో అలా ఓపిక తెచ్చుకుని మామూలుగా వుండాలి సుమా!  ఇలాగే వున్నావంటే ఇక నువ్వు ఎందుకూ పనికి రావని తీర్మానించుకుని ప్రాణాలతో వుండగానే గొయ్యి తీసి నిలువునా పాతేస్తారు. నీ ఇష్టం.”
రెండో రోజు వైద్యుడు మందిచ్చి వెళ్ళిన తరువాత కూడా గుర్రం కదలలేదు. మేక మళ్ళీ వచ్చి హిత బోధ చేసింది.
“చూడు మిత్రమా! ఎంతో కొంత ఓపిక చేసుకో. వైద్యుడు వచ్చేవేళకు కాస్త లేచి తిరుగు. లేదంటే మందు  పని చేయడం లేదనుకుని నిన్ను పాతి పెడతారు. నా మాట విను” అంది.   
వైద్యుడు మూడో రోజు కూడా వచ్చాడు. యధాప్రకారం ఇవ్వాల్సిన మందు ఆఖరి మోతాదు కూడా ఇచ్చాడు. ఇచ్చి రైతుతో చెప్పాడు.
“నేను చేయాల్సిన ప్రయత్నం చేసాను. రేపు ఉదయం మరో సారి వస్తాను. అప్పుడు కూడా ఈ పరిస్తితే వుంటే ఇక చేయగలిగింది ఏమీ వుండదు, గుర్రాన్ని గొయ్యి తీసి పూడ్చి పెట్టడం మినహా. ఎందుకంటే ఈ గుర్రానికి వచ్చింది  ఆషామాషీ రోగం కాదు. అంటు  వ్యాధి. అది ఇతరులకు సోకకుండా వుండాలంటే ఇంతకంటే మార్గం లేదు.”
వైద్యుడిని సాగనంపడానికి రైతు వెళ్ళగానే మేక వచ్చి మళ్ళీ గుర్రంతో పోరు పెట్టింది.
“ నా మాట విను మిత్రమా! నువ్వు ఇక ఎందుకూ  పనికిరావని  వీళ్ళకు అర్దమయింది. ఏదో  ఇన్నాళ్ళబట్టి ఒకరికొకరం కష్టాలు, సుఖాల్లో తోడు నీడగా ఓ చోట వుంటున్నాం కాబట్టి మళ్ళీ మళ్ళీ చెబుతున్నాను. ఏదో విధంగా ఓపిక చేసుకో. నెమ్మదిగా లేచి నిలబడు. అలాగే. అలాగే. నెమ్మదిగా ఒక్కొక్క కాలు కూడదీసుకుని నిలబడు. అమ్మయ్య నా మాట ఇన్నాల్టికి నీకు అర్ధం అయినట్టుంది. ఎలాగో అలా లేచి నిలబడ్డావు. అలాగే శక్తి కూడదీసుకుని లగెత్తి పారిపో. ఇక్కడ వున్నావంటే నీకు చావు తప్పదు. ముందు అది గుర్తు పెట్టుకో.”             
“నాకు తెలుసు. పరుగు పందెంలో నిన్ను మించిన వాడు లేడు. మొదలు పెట్టిన పరుగు ఆపకు. అలాగే పరిగెట్టు.” అని సంతోషంతో ఉత్తేజపరచసాగింది.
గుర్రం లేచి ఇంటి పెరడులో పరిగెత్తుతుండగానే రైతు తిరిగివచ్చాడు. ఆ దృశ్యం చూడగానే అతడికి మహాదానందం అనిపించింది. మృత్యు ముఖంలో ప్రవేశించిన గుర్రం లేచి పరుగులు తీస్తూ వుండడం గమనించిన  సంతోషంలో భార్యను కేకేసి చెప్పాడు.
“మందు పనిచేసింది. గుర్రం తేరుకుంది. ఈ ఆనందాన్ని ఇరుగూ పొరుగుతో కలసి పంచుకుందాం. ఈ రాత్రే విందు భోజనానికి ఏర్పాట్లు చేయి. మేకను కోసి అందరికీ వండి పెట్టు.”
ఇది విన్న మేక ప్రాణాలు పైనే పోయాయి. (26-06-2012)
        

17, జూన్ 2012, ఆదివారం

ఏవన్నా తేడా వచ్చిందా?


ఏవన్నా తేడా వచ్చిందా?
ఎందుకిలా రాస్తున్నారు అని నా బ్లాగు పాఠకులు కొందరు రాసిన పిమ్మట నేను స్వచ్ఛందంగానే కొన్నాళ్ళపాటు రాజకీయాలు రాయడం మానేసి ‘ఎందుకిలా రాస్తున్నాను?’ అన్న ప్రశ్నను నాకు నేనే వేసుకుని సమాధానం వెతుక్కున్నాను. నేను రాస్తున్నదానిలో, లేదా టీవీ ఛానళ్ళలో మాట్లాడుతున్న వాటిలో ఏదన్నా పక్షపాత ధోరణి కానవస్తున్నదేమో అని పరిశీలన చేసుకున్నాను. ఇన్నేళ్ళుగా రాస్తూ వచ్చిన విషయాలను పునశ్చరణ చేసుకుని మరోమారు బేరీజు వేసుకున్నాను.
ఈనాడు  రాష్ట్ర రాజకీయ యవనికపై మారుతున్న  దృశ్యం పరికిస్తున్నప్పుడు ఇన్నాళ్ళనుంచి నేను వ్యక్తం చేస్తున్న అభిప్రాయాల్లో ఏదయినా తేడా వచ్చిందా? లేక నేను రాసిందే జరుగుతూ వస్తోందా ? అని పోల్చి చూసుకోవడానికే ఈ ప్రయత్నం. నా విమర్శకులను కూడా అదే అభ్యర్ధిస్తున్నాను.కాకపోతే, స్తలాభావం కారణంగా వ్యాసాలను బాగా కుదించడం జరిగింది.

ముళ్ళ బాటలో ముఖ్యమంత్రి  (15-12-2010)
పత్రికల్లో, మీడియాలో ఎక్కడ చూసినా ఊహాగానాలే! ఏమిజరుగుతుందో విశ్లేషించి వివరించేవారికన్నా ఏమి జరగాలని తమ అంతరాంతరాల్లో అభిలషిస్తున్నారో దాన్నే ప్రస్తుత  పరిస్తితులకు అన్వయించి భాష్యం చెప్పేవారు ఎక్కువయ్యారు. రాజకీయనాయకులకే కాదు రాజకీయ విశ్లేషకులకు కూడా మినహాయింపు లేకపోవడమే  ఇందులోని విషాదం.
నిన్న మొన్నటివరకు ప్రాంతీయ సమస్య ప్రధాన భూమిక పోషించిన రాష్ట్రంలో ఈనాడు రాజకీయమంతా ఒక వ్యక్తి చుట్టూ పరిభ్రమిస్తోంది. నిజానికి నిండా నాలుగు పదుల వయస్సు లేదు. క్రియాశీలక రాజకీయాల్లోకి అడుగుపెట్టి ఏడాదిన్నర కూడా కాలేదు. చూడగానే ఆకట్టుకునే విగ్రహం కాదు. పట్టుమని పది నిమిషాలపాటయినా తన ప్రసంగాలతో  ప్రజలను కట్టిపడేసే చాతుర్యం ఏమయినా వుందా అంటే అదీ లేదు.
అయినా వై ఎస్ జగన్ మోహన రెడ్డి సభలకు వేలం వెర్రిగా జనం ఎందుకలా వస్తున్నారు?
ఈ ఒక్క ప్రశ్నే అందర్నీ కలవరపెడుతోంది. అయితే, ఇది సమాధానం లేని ప్రశ్న కాదు. పైపెచ్చు అనేక సమాధానాలున్న ప్రశ్న. ముందు చెప్పినట్టు ఎవరి ఉద్దేశ్యాలకు తగ్గట్టుగా వారు ఊహించుకుంటూ జవాబులు వెతుక్కుంటూ వుండడంవల్ల ఎన్నెన్నో రకాల ఊహాగానాలు ఊపిరి పోసుకుంటున్నాయి. ఏమి జరగబోతున్నదన్న దానిపై మరెన్నో రకాల వదంతులు చెలరేగుతున్నాయి. జగన్ అనుకూల, ప్రతికూల కధనాలతో  మీడియా వీటికి మరింత  ఊతం ఇస్తోంది.                                                        

ఇప్పుడున్న వాడినీ వేడినీ మరో మూడేళ్ళు పైబడి  కొనసాగించడం అంత ఆషామాషీ వ్యవహారం కాదని, ఈనాడు జగన్ కు వున్న ధన వనరులు, జన వనరులు వచ్చే ఎన్నికలకల్లా కళ్ళ ఎదుటే  కరిగిపోవడం ఖాయమన్నది వారి నిశ్చితాభిప్రాయం. అవినీతి మార్గాలలో సంపాదించిన డబ్బును పెట్టుబడిగా పెట్టి మరో మార్గంలో అధికార పీఠం అధిరోహించడం అతడి ఏకైక లక్ష్యమన్నది  గత ఏడాది పైగా సాగుతూ వస్తున్న జగన్ వ్యతిరేక ప్రచారం లోని  మరో పార్శ్వం. ఈ క్రమంలో జగన్ సానుకూల, ప్రతికూల వర్గాల నడుమ సాగిన  వాదప్రతివాదాలు ముదిరి పాకానపడి జగన్ కు జనం లో హీరో స్తాయిని కట్టబెట్టాయి. పార్టీలో పెద్దలంతా ఒకవైపు, జగన్ ఒక్కడూ ఒకవైపూ వుండి నడిపిన రాజకీయంసాధారణ జనంలో జగన్ పట్ల సానుభూతి మరింత పెరిగేలా చేసింది.

మొదటి ముద్దాయి కాంగ్రెస్ అధిష్టానం (29-12-2010)
 
ఎవరు అవునన్నా కాదన్నా రాష్ట్రంలో టీడీపీ ది ఒక ప్రత్యేక స్తానం. రాష్ట్రంలోని అన్ని ప్రాంతాలలో అన్ని నియోజక వర్గాలలో కాంగ్రెస్  మాదిరిగానే కొద్దో గొప్పో కేడర్ కలిగిన పార్టీ. కానీ ఈ మధ్యలో బాగా పుంజుకున్న తెలంగాణా అంశం వారి ఆశలపై మరోసారి  నీళ్ళు చల్లింది.అన్ని పార్టీల మాదిరిగానే ఈ పార్టీపై కూడా తెలంగాణా క్రీనీడలు కమ్ము కున్నాయి.  
పోతే, టీ.ఆర్.యస్.
తెలంగాణా లక్ష్య సాధన కోసం, అవసరమయితే కుష్టు రోగిని సయితం కావలించుకుంటామనే  నాయకులకు కొదవ లేని పార్టీ అది. అదృష్టం ముందు పుట్టి తరువాత పుట్టిన చంద్రశేఖరరావు ఆ పార్టీ నాయకుడు.
ఇంకా పేరు పెట్టని జగన్ పార్టీ విషయం కూడా చెప్పుకోవాలి. పుటకకు ముందే ప్రకంపనలు సృష్టించి దరిమిలా నీరు కారిపోయిన ఇతర పార్టీలను ఉదాహరణగా చూపిస్తూ  కొందరు  చేస్తున్న అవహేళనల నడుమ, కొత్తగా ఈ పార్టీ పురుడు పోసుకుంటోంది.
రాష్ట్రంలో నేడు నెలకొనివున్న దుస్తితికి  అన్ని  పార్టీలకు అంతో ఇంతో బాధ్యత  వున్నప్పటికీ  ఏదో సాకు చూపి తప్పించుకోలేని ప్రధాన బాధ్యత  మాత్రం అధికార పక్షానిది.          
అయిదేళ్ళు పాలించండని అధికారం అప్పగించిన ప్రజలను వారి మానాన వారిని వొదిలి గ్రూపు తగాదాలతో   మునిగి తేలుతున్న కాంగ్రెస్ వారిని చూస్తుంటే ఆ పార్టీని మొండిగా అభిమానించే వారికి కూడా  ఏష్టత కలుగుతోంది. రెండేళ్ళ క్రితం వరకు వడ్డించిన విస్తరి లాంటి కాంగ్రెస్ పరిస్తితి ఈ రోజు కుక్కలు చింపిన విస్తరి  చందాన తయారయింది.
ముఖ్యమంత్రిని మార్చాలా! ముఖ్యమంత్రి  తీరు మారాలా!! (18-11-2011)
కిరణ్ కుమార్ రెడ్డిని ముఖ్యమంత్రిగా ఎంపిక చేయడానికి అధిష్టానం పరిగణన లోకి తీసుకున్న యువకుడు, విద్యాధికుడు అన్న రెండు అంశాలను రుజువు చేసుకోవడంలో ఆయన కొంతవరకు  వైఫల్యం చెందారనే చెప్పాలి. ఆయనకు ముందు ముఖ్యమంత్రులుగా పనిచేసిన చంద్రబాబు నాయుడు, రాజశేఖర రెడ్డి, రాష్ట్రంలో ఎక్కడ ఏ విపత్తు సంభవించినా, ఏ చిన్న సంఘటన జరిగినా - తక్షణం  హెలికాప్టర్ లో రెక్కలు కట్టుకుని వాలిపోయేవారు. ఇలా చేయడం వల్ల సమస్యలు పరిష్కారమవుతాయా అన్నది సందేహమే. కానీ, ఈ ఆకస్మిక పర్యటనల ద్వారా వారిరువురికీ ప్రజాదరణ అనే రాజకీయ లబ్ది లభించింది. ప్రజలకు సంబంధించిన ప్రతి అంశం పట్ల వెంటనే స్పందిస్తారన్న నమ్మకం జనంలో ఏర్పడింది.
యువకుడయిన కిరణ్ కుమార్ రెడ్డి మాత్రం  ఈ విషయంలో అధిష్టానం తన మీద వుంచిన భరోసాను నిలబెట్టుకోలేకపోయారనే చెప్పాలి. చంద్రబాబు, వై.ఎస్.ఆర్. లకు సమర్దులయిన పేషీ అధికారులు వుండేవారు. ముఖ్యమంత్రి ఆదేశాలు ఖచ్చితంగా అమలయ్యేలా వారు శ్రద్ధ తీసుకునేవారని, కిరణ్ కుమార్ రెడ్డి విషయంలో ఇది మరో ప్రధానమయిన లోటని కాంగ్రెస్ వర్గాలు చెబుతుంటాయి.
 పైగా అధిష్టానం మద్దతు ఆయనకు పూర్తిగా వుంది. ఏ కాంగ్రెస్ ముఖ్యమంత్రికయినా ఇది గొప్ప వరం. రాజశేఖరరెడ్డి ఈ వరాన్ని సంపూర్తిగా సద్వినియోగం చేసుకున్నారు. అటు ఢిల్లీ పెద్దలను మెప్పించడంలో, ఇటు రాష్ట్రంలో రాజకీయంగానే కాక ఇతరత్రా  పునాదులు గట్టి పరచుకోవడంలో ముఖ్యమంత్రి పదవిని చాలా చక్కగా వినియోగించుకున్నారు. ఎన్నెన్ని అవినీతి  ఆరోపణలు వెల్లువెత్తినా సామాన్య ప్రజలను దృష్టిలో వుంచుకుని రూపకల్పన చేసిన సంక్షేమ పధకాలు  వై.ఎస్.ను తిరుగులేని ప్రజాకర్షణ కలిగిన నాయకుడిగా నిలబెట్టాయి.
ఎటు పోతున్నాం? (22-11-2011)
ప్రత్యర్ధి పార్టీలను  నామరూపాలు లేకుండా చేయాలనుకోవడం రాజకీయ రంగంలో చాలా సహజమయిన విషయం. ఎన్నికల్లోనూ, ఇతరత్రా కూడా ఈ లక్ష్య సాధనకోసం రాజకీయ పార్టీలు పనిచేస్తూనే వుంటాయి. నైతికంగా ఇది తప్పే అయినా రాజకీయకోణం నుంచి చూస్తే వాటికి ఇది  తప్పనిసరి వ్యవహారం. అందుకే ఎన్నికల్లో తేలని విషయాలను న్యాయస్తానాల ద్వారా తేల్చుకోవాలని ప్రయత్నించడం ఈ మధ్య కాలంలో ఎక్కువయింది. ఒకరకంగా చెప్పాలంటే సివిల్ కేసుల్లో సెటిల్మెంట్ మాదిరి. ఇప్పుడిది రాజకీయ పార్టీలకు కొత్త అస్త్రంగా తయారయింది.
మొన్నటికి మొన్న జగన్ మోహన రెడ్డి పై ఇదే బాణం ఎక్కుబెట్టారు. మళ్ళీ ఈ రోజున అదే బాణం చంద్రబాబు వైపు తిరిగింది. అధికారం అండగా చేసుకుని ఆర్ధిక నేరాల ఆరోపణల్లో చిక్కుకున్న వారిపై దర్యాప్తులు జరిపి నేరం రుజువు చేస్తే తప్పుబట్టేవాళ్ళు ఎవ్వరూ వుండరు. అలా కాకుండా ఇది కేవలం రాజకీయ కక్షలను సెటిల్ చేసుకునే  క్రమంలో సాగే వ్యవహారం అయితే పరిణామాలు దారుణంగా వుంటాయి.
రాజకీయ అవినీతి (28-07-2011)
అంగట్లో అన్నీ  వున్నా అల్లుడి నోట్లో  శని అన్న సామెత చందంగా రాజకీయ అవినీతి గురించి జరిగిన దర్యాప్తులు, అవి నిగ్గు దేల్చిన నిజాలు కాలగర్భంలో కలసిపోతున్నాయి. భారత దేశానికి స్వాతంత్రం వచ్చిన తరువాత ఇన్ని సంవత్సరాల కాలంలో అవినీతి, లంచగొండితనం ఆరోపణలు రుజువై శిక్ష పడ్డ రాజకీయ ప్రముఖులను వేళ్ళమీద లెక్కపెట్టవచ్చు. నేరానికి తగిన  శిక్ష తధ్యం అన్న భయం వున్నప్పుడే నేరాల సంఖ్య తగ్గుతుంది. నేర ప్రవృత్తి సయితం తగ్గుముఖం పడుతుంది.
చట్టం అందరిపట్లా ఒకే  రకంగా వ్యవహరించినప్పుడే చట్టం తన పని తాను చేసుకుపోతుందిఅనే వాక్యానికి అర్ధం వుంటుంది. లేని పక్షంలో అది ఒక పనికిరాని వూతపదంగా మిగిలిపోతుంది.

కాంగ్రెస్ వాకిట్లో ఆగస్టు సంక్షోభం (03-05-2012)
తాము కోరి ఎంపిక చేసుకుని నియమించిన ముఖ్యమంత్రి కిరణ్ కుమార్ రెడ్డి, పీసీసీ అధ్యక్షుడు బొత్స సత్యనారాయణ  తమ అంచనాలకు, ఆకాంక్షలకు అందకుండా వ్యవహరిస్తున్నారన్న అభిప్రాయం హస్తిన నాయకులను కలవరపెడుతోందా?
రాజశేఖరరెడ్డి ఆకస్మిక మరణం తరువాత రాష్ట్ర వ్యవహారాలను తిరిగి తమ గుప్పిట్లోకి తెచ్చుకోవాలన్న అధిష్టానం  ప్రయత్నాలు బెడిసికొట్టి, 1982 నాటి చరిత్ర పునరావృతం కాబోతున్నదన్న సందేహం పార్టీ శ్రేణులను గందరగోళంలోకి నెడుతోందా?    
ఇంతకీ కాంగ్రెస్ లో ఏం జరుగుతోంది?
నిజానికి రాష్ట్రంలో కాంగ్రెస్ పరిస్తితి ఇంతగా దిగజారిపోవడానికి ప్రధాన కారణం అధిష్టానం అనుసరిస్తున్న ఒంటెద్దు పోకడలే. కానీ ఆ విషయం అధినాయకత్వం ముఖాన్నే  చెప్పగల, చేవ కలిగిన నాయకుడేడీ? రాష్ట్ర కాంగ్రెస్ అస్తవ్యస్త పరిస్తితికి సంబంధించి ముద్దాయి స్తానంలో వుండాల్సిన అధిష్టానం తీర్పరి పీఠంపై వుండడమే విషాదం. దీనికి తోడు - జాతీయ పార్టీ ముసుగులో పేను పెత్తనంచేయాలనే ఆభిలాష అదనం.
కానీ తప్పు దిద్దుకోవడానికి తరుణం కాదాయె. ముంగిట్లో 18 అసెంబ్లీ ఉపఎన్నికలు, ఒక లోకసభ ఉపఎన్నిక పెట్టుకుని యే నిర్ణయం తీసుకోవాలన్నా పాలుపోని పరిస్తితి.
రాష్ట్రపతి ఎన్నిక అనంతరం  ఆగస్టులో కాయకల్ప చికిత్స మొదలు పెడతారేమో! అప్పుడూ లొంగకపోతే, ఆఖరి ఔషధంగా గరళవైద్యం తప్పదేమో!
దుష్టాంగాన్ని ఖండించయినా శిష్టాంగాన్ని కాపాడమన్నారు కదా పెద్దలు.
కాకపోతే, తొలగించే అంగాలుఒకటా రెండా అన్నదే ప్రశ్న. (17-06-2012)
ఏవన్నా తేడా వచ్చిందా? మీరే చెప్పాలి.

టుడే ఫాదర్స్ డే - నాన్న చెప్పిన మాట



టుడే ఫాదర్స్ డే  - నాన్న చెప్పిన మాట

ఇన్నేళ్ళ తరువాత కూడా నా చిన్ననాటి ఈ సంఘటన నాకు బాగా గుర్తుంది.
ఆ రోజుల్లో ఇంటెడు చాకిరీతో అమ్మ ఎంతో కష్టపడుతుండేది. అయినా,  ఎన్ని పని తొందరలు వున్నా నాకిష్టమయిన చిరుతిళ్ళు మాత్రం టంచనుగా  చేసిపెడుతుండేది. చిన్నతనం వల్ల  కావచ్చు, అమ్మ చేసిన గారాబం వల్ల కావచ్చు  అమ్మ ఎంత బాగా చేసినా  ఏదో ఒక వంక పెట్టి సతాయించేవాడిని.
ఓ రాత్రి అమ్మ నాన్నకు భోజనం పెడుతుంటే చూశాను. అన్నం మాడిపోయివుంది. దానికి తోడు  చల్లారిన చారు. కానీ నాన్న మారుమాట్లాడకుండా, మారు అడిగి మరీ  భోజనం చేయడం చూసి ఆశ్చర్యపోయాను.
మర్నాడు అమ్మ నాన్నతో అంటోంది. “రాత్రి అన్నం మాడిపోయింది. మళ్ళీ చేసిపెట్టే టైం లేకపోయింది. మీరు అలానే తిని  నైట్ డ్యూటీకి వెళ్లారు. నాకెంతో బాధ వేసింది.”
అప్పుడు నాన్న చెప్పిన  జవాబు నన్ను మరింత ఆశ్చర్యానికి గురి చేసింది.
“భలేదానివే. అన్నం మాడిపోయిందని నీవనుకుంటున్నావు. నాకు మాత్రం మాడిపోయిన అన్నం చెక్కలంటే ఎంతో ఇష్టం. చిన్నప్పుడు మా అమ్మ అలా మాడిపోయిన అన్నం చెక్కలపై వెన్న రాసి పెడితే ఆవురావురుమంటూ తినేవాడిని తెలుసా!”    
నాన్న మాటలు నమ్మబుద్ధి కాలేదు. ఆ రాత్రి  అమ్మ వంటింట్లో పనిలో వున్నప్పుడు చూసి అడిగాను.
“ ఒరేయ్  నాన్నా”
నాన్న నన్ను ముద్దుగా ‘నాన్నా’ అని పిలుస్తాడు.
“అమ్మ వుదయం నుంచి రాత్రిదాకా ఎంత కష్టపడుతున్నదో రోజూ చూస్తున్నాం కదా. అప్పటికే  బాగా  అలసిపోయి వుంది. అంత రాత్రప్పుడు మళ్ళీ  ఏం వొండి పెడుతుంది చెప్పు. అయినా ఒక్క రోజు  మాడిన అన్నం తింటే ఏమవుతుంది ? కడుపు మాడదు కదా!
“ఒక మాట చెబుతున్నాను గుర్తుపెట్టుకో. 
“జీవితంలో అన్నీ మన కిష్టమయినట్టు జరగవు.  మనం ఇష్టపడ్డ మనుషులే  మనకు తారసపడరు. అన్నీ సవ్యంగా సక్రమంగా జరగాలని అనుకోవడంలో తప్పు లేదు. కానీ సవ్యంగా జరగని వాటికి మనం ఇతరులను తప్పు పట్టటం పెద్ద తప్పు. ఆ తప్పు నువ్వెప్పుడు చేయకు. ఇంకో విషయం.  నాకు వొంట చేయడం రాదుకదా కనీసం గ్యాస్ పొయ్యి వెలిగించడం కూడా రాదు. ఇక అమ్మ చేసే  వంటకు వంక పెట్టే హక్కునాకెలా వుంటుంది చెప్పు.
“ఇన్నేళ్ళ జీవితంలో నేను కొన్ని పాఠాలు నేర్చుకున్నాను. ఇతరుల పొరబాట్లను మంచి మనసుతో స్వీకరించగలగాలి. అప్పుడే నలుగురితో మన సంబంధాలు బాగుంటాయి. ఆ సంబంధాలే పది  కాలాలపాటు చెక్కుచెదరకుండా వుండి జీవితాలకు శోభనిస్తాయి.
“మళ్ళీ  చెబుతున్నా విను. ఇతరులలోని మంచితనాన్ని  గ్రహించే శక్తిని భగవంతుడు నీకివ్వాలని కోరుకుంటున్నాను. అలాగే పక్కవారి తప్పులను ఎత్తిచూపే దుర్గుణం నీనుంచి దూరం కావాలన్నది కూడా నా కోరిక.
“నీ జీవితంలో ఎదురయ్యే చెడు సంఘటనలను, నీ మనసులో మెదిలే చెడు ఆలోచనలను ఆ భగవంతుడి పాదాలవద్ద వొదిలెయ్యి. నువ్వు గ్రహించిన మంచిని నీలోనే వుంచుకో. ఆ చెడ్డ విషయాల సంగతి  ఆ దేవుడే  చూసుకుంటాడు. నీ మంచి మాత్రం నిన్ను మంచి దోవలో నడిపిస్తుంది. అప్పుడు మాడిపోయిన అన్నం కూడా నీకు పరమాన్నంలా అనిపిస్తుంది.”  

ఇదో కధ అనుకుంటే ఇందులోని నీతి:
జీవితంలో  మీరు  కలిసే వారెవరో, మీకు తారసపడేవారెవరో కాలమే నిర్ణయిస్తుంది.
మీరు  కోరుకునే వ్యక్తులను మీ  మనసే నిర్ణయిస్తుంది.
కానీ జీవితంలో మీ వెంట నడిచే వ్యక్తులెవరన్నది మీ  ప్రవర్తనే నిర్ణయిస్తుంది.

ఇతరుల తప్పిదాలను తేలిగ్గా తీసుకుని, ఇతరులతో విభేదాలను సామరస్యంగా పరిష్కరించుకుని ముందుకు నడిస్తే  ఇతరులతో మీ  సంబంధాలు శాశ్వితం అవుతాయి. జీవితం పూల పానుపు అవుతుంది. లేకపోతే ముళ్ళ కంపగా మారుతుంది. (17--06-2012)